calender_icon.png 20 July, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి భూములను రక్షించాలి

20-07-2025 01:13:03 AM

  1. తెలుగు ప్రభుత్వాలు చొరవ చూపాలి 

వీహెచ్‌పీ ప్రచార ప్రముఖ్ బాలస్వామి

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): భద్రాద్రి రాములవారి భూ ముల రక్షణకు రెండు తెలుగు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి కోరారు. రాముడి పేరుపై ఉన్న భూముల రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. రాములవారి గోశాల ప్రహ రీ నిర్మాణానికి అడ్డంకులు తొలగించాలని, గోశాల నిర్మాణాన్ని అడ్డు కుంటున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

2018 నుంచి దేవాలయానికి చెల్లించాల్సిన కౌలు (డ్యామేజింగ్ చార్జెస్) వెంటనే చెల్లించాలన్నారు. పురుషోత్తపట్నంలోని రామయ్య భూములపై పూర్తి హక్కులు భద్రాద్రి దేవస్థానానికే చెందుతాయని ఆయన పేర్కొ న్నారు. ఇందుకు పాలకులు రాజకీయాలకు అతీతంగా స్పందించి, దే వాలయ భూములు కాపాడాలని సూచించారు.

దేవాలయం చుట్టూ ఫెన్సింగ్ వేసి, కబ్జాదారుల నుంచి దేవాలయ భూములకు రక్షణ కల్పించాలని తెలుగు ప్రభుత్వాలను డి మాండ్ చేశారు. భద్రాద్రి ఈవోపై దా డి జరిగి రోజులు గడుస్తున్నా పా లకులు పట్టించుకోకపోవడం దారుణ మని ఆవేదన వ్యక్తం చేశారు. రాములవారి భూములను కాపాడేందుకు తమ సంస్థ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తుందని స్పష్టం చేశారు.