కూకట్పల్లిలో బాలిక దారుణ హత్య
19-08-2025
కూకట్పల్లి, ఆగస్టు 18 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలో సోమవారం బాలిక దారుణ హత్యకు గురైంది. బాలానగర్ డీసీపీ సురేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ముక్తక్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ దంపతులు కూకట్పల్లి సంగీత నగర్లో నివాసం ఉంటున్నారు. కృష్ణ బైక్ మెకానిక్గా పని చేస్తుండగా, రేణుక ఓ ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నది. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు.