గొంతు కోసి యువతి హత్య
09-12-2025
ముషీరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాం తి): తనతో పెళ్లికి ఒప్పుకోవడం లేదనే కోపం తో యువతి గొంతుకోసి, హత్య చేసిన ఘటన సోమవారం హైదరాబాద్లోని ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్లో జరిగింది. ఏపీలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన లక్ష్మి, కాంతారావు దంపతులు బాపూజీ నగర్లో నివాస ముంటున్నారు. వారి కూతురు పవిత్ర (19) ఇంటర్ పూర్తి చేసి, ఇంట్లోనే ఉంటుంది. పవిత్ర మేనబావ అయిన హైదరాబాద్ రహమత్ నగర్కు చెందిన ఉమా శంకర్ (25) టైల్స్ పనిచేస్తున్నాడు.