ఫిరాయింపులకు అంతమెప్పుడు?
19-08-2025
‘ప్రజలు ఓటేశారని నమ్మకం.. కానీ పదవిలో ఉండాలంటే పార్టీ మారాలన్నా రాజీ పడాలా?’.. నేటి భారత రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఈ ప్రశ్న ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలనే పెకిలిస్తోంది. ప్రజల తీర్పును తుంగలో తొక్కి, నైతిక విలువలను కాలరా స్తూ జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు దేశ రాజకీయాలకు మాయని మచ్చగా మి గిలిపోతున్నాయి. తెలంగాణ, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, అరుణాచల్ ప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో ఈ ప్రజాస్వామ్య అపహాస్యం నిత్యకృత్యమైంది.