కేరళలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు: శశిథరూర్
తిరువనంతపురం: కేరళలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం జరిగిన ఎన్నికల్లో చురుకైన పోలింగ్(Kerala Election Polling Percentage) జరిగింది. మధ్యాహ్నం 1 గంటలోపే 50 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. ఈ కీలకమైన ఎన్నికలు, అధికారంలో ఉన్న ఎల్డిఎఫ్ వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా, యుడిఎఫ్ తిరిగి అధికారంలోకి వస్తుందా, లేదా ద్విముఖ పోరులో బిజెపి అనూహ్య ఫలితాన్నిస్తుందా అనే విషయాలను తేల్చి చెప్పనున్నాయి. ఎన్నికల సంఘం (EC) గణాంకాల ప్రకారం, మధ్యాహ్నం 1 గంట సమయానికి, 2.71 కోట్ల మంది ఓటర్లలో 49.70 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
09-04-2026