calender_icon.png 12 January, 2026 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_36737527.webp
నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ

12-01-2026

నెల్లూరు, జనవరి 11(విజయక్రాంతి): శ్రీహరి కోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నేటి (సోమవారం) ఉదయం 10.17 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రాకెట్ ప్రయోగానికి ఆదివారం(24 గంటల ముందే) ఉదయం 10.17 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) తయారు చేసిన తొమ్మిదో వాణిజ్య ఉపగ్రహం ఇది. ఈ రాకెట్ ద్వారా ఈఓఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. దేశ రక్షణ రంగానికి ఇది అత్యంత కీలకం కానుంది. 2026లో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగమిది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వది. ఈ మిషన్ ద్వారా 8 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు.

article_20363909.webp
డిజిటల్ అరెస్ట్‌తో రూ.15 కోట్ల మోసం

12-01-2026

న్యూఢిల్లీ, జనవరి 11: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ ఎన్నారై వృద్ధదంపతుల నుంచి దాదాపు రూ.15 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచేశారు. అంతేగాక కేటుగాళ్లు ఢిల్లీలో జనవరి 10న ఆ దంపతులను ఆర్బీఐ రీఫండ్ పేరుతో ఒక పోలీస్ స్టేషన్‌కు పంపడంతో ఈ మోసం బయటపడింది. అక్కడ అధికారులు వారికి రూ.14.85 కోట్లు మోసం జరిగిందని నిర్ధారించారు. బాధితులు గతంలో ఐక్యరాజ్యసమితిలో పనిచేశారు. తమ జీవితకాల పొదుపును కోల్పోయామని ఆ దంపతులు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు సమాచారం. డాక్టర్ ఓం తనేజా, అతని భార్య డాక్టర్ ఇందిరా(77) తనేజా యునైటెడ్ స్టేట్స్‌లో ఐక్యరాజ్యసమితిలో దాదాపు 48 సంవత్సరాలు పనిచేశారు. పదవీ విరమణ తర్వాత 2015లో భారతదేశానికి వారు తిరిగొచ్చి, ఢిల్లీలో ఉంటున్నారు. అప్పటి నుంచి, వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. డిసెంబర్ 24, 2025న వృద్ధదంపతులకు సైబర్ నేరగాళ్ల నుంచి కాల్ వచ్చింది.

article_38778628.webp
మహారాష్ట్ర మాజీ డీజీపీ కుట్ర ?

11-01-2026

ముంబై, జనవరి ౧౦: మహారాష్ట్ర మాజీ డీజీపీ సంజయ్ పాండేపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేను 2021లో ఒక తప్పుడు కేసులో ఇరికించేందుకు ఆయన కుట్ర పన్నారని ఒక విచారణ నివేదిక వెల్లడించడం కలకలం రేపింది. విశ్రాంత డీజీపీ రష్మీ శుక్లా తాజాగా ఆ రాష్ట్ర హోంశాఖకు ఈ నివేదికను సమర్పించారు. పట్టణ భూ గరిష్ఠ పరిమితి (యూఎల్‌సీ) చట్టం ఉల్లంఘన కేసును ఆధారంగా చేసుకుని ఈ కుట్ర జరిగినట్లు నివేదిక పేర్కొంది. 2021లో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంజయ్ పాండే ఈ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది.