రూపాయి విలువ.. పావులా పతనం

10-09-2026 | 10:29am

ప్రారంభ ట్రేడింగ్‌లో తగ్గిన రూపాయి

ముంబై: గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో, బ్రెంట్ ముడి చమురు ధర 100 డాలర్ల మార్కును దాటడంతో భారత్ దిగుమతి వ్యయంపై(India's import expenditure) ఆందోళనలు తీవ్రమయ్యాయి. దీనివల్ల అమెరికా డాలర్‌తో(US Dollar పోలిస్తే రూపాయి విలువ 25 పైసలు(Rupee falls) తగ్గి 95.33కు చేరుకుంది. పెరిగిన ముడి చమురు ధరలు, నిరంతర డాలర్ డిమాండ్ కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని ఫారెక్స్ వ్యాపారులు(Forex traders) పేర్కొన్నారుఅంతర్-బ్యాంక్ విదేశీ మారకపు మార్కెట్‌లో, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 95.15 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత బలహీనపడి 95.33 స్థాయికి చేరింది. తద్వారా తన మునుపటి ముగింపుతో పోలిస్తే 25 పైసల నష్టాన్ని నమోదు చేసింది. బుధవారం నాడు, అమెరికన్ కరెన్సీతో పోలిస్తే రూపాయి విలువ 34 పైసలు తగ్గి 95.08 వద్ద ముగిసింది.

స్వల్ప లాభాల్లో స్టాట్ మార్కెట్లు

అటు దేశీయ మార్కెట్ సూచీలు(Domestic market indices) స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.17 సమయంలో 16 పాయింట్ల లాభంలో సెన్సెక్స్(Sensex), 15 పాయింట్లతో నిఫ్టీ-50 లాభంలో కొనసాగాయి.

మరిన్ని వార్తలు