21 March, 2026 | 2:51 PM

National

article_46700025.webp
జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన

హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, షర్మిల ఆస్తుల పంచాయతీపై తల్లి వైఎస్ విజయమ్మ(YS Vijayamma ) సంచలన ప్రకటన చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వరకు ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని నోటరీ చేసిన నోట్ ను విజయమ్మ విడుదల చేశారు. వైఎస్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని పేర్కొన్నారు. ఆస్తులన్నీ నలుగురు మనవలకు సమానంగా పంచాలని వైఎస్ ఉద్దేశమని తెలిపారు. వైఎస్ ఆదేశం కూడా అదే.. దగ్గర వాళ్లందరికీ తెలిసిన వాస్తవమిదన్నారు. ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సినవేనని స్పష్టం చేశారు.

20-03-2026