2 April, 2026 | 11:40 PM

Districts - Kamareddy

article_71127302.webp
రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

నిజాంసాగర్,(విజయక్రాంతి): రైతులను రాజులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్ పేర్కొన్నారు. ఆయన గురువారం నాడు నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో ధాన్యం కొలువును కేంద్రాలను ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట సర్పంచ్ సంకు లక్ష్మయ్య , నాయకులు మంద బలరాం, బంగ్లా ప్రవీణ్, గఫూర్, ప్రసాద్, రాజు, రాములు, సొసైటీ కార్యదర్శి సంగమేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

02-04-2026

article_20486582.webp
గ్రామసభలో ఆత్మహత్యాయత్నం.. పెన్షన్ నిలిచిపోయిందంటూ చెట్టెక్కాడు!

కాపాడిన పాలకవర్గం భిక్కనూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ ప్రాంగణంలో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. అదే గ్రామనికి చెందిన గొల్ల రాములు (మూర్ఛవ్యాధితో బాధపడుతున్నడు)అనే వ్యక్తి గతంలో పొందిన పెన్షన్ ప్రస్తుతం నిలిచిపోయిందని, పలుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ చెట్టెక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన గ్రామ పాలకవర్గ సభ్యులు అతన్ని సమయానికి కాపాడారు. సమస్యను పరిష్కరించి పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

02-04-2026

article_57294491.webp
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక గ్రామ సభలు విజయవంతం

నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా గ్రామ సభలు మండలంలోని బొల్లారం,ఆత్మకూర్, మాసన్పల్లి,జలాల్పూర్, తాండూర్,గోపాల్పేట్, నాగిరెడ్డిపేట వివిధ గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించబడింది.99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జరిగిన ఈసభలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు,మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,రూ.500కే గ్యాస్ సిలిండర్,సన్న రకం వడ్ల కొనుగోలు,పెన్షన్లు, గృహజ్యోతి,కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్,కొత్త రేషన్ కార్డులు తదితర పథకాలపై విస్తృతంగా చర్చించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో నాగిరెడ్డిపేట్ మండలం అభివృద్ధి దిశగా పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రశంసించారు.

02-04-2026