13 June, 2026 | 5:16 PM

Crime&legal -

article_70905819.webp
మొయినాబాద్ హంతకురాలు మృతి

తాండూరు, జూన్ 11, (విజయ క్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మహిళల జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలైన కరీమా బేగం గురువారం మృతి చెందింది. రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడి ఆయా జుబేదా బేగం వద్ద అప్పు తీసుకుంది, ఇందిరా నగర్ కు చెందిన మరో మహిళ పెద్ద సైతం కరిమా బేగం గతంలో అప్పు తీసుకుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వస్తే తీసుకున్న అప్పు తీరుస్తానని ఇద్దరు మహిళలను వేరువేరుగా పిలిపించుకొని కరీమా బేగం, భర్త రెహమాన్, ఫామ్ హౌస్ సెక్యూరిటీ గార్డ్ నయీమ్ తో కలిసి వారిని హత్య చేసి అక్కడే పూడ్చి పెట్టింది.

11-06-2026

article_53859327.webp
కాఫర్ వైర్ దొంగలు దొరికారు..

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కొంతకాలంగా శాంతి ఖని ప్రాజెక్ట్ లో కాఫర్ వైర్ దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. అంతు చిక్కని విధంగా దొంగతనాలు పరంపర సాగుతున్నది. ఎట్టకేలకు కాపర్ వైర్ దొంగతనం కేసును బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు చేధించారు. కాఫర్ వైర్ దొంగలను అనూహ్యంగా పట్టుకున్నారు. సంఘటన వివరాలను బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం శాంతి ఖని మైన్ లో కాపర్ వైర్ దొంగతనం చోటుచేసుకున్నది. అధికారులను నుంచి కంప్లైంట్ రాగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బుధవారం బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ సీహెచ్ కిరణ్ కుమార్ తన సిబ్బందితో వెళ్లి శాంతి ఖని ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నారు. అక్కడ కొందరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించారు. సదరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని పట్టుకుని విచారించారు. వారి దగ్గర 10 కిలోల కాపర్ వైర్ దొరికింది.

11-06-2026

article_35840483.webp
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: కోటపల్లి సిఐ కృష్ణ

కోటపల్లి, (విజయక్రాంతి) : యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోటపల్లి సిఐ కృష్ణ పేర్కొన్నారు. కోటపల్లి పోలీసులు మండలంలోని పారుపల్లి గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కోటపల్లి ఎస్సై రాజశేఖర్ తో కలిసి ఆయన మాట్లాడారు. చెడు వ్యసనాలకు యువత బానిస కాకుండా తమ భవిష్యత్తును లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన బోగే రాజేష్ ఇటీవల అగ్నివీర్ (ఆర్మీ)కు ఎంపికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు వాలీబాల్ కిట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, అధికారులు గ్రామస్థులు పాల్గొన్నారు.

11-06-2026