బురుజుగడ్డలో విశ్వహిందూ పరిషత్ స్థాపన దినోత్సవం
05-09-2026 | 11:55pm
అడ్డాకుల: బలీదుపల్లి-కన్మనూరు బురుజుగడ్డ ఆంజనేయస్వామి ఆలయం(Anjaneyaswamy Temple)లో శనివారం 52వ వారం హనుమాన్ చాలీసా పారాయణం(Hanuman Chalisa recitation) నిర్వహించారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ స్థాపన దినోత్సవం, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు(Krishna Janmashtami celebrations) ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విహెచ్పీ ప్రముఖులు రాచాల జనార్ధన్ మాట్లాడుతూ యువత కుటుంబ వ్యవస్థను పరిరక్షించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, యువకులు పాల్గొన్నారు.






