14 July, 2026 | 1:49 PM

National -

article_52565593.webp
సమస్యలకు చర్చలే పరిష్కారం.. అందుకే ఢిల్లీ వచ్చా

న్యూఢిల్లీ: పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో(Kinjarapu Ram Mohan Naidu) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) భేటీ అయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు అనుమతులు కోరినట్లు తెలిపారు. అభివృద్ధికి విమానాశ్రయాలు అత్యంత కీలకమని సూచించారు. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని, పూర్తి చేయాలనేది తమ లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రానికి మేలుచేసే పనులు పాడు చేయవద్దని సీఎం రేవంత్ విపక్షాలను కోరారు. 2028 జూన్ 2 నాటికి విమానాశ్రయాలు పూర్తి చేయాలనేది తన సంకల్పం అన్నారు. నాలుగు ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నట్లు వివరించారు. భూసేకరణ, అనుమతి, నిర్మాణం, ప్రారంభం. దిశగా పనిచేస్తున్నామని తెలిపారు.

14-07-2026

article_46248691.webp
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హస్తిన పర్యటనలో బిజీగా ఉన్నారు. మంగళవారం న్యూఢిల్లీలోని 2 మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లో ఉన్న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసంలో(Union Minister Nitin Gadkari) రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డితో కలిసి భేటీ అయ్యారు. నివేదికల ప్రకారం, ఈ సమావేశం 30 నిమిషాలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు తెలంగాణకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కార్యక్రమాలపై చర్చించారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రతిపాదిత ఆదిలాబాద్, మామ్నూర్ విమానాశ్రయాల రూపకల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారించింది. హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్) ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.

14-07-2026

article_39695524.webp
Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్

వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్త(Tensions in West Asia) పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా, ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కత్తులు దూసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ కు నౌకలు వెళ్లకుండా, రాకుండా హర్మూజ్(Hormuz)లో అడ్డుకుంటామని ట్రంప్ తెలిపారు. ఇతర నౌకలు మాత్రం హర్మూజ్ ను స్వేచ్ఛగా వాడుకోవచ్చని సూచించారు. నౌకల్లోని సరుకు విలువలో 20 శాతం వరకు టోల్ వసూలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు.

14-07-2026