20-07-2025 07:02:14 PM
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోనాల ఉత్సవాలు(Bonalu Festival) ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పాల్గొని పలు ఆలయాలను సందర్శించి మొక్కులను, బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, ప్రభాకర్ రెడ్డి, సోమేశ్ గౌడ్, శ్రీనివాస్, ఆలయ కమిటీల సభ్యులు, ప్రజలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.