2 July, 2026 | 2:04 PM

Districts - Kamareddy

article_54349222.webp
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ ఓ వెంకట్

ఎల్లారెడ్డి జూలై 2 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా డి,ఎంహెచ్ ఓ వెంకట్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు వైద్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదని ఆసుపత్రి వైద్యులు శరత్ కుమార్ కు సూచించారు. ఆస్పత్రిలో ఆసుపత్రి సిబ్బంది సమయానికి హాజరు కాకపోవడం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని సిబ్బందిపై డిఎంహెచ్ ఓ మండిపడ్డారు. అనంతరం ఆసుపత్రిలోని మాత్రల పంపిణీ గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకి అందుతున్న సేవల పట్ల వాటి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ, నర్సింగ్ చౌహన్, మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

02-07-2026

article_84940255.webp
కళాశాలల బంద్ విజయవంతం

కామారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి): పాత పద్ధతిలోనే ఫీజు రీయాంబర్స్మెంట్ అమలు చేయాలని, ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం తలపెట్టిన కాలేజీల బంద్ విజయవంతంగా ముగిసింది. ప్రయివేట్ కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయని,ప్రభుత్వ కళాశాలలను బంద్ చేయించుడం జరిగింది. ఫీజు రీయాంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నటువంటి జీఓ 9 ని తక్షణమే రద్దు చేసి పాత పద్ధతిలోనే అమలు చేయాలని అన్నారు,లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిరంతరం చేపడతామని బీసీ విద్యార్థి సంగం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు,గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు వినోద్ నాయక్,బిసి ప్రధాన కార్యదర్శి దయాకర్, ప్రవీణ్,సంతోష్,వినీత్, ప్రభు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు..

02-07-2026