4 September, 2026 | 10:40 PM

Breaking News

మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •   కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం   •   420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్   •  

ఇస్కాన్ లో ఎమ్మెల్యే నాయిని ప్రత్యేక పూజలు

04-09-2026 | 05:00pm

హనుమకొండ,(విజయక్రాంతి): శ్రీకృష్ణ జన్మాష్టమి(Sri Krishna Janmashtami) పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy,), సతీమణి నాయిని నీలిమరెడ్డి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు రోడ్డులోని శ్రీకృష్ణ మందిరం (ఇస్కాన్) ను సందర్శించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేసి, స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.

ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, సౌభ్రాతృత్వం నింపాలని ఆకాంక్షించారు. భగవంతుని ఆశీస్సులతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.