calender_icon.png 21 January, 2026 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Editorial

article_13487447.webp
మైక్రో ఫైనాన్స్ రుణాలతో జాగ్రత్త!

21-01-2026

మైక్రో-ఫైనాన్స్ సంస్థలు అనేవి వ్యక్తులకు, చిన్న తరహా సంస్థలకు, మహిళా స్వయం సహాయక బృందాలు, పేద రైతులు నడిపే సంస్థలతో సహా, చిన్న రుణాలను అందించే సంస్థలు. వీటిలో నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు (ఎన్‌బిఎఫ్‌సిలు), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బి) ఎక్కువగా రుణాలు ఇస్తుంటాయి. మహిళల సాధికారత కోసం, ఇప్పటివరకు బ్యాంకు రుణాలకు దూరంగా ఉన్న పేద ప్రజలను ఆర్థిక వ్యవస్థలో చేర్చడం కోసం మైక్రో ఫైనా న్స్ రుణాలను ఇస్తూ ప్రోత్సహించడం జరిగింది. వాణిజ్య బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి భూమి లేదా ఏదైనా ఇతర ఆస్తిని పూచీకత్తుగా కోరితే, సూక్ష్మరుణ సంస్థలు మాత్రం ఎలాంటి పూచీకత్తు లేకుండా, చాలా తక్కువ పత్రాలతో చిన్న రుణాలను మంజూరు చేయడంలో సహాయపడుతుంది.

article_65964951.webp
గవర్నర్ల వివాదం!

21-01-2026

భారత రాజ్యాంగం రాష్ట్రపతికి ఎలాంటి హక్కులను (కొన్ని మినహాయింపు) కల్పించిందో అవే హక్కులు గవర్నర్లకు ఉంటాయి. అందులో భాగంగా ప్రతీ ఏడాది ఆయా రాష్ట్రాల తొలి శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు గవర్నర్లు సభనుద్దేశించి ప్రసంగించడం ఆనవా యితీ. తాజాగా మంగళవారం ఏకకాలంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాల తొలిరోజున ఆయా రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తమిళనాడులో జాతీయగీతం అంశం గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య చిచ్చురేపగా.. కేరళలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాపీలోని కొన్ని అంశాలను ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చదవకపోవడం విమర్శలకు దారి తీసింది. ఈ రెండింటికి వ్యత్యాసమున్నప్పటికీ వివాదాలకు కేంద్ర బిందువు మాత్రం గవర్నర్లే. ‘నా ప్రసంగాన్ని అడ్డుకోవడం దురదృష్టకరం. జాతీయగీతానికి తగిన గౌరవం ఇవ్వడం లేదు. మైక్‌ను పదేపదే కట్ చేస్తున్నారు.’ అంటూ రవీంద్ర నారాయణ్ రవి