7 April, 2026 | 9:05 PM

National -

article_38207922.webp
మాజీ సీఎం కుమారుడికి యావజ్జీవం

రాయ్‌పూర్, ఏప్రిల్ 6: ఎన్సీపీ నేత రామావతార్ జగ్గీ హత్య కేసులో, 2007లో ఇచ్చిన ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ కుమారుడు అమిత్ జో గీకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌ఢ్ (జే) అధ్యక్షుడైన జోగీకి ట్రయల్ కోర్టు 2007లో ఇచ్చిన క్లీన్ చిట్ చట్టబద్ధంగా చెల్లదని తీర్పు ఇచ్చింది. అదే సాక్ష్యం ఆధారంగా ఇప్పటికే 28 మంది ఇతర నిందితులకు శిక్ష పడినప్పుడు, ప్రధాన కుట్రదారుడిగా ఆరోపించబడిన వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేయడం అన్యాయమని కోర్టు స్పష్టం చేసింది.

07-04-2026