calender_icon.png 7 February, 2026 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_83618295.webp
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా

06-02-2026

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను సుప్రీం కోర్టు(Supreme Court) మూడు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున మరికొంత సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటిస్తారని, గత ఆదేశాలకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు సుప్రీం తెలిపింది. లేనిపక్షంలో అప్పుడే ధిక్కారణ చర్యలపై ఆలోచిస్తామని వెల్లడించింది.

article_38193029.webp
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

06-02-2026

గడ్చిరోలి: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు(Gadchiroli Encounter) చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు, ఒక కానిస్టేబుల్ హతమయ్యారు. మరొకరికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. భమ్రగడ్ తాలుకా ఫడేలా అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భమ్రగడ్ తాలుకాలో గడ్చిరోలి పోలీసులు, నక్సలైట్ల మధ్య రెండు రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఎదురుకాల్పుల సమయంలో, సి-60 కమాండో దీపక్ చిన్న మాధవి (38 ఏళ్లు) తీవ్ర బుల్లెట్ గాయాలకు గురయ్యారు. వైద్య చికిత్స అందించినప్పటికీ, ఆ జవాను గాయాల కారణంగా మరణించినట్లు గడ్చిరోలి ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.