3 September, 2026 | 9:42 PM

Districts - Nagarkurnool

article_14836598.webp
ఆరు గ్యారెంటీల కోసం మళ్ళీ ఉద్యమాలు చేయాలా..!

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజలు, ఉద్యోగులు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీఆర్‌ఎస్ నాయకులు నాగం శశిధర్‌రెడ్డి విమర్శించారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు సైతం తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్నారని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. కరెంట్ కోతలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కల్వకుర్తి ప్రాజెక్టు కాలువలన్నీ జమ్ముతో పేరుకుపోయి నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి ఆందోళన చేపడతామని నాగం శశిధర్‌రెడ్డి హెచ్చరించారు.

30-08-2026 | 01:52pm

article_86695486.webp
కల్వకుర్తిలో ఘనంగా 2కే రన్‌ పోటీలు

కల్వకుర్తి, ఆగస్టు 30: నాగర్‌కర్నూల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్(Nagarkurnool District Athletic Association) ఆధ్వర్యంలో ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో 2కే రన్‌ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి(Kalwakurthy MLA Kasireddy Narayana Reddy) హాజరై జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. బాలురు, బాలికలు, యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేసి అభినందించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు.

30-08-2026 | 11:56am

article_56597727.webp
చౌటబెట్ల యువతికి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్.!

కొల్లాపూర్ రూరల్: మండలంలోని చౌటబెట్ల గ్రామానికి చెందిన కోళ్ల చంద్రయ్య–దేవేంద్రమ్మ దంపతుల కుమార్తె కోళ్ల సునీత భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్‌లో ఉన్న ఎస్‌జెజేటీయూ విశ్వ విద్యాలయంలో డాక్టర్ నితికా చౌదరి మార్గదర్శకత్వంలో సునీత పరిశోధన పూర్తి చేశారు. స్ఫటికాల అంతర్గత పరమాణు అమరిక, వాటి సామ్యరూపతను గణితశాస్త్ర పరంగా అధ్యయనం అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సునీత ఉన్నత విద్యలో ఈ ఘనత సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ కౌన్సిలర్ వంగ అనూష మాట్లాడుతూ గ్రామీణ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. సునీతను ఆదర్శంగా తీసుకుని యువత ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

30-08-2026 | 11:27am

article_76573273.webp
చెరువులో అనుమానాస్పదంగా చేపల మృతి

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌ బండ్‌, కేసరి సముద్రం చెరువులో(Kesari Samudram Cheruvu) గత వారం రోజులుగా చేపలు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి. మున్సిపాలిటీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, మురుగునీరు చెరువులో కలవడంతో నీరు కలుషితమై చేపలు మృత్యువాత పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దళారులు నిబంధనలకు విరుద్ధంగా చెరువులో చేపలను పట్టుకుని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలలకు చిన్న సైజు చేపలు సైతం చిక్కి మృతి చెందుతున్నాయని ఆరోపిస్తున్నారు. మృతి చెందిన చేపలు అలలతో ఎండబెట్ల గ్రామ శివారు వైపు కొట్టుకురావడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. చేపల మృతిపై అధికారులు వెంటనే విచారణ జరిపి, చెరువులో మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ చేపల వేటను అరికట్టాలని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు.

30-08-2026 | 08:53am