3 September, 2026 | 9:06 PM

Districts - Khammam

article_36937600.webp
సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్‎నీ పరిశీలించిన ఎమ్మెల్యే

సత్తుపల్లి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): సత్తుపల్లి నూతన ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్‌నాయక్, డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులతో కలిసి సింగరేణి ఆధ్వర్యంలో గతంలో అందించిన వైద్య పరికరాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. రోగులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రోగులను పరామర్శించి, ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

02-09-2026 | 05:31pm