calender_icon.png 2 February, 2026 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_22784183.webp
వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటికి నిప్పు

02-02-2026

అమరావతి, ఫిబ్రవరి 1: ఏపీ మంత్రి నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్య ల చేశారంటూ టీడీపీ శ్రేణులు ఆదివారం విజయ వాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి పై దాడి చేశారు. కొంతమంది ఇంటికి నిప్పు పెట్టారు. అయితే ఈ సమయంలో జోగి రమేశ్ ఇంట్లో లేరు. తండ్రి జోగి మోహనరా వు, భార్య శకుంతల దేవి, చిన్న కొడుకు రో హిత్ ఇంట్లో ఉన్నారు. దీంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడ భారీగా చేరుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో ఇంటి మొదట అంత స్తులో మంటలు ఎగిసిపడ్డాయి.

article_66618653.webp
కెనడాపై మరోసారి ట్రంప్ సుంకాల మోత

31-01-2026

వాషింగ్టన్, జనవరి 30 : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ తన పొరుగు దేశమైన కెనడాపై వాణిజ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశారు. కెనడా నుంచి అమెరికాకు విక్రయించే అన్ని రకాల విమానాలపై ఏకంగా 50 శాతం సుంకాలు విధిస్తానని తాజాగా సం చలన హెచ్చరిక జారీ చేశారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ట్రంప్‌కు ఉన్న విభేదాలు ఇప్పుడు రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను ప్రమాదంలో నెట్టేస్తున్నాయి. అమెరి కాకు చెందిన ’గల్ఫ్‌‌‌రరస్టీమ్ ఏరోస్పేస్’ తయారు చేసిన జెట్ విమానాలకు కెనడా అనుమతి ఇవ్వడానికి నిరాకరిస్తోందని.. దానికి ప్రతీకారంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రం ప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.