calender_icon.png 20 December, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_56517634.webp
గ్రీన్‌కార్డు లాటరీ ప్రోగ్రామ్ నిలిపివేత

20-12-2025

వాషింగ్టన్: గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. బ్రౌన్ యూనివర్సిటీ, ఎంఐటీ కాల్పుల ఘటనలో నిందితుడు ఈ లాటరీ ద్వారానే అమెరికాలోకి ప్రవేశించాడన్న సమాచారంతో ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పోర్చుగల్‌కు చెందిన క్లాడియో నెవెస్ వాలెంటే (48)గా అక్కడి పోలీసులు గుర్తించారు. నిందితుడు 2017లో డైవర్సిటీ వీసా లాటరీ ద్వారా అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందాడని విచారణలో వెల్లడైంది. బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారు.

article_85806439.webp
ముగిసిన శీతాకాల పార్లమెంట్ సమావేశాలు

20-12-2025

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. నిరవధికంగా వాయిదాపడ్డాయి. చివరిరోజు రాజ్యసభలో సభ్యులు జాతీయ గీతం ఆలపించిన అనంతరం చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 1న ప్రారంభమైన సమావేశాలు 19 రోజు ల పాటు సగాయి. లోక్‌సభ, రాజ్యసభ.. ఉభ య సభల్లోనూ కేంద్రం ప్రవేశపెట్టిన కీలక బిల్లులపై వాడీవేడి చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు బిల్లులపై తమ గళం వినిపించారు. ఈ సమావేశాల్లో పార్లమెంట్ అణుశక్తి రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి వీలు కల్పించే బిల్లును ఆమోదించింది. బిల్లు ద్వారా దేశ ఇంధన రంగంలో భారీ మార్పులు, చేర్ప్లు వచ్చే అవకాశం ఉంది. సమావేశాల్లో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ‘వీబీ -జీ రామ్ జీ’ అనే కొత్త బిల్లు ను ప్రవేశపెట్టింది.

article_40402255.webp
సుహృత్ వాతావరణంలో తేనీటి విందు

20-12-2025

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పార్లమెంట్ సభ్యులకు తేనీటి విందునిచ్చారు. విందుకు ప్రధాని నరేంద్రమోదీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాత్ సింగ్, రామ్మోహన్‌నాయుడు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్రయాదవ్, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సులే, సీపీఐ అగ్రనేత డీ రాజాతోపాటు పలువురు అఖిలపక్ష ఎంపీలు హాజరయ్యారు. విందు సుహృత్ వాతావరణంలో సాగింది. సభ్యులు మధ్య నవ్వులు విరబూయించింది. ప్రధాని మోదీ, ఎంపీ ప్రియాంకా గాంధీ ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రధాని మోదీ వాయనాడ్‌లో లభించే ఆయుర్వేద మూలిక గురించి ప్రియాంకకు తెలియజేశారు.

article_61763048.webp
బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్

19-12-2025

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో(Encounter) ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. భైరామ్‌గఢ్-ఇంద్రావతి ప్రాంతంలోని అటవీ కొండల్లో మావోయిస్టు కార్యకర్తలు ఉన్నారనే సమాచారం మేరకు జిల్లా రిజర్వ్ గార్డ్ బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. గురువారం సుక్మా జిల్లాలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎదురుకాల్పుల్లో, ఒక మహిళతో సహా మొత్తం 12 లక్షల రూపాయల రివార్డులు కలిగిన ముగ్గురు నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు.