పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొల్పాలి
- బ్రిక్స్ దేశాలు తగిన పాత్ర పోషించాలి
- చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పిలుపు
- 7 ఏళ్లలో షీజిన్పింగ్ తొలి భారత పర్యటన
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 12: వర్ధమాన మా ర్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి బ్రిక్స్ కూటమి (BRICS alliance) ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వేదిక అని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రశంసించారు. పశ్చి మ ఆసియాలో శాంతిని నెలకొల్పడంలో ఈ కూటమి తన తగిన పాత్ర పోషించాలని ఆ యన పిలుపునిచ్చారు.
ఇక్కడ జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో షీ జిన్పింగ్ మాట్లాడుతూ, పశ్చిమ ఆసియా, గల్ఫ్ ప్రాంతాల లో శాంతి, ప్రశాంతతను సాధించడానికి చై నా బ్రిక్స్ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఆ ధ్వర్యంలోని జిన్హువా వార్తా సంస్థ తెలిపిం ది. పశ్చిమ ఆసియా, గల్ఫ్ ప్రాంతాలలో పరిస్థితి నిరంతరం మారుతున్నందున, అక్కడి యుద్ధం ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని షీజిన్పింగ్ అన్నారు.
అంతేకాకుండా ఇది అంతర్జాతీయ సమాజ ఉమ్మ డి ప్రయోజనాలకు ప్రమాదమని తెలిపారు. పశ్చిమ ఆసియాలో శాంతిని నెలకొల్పడం లో ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల నాయకులు తగిన పాత్ర పోషించాలని ఆయన కో రారు. అలాగే సభ్య దేశాలు చరిత్రలో సరైన వైపు నిలబడాలని సూచించారు.
బ్రిక్స్ దేశా లు ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వ్యతిరేకించాలని, ఇతర దేశాల సార్వభౌమాధికార ఉ ల్లంఘనలను, వాటి అంతర్గత వ్యవహారాల్లో జోక్యాన్ని వ్యతిరేకించాలని ఆయన సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మ ధ్య ఏఐ ద్వారా నూతన పారిశ్రామికీకరణను ప్రోత్సహించడానికి, ఏఐ చొరవలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని షీ స్పష్టం చేశారు. సైబర్స్పే, అంతరిక్షం, లోతైన సముద్రంలో ప్రపంచ పాలనకు నాయకత్వం వహించాలన్నారు.
గ్లోబల్ సౌత్ వాణిని బలోపేతం చేయాలని ఆయన బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు నూతన ఆవిష్కరణల అభివృద్ధిలో, అలాగే శాంతి, స్థిరత్వాన్ని కాపాడటంలో మార్గదర్శకంగా నిలవాలని, నాగరికతల మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించాలని ఆయన అ న్నారు.
సభ్యులు ప్రపంచ పాలనను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని, ఈ కూటమి అంతర్జాతీయ వ్యవస్థను మరింత న్యాయం, సమానత్వం వైపు నడిపించాలని, మానవాళికి ఉమ్మడి భవిష్యత్తు ఉన్న సమాజాన్ని నిర్మించడానికి కలిసి పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.