12-02-2025 06:54:44 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని స్థానిక సారపాకలో గల బ్రిలియంట్ జూనియర్ కాలేజ్ లో మొదటి సంవత్సరం విద్యార్థులు రెండో సంవత్సరం విద్యార్థులకు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మొదటిగా వందేమాతరం గీతం ఆలపించి, అనంతరం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు వారి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం బ్రిలియంట్ విద్యాసంస్థలు చైర్మన్ డా.బిఎన్ఆర్ మాట్లాడుతూ... ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు యునివర్సిటీలలో చదివి అత్యున్నత స్థాయికి చేరుకుంటున్నారని మీరు కూడా మంచి స్థాయిలో ఉండాలి మీ లక్ష్యాలను చేరుకోవాలని దానికి బ్రిలియంట్ విద్యాసంస్థలు ఎప్పుడు మీతో ఉంటుంది అని తెలియచేసారు.
అనంతరం మంగళవారం ప్రకటించిన జేఈఈ మెయిన్స్ లో 79 శాతంతో ఉత్తీర్ణత సాధించిన బి.సంయుక్త ను సన్మానించారు. అనంతరం కాలేజీని విడిచి వెళ్ళిపోతున్నటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ కూడా ఈ రెండు సంవత్సరాలు అన్ని విధాలుగా విద్యార్థులను తయారు చేసినందుకు బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బి.ఎన్.ఆర్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల హెడ్మిసెస్ స్వర్ణ, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.