calender_icon.png 24 December, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_15730644.webp
బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ కౌంట్‌డౌన్ షురూ

24-12-2025

శ్రీహరికోట, డిసెంబర్ 23(విజయక్రాంతి): శ్రీహరి కోటలో ఇస్రోకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ కౌంట్‌డౌన్ ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ మోసుకెళ్లే ఎల్‌వీ ఎం3-ఎం6 వ్యోమనౌక బుధవారం ఉద యం 8.54 గంటలకు నింగిలోకి ఎగరనున్నట్లు తెలిపారు. ఈ ఉపగ్రహం బరువు సుమారు 6,500 కిలోలు ఉన్నట్లు సమాచారం. స్పేస్‌పోర్ట్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తోంది.

article_76264836.webp
మల్కాన్‌గిరి జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టులు

23-12-2025

మల్కన్‌గిరి: మావోయిస్టు పార్టీకి(Maoist Party) దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో(Malkangiri district) మంగళవారం ఇరవై రెండు మంది మావోయిస్టులు(Maoists surrender) పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒడిశా డీజీపీ వై. బి. ఖురానియా, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టులు తొమ్మిది తుపాకులు, 150 సజీవ తూటాలు, 20 కిలోల పేలుడు పదార్థాలు, 13 ఐఈడీలు, జిలెటిన్ స్టిక్‌లు, ఇతర వస్తువులను అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులలో ఎక్కువ మంది పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే అయినప్పటికీ, వారు ఒడిశాలో కార్యకలాపాలు నిర్వహించేవారని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 19 మంది ఒడిశాకు చెందిన వారున్నారు. అందులో ఇద్దరు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన వారని అధికారులు వెల్లడించారు.

article_43038297.webp
ఢిల్లీలో ఉద్రిక్తత

23-12-2025

న్యూఢిల్లీ: ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషనర్ కార్యాలయం(Bangladesh High Commission office) మంగళవారం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని మూకదాడి చేసి చంపిన ఘటనకు నిరసనగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ సమీపంలో విశ్వ హిందూ పరిషత్(Vishwa Hindu Parishad), ఇతర హిందూ సంస్థల సభ్యులు భారీ నిరసన చేపట్టారు. వీహెచ్ పీ(VHP activists) కార్యకర్తలు హైకమిషనర్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. వీహెచ్ పీ శ్రేణలులు బారీకేడ్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీహెచ్ పీ ఆందోళనల దృష్ట్యా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. పోలీసులు వీహెచ్ పీ కార్యకర్తలను నిలువరిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.

article_32774764.webp
‘ఆరావళి’లో 90% రక్షిత ప్రాంతమే

23-12-2025

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కేవలం ఖనిజాల తవ్వకం కోసమే ఆరావళి పర్వతాల నిర్వచనాన్ని తాము మార్చినట్లు వస్తున్న ఆరో పణలు అవాస్తవమని, ఆ పర్వత శ్రేణుల్లో 90% విస్తీర్ణం రక్షిత ప్రాంతమేనని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. సమ గ్ర నిర్వహణ ప్రణాళిక ఖరారయ్యేవరకు ఆ ప్రాంతంలో కొత్త గనుల తవ్వకానికి లీజులు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయాన్ని గుర్తుచేసింది. కోర్టు ఆమోదించిన నిర్వచనం ప్రకారం ఆరావళిలో 90% పైగా రక్షిత ప్రాంతంగా ఉంటుందని తేలిచెప్పింది. 1.44 లక్షల చదరపు కి.మీ మేర విస్తరించిన ఈ పర్వత శ్రేణుల్లో 0.19% మైనింగ్ కోసం వినియోగించుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది.