calender_icon.png 20 July, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

27న గాంధారి గిరిజన గర్జన సభ విజయవంతం చేయాలి

20-07-2025 06:57:22 PM

లంబాడా హక్కుల పోరాట సమితి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ మోతిలాల్..

కామారెడ్డి (విజయక్రాంతి): హలో లంబాడా.. చలో గాంధారి.. ఈనెల 27న జరిగే గిరిజన గర్జన సభ విజయవంతం చేయాలని లంబాడి కుల పోరాట సమితి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ మోతిలాల్ అన్నారు. ఆదివారం కామారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోర్ ధర్మ సమాజ్ పరిరక్షణ, రాజ్యాంగంలో ఎనిమిది షెడ్యూల్లో గోర్బోలి భాషను చేర్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. పోడు భూములు ఆసైన్ ల్యాండ్ సమస్య పరిష్కరించాలని సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని లంబాడ ప్రజలందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో లంబడాకుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్ ప్రధాన కార్యదర్శి బద్రీనాథ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవి నాయక్ గౌరవ అధ్యక్షులు రూప్సింగ్ నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, టౌన్ అధ్యక్షులు మోహన్ నాయక్, విద్యార్థి సంఘం అధ్యక్షులు ప్రకాష్ నాయక్, గోపి నాయక్, రవి నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.