14 April, 2026 | 10:59 AM

Crime&legal -

article_52529681.webp
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహాంను గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గమనించిన స్థానికులు చేర్యాల పోలీసులకు సమాచారం తెలుపగ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గుర్తుతెలియని మహిళా మృతదేహంగా గుర్తించి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.మహిళా వయస్సు 35 నుంచి 40 ఏళ్ల పైబడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.మృతురాలి శరీరం పైన నల్లటి బుర్కా తో పాటు ఎర్ర రంగు నైటీ ధరించింది మేడలో తాళిబొట్టుతో పాటు తాయత్తు ఉందని తెలిపారు.ఎవరికైనా మృతరాలి వివరాలు తెలిసినచో ఈ నెంబర్ కు 8712667356 సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

10-04-2026

article_57293311.webp
గంజాయి స్వాదీనం

పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో(Pebbair Police Station Limits) గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించి పోలీసులు కీలక విజయాన్ని సాధించారు. గురువారం ఉదయం అందిన సమాచారంతో చేపట్టిన ఆపరేషన్‌లో కొంత మందిని అరెస్ట్ చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాలలో.. ఉదయం 10 గంటల సమయంలో బాలాజీ ధాబా సమీపంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్మకానికి వస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే పై అధికారులకు తెలియజేశారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డి సమక్షంలో ప్రభుత్వ పంచులతో పాటు క్లూస్ టీం సహాయంతో అక్కడికి చేరుకున్నారు. సుమారు 11 గంటల సమయంలో అనుమానితులు అక్కడికి రాగానే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, వారి పేర్లు ప్రవీణ్ కుమార్, బబ్లు కుమార్ సింగ్ అని, ఇద్దరూ బీహార్ రాష్ట్రానికి చెందినవారని వెల్లడైంది. వీరు ఇటీవల బాలాజీ రైస్ మిల్‌లో పని చేస్తూ గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వారి వద్ద నుంచి నాలుగు ప్యాకెట్లు (మొత్తం 16 గ్రాములు) గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

10-04-2026

article_88795030.webp
రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి

షాద్‌నగర్ ఏప్రిల్ 3 (విజయక్రాంతి): రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఫరూఖ్ నగర్ మండలం చిలకమర్రి రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలకమర్రి రైల్వే గేట్ సమీపంలో ఉదయం సుమారు 5: 20 నిముషాల సమయంలో రైలు పట్టాలు దాటడంతో రైలు రాకను గమనించకపోవడంతో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి మృతి చెందిందని మృతురాలు గ్రీన్ రంగు చీర గ్రీన్ జాకెట్ చేతికి రాయి ఉంగరాలు ఉన్నట్టు తెలిపారు. షాద్ నగర్ స్టేషన్ మాస్టర్ అభిషేక్ కుమార్ ఫిర్యాదు మేరకు రైల్వే కానిస్టేబుల్ డి.మల్లేశ్వర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

03-04-2026

article_14530947.webp
ఆమనగల్లులో ఘోరం.. క్షణికావేశం నిండు ప్రాణాలను బలితీసుకుంది

​ఆమనగల్లు,(విజయక్రాంతి): క్షణికావేశం మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను కడతేర్చిన హృదయవిదారక ఘటన అమంగల్ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.​స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు మండలం సీతారాం నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పులిగోనిపల్లి తండాకు చెందిన బాణావత్ రాందాస్ అనే వ్యక్తి మద్యం బానిస. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి రాందాస్ అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.​

31-03-2026