హాల్ టికెట్ ఇవ్వలేదని.. బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య
పరీక్షలు రాయడానికి హాల్ టికెట్ ఇవ్వలేదని బీటెక్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండల కేంద్ర్రానికి మ్యాదరి ప్రణీత్ కుమార్ (22) రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని శ్రీ ఇందూ కాలేజీలో సీఎస్సీ - డీ బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాడు.
19-04-2026