calender_icon.png 8 December, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_72981502.webp
వందేమాతరం నినాదం.. బ్రిటిషర్లకు సింహస్వప్నం

08-12-2025

న్యూఢిల్లీ: వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై(Vande Mataram Lok Sabha Discussion) లోక్ సభలో సోమవారం చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సభలో చర్చను ప్రారంభించారు. జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏడాది పొడవునా వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. వందేమాతరం.. స్వాతంత్య్ర పోరాటంలో(Freedom Struggle) భారతీయుల గొంతు అన్న ప్రధాని మోదీ ఈ చర్చలో పాల్గొనడం గర్వకారణం అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వివరించారు. ఇవాళ్టి చర్చలు భవిష్యత్తు తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని సూచించారు. వందేమాతరం అనేది ఒక మంత్రం.. స్వాతంత్య్ర ఉద్యమానికి వందేమాతరం.. శక్తి, ప్రేరణ ఇచ్చిందని తెలిపారు. 1857 తర్వాత స్వాతంత్య్ర సమరయోధులపై ఒత్తిడి పెంచారు.. ఒత్తిడి పెరిగినా వెనక్కి తగ్గకుండా వందేమాతరం రచించారని కొనియాడారు.

article_54126250.webp
లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు

08-12-2025

రాయ్‌పూర్: మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) మరో పన్నెండు మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆయుధాలతో సహా మావోయిస్టులు(Maoists Surrender) ఖైరాఘర్ జిల్లా పోలీసులు ఎదుట సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్(Central Committee Member Randher) ఉన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్ తలపై రూ. 3 కోట్ల రివార్డు ఉంది. రాంధెర్ ఎంఎంసీ జోన్ లో క్రియాశీలకంగా ఉన్నాడు. రాంధెర్ మిళింద్ తెల్టుంబే మరణించాక ఎంఎంసీ బాధ్యతలు చూస్తున్నారు. రాంధెర్ లోంగుబాటుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సరిహద్దులు నక్సల్స్ రహిత ప్రాంతంగా మారాయి.

article_31246324.webp
గోవా అగ్నిప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

07-12-2025

గోవా: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా రిలీఫ్‌ను ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్(Chief Minister Pramod Sawant) ప్రకటించారు. అలాగే ఈ ఘోర అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ఒక ప్యానెల్ ఏర్పాటు చేయడంతో పాటు వారంలోపు నివేదిక అందుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ ఘోర అగ్నిప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో నైట్‌క్లబ్ మేనేజర్, మరో ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేశారు. బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్ యజమానులు గౌరవ్ లూత్రా, సౌరభ్ లూత్రాపై కూడా పోలీసులు కేసు నమోదు చేయగా, అర్పోరా-నగోవా సర్పంచ్ రోషన్ రెడ్కర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.