21-01-2025
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో మార్కెట్లు లాభపడ్డాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ లాభాలల్లో 76,978.53 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా పెరి గింది. చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఇంట్రాడేలో 76,584.84 పాయిం ట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. 77,318.94 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 454.11 పాయింట్ల లాభంతో.. 77,073.44 వద్ద స్థిరపడింది.
21-01-2025
ముంబై: రిలయన్స్ జియో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), భారతీ ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. యూజర్లు తాము వాడుతున్న సిమ్ కార్డ్ సిగ్నల్ కోల్పోయినా అందుబాటులో ఉన్న ఇతర నెట్వర్క్ సాయంతో కాల్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం ఇంట్రాసర్కిల్ రోమింగ్ (ఐసీఆర్) ఫెసిలిటీ తీసుకొచ్చింది.
21-01-2025
న్యూఢిల్లీ: ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీ స్ భారత్ వృద్ధిరేటు అంచనాలను తగ్గించేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024- 25)లో వృద్ధిరేటు ఏడు శాతమేనని తేల్చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) వృద్ధిరేటు 8.2శాతంతో పోలిస్తే తగ్గుముఖం పడుతుందని వ్యాఖ్యానించింది. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక ధోరణుల నేపథ్యంలో వృద్ధిరేటు అంచనాలు తగ్గిస్తున్నట్లు మూడీస్ పేర్కొంది. అలాగే, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు కొనసాగుతుందని వెల్లడించింది.
21-01-2025
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకు పోయిన ‘గో ఫస్ట్’ ఎయిర్లైన్స్ లిక్విడేషన్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్( ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఈ మేరకు కంపెనీ దాఖలు చేసిన పిటిషన్కు జ్యుడీషియల్ సభ్యుడు మహేంద్ర ఖండేల్వాల్, టెక్నికల్ మెంబర్ డాక్టర్ సంఈవ్ రంజన్తో కూడిన ఎన్సీఎల్టీ బెంచ్ అనుమతించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
21-01-2025
ముంబై: దిగ్గజ సంస్థ అదానీ గ్రూపు ఇటీవల అమెరికాలో తమ సంస్థపై వచ్చిన ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయింది. ఈ మేరకు సెక్యూరి టీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ), ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ దాఖలు చేసిన సివిల్, క్రిమినల్ కేసులను నిర్వహించడానికి కిర్క్లాండ్ అండ్ ఎల్లిస్, క్విన్ ఇమ్మాన్యుయేల్ ఉర్కహర్ట్ అండ్ సుల్లివాన్ ఎల్ఎల్పీ అనే రెండు న్యాయసంస్థలను అదానీ గ్రూపు నియమించింది.
21-01-2025
చెన్నై: టీవీఎస్ మోటార్స్ కంపెనీ సోమవా రం తన సరికొత్త కింగ్ ఈవీ మ్యాక్స్ త్రీవీలర్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ పర్యావరణ అనుకూల వాహనాన్ని కంపెనీ పట్టణ ప్రాంత ప్రయాణికుల కోసం రూపొందించింది. ఇది 51.2వి లిథియం అయాన్ ఎల్ఎఫ్పీ బ్యాటరీతో వస్తుంది. సింగిల్ చార్జ్పై 179 కిలోమీ టర్లు ప్రయాణిస్తుంది.