20-07-2025 07:37:47 PM
భద్రాచలం (విజయక్రాంతి): విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 23న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని (PDSU) రాష్ట్ర కమిటీ సభ్యుడు మునిగేలా శివ ప్రశాంత్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18,19 నెలలు గడుస్తున్న ప్రభుత్వ విద్యాసంస్థలను గాలికి వదిలేయడం సరైనది కాదు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్న విద్యాసంస్థలకు గత సంవత్సరాల తరబడి రావలసిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ రూ 8 వేల కోట్ల బకాయిలో పెండింగ్లో ఉండడంతో విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి అనేక రకాలైయిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
కాలేజీ యజమాన్యాలు ఫీజులు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామని వేధిస్తున్నారు. గత ప్రభుత్వం మన ఊరి మనబడి అనే కార్యక్రమం పెట్టి ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న మూత్రశాలలను మరుగుదొడ్లను వంటశాలలను పాత బిల్డింగ్లను కూల్చివేసి కొత్తవి కడతామని చెప్పి వదిలేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలు వేసి కనీసం విద్యార్థులకు అందించవలసిన మూత్రశాలలు మరుగుదొడ్లనైన నిర్మించకపోవడం వల్ల విద్యార్థులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
అమ్మాయిలు అబ్బాయిలు బయటికి వెళ్లడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే భవనాలు మరుగుదొడ్లు మూత్రశాలలో వంట గదులను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేసినారు. రాష్ట్రంలో కార్పోరేట్, ప్రయివేట్ విద్యాసంస్థలలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలు చట్టాల ప్రకారం ఈ ఒక్క ప్రైవేటు ,కార్పోరేట్ విద్యా సంస్థలను నడవడం లేదు ఎవరికి వారే ఇష్టానుసారంగా ఫీజుల దందాను చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఫీజుల నియంత్రణ చట్టాన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్య సంస్థలో పకడ్బందీగా అమలు చేయాలి. తదితర డిమాండ్స్ పైన జూలై 23న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ బందుకు విద్య సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు మేధావులు సహకరించే విజయవంతం చేయాలని కోరారు.