పేదల నిధులు.. టీఎంసీ లూటీ
18-01-2026
కోల్కతా, జనవరి 17: పేదలకు అందాల్సిన నిధులను టీఎంసీ ప్రభుత్వం లూటీ చేస్తున్నదని ప్రధాని మోదీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా టౌన్ రైల్వేస్టేషన్లో శనివారం ఆయన హౌరాణొ గువాహటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. అలాగే రూ.3,250 విలువైన రైల్వే, రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. మాల్దాలో పరిశ్రమలు లేకపోవడం వల్ల స్థానిక యువత వలస వెళ్తున్నారని, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాల్దా మామిడి రైతులకు మేలు చేసే విధంగా కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పిస్తామని భరోసానిచ్చారు. రాష్ట్రంలో అధికార మార్పు రావాలని, అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీనే కావాలని ఆకాంక్షించారు.