2 April, 2026 | 7:23 PM

National

article_29065255.webp
కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..

న్యూఢిల్లీ: కేసీఆర్ చేసిన ఎంతో పోరాటం వల్ల తెలంగాణ సాకారమైందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి(BRS MP KR Suresh Reddy) అన్నారు. ప్రాంతాలుగా వేరవుదాం.. అన్నదమ్ముల్లా కలిసుందామని కేసీఆర్ అన్న విషయాన్ని రాజ్యసభలో ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తీరుపై బీజేపీ తరుచు విమర్శలు చేస్తోందన్నారు. తల్లిని చంపి బిడ్డను తీశారన్నట్లుగా పార్లమెంటులోనూ చెప్పారని పేర్కొన్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన సమయమిదన్నారు. అమరావతికి కేసీఆర్ మద్దతు తెలిపారని వెల్లడించారు. అమరుల త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నామం.. దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టమన్నారు.

02-04-2026

article_38223002.webp
పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది

న్యూఢిల్లీ: రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై(Amaravati Capital Bill) చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్(BJP MP Laxman) మాట్లాడుతూ... ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం తీసుకున్నారని తెలిపారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని పేర్కొన్నారు. భవ్య రాజధాని సాకారం కోసం ఏపీ ప్రజలు కలలు కన్నారని సూచించారు. వికసిత్ భారత్ సాకారం కోసం వికసిత్ ఆంధ్ర నిర్మాణం ఆవశ్యకం అన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం వికసిత్ రాజధాని అవసరమని ఆయన పేర్కొన్నారు. రాజధాని కోసం సుదీర్ఘంగా పోరాడిన మహిళలకు, ఘన చరిత్ర ఉన్న తెలుగుజాతికి లక్ష్మణ్ శిరస్సు వంచి నమస్కరించారు. అమరావతి బిల్లు ఆమోదం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందని వెల్లడించారు.

02-04-2026

article_42232768.webp
మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మద్దతుగానే ఉందని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఈ విషయంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఇప్పటికే లేఖ రాశామని పేర్కొన్నారు. ఈ అంశంపై ఛైర్మన్ కు లేఖ రాశానని గుర్తుచేశారు. ఈ విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఈ విషయాన్ని ఇంకా పొడిగించడం మంచిది కాదన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక చర్చ పెట్టండి.. అన్ని పక్షాలు పూర్తి మద్దతిస్తాయని సూచించారు. రాజ్యసభలో అమరావతి బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ విషయం ఏం చేశారని మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.

02-04-2026