18 March, 2026 | 7:46 PM

National

article_77566721.webp
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: తొమ్మిది మంది సజీవదహనం

న్యూఢిల్లీ: నైరుతి ఢిల్లీలోని పాలం ప్రాంతంలో బుధవారం ఉదయం ఓ భవనంలో అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించడంతో, ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి మరణించారని అధికారులు తెలిపారు. మంటల నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు భవనం పైనుండి దూకారని, వారిని ఆసుపత్రిలో చేర్చారని తెలిపారు. పాలం మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక భవనంలో ఉన్న ఇంట్లో మంటలు చెలరేగినట్లు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీ అగ్నిమాపక సేవలకు (DFS) సమాచారం అందడంతో, 30 అగ్నిమాపక వాహనాలతో కూడిన భారీ అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.

18-03-2026