3 September, 2026 | 10:14 PM

Districts - Bhadradri Kothagude

article_49760115.webp
బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణను బహిష్కరిస్తున్నాం

పాల్వంచ: ఈ నెల 4న జరగనున్న బాబు జగ్జీవన్‌రావు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మాదిగ జాతి బహిష్కరిస్తుందని వానపాకుల రాంబాబు, కటుకూరి శేఖర్‌బాబు తెలిపారు. పాల్వంచ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం మాదిగ జాతిని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో అల్లూరి సాంబశివరావు, పొట్టపింజర బ్రహ్మానందరావు, కొత్తపల్లి శ్రీను, మోదుగు వెంకన్న, గుండెపాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

02-09-2026 | 03:27pm

article_61490324.webp
గత పదేళ్లలో చేయలేని అభివృద్ధి వెయ్యి రోజుల్లోనే ప్రభుత్వం చేసి చూపింది

గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో జరగని అభివృద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వేయి రోజుల్లోనే చేసి చూపిందని అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసం శ్రీనాథ్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని అలాగే ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిందని అర్హులైన వారందరికీ రేషన్ కార్డు మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటికే ఉన్నత చదువుల పూర్తి చేసి ఉన్న నిరుద్యోగుల కోసం పోలీస్ ఫారెస్ట్ తదితర విభాగాలలో నోటిఫికేషన్ విడుదల చేసిందని ఈ సందర్భంగా తెలిపారు.

02-09-2026 | 08:41am