కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైడ్రా కమిషనర్
08-09-2026 | 10:16pm
కొడిమ్యాల(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి(Kondagattu Anjaneya Swamy)ని హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్(Hydra Commissioner A.V. Ranganath) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అంజనా రెడ్డి పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకం,పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రంగనాథ్ కు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేసి అర్చకులచే ఆశీర్వచనం ఇవ్వబడినది.
ఈ కార్యక్రమంలో జగిత్యాల డిఎస్పి పురుషోత్తం రెడ్డి,మల్యాల సిఐ రాజ్ కుమార్, మల్యాల ఎస్ఐ సందీప్ కుమార్, కొడిమ్యాల ఎస్ఐ నరేష్ కుమార్,ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు రంజీవస్వామి, ఆలయ పర్యవేక్షకులు సునీల్ కుమార్,పరిశీలకులు అశోక్,సిబ్బంది పాల్గొన్నారు.