calender_icon.png 20 July, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

19-07-2025 09:01:34 PM

మునగాల‌: గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం చట్టం అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు(CITU District President M Rambabu) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ ఎండ్ వర్కర్స్ యూనియన్ మునగాల మండల ద్వితీయ మహాసభలు సుందరయ్య భవనంలో ఎల్ నాగార్జున అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వలు గత 30, 40 సంవత్సరాల నుండి ఎట్టి చేయించుకుంటూ పర్మినెంట్ చేయకుండా వారిని మోసం చేస్తుందన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు పారిశుద్ధ నిర్మాణంలో భాగంగా సైడ్ కాలువలు శుభ్రం చేస్తూ మంచినీటిని సరఫరా చేస్తూ వీధిలైట్లు డంపింగ్ యార్డ్ ట్రాక్టర్ నిర్వహణ చెట్ల పెంపకం తదితర పనులు చేయుచుకుంటున్నారు.

మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని జీవో నెంబర్ 51 ని సవరించాలని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు గ్రామపంచాయతీ కార్మికులకు అనేక వాగ్దానాలు చేశారని తమ మేనిఫెస్టో పెట్టుకున్నారని దాటిన వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ మహాసభలో జీ గ్రామపంచాయతీ ఎంప్లాయ్ సెండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ రాధాకృష్ణ, జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు చిట్యాల రవిచంద్ర, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, హమాలీ వర్కర్స్ మండల అధ్యక్షులు అనంత మైసయ్య గౌడ్, పాల్గొన్నారు. అనంతరం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నూతన మండల కమిటీ అధ్యక్షులు ఎల్ నాగార్జున, కార్యదర్శి ఎం వెంకన్న, కోశాధికారి డి రవికుమార్, ఉపాధ్యక్షులు రేణుక, ముత్తయ్య సహాయ కార్యదర్శిలు పరశురాములు ఎస్ నాగరాజు,వి వెంకటేశ్వర్లు, వీరుతోపాటు మరో21 మంది మండల కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది.