ఆస్తి కోసం హత్య?
20-01-2025
కామారెడ్డి, జనవరి 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. రామారెడ్డి ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పొక్కిలి జంపాలరవి(48), సంగీత దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.