విరిసిన 131 పద్మాలు
26-01-2026
న్యూఢిల్లీ, జనవరి 25: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు బహూకరించనుంది. పద్మశ్రీ వచ్చిన వారిలో 11 మంది తెలుగు వారు ఉన్నారు. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు, మరణాంతరం పొం దిన వారు 16 మంది, విదేశీయులు, ఎన్ఆర్ఐ, పీఐఓ, ఓసీఐ విభాగాల్లో ఆరుగురు ఉన్నారు.