అందరూ సంపన్నంగా, సంతోషంగా ఉండాలి
02-01-2026
ఢిల్లీ, జనవరి1: నూతన సంవత్సర రాకను పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంపన్నంగా, సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భాన్ని నూతన శక్తి, సానుకూల మార్పునకు చిహ్న ంగా రాష్ట్రపతి ముర్ము అభివర్ణించారు. ఇది బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో కొత్త శక్తిని నింపుతుందని ఆమె తన ప్రకటనలో ఆకాంక్షించారు. అందరికీ శాంతి, ఆనందం, శ్రేయస్సును రాష్ట్రపతి ఆకాంక్షించారు.