శబరిమల కేసులో కీలక మలుపు: మహిళల ప్రవేశంపై కేంద్రం స్టాండ్… సుప్రీంకోర్టులో హై టెన్షన్ విచారణ!
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: శబరిమల ఆలయం సహా పలు మతపరమైన ప్రదేశాలలో మహిళలపై వివక్ష, మత స్వేచ్ఛ పరిధికి సంబంధిం చిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం మంగళవారం నుంచి తుది విచారణను ప్రారంభించింది. కేంద్రం సుప్రీంకోర్టుకు తమ వివరణను సమర్పించింది. ప్రాచీనకాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలకు అనుగుణంగానే మహిళలకు శబరిమల ప్రవేశంపై నిషేధం విధించామని, దీనికి సంబంధించిన వివక్ష ఏమీ లేదని కేంద్రం తరఫున సుప్రీంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.
08-04-2026