calender_icon.png 31 December, 2025 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_45765036.webp
సొరంగంలో రైళ్లు ఢీ: 60 మందికి గాయాలు

31-12-2025

గోపేశ్వర్: చమోలీ జిల్లాలోని(Chamoli train accident) విష్ణుగడ్-పిపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలోని పిపల్‌కోటి టన్నెల్‌లో ఒక లోకో రైలు గూడ్స్ రైలును ఢీకొన్న ఘటనలో సుమారు 60 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో అధికారులు సహాయచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై చమోలి జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ మాట్లాడుతూ... సాయంత్రం ఆలస్యంగా జరిగిన ఈ ప్రమాద సమయంలో కార్మికులను తీసుకెళ్తున్న రైలులో మొత్తం 109 మంది ఉన్నారని, వారిలో సుమారు 60 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనలో చిక్కుకున్న వారందరినీ రక్షించామని, గాయపడిన వారందరి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

article_59427537.webp
చొరబాటుదారులను తరిమికొడతాం: అమిత్ షా

30-12-2025

కోల్‌కతా: ఎన్నికల ప్రయోజనాల కోసం పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం(Mamata Banerjee) బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులను తరిమేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) మంగళవారం స్పష్టం చేశారు. కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో షా మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్ ప్రజలు(Bengal people) చొరబాట్లపై ఆందోళన చెందుతున్నారని సూచించారు. తాము చొరబాటుదారులను గుర్తించడమే కాకుండా, వారిని తరిమివేస్తామని హెచ్చరించారు. 2026లో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం(BJP Government) ఏర్పాటు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక బెంగాల్ కు పూర్వవైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ హింసలో వామపక్షాలను టీఎంసీ మించిపోయిందని అమిత్ షా ఆరోపించారు.