బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణను బహిష్కరిస్తున్నాం
పాల్వంచ: ఈ నెల 4న జరగనున్న బాబు జగ్జీవన్రావు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మాదిగ జాతి బహిష్కరిస్తుందని వానపాకుల రాంబాబు, కటుకూరి శేఖర్బాబు తెలిపారు. పాల్వంచ ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం మాదిగ జాతిని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో అల్లూరి సాంబశివరావు, పొట్టపింజర బ్రహ్మానందరావు, కొత్తపల్లి శ్రీను, మోదుగు వెంకన్న, గుండెపాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
02-09-2026 | 03:27pm