బీసీలు రాజకీయ పావులేనా?
18-01-2025
దేశంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ అత్యధిక శాతం జనాభా గల బలహీన వర్గాల ఓట్లు రాజకీయ పార్టీలను గెలిపించటంలోనూ, అధికారంలోకి తీసుకురావ టంలోనూ కీలకంగా మారాయి. బలహీన వర్గాల ఓట్లతోనే తెలంగాణ, కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్, హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ గెలిచాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్,బీజేపీ, బీఆర్ఎస్ మూడు రాజకీయ పార్టీలు బీసీల ఓట్లసాధనే లక్ష్యంగా అనేక హామీలను ఇవ్వడం జరిగింది.