ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమీక్ష
ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమీక్ష సమావేశం ముగిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు & ఎస్ఎస్ఏ జాతీయ ఇన్చార్జ్ చల్లా వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తో పాటు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.
28-07-2026