కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
09-09-2026 | 11:27am
ముంబై: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ముడి చమురు ధర బ్యారెల్కు(Crude oil price per barrel) దాదాపు 100 డాలర్ల స్థాయికి చేరడంతో బుధవారం ప్రారంభ ట్రేడింగ్లో మార్కెట్(Stock markets ) సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పడిపోయాయి. ఐటీ షేర్ల విక్రయాలు, విదేశీ నిధుల తాజా తరలింపు కూడా పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీశాయి. ప్రారంభ ట్రేడింగ్లో 30 షేర్ల BSE సెన్సెక్స్ 500.25 పాయింట్లు పడిపోయి 75,060.61 వద్దకు చేరింది. 50 షేర్ల NSE నిఫ్టీ 129.40 పాయింట్లు తగ్గి 23,506.10 వద్దకు చేరింది.