భారత్ మనందరిదీ!
02-01-2026
డెహ్రాడూన్, జనవరి 1 : దేశ ప్రజలందరూ కులం, ధనం, భాష అనే భేదాలను పక్కనపెట్టి, విభజన రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని భగవత్ పిలుపు నిచ్చారు. దేశం ఏ ఒక్క వర్గానికో చెందినది కాదని, ఇది అందరిదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల డెహ్రాడూన్లో త్రిపుర వి ద్యార్థి ఏంజిల్ చక్మా హత్య, జాత్యహంకార దాడి ఆరోపణల నేపథ్యంలో ప్రజల్లో ఆగ్ర హం వ్యక్తమవుతున్న సమయంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ సమగ్రతకు సామరస్యమే ప్రధానమని ఆయన పునరుద్ఘాటించారు.