16 June, 2026 | 9:42 AM

National -

article_12283484.webp
తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన పార్టీ ఏనాడు అడ్డు చెప్పలేదని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం భట్టి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ తలపెట్టిన సేన ప్రస్థానం, జాతీయ సమైక్యత కోసం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.... ఏపీని విభజించిన తీరుపై మాత్రమే ఆవేదన వెలిబుచ్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్ విభజన తీరు.. అసంతృత్తి, అశాంతిని సృష్టించిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించిన నాటి నుంచి ఇవాళ్టికి కాంగ్రెస్ ధోరణి మారలేదని ఆరోపించారు. తెలంగాణలో జనసేన సభకు అనుమతివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి, ఢిల్లీ మెడలు వంచుతాం.. తడాఖా చూపిస్తామని చాలామంది పెద్దమాటలు చెబుతున్నారని సూచించారు.వాస్తవానికి అలాంటి నేతలు ఢిల్లీకి రాగానే వెనక్కి తగ్గుతారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.

15-06-2026