కళాశాలల బంద్ విజయవంతం
కామారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి): పాత పద్ధతిలోనే ఫీజు రీయాంబర్స్మెంట్ అమలు చేయాలని, ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం తలపెట్టిన కాలేజీల బంద్ విజయవంతంగా ముగిసింది. ప్రయివేట్ కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయని,ప్రభుత్వ కళాశాలలను బంద్ చేయించుడం జరిగింది. ఫీజు రీయాంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నటువంటి జీఓ 9 ని తక్షణమే రద్దు చేసి పాత పద్ధతిలోనే అమలు చేయాలని అన్నారు,లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిరంతరం చేపడతామని బీసీ విద్యార్థి సంగం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు,గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు వినోద్ నాయక్,బిసి ప్రధాన కార్యదర్శి దయాకర్, ప్రవీణ్,సంతోష్,వినీత్, ప్రభు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు..
02-07-2026