ఆన్లైన్ పెట్టుబడుల స్కాం ముఠా గుట్టురట్టు
07-01-2026
ముంబై, జనవరి ౬: ఆన్లైన్ పెట్టుబడుల పేరిట ప్రజల బ్యాంక్ ఖాతాలను కొల్లగొట్టి సొమ్ముచేసుకుంటున్న సైబర్ ముఠాను మంగళవారం ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యులంతా ఉన్నత విద్యావంతులు కావడం గమనార్హం. వీరు షేర్ మార్కెట్, గోల్ ట్రేడింగ్, ఫారెక్స్ ట్రేడింగ్ వంటి విభాగాల్లో భారీ లాభాలు వస్తాయంటూ నకిలీ వెబ్సైట్స్ సృష్టించారు. అమాయక ప్రజలను ఆకర్షించేందుకు ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రమోట్ చేశారు.