2024 ఎన్నికల ఖర్చులో బీజేపీదే అగ్రస్థానం
22-06-2025
న్యూఢిల్లీ, జూన్ 21: గతేడాది జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను తలదన్నుతూ బీజేపీ ఏకంగా రూ. 1494 కోట్లు (44.56 శాతం) ఖర్చు చేసింది. 32 జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కలిసి 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం రూ. 3,352.81 కోట్లు ఖర్చు చేసినట్టు అసోసియేషన్ ఫర్ ద డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది.