గిగ్ వర్కర్ల సమ్మె
08-02-2026
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): ఓలా, ఊబర్, ర్యాపిడో తదితర ప్లాట్ఫామ్లలో పనిచేస్తున్న బైకులు, ఆటోలు, క్యాబ్ డ్రైవర్లకు కనీస చార్జీలు, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని, ప్రైవేటు వాహనాలను వాణిజ్య అవసరాలకు వాడడాన్ని నిరో ధించాలని గిగ్కార్మికులు, యూనియన్ల నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ), ఇతర జాతీయ కార్మిక సంఘా లతో కలిసి శనివారం దేశవ్యాప్తంగా సమ్మె చేశాయి.