14 April, 2026 | 12:17 AM

National -

article_16164319.webp
దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఢిల్లీలో 'నారీశక్తి వందన్ సమ్మేళన్'(Nari Shakti Vandan Sammelan) కార్యక్రమం నిర్వహించారు. 'నారీశక్తి వందన్ సమ్మేళన్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని మహిళ రిజర్వేషన్ బిల్లుపై(Women's Quota Law) ప్రసంగించారు. వివిధ రంగాల ప్రముఖులతో ప్రధాని ముఖాముఖి నిర్వహించారు. 21వ శతాబ్దం మహిళలకు చెందినదని తెలిపారు. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని ప్రకటించారు. కేంద్రం తీసుకునే నిర్ణయం మహిళలకు అంకితం చేస్తున్నామని మోదీ వెల్లడించారు. పార్లమెంటు.. కొత్త చరిత్ర లిఖించడానికి చేరువలో ఉందన్నారు. స్వప్నాల సాకారంతో పాటు భవిష్యత్ సంకల్పాలను నెరవేరుస్తుందన్నారు.

13-04-2026

article_72583070.webp
గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?

సురేంద్రనగర్: గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Gujarat Accident) జరిగింది. రోడ్డు పక్కన ఉన్న వారిపైకి ట్రక్కు వేగంగా దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రాజ్‌కోట్ నుండి బహుచరాజీలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజల నిమిత్తం యాత్రికుల బృందం ఊరేగింపుగా నడుచుకుంటూ వెళ్తుండగా, లఖ్తార్-విరామ్‌గామ్ రహదారిపై తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని లఖ్తార్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ యోగేష్ పటేల్ వెల్లడించారు.

13-04-2026