అమర్నాథ్కు పోటెత్తుతున్న భక్తులు
06-07-2025
గత మూడు రోజుల్లో దాదాపు 48,000 మంది భక్తులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు. ఆదివారం 7208 మంది యాత్రికుల మరో బృందం జమ్మూ నుండి కాశ్మీర్కు బయలుదేరింది. శనివారం పవిత్ర గుహ మందిరం లోపల 21,000 మందికి పైగా యాత్రికులు దర్శనం చేసుకొని, ఇవాళ జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుండి రెండు ఎస్కార్ట్ కాన్వాయ్లలో 7,208 మంది యాత్రికుల బృందం లోయకు బయలుదేరిందని అధికారులు పేర్కొన్నారు.