బిగ్ షాక్!.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
01-01-2026
న్యూఢిల్లీ: న్యూ ఇయర్ వేళ దేశ ప్రజలకు కేంద్రం షాక్ ఇచ్చింది. వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు జనవరి 1వ తేదీ నుండి 19 కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధరను రూ. 111 వరకు పెంచడంతో 2026 సంవత్సరం భారతదేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు షాక్ తగిలింది. సవరించిన ధరలు హోటళ్ళు, రెస్టారెంట్లు, తినుబండారాలు, ఇతర వ్యాపార సంస్థలు ఉపయోగించే వాణిజ్య సిలిండర్లకు వర్తిస్తాయి. అయితే 14 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలు దేశవ్యాప్తంగా మారలేదు, గృహ వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. సవరించిన ధరల విధానం ప్రకారం, 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 111 పెంచి, దేశవ్యాప్తంగా అమలు చేశారు. దీంతో 19 కేజీల ఎల్పీజీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ రూ. 1,691కి చేరింది.