3 September, 2026 | 9:41 PM

Districts - Kamareddy

article_76076793.webp
అధికారులు మారినా.. మారని గ్రామపంచాయతీ సమాచార బోర్డు

భిక్కనూర్, సెప్టెంబర్‌ 3 (విజయక్రాంతి): అధికారులు మారుతున్నా గ్రామపంచాయతీ సమాచార బోర్డుపై పేర్లు మాత్రం మారడం లేదు. భిక్కనూర్‌ మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామపంచాయతీ గోడపై ఏర్పాటు చేసిన సమాచార హక్కు బోర్డుపై ఎంపీడీవో, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శుల పేర్లు ఏళ్లుగా మార్పులు చేయకుండా అలాగే దర్శనమిస్తున్నాయి. బోర్డుపై ఉన్న ఎంపీడీవో 2021లో, ఎంపీఓ 2024లో బదిలీ అయినట్లు సమాచారం. అయినప్పటికీ వారి పేర్లే కొనసాగుతుండడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి పాత పేర్లను తొలగించి, ప్రస్తుత అధికారుల పేర్లను నమోదు చేయాలని కోరుతున్నారు.

03-09-2026 | 03:20pm

article_38064452.webp
బీసీ బాలుర వసతిగృహంలో సమస్యల తిష్ట...?

బాన్సువాడ, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలోని బీసీ బాలుర వసతిగృహంలో విద్యార్థులకు కనీస వసతులు కరువవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం రాత్రి విజయక్రాంతి విజిట్ చేసింది. వసతిగృహంలోని కిటికీలకు తలుపులకు బదులుగా అట్టలు,దుప్పట్లు ఏర్పాటు చేయడం, బాత్రూంల తలుపులు విరిగిపోయి ఉండటం వంటి సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విద్యార్థులు,తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు విద్యార్థులకు అందించే భోజనంపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘వండామా.. పెట్టామా’ అన్న చందంగా భోజనం అందిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

03-09-2026 | 10:27am