calender_icon.png 16 December, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_19506557.webp
లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం

16-12-2025

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఎంపీల సమావేశ లీకులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ లో జరిగిన విషయాలు బయటకు చెప్పొద్దని ప్రధాని చెప్పారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని చెప్పినా.. మీటింగ్ లో విషయాలను బయటకు చెప్పారని ఆరోపించారు. బయటకు చెప్పినవారు ఎవరో చెబితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాని మీటింగ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని చెప్పారని, తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రధాని కోరారని తెలిపారు. దక్షిణ భారత్ నుంచి ఇప్పటివరకు ఇద్దరు ఉపరాష్ట్రపతులు అయ్యారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు.

article_41232073.webp
సాయుధ బలగాలకు మోదీ సెల్యూట్

16-12-2025

న్యూఢిల్లీ: 1971 యుద్ధంలో భారత సైన్యం పాకిస్థాన్‌ను ఓడించిన విజయ్ దివస్ సందర్భంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను ప్రశంసించారు. విజయ్ దివస్(Vijay Diwas) సందర్భంగా, 1971లో భారతదేశానికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ధైర్యవంతులైన సైనికులను మనం స్మరించుకుంటాము. వారి స్థిర సంకల్పం, నిస్వార్థ సేవ మన దేశాన్ని రక్షించాయి. మన చరిత్రలో ఒక గర్వించదగిన క్షణాన్ని లిఖించాయి అని మోదీ తెలిపారు. ఈ రోజు వారి శౌర్యానికి నివాళిగా, వారి అసమాన స్ఫూర్తికి గుర్తుగా నిలుస్తుంది. వారి వీరత్వం తరతరాల భారతీయులను ప్రేరేపిస్తూనే ఉంది," అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.