24 May, 2026 | 2:29 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చే వరకు పోరాటం...

03-02-2025 08:03 PM

మాజీ మంత్రి రామన్న...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ... గత పది ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి చేసిన అభివృద్ధి పనులతో పాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని గుర్తుచేస్తూ ప్రతి కార్యకర్త అదే స్ఫూర్తితో మరోసారి ప్రజలకు అండగా ఉండేలా ముందుండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక బూటకపు హామీలు ఇచ్చి అధికారంల్లోకి వచ్చిందని, ప్రభుత్వ విధానాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు. ప్రజా గొంతుకై నిలబడి ప్రజల పక్షాన పోరాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.