3 September, 2026 | 9:41 PM

Districts - Mancherial

article_12437982.webp
420 హామీల అమలు ఏమయ్యాయి..?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన 420 హామీల అమలు ఏమైందని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రశ్నించారు. గురువారం మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట ఐబి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బీ ఆర్ ఎస్ నాయకులు, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె నెక్కడానికి అనేక రకాల హామీలిచ్చి, ఇప్పుడు ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తోందని మండిపడ్డారు. మహిళలకు ప్రతి నెల రూ. 2500 లతో పాటు కల్యాణ లక్ష్మీలో తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టి ఓట్లు వేయించుకున్నారని ఏద్దేవా చేశారు.

03-09-2026 | 06:12pm

article_73142936.webp
సెల్ ఫోన్ వదలండి

సెల్ ఫోన్ చూస్తూ కాలక్షేపం చేయడం మాని విద్యార్థులు స్కిల్స్ నేర్చుకోవాలని కళాశాల వైస్ ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డి కోరారు. రోబోటిక్స్‌లో ఆసక్తి ఉన్న స్కూల్ విద్యార్థులను ప్రేరేపించాలనుకునే కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం ఇది అని, ట్రైనింగ్ పొందిన విద్యార్థులు స్కూళ్లకు వెళ్లి చెప్పినందుకు స్టైపెండ్ రోజువారీగా ఇవ్వబడుతుందన్నారు. రోబోటిక్స్ శిక్షణను సద్వినియోగం చేసుకుంటే పాఠశాలల్లో వర్క్‌షాప్‌లు & ఇన్నోవేషన్ మేళాల్లో పాల్గొనే అవకాశం కలుగుతుందని, స్టైపెండ్ తో పాటు ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ లభిస్తుందన్నారు.

01-09-2026 | 05:48pm