20-07-2025 10:25:44 PM
సిద్దిపేట (విజయక్రాంతి): ఆషాఢం మాసంలో జిల్లా వ్యాప్తంగా గ్రామ దేవతలకు సమర్పించే బోనాల నైవేద్యం చివరి ఆదివారంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. సిద్దిపేట జిల్లా(Siddipet District)లో అనేక గ్రామాల్లో, పట్టణాల్లో మహిళలు అధిక సంఖ్యలో బోనాలతో ఊరేగింపు నిర్వహించి మొక్కులు సమర్పించారు. సంప్రదాయ పద్ధతిలో బైండ్ల పూజారులు పూజలు చేసి భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జాతర జాతర వాతావరణం నెలకొన్నది. ఆషాడం మాసం బోనాల పండుగ ఆదివారంతో ముగిశాయి.