calender_icon.png 10 December, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_35606556.webp
కాంగ్రెస్ మొదటి నుంచీ ‘వందేమాతర’ వ్యతిరేకి! X గీతాన్ని భుజానికెత్తుకున్నదే మేం!

10-12-2025

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: బ్రిటిష్ సంస్కృతిని అనుసరించేవారికి వందేమాతర గీతం విలువ తెలియదని, వారు ఎప్పటికీ దేశ ప్రజలపై గీత ప్రభావాన్ని ఆపలేరని కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. బ్రిటిష్ పాలకులు కూడా ప్రజల్లో గీత ప్రభావాన్ని ఆపలేకపోయారని, ఇక కాంగ్రెస్ నేతలేం చేయగలరని నిప్పులు చెరిగారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వరకూ ప్రతిఒక్కరూ వందేమాతరం గీతాన్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారని దుయ్యబట్టారు.

article_17740749.webp
ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో కేంద్రం ప్రకటన

09-12-2025

న్యూఢిల్లీ: ఇండిగోపై(IndiGo crisis) కేంద్ర పౌరవిమానయాన శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో కేంద్ర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరపు కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్ సహా ప్రధాన ఎయిర్ పోర్టుల్లో సీనియర్ అధికారుల బృందం అధ్యయనం చేయనుంది. రామ్మోహన్ నాయుడు(Union Aviation Minister Ram Mohan Naidu) సభ ముందు వివరణ ఇచ్చారు. కొత్త నిబంధనలు పాటిస్తామని ఇండిగో వివరణ ఇచ్చిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికుల భద్రతే ముఖ్యమని, ప్రయాణికులు ఇబ్బంది పడితే యాజమాన్యాలదే బాధ్యతన్నారు. ఇండిగోపై సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు. ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా ప్రయాణం చేయాలన్నారు.

article_64955023.webp
కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం

09-12-2025

హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport)లో మంగళవారం విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రోజు 58 ఇండిగో సర్వీసులు రద్దు చేయబడ్డాయి. డిసెంబర్ 4 తర్వాత రోజువారీ రద్దుల సంఖ్య 100 కంటే తక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. ఇండిగో హైదరాబాద్ కు రావాల్సిన 14 విమానాలు, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 44 విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, గోవా, కొచ్చిన్, విశాఖపట్నం, వారణాసి, పాట్నా, శ్రీనగర్, కోల్‌కతా, అహ్మదాబాద్, ప్రయాగ్‌రాజ్, లక్నో, బాగ్డోగ్రా, చెన్నై, జోధ్‌పూర్‌లతో సహా హైదరాబాద్‌కు, తిరిగి వచ్చే అనేక ప్రధాన మార్గాలు ప్రభావితమయ్యాయి. మొత్తం రద్దుల సంఖ్య తగ్గినప్పటికీ, కీలక మార్గాల్లో అంతరాయాలు ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. వీరిలో చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ నిరాశను వ్యక్తం చేశారు. రాహుల్ భాటియా నియంత్రణలో ఉన్న దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సోమవారం ఆరు మెట్రో విమానాశ్రయాల నుండి 562 విమానాలను రద్దు చేసింది. వీటిలో 150 విమానాలు బెంగళూరు విమానాశ్రయం నుండి మాత్రమే ప్రారంభమయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి.