calender_icon.png 6 December, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_86982965.webp
సుప్రీంకోర్టుకు ఇండిగో సంక్షోభం

06-12-2025

న్యూఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు(IndiGo flight cancellations) సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది.దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా విమానాలు రద్దుతో ప్రయాణికుల అసౌకర్యంపై సుప్రీంకోర్టులో(Supreme Court) ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. కేంద్ర ప్రభుత్వం(Central Government) తీసుకొచ్చిన కొత్త నిబంధనలను ఇండిగో పాటించకపోవడం వల్లే ఇబ్బందులంటూ బాధితులు సుప్రీంను ఆశ్రయించారు. ఆర్టికల్ 21 ప్రకారం ప్రయాణికుల హక్కుల ఉల్లంఘన జరిగిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇండిగో వ్యవహారంపై తక్షణమే విచారణ జరపాలని,స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.

article_47365181.webp
ఇండిగో కష్టాలు.. విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

06-12-2025

హైదరాబాద్: ఇండిగో విమాన ప్రయాణికులకు(IndiGo Passengers) తిప్పలు తప్పడం లేదు. ఒక్కరోజే 1000 విమానాల రద్దుతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ నుంచి వరసగా నాలుగోరోజు ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. శంషాబాద్ నుంచి రాకపోకలు సాగించే 69 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. హైదరాబాద్(Hyderabad)కు రావాల్సిన 26 ఇండిగో విమానాలు, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సాధారణ పరిస్థితులు నెలకునేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశముందని అధికారులు సూచించారు. ఇండిగో విమాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. మూడ్రోజుల్లో పూర్తిస్థాయి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

article_16799302.webp
అంబేద్కర్‌కు నివాళులర్పించిన ప్రముఖులు

06-12-2025

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(Dr. Babasaheb Ambedkar) 70వ వర్ధంతిని పురస్కరించుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం న్యూఢిల్లీలోని పార్లమెంట్‌లో మహాపరినిర్వాణ దివస్(Mahaparinirvan Diwas) సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. "మహాపరినిర్వాన్ దివస్ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను స్మరించుకుంటూ ఆయన దార్శనిక నాయకత్వం, న్యాయం, సమానత్వం, రాజ్యాంగబద్ధత పట్ల అచంచల నిబద్ధత మన జాతీయ ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. మానవ గౌరవాన్ని నిలబెట్టడానికి, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి ఆయన తరతరాలను ప్రేరేపించారు. విక్షిత్ భారత్‌ను నిర్మించే దిశగా మనం కృషి చేస్తున్నప్పుడు ఆయన ఆదర్శాలు మన మార్గాన్ని వెలిగించాలని కోరుకుంటున్నాను" అని ప్రధాని మోదీ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

article_83677127.webp
వాణిజ్యాన్ని మరింత పెంచుకుంటాం: పుతిన్

05-12-2025

న్యూఢిల్లీ: భారత్, రష్యా స్నేహసంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని భారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin) అన్నారు. ఈ పర్యటన సందర్భంగా భారత్, రష్యా కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. పుతిన్ మీడియాతో మాట్లాడుతూ... మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు. భారత్ తో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగినట్లు పేర్కొన్నారు. ఒప్పందంలో వాణిజ్యం, సాంకేతికత కీలక ప్రాధాన్యతని తెలిపారు. ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకున్నామని సూచించారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వ్యాపారం లక్ష్యమన్న పుతిన్ ఉమ్మడి ప్రాజెక్టులు, సాంకేతిక అంశాల్లో పరస్పర సహకారం ఉంటుందన్నారు. రష్యా నుంచి భారత్ వచ్చే పర్యాటకులకు వీసాలో వెలుసుబాటు, ఇరు దేశాల క్రీడాకారులు, విద్యార్థుల మధ్య పరస్పర సహకారం ఉందన్నారు.

article_86109694.webp
హైదరాబాద్‌ హౌస్‌లో మోడీ-పుతిన్ భేటీ

05-12-2025

న్యూఢిల్లీ: హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ(PM Narendra Modi), రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు. భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. చర్చల ఆరంభంలోనే పుతిన్‌తో శాంతి గురించి మాట్లాడారు. ఉక్రెయిన్‌-రష్యా వివాదం దౌత్య, శాంతి చర్చల ద్వారానే సాధ్యమవుతుందని ప్రధాని ప్రస్తావించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో భారత్ తటస్థంగా లేదని చెప్పిన ప్రధాని మోదీ భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటుందని స్పష్టం చేశారు. రష్యా- ఉక్రెయిన్‌ దేశాలు శాంతి మార్గంలోకి వస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. పుతిన్ విజన్ కు భారత్, రష్యా ఒప్పందాలే ఉదాహరణ అని మోదీ తెలిపారు. భారత్, రష్యా సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని పుతిన్ తెలిపారు. భారత్-రష్యా మధ్య 25 ఒప్పందాలు జరుగనున్నాయి. పుతిన్ విజన్ ను ప్రధాని అభినందించారు.

article_79779384.webp
హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం

05-12-2025

న్యూఢిల్లీ: దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి వికల్ప్ లేఖ కలకలం రేపుతోంది. నవంబర్ 27 నాటి వికల్ప్ లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం ఓ కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారని వికల్ప్ తెలిపారు. నిరాయుధడైన హిడ్మా సహా ఆరుగురిని పోలీసులు హత్య చేశారని తెలిపారు. ఎన్ కౌంటర్ లో హిడ్మా చనిపోయారని కట్టుకథ ప్రచారం చేశారని వికల్ప్ వివరించారు. హిడ్మా హత్యకు కలప వ్యాపారి, బిల్డర్, ఐటీడీఏ కాంట్రాక్టరే కారణమని వికల్ప్ ఆరోపించారు. హిడ్మా, శంకర్ ఎన్ కౌంటర్లపై విచారణ జరిపించాలని వికల్ప్ డిమాండ్ చేశారు. మనీశ్ కుంజాం, సోని చేసిన తప్పుడు ఆరోపణలను వికల్ప్ ఖండించారు.