4 August, 2026 | 11:42 AM

Crime&legal -

article_77617541.webp
అమీన్‌పూర్‌లో మాయ 'లేడీ' భారీ మోసం

అమీన్ పూర్ ఆగస్టు 3: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్(Ameenpur GHMC Circle) పరిధిలోని బిఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్న చిలకలూరి పేటకు చెందిన శీరిష చిట్టిల వ్యాపారిగా అవతారమెత్తింది. చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో నమ్మబలికి బాధితుల నుంచి విడతల వారీగా దాదాపు రూ.4 కోట్ల వరకు వసూలు చేసి అదృశ్యం అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బీఎస్ఆర్ కాలనీతో పాటు చుట్టుపక్కల స్థానికులను నమ్మించి వారి దగ్గర నుండి రూ.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కాగా అకస్మాత్తుగా తనసొంత ఇల్లును అమ్ముకొని రాత్రికి రాత్రే ఉడాయించింది. దీంతో మోసపోయామని తెలిసిన బాధితులు అమీన్ పూర్ పోలీస్ స్టేషన్(Ameenpur Police Station)లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపులు చేపట్టారు.

03-08-2026

article_87190128.webp
బాధ్యతారాహిత్యంతో బలవుతున్న నిండు ప్రాణాలు

గుండాల, (విజయక్రాంతి): గత కొంత కాలంగా మండలంలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాలను గమనిస్తే అత్త్తారింటికి ద్విచక్ర వాహనంపై ఒక కుటుంబం మొత్తం వెళ్తున్న సందర్భంలో మూల మలుపు వద్ద వాహనం అదుపు తప్పి క్రిందపడడంతో ఆ ప్రమాదంలో చిన్న పిల్లవాడు మృతి చెందగా, తల్లికి తొంటి, తండ్రికి చేయి విరగడంతో ఆనందంగా ఉండాల్సిన కుటుంబంలో ఆ రోడ్డు ప్రమాదం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. మండల పరిధికి చెందిన ఒక గ్రామంలో తనకు పుట్టిన బిడ్డను చూడడానికి తండ్రి దూర ప్రాంతం నుండి ద్విచక్ర వాహనంపై వస్తుంటే అనుకోకుండా జరిగిన ప్రమాదంలో అతను మృత్యువాత పడితే ఆ కుటుంబ పరిస్థితి అగమ్యగోచరం. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో నిండా ఇరువై ఏళ్ళు కూడా నిండని కన్న కొడుకు ఆ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై నుండి పిట్టలా రాలిపోయి మరణిస్తే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఇలా చెప్పుకుంటూ పోతే మండలంలో రోజురోజుకీ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాల బారిన పడి తీవ్రంగా గాయపడడమో లేక ప్రాణాలను సైతం కోల్పోవడం జరుగుతూ పరిపాటి అయింది.

03-08-2026

article_67297410.webp
ఇంటి నుండి బయటకు వెళ్లిన దివ్యాంగుడు అదృశ్యం

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఇంటి నుండి బయటకు వెళ్లిన ఓ దివ్యాంగుడు అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన్ననాటి నుండి మానసిక వైకల్యంతో బాధపడుతున్న అఖిల్ (24) జవహర్ నగర్ పరిధిలోని అంబేద్కర్ నగర్ వాటర్ ట్యాంకు వద్ద తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. కాగా తన నివాసం నుండి గత ఆదివారం ఉదయం 11 గంటలకు బయటికి వెళ్లాడని ఇంతవరకు అతని ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు అఖిల్ గురించి బంధువుల వద్ద వెతికినా స్నేహితుల ఇళ్లలో వెతికినా ఎంతకీ సమాచారం లభించకపోవడంతో అఖిల్ తండ్రి రామాచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దివ్యాంగుడైన అఖిల్ కు సరిగ్గా మాటలు రావని కనీసం తన అడ్రస్ గానీ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ గాని ఎవరికి చెప్పలేడని ఈ యువకుడి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే సమీపంలోనే పోలీస్ స్టేషన్లకు తెలియజేయాలని లేదా 9866784848 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

03-08-2026

article_56640817.webp
గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం

మల్లాపూర్, ఆగస్టు 2(విజయక్రాంతి):మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబులాపూర్ గ్రామ శివారులోని గోదావరి నదిలో ఆదివారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి వయస్సు సుమారు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు. మృతురాలు నావి బ్లూ రంగు డిజైన్ ఉన్న టాప్, పసుపు రంగు ప్యాంట్ ధరించి ఉంది, చేతికి ఎరుపు, ఆకుపచ్చ రంగుల గాజులు ఉండగా, కుడి చేతిపై "అమ్మ" అని టాటూ ఉందని తెలిపారు.మృతురాలి వివరాలు తెలిసిన వారు లేదా ఆమెను గుర్తించగలిగిన వారు వెంటనే మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు లేదా మీకు సమీపంలో ఉన్నా పోలీస్ స్టేషన్‌ను సమాచారం అందించాలని కోరారు.మృతురాలు వివరాలు తెలిస్తే మల్లాపూర్ ఎస్‌ఐ ఎ. అనిల్ 8712656796 నంబర్‌ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

03-08-2026

article_23612527.webp
కుటుంబ కలహాలతో గృహిణి మృతి

జవహర్ నగర్ ఆగస్టు 2 (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో ఓ గృహిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... యాప్రాల్ ప్రాంతం లో బి. బాలరాజు భార్య లలిత ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. బాలరాజు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. మూడు నెలల క్రితం లలిత( 28) ను భర్త కొట్టడంతో నాగర్ కర్నూల్ జిల్లా కేశంపేట తండా అయిన పుట్టింటికి వెళ్ళింది. మూడు రోజుల క్రితం బాలరాజు వద్దకు లలితను తన అన్నబాధ్య తీసుకువచ్చాడు. కోపంతో రగిలిపోయిన బాలరాజు భార్య లలిత బామ్మర్ది బాధ్య ను కొట్టాడు. ఈనెల 1వ తేదీన భార్య లలిత వాటర్ హీటర్ బకెట్లో చేతిని పెట్టుకుందని స్థానికులు బాలరాజుకు సమాచారం అందించారు. వెంటనే లలితను ఆర్మీ దావకానాకు తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. హీటర్ బకెట్ కు సంబంధించిన ఘటన భర్త బాలరాజు వేధింపులతోనే లలిత మరణించి ఉంటుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు లలిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

03-08-2026

article_81335082.webp
పుట్టగొడుగుల్లా దర్శనమిస్తున్న బెల్ట్ షాపులు.. ఏరులై పారుతున్న మద్యం

కుత్బుల్లాపూర్, ఆగష్టు 02(విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని మద్యం ఏరులై పారుతుంది. ఎటు చూసిన బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా దర్శనమిస్తున్నాయి.అధికారుల నిర్లక్ష్యం వలన మద్యం మాఫియా గల్లీకో బెల్ట్ షాపు ఏర్పాటు చేస్తూ అందినకాడికి దండుకుంటుంది. నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్ వార్డులో గల సైదప్ప బస్తీలో అక్రమ బెల్ట్ షాపులు రాజ్యమేలుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేణుక ఎల్లమ్మ ఆలయం వెనుక భాగంలో, ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో బెల్ట్ షాపులను ప్రతిరోజూ తెల్లవారకముందే తెరిచి అర్ధరాత్రి వరకు ఎలాంటి నియంత్రణ లేకుండా నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

03-08-2026

article_33603396.webp
కాళేశ్వరం గోదావరి నదిలో విషాదం

భూపాలపల్లి /కాళేశ్వరం ఆగస్టు 2 విజయక్రాంతి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. పుణ్య స్థానం చేసేందుకు గోదావరిలో దిగిన భక్తుడు గుబ్బల శ్రీనివాస్ రెడ్డి పుణ్యస్నానం చేస్తున్న సమయంలో ఒక్కసారి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అదుపుతప్పి లోతైన నీటిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించిన అక్కడే ఉన్నా నిట్టూరు మహేష్ దరిపెల్లి శ్రీకాంత్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గోదావరిలోకి దిగి ఆయనను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గోదావరి ప్రవాహం వేగంగా ఉండడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు.

03-08-2026