calender_icon.png 1 January, 2026 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_13684966.webp
గిగ్ బిగ్ షాక్

01-01-2026

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: గిగ్‌వర్కర్ల సమ్మెను తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారమ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూ యూ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఆప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్‌ఏటీ), గిగ్ అం డ్ ప్లాట్ఫారమ్ సర్వీసెస్ వర్కర్స్ యూనియన్ (జీఐపీఎస్‌డబ్ల్యూయూ) నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్ డెలివరీ కార్మికు లను గిగ్‌వర్కర్లు అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే..! ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యాప్ ఆధారిత ప్లాట్‌ఫా రమ్ డెలివరీలను బుధవారం బంద్‌చేసి, కీలక ప్రదేశాల్లో శాంతియుత నిరసనలు చేశామని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ (ఐఎఫ్‌ఏటీ) జాతీయ ప్రధానకార్యదర్శి షేక్ సలావుద్దీన్ అన్నారు.

article_62266487.webp
దూత అవతారం ఎత్తిన చైనా

31-12-2025

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) మాదిరిగానే చైనా కూడా దూత అవతారం ఎత్తింది. భారత్-పాకిస్థాన్ ఘర్షణల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా వెల్లడించింది. అనేక ప్రపంచ ఘర్షణల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించామని వాంగ్ యూ పేర్కొన్నారు. చైనా ప్రచారాన్ని భారత విదేశాంగశాఖ ఉన్నతాధికారులు ఖండించారు. భారత్ -పాక్ యుద్ధ(India-Pakistan War) విరమణలో మూడో పక్షం జోక్యం లేదని స్పష్టం చేశారు. భారత్-పాక్ అంశంలో చైనా ప్రకటన ఆందోళన కలిగిస్తోందని కాంగ్రెస్ పేర్కొంది. చైనా ప్రకటన దేశ భద్రతను అపహాస్యం చేసేలా ఉందని కాంగ్రెస్ వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మౌనం వీడి దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

article_45765036.webp
సొరంగంలో రైళ్లు ఢీ: 60 మందికి గాయాలు

31-12-2025

గోపేశ్వర్: చమోలీ జిల్లాలోని(Chamoli train accident) విష్ణుగడ్-పిపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలోని పిపల్‌కోటి టన్నెల్‌లో ఒక లోకో రైలు గూడ్స్ రైలును ఢీకొన్న ఘటనలో సుమారు 60 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో అధికారులు సహాయచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై చమోలి జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ మాట్లాడుతూ... సాయంత్రం ఆలస్యంగా జరిగిన ఈ ప్రమాద సమయంలో కార్మికులను తీసుకెళ్తున్న రైలులో మొత్తం 109 మంది ఉన్నారని, వారిలో సుమారు 60 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనలో చిక్కుకున్న వారందరినీ రక్షించామని, గాయపడిన వారందరి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.