ఖలీదా కన్నుమూత
31-12-2025
ఢాకా, డిసెంబర్ ౩౦: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధినేత్రి ఖలీదా జియా(80) కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆమె లివర్ సిర్రోసిస్, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు, ఊపిరిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి పరిస్థితి విషమించగా కుటుంబ సభ్యులు ఆమెను ఢాకాలోని ఎవర్కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు.