calender_icon.png 7 January, 2026 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_36745475.webp
తెలంగాణ నేతలను కోరుతున్నా.. నీళ్లపై రాజకీయాలొద్దు

07-01-2026

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తలెత్తిన జలవివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) మరోసారి స్పందించారు. నీళ్లపై రాజకీయాలు చేయొద్దని తెలంగాణ నేతలను చంద్రబాబు కోరారు. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులను తానే ప్రారంభించానని చెప్పారు. జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్ నగరకు ఇచ్చామని తెలిపారు. పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదని హితువు పలికారు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చన్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు(Telangana people) కూడా ఆలోచించాలని కోరారు. దేవాదులను మందుకు తీసుకెళ్లండి.. ఎవరు వద్దన్నారు? అని సీబీఎన్ ప్రశ్నించారు. తెలుగుజాతి ఒక్కటే.. ఇచ్చిపుచ్చుకొనే వైఖరి ఉండాలని కోరారు. గతంలో హైదరాబాద్ లో వారానికి ఒకసారి నీళ్లు వచ్చేవని చంద్రబాబు గుర్తుచేశారు. నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తెచ్చి హైదరాబాద్ కు ఇచ్చామని ఆయన వెల్లడించారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని ఏపీ సీఎం వెల్లడించారు.

article_32507096.webp
సోమనాథ్ ఆలయంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం

07-01-2026

డెహ్రాడూన్, జనవరి 6: గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయంపై దాడి చేసినంత మాత్రాన ఆలయ చరి త్ర కనుమరుగవదని, ఆలయం జాతి ఆత్మకు ప్రతీక అని తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి మహరాజ్ ప్రక టించారు. మోదీ వ్యాఖ్యలు భారతీయుల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఉన్నాయని కొని యాడారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వెయ్యేళ్ల క్రితం గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంపై జరిగిన దాడి హిందూ సమాజానికి తీరని వేదన మిగిల్చిందని ఆయన గుర్తు చేశారు.