13-11-2025
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఏటా నవంబర్ 19న నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ (ఏఐ ఎన్యూ), బంజారాహిల్స్ శాఖలో పురుషుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ పురుషుల సమగ్ర వెల్నెస్ ప్రోగ్రాంను ప్రారంభించింది. పురుషుల్లో పెరుగుతున్న వంధ్యత్వం (సంతానరాహిత్యం), లైంగిక పటుత్వం లోపించడం లాంటి సమస్యలపై ప్రధానం గా దృష్టిసారించారు.
13-11-2025
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): నిమోనియా అనేది ఊపిరితిత్తులను ప్రభావితం చేసే తీవ్రమైన ఇన్ఫెక్షన్ అని, దీన్ని ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చునని మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ మేఘన సుభాష్ తెలిపారు. అన్ని వయసుల వారిలో కనిపించే ఈ వ్యాధి, ముఖ్యంగా వృద్ధులు, మధుమేహం లేదా హృదయ సంబంధ వ్యాధులతో ఉన్నవారిలో ప్రమాదకరం అని చెప్పారు.
13-11-2025
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): వైద్యరంగంలో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కిమ్స్ గ్రూప్ అగ్రగామిగా ముందుకు సాగుతోందని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.భాస్కర్రావు తెలిపారు. కిమ్స్ సన్షైన్లో భాగమైన సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్కు జాయింట్ రీప్లేస్మెంట్ భాగంలో భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎవి గురవారెడ్డి తెలిపారు. బుధవారం బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్లో మాట్లాడారు.
11-11-2025
హైదరాబాద్: బీమా లోక్ పాల్ దినోత్సవాన్ని హైదరాబాద్ ఇన్య్సూరెన్స్ అంబుడ్సమన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఐఆర్డీఎ ఛైర్మన్ అజయ్ సేథ్ వెబ్ కాస్ట్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీమా అంబుడ్సమన్ కేంద్రాలను ఉద్దేశించి ప్రసంగించిన అజయ్ సేథ్ 2047 నాటికి ప్రతీ ఒక్కరికీ బీమా అనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. పాలసీదారుల ఫిర్యాదులను ఉచితంగా, పారదర్శక పరిష్కరించడానికి నిష్పాక్షికమైన యంత్రాంగాన్ని అందించడానికి భారత ప్రభుత్వం దీనిని తీసుకొచ్చిందన్నారు. ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో హైదరాబాద్ కేంద్రం చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
11-11-2025
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు తర్వాత కోలుకున్నాయి. 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్ 411.32 పాయింట్లు క్షీణించి 83,124.03 వద్ద ప్రతికూలంగా ట్రేడింగ్ను ప్రారంభించింది. 50 షేర్ల ఎన్ఎస్ఇ నిఫ్టీ ప్రారంభ ట్రేడింగ్లో 125.1 పాయింట్లు క్షీణించి 25,449.25 వద్ద ముగిసింది.
11-11-2025
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి): కాంటినెంటల్ నెక్స్ట్ జనరేషన్ బయోబ్యాంక్ను హైదరాబాద్ గచ్చి బౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్స్లో సోమవారం ప్రారంభించారు. కాంటినెంటల్ బయో బ్యాంక్.. ఆధునిక బయోబ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను, తెలివైన డేటా వ్యవస్థలతో సమన్వయం చేస్తోంది. బయోటెక్ భాగస్వామ్యాలు ఇప్పటికే మొదలైనప్ప టికీ... వాటికి సంబంధించిన వివరాలు 2026లో ప్రకటించడం జరుగుతుంది.