20-07-2025 01:31:23 AM
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్య పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వెలు పలకు తరలించే ప్రక్రియను వేగవంతం చే యాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణ సమావేశంలో కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ పరిశ్రమల తరలింపునకు సంబం ధించి విధివిధానాలను, తరలింపు కేలండర్ను రూపొందించాలని, తరలింపు ప్రక్రి యకు తుది గడువును ఖరారు చేయాలని అధికారులను సబ్ కమిటీ సభ్యులు ఆదేశించారు.
రాజీవ్ స్వగృహా పథకం కింద వివిధ దశల్లో ఉన్న ఇల్లు, హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ఖాళీ స్థలాల విక్రయాలకు సం బంధించి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కొన సాగే బహిరంగ వేలం ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకో వాల న్నారు. సామాన్యులు, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా హౌసింగ్ బో ర్డు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
పెరిగిన వివిధ శాఖల ఆదాయం
గత నెలరోజుల వ్యవధిలో వివిధ శాఖల ఆదాయాల పెరుగుదలపై ఆయా శాఖలో ఉన్న అధికారులు సమవేశంలో నివేదిక సమర్పించారు. కమర్షియల్ ట్యాక్స్ శాఖలో 1.8శాతం, స్టాంప్స్ మరియు రిజిష్ర్టేషన్ల శాఖ లో 3.6శాతం, గనుల శాఖలో 7శాతం ఆదా యం పెరుగుదల ఉన్నట్లు అధికారులు మం త్రులకు నివేదించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు,
ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కు మార్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధ ర్, మెట్రోపాలిటన్ ఏరియా నగర అభివృద్ధి శాఖ కమిషనర్ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్, గనుల శాఖ కమిషనర్ శశాంక, కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, టీజీటీడీసీ ఎండీ వల్లూరు క్రాంతి, డి ప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు.