పసికందుకు ప్రాణంపోసిన మెడికవర్
అత్యవసర శస్త్ర చికిత్సతో కాపాడిన వైద్యులు
హైదరాబాద్, సెప్టెంబర్ 7(విజయక్రాం తి): అప్పుడే పుట్టిన ఓ శిశువుకు అత్యవసర శస్త్ర చికిత్స(Emergency surgery) చేసి ప్రాణాలు కాపాడారు హైదరాబాద్(Hyderabad)లోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు(Medicover Hospital Doctors). 2.69 కిలోల బరువుతో సిద్దిపేట(Siddipet)లో జన్మించిన ఈ చిన్నారికి పుట్టిన కొద్దిసేపటికే నోటి నుంచి నిరంతరం నురగలు రావడంతో పా టు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. క్రమంగా శరీరం నీలంగా మారడం తో పాటు ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం తో, అక్కడి వైద్యులు పరిస్థితి తీవ్రతను గు ర్తించి మెరుగైన ప్రత్యేక వైద్యసదుపాయాల కోసం శిశువును అత్యవసరంగా మెడికవర్కు రిఫర్ చేశారు.
ఎన్ఐసీయూలో వైద్యులు శిశువును పరీక్షించగా ఈసోఫేజియల్ అట్రేషియా(Esophageal atresia) అనే అరుదైన పుట్టుకతో వచ్చే ఆహారనాళ లోపం ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యలో నోటి నుంచి కడుపు వరకు ఆహా రం వెళ్లాల్సిన ఆహారనాళం సరిగ్గా ఏర్పడకుండా మధ్యలోనే ముగిసిపోతుంది. దీంతో శిశువు పాలు మాత్రమే కాకుండా తన నోటి లో ఏర్పడే లాలాజలాన్ని కూడా సురక్షితం గా మింగలేని పరిస్థితి ఏర్పడింది. పాలు లేదా లాలాజలం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉండటంతో తీవ్రమైన శ్వాస సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్(Lung infection), ప్రాణాపా యం సంభవించే అవకాశం ఉంటుంది.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన మెడికవర్ నియోనే టాలజీ బృందం వెంటనే శిశువును స్థిరీకరించింది. శ్వాసకు అవసరమైన సహాయం అం దించడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి ద్రవా లు వెళ్లకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా రు. అదే సమయంలో పీడియాట్రిక్ సర్జరీ, అనస్థీషియా, నియోనేటాలజీ, క్రిటికల్ కేర్ బృందాలను అత్యవసరంగా సమన్వయం చేశారు.పుట్టిన సుమారు ఒక రోజు వయసులోనే డాక్టర్ మధు మోహన్ రెడ్డి, హెడ్ పీడి యాట్రిక్ సర్జరీ, మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ నేతృత్వంలోని వైద్య బృం దం అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి ఆహారనాళంలోని విడిపోయిన రెండు చివరలను కలిపి, ఆహారం కడుపుకు చేరే మార్గాన్ని పునరుద్ధరించారు.
అనంతరం శిశువు క్రమంగా కోలుకుంది. ఆరవ రోజున నోటి ద్వారా పాలు ఇవ్వడం ప్రారంభించారు. 12వ రో జున ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్ర స్తుతం చిన్నారి సా ధారణంగా పాలు తీసుకుంటూ, బరువు పెరుగుతూ ఆరోగ్యంగా ఉంది. నియోనేటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, అనస్థీషియా, క్రిటికల్ కేర్ బృందాల సమిష్టి కృషి ఈ చిన్నారి కోలుకోవడంలో కీలకంగా నిలిచింది. ప్రస్తు తం చిన్నారి సాధారణంగా పాలు తీసుకుంటూ, ఆరోగ్యంగా బరువు పె రుగుతుండ టం ఎంతో సంతోషంగా ఉంది, అని డాక్టర్ మధు మోహన్ రెడ్డి తెలిపారు.