calender_icon.png 8 December, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Business/Health

article_87966441.webp
ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. దిగివచ్చిన రెపో రేటు

05-12-2025

ముంబై: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా(RBI Governor Sanjay Malhotra) శుక్రవారం ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించారు. ఆర్‌బీఐ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బేసిస్ పాయింట్లు తగ్గింపుతో రెపోరేటు 5.25 శాతానికి దిగొచ్చింది. కరెన్సీ సరఫరా, రిజర్వ్ ఫండ్ ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. బేసిస్ పాయింట్ల తగ్గింపు(Basis points reduction) కొనుగోళ్లకు ఊతం ఇస్తోందన్నారు. ఈ ఆర్థిక సంవంత్సరంలో కరెంట్ ఖాతా లోటు సాధారణంగా ఉంటుందని సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం అంచనాను 2.6 శాతం నుంచి 2 శాతానికి తగ్గించామని వెల్లడించారు. వృద్ధి అంచనాను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచినట్లు తెలిపారు. ఉత్పాదక కార్యకలాపాలు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. సేవలు స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవంత్సర మూడో త్రైమాసికంలో వేగంగా ఆర్థిక కార్యక్రలాపాలు చేపట్టనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.

article_81203298.webp
ప్రారంభంలో ఒడిదుడుకులు

05-12-2025

ముంబై: శుక్రవారం ఆర్‌బిఐ ద్రవ్య విధాన(RBI Monetary Policy 2025) నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్(Stock markets ) బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ప్రారంభ ట్రేడింగ్‌లో అత్యంత అస్థిర ధోరణులను ఎదుర్కొన్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ 53.54 పాయింట్లు పెరిగి 85,318.86 వద్ద ముగిసింది. 50 షేర్ల ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 28.2 పాయింట్లు పెరిగి 26,061.95 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సంస్థలలో, ఎటర్నల్, మారుతి, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ట్రెంట్ వెనుకబడి ఉన్నాయి. గురువారం సెన్సెక్స్ 158.51 పాయింట్లు లేదా 0.19 శాతం పెరిగి 85,265.32 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 47.75 పాయింట్లు లేదా 0.18 శాతం పెరిగి 26,033.75 వద్ద ముగిసింది.