calender_icon.png 14 January, 2026 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_57489934.webp
ట్రంప్ సుంకాల బాంబ్

14-01-2026

వాషింగ్టన్, జనవరి ౧౩: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల బాంబ్ పేల్చారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న ఏ దేశమైనా ఇకపై అమెరికాతో వ్యాపారం చేయాలంటే 25 శాతం అదనపు సుంకం చెల్లించాలని హుకుం జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేశారు. ఇరాన్ ప్రభుత్వం అక్కడి పౌరులను అణచివేస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేల్చిచెప్పారు. చైనా తర్వాత ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇండియానే కాబట్టి మన దేశంలోపై సుంకాల ప్రభావం ఎక్కువ ఉండనుంది. అమెరికా ఇప్పటికే భారత్‌పై ౫౦శాతం సుంకాలు విధిస్తున్నది. ఇరాన్ సాకుతో విధించే సుంకంతో ఎగుమతి సుంకం కాస్తా ౭5 శాతానికి చేరుకోనున్నది. ట్రంప్ తాజా ప్రకటన భారత ఎగుమతిదారులకు పెద్ద శరాఘాతమే.

article_24312148.webp
ఇద్దరు చిన్నారుల కిడ్నాప్

14-01-2026

బెంగళూరు, జనవరి 13: కర్ణాటకలోని ధార్వాడ్‌లో కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజన సమయంలో ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. తరగతులు మొదలైనా పిల్లలు రాకపోవడంతో టీచర్లు ఆరా తీయగా కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. వెంటనే పిల్లల తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, బైక్ పై వెళుతున్న కిడ్నాపర్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే..ధార్వాడలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తన్వీర్, లక్ష్మి అనే మూడో తరగతి చదువుతున్న పిల్లలు కనిపించకుండా పోయారు.

article_84392217.webp
ఇరాన్‌లో కొనసాగుతున్న ఊచకోత

14-01-2026

టెహ్రాన్, జనవరి 13: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు ఉధృతమవుతున్న కొద్దీ మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. భద్రతా బలగాల కాల్పులు, దాడుల్లో ఇప్పటివరకు ౨ వేల మందికి పైగా మృతిచెందార ని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా టెహ్రాన్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి ముందు గుట్టలు గుట్టలుగా చెల్లాచెదురుగా శవాలు పేరుకున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వి షయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు పౌరులు చేస్తున్న ఉద్య మాలను అక్కడి ప్రభుత్వం ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తున్నది. ఇకముందు కూడా నిరసనలు కొనసాగిస్తే మరణాల సంఖ్య పెరుగుతుందని హెచ్చరించింది. ఈ పరిణామాలపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇరాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని ప్రకటించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.

article_42224745.webp
కుక్క కాటుకు భారీ జరిమానా

13-01-2026

న్యూఢిల్లీ: గత ఐదేళ్లుగా వీధి జంతువులకు సంబంధించిన నిబంధనల అమలులో లోపంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, కుక్క కాటు(dog bite) ఘటనలకు రాష్ట్రాలు భారీ పరిహారం(Heavy fine) చెల్లించాలని ఆదేశిస్తామని మంగళవారం పేర్కొంది. కుక్క కాటు సంఘటనలకు కుక్కలను ప్రేమించేవారు, వాటికి ఆహారం పెట్టేవారు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని జస్టిస్‌లు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజారియాతో కూడిన ధర్మాసనం(Supreme Court) పేర్కొంది. పిల్లలకు, వృద్ధులకు కుక్క కాటు వల్ల మరణం లేదా గాయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు హెచ్చరించింది.