గణపతి మండపం వద్ద హోమం, అన్నదానం
01-09-2025 | 12:00am
కామారెడ్డి, ఆగస్టు 31 (విజయక్రాంతి), కామారెడ్డి జిల్లాలో గణపతి మండపాల వద్ద ఆదివారం ఆయా మండపాల నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలోని విద్యుత్ నా వల్ల శ్రీ గణేష్ మండలి మండపం వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు ప్రసాద్ ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.






