calender_icon.png 20 July, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు ఈ- సమన్స్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్

19-07-2025 08:06:02 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): ప్రతి కేసులో సంబంధిత వ్యక్తులకు సమయానుగుణంగా ఈ-సమన్స్ జారీ చేసి పారదర్శకతతో పాటు కేసుల పరిష్కారానికి వేగవంతమైన సేవలకై టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలని సిపి సాయికృష్ణ(CP Saikrishna) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ లో కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లకు "ఈ-సమన్స్" శిక్షణ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ప్రారంభించి ప్రసంగించారు. కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. "ఈ-సమన్స్ నిర్వహణపై పోలీస్ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. సంబంధిత డిజిటల్ ప్లాట్‌ ఫామ్లను వాడడంలో శిక్షణ తీసుకుని, ప్రతి ఆదేశాన్ని రికార్డు చేయాలని సూచించారు.

"సంబంధిత అన్ని కోర్టుల నుండి సమన్సు జారీ చేసిన వాటిని అట్టి సమన్స్ లను పోలీస్ స్టేషన్లో వారు డౌన్లోడ్ చేసుకుని ఆ సమన్స్ ను వాటిని త్వరితగతిన సర్వ్ చేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఈ శిక్షణను సిబ్బంది సద్వినియోగపరుచుకొని శిక్షణ పూర్తి అయిన అనంతరము సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ లు ఈ శిక్షణ గురించి క్లుప్తంగా తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ బస్వారెడ్డి, సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ శ్రీ సతీష్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్రీ శ్యాం కుమార్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని కోర్ డ్యూటీ ఆఫీసర్లతో పాటు ఐటి కోర్స్ సిబ్బంది హాజరయ్యారు.