మహిళపై సామూహిక అత్యాచారం
06-09-2026 | 12:11pm
జాజ్పూర్: ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా(Jajpur District) చండిఖోల్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు 32 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశారని పోలీసులు ఆదివారం తెలిపారు. బుధవారం రాత్రి కళింగ నగర్ పోలీస్ స్టేషన్లో(Kalinga Nagar Police Station) ఆ మహిళ ఫిర్యాదు చేసిన తర్వాత, శనివారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. బాధితురాలికి తెలిసిన నిందితులలో ఒకరు మంగళవారం సాయంత్రం ఆమెకు ఫోన్ చేసి, ఆమె భర్తకు ఆరోగ్యం బాగోలేదని చెప్పినప్పుడు ఈ ఘటన జరిగిందని ఒక పోలీసు అధికారి మీడియాకు సూచించారు.






