కేంద్ర మాజీ మంత్రి బిట్టు కాన్వాయ్పై దాడి
పంజాబ్: కేంద్ర మాజీ మంత్రి రవ్ణీత్ సింగ్ బిట్టు(Former Union Minister Ravneet Singh Bittu) కాన్వాయ్ పై దాడి జరిగింది. నషా ముక్త్ పంజాబ్ యాత్ర(Nasha Mukt Punjab Yatra)లో పాల్గొనేందుకు అమృత్సర్ నుంచి పఠాన్కోట్కు ప్రయాణిస్తుండగా, పంజాబ్లోని బటాలా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు తన కాన్వాయ్పై దాడి చేశారని మాజీ కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు శుక్రవారం ఆరోపించారు.
తాను ప్రయాణిస్తున్న వాహనంపై గుడ్లు, రాళ్లు విసిరారని, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పనేనంటూ బీజేపీ నేత చేసిన ఆరోపణలపై తన భద్రతా సిబ్బంది ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని బిట్టు పేర్కొన్నారు. వారు నల్లటి వస్త్రాన్ని పట్టుకుని ఉన్నారని, నషా ముక్త్ పంజాబ్ యాత్రలో తాను పాల్గొనకుండా నిరోధించడానికి బటాలా ఎమ్మెల్యే షెర్రీ కల్సీ వారిని పంపారని ఆయన తెలిపారు. నాకు ఏమైనా జరిగితే, నా భద్రతకు పంజాబ్ ముఖ్యమంత్రి, డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తక్షణ విచారణ జరపాలని, రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు తగిన భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.