పతంగ్ ఎగరేసిన ప్రధాని మోడీ
12-01-2026
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) సోమవారం అహ్మదాబాద్లోని సబర్మతి నదీతీరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్-2026ను ప్రారంభించారు. తరువాత జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో(German Chancellor Friedrich Merz) కలిసి గాలిపటాలు ఎగురవేయడాన్ని ఆస్వాదించారు. సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన తర్వాత, ప్రధాని మోదీ, ఛాన్సలర్ మెర్జ్ సబర్మతి రివర్ఫ్రంట్కు వెళ్లారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పతంగుల పండుగను నిర్వహించింది. కార్యక్రమ వేదిక వద్ద, ప్రధాని మోదీ, మెర్జ్ మహిళా కళాకారులతో ముచ్చటించి, గాలిపటాలు తయారుచేసే ప్రక్రియను తెలుసుకున్నారు. ప్రారంభోత్సవం అనంతరం, ఇద్దరు నాయకులు ఒక తెరిచిన వాహనంలో మైదానంలో పర్యటించారు. కైట్ ఫెస్టివల్ ప్రాంగణంలో సాంస్కృతిక ప్రదర్శనలను ప్రధాని తిలకించారు. సందర్శకులకు ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్స్ లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ అభివాదం తెలిపారు.