సామాన్యుడిపై ధరాభారం
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజల జీవితం భారంగా మారుతోంది. ముఖ్యంగా కూరగాయలు(vegetables), బియ్యం(rice), పప్పులు, పంచదార(sugar) వంటి వంటింటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కుటుంబ బడ్జెట్(family budget)ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దేశవ్యాప్తంగా ఆహార ధరల ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, పరిమిత పెన్షన్(pension)పై ఆధారపడుతున్న సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు(Singareni retired employees) మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జూలై 2026లో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 4.45 శాతానికి చేరగా, ఆహార ద్రవ్యోల్బణం 5.52 శాతంగా నమోదైంది. కూరగాయల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాల్లో వాతావరణ పరిస్థితులు ఒకటి. అధిక వర్షాలు, అకాల వర్షాలు, ఉష్ణోగ్రతల్లో మార్పులు పంటల దిగుబడిని ప్రభావితం చేస్తున్నాయి. కూరగాయలు నిల్వ చేయడానికి ఎక్కువ కాలం వీలుకాకపోవడంతో సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి.
బియ్యం, పప్పుల విషయంలో సాగు ఖర్చులు, ఎరువులు, విత్తనాలు, విద్యుత్, నీటిపారుదల, రవాణా ఖర్చులు పెరగడం కూడా ధరలపై ప్రభావం చూపుతుంది. రైతు పొలం నుంచి వినియోగదారుడి వంటింటి వరకు అనేక దశలు ఉండటం వల్ల ప్రతి దశలో కొంత వ్యయం చేరి చివరికి రిటైల్ ధర పెరుగుతుంది. పంచదార ధరల పెరుగుదల ప్రస్తుతం ప్రత్యేకంగా ఆందోళన కలిగిస్తోంది. దేశీయ చక్కెర ఉత్పత్తి తగ్గడం, పండుగల సీజన్లో డిమాండ్ పెరగడం వంటి కారణాలతో ధరలు గణనీయంగా పెరిగాయి.
ఆగస్టులో పంచదార ధరలు వేగంగా పెరగడంతో ప్రభుత్వం ఒక మిలియన్ టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై ఇంధన వ్యయాలు కూడా ప్రభావం చూపుతున్నాయి.
అందువల్ల నిత్యావసర ధరల నియంత్రణతో పాటు సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. దేశ ఆర్థిక ప్రగతికి జీవితాలను అంకితం చేసిన కార్మికులు తమ వృద్ధాప్యంలో ధరల భారంతో సతమతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్, 8686051752






