ప్రారంభంలో ఒడిదుడుకులు
05-12-2025
ముంబై: శుక్రవారం ఆర్బిఐ ద్రవ్య విధాన(RBI Monetary Policy 2025) నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్(Stock markets ) బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ప్రారంభ ట్రేడింగ్లో అత్యంత అస్థిర ధోరణులను ఎదుర్కొన్నాయి. ప్రారంభ ట్రేడింగ్లో 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్ 53.54 పాయింట్లు పెరిగి 85,318.86 వద్ద ముగిసింది. 50 షేర్ల ఎన్ఎస్ఇ నిఫ్టీ 28.2 పాయింట్లు పెరిగి 26,061.95 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సంస్థలలో, ఎటర్నల్, మారుతి, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ట్రెంట్ వెనుకబడి ఉన్నాయి. గురువారం సెన్సెక్స్ 158.51 పాయింట్లు లేదా 0.19 శాతం పెరిగి 85,265.32 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 47.75 పాయింట్లు లేదా 0.18 శాతం పెరిగి 26,033.75 వద్ద ముగిసింది.