calender_icon.png 13 January, 2026 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_42224745.webp
కుక్క కాటుకు భారీ జరిమానా

13-01-2026

న్యూఢిల్లీ: గత ఐదేళ్లుగా వీధి జంతువులకు సంబంధించిన నిబంధనల అమలులో లోపంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, కుక్క కాటు(dog bite) ఘటనలకు రాష్ట్రాలు భారీ పరిహారం(Heavy fine) చెల్లించాలని ఆదేశిస్తామని మంగళవారం పేర్కొంది. కుక్క కాటు సంఘటనలకు కుక్కలను ప్రేమించేవారు, వాటికి ఆహారం పెట్టేవారు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని జస్టిస్‌లు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజారియాతో కూడిన ధర్మాసనం(Supreme Court) పేర్కొంది. పిల్లలకు, వృద్ధులకు కుక్క కాటు వల్ల మరణం లేదా గాయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

article_61310551.webp
గిగ్ వర్కర్లకు ఊరట

13-01-2026

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్‌లకు భారీ ఊరట(Big relief for gig workers) లభించింది. 10 నిమిషాల ఆన్ లైన్ డెలివరీ నిర్ణయాన్ని ఎత్తివేస్తూ కేంద్ర కార్మిక మంత్రి మాండవీయ మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. మాండవీయ వరుస జోక్యాల తర్వాత తప్పనిసరి 10 నిమిషాల డెలివరీ గడువును తొలగించమని ప్రధాన డెలివరీ అగ్రిగేటర్లను ఒప్పించారని వర్గాలు తెలిపాయి. డెలివరీ సమయాలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి బ్లింకిట్, జెప్టో, జొమాటో, స్విగ్గీ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లతో ఒక సమావేశం నిర్వహించబడింది. వర్గాల సమాచారం ప్రకారం, బ్లింకిట్ ఇప్పటికే ఈ ఆదేశంపై చర్య తీసుకుని, తన బ్రాండింగ్ నుండి 10 నిమిషాల డెలివరీ వాగ్దానాన్ని తొలగించింది. రాబోయే రోజుల్లో ఇతర అగ్రిగేటర్లు కూడా ఇదే బాటలో నడుస్తారని భావిస్తున్నారు.

article_64153664.webp
భీమవరంలో ట్రాఫిక్ జామ్

13-01-2026

అమరావతి, జనవరి 12: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందడి పెద్ద ఎత్తున కనిపిస్తోంది. పండగకి హైదరాబాద్ తదితర నగరాల్లో ఉన్నవాళ్లంతా సొంతూళ్లకు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వచ్చే వాహనాలతో నగర, పలు పట్ణణ రహదారులపై తీవ్ర రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రహదారులు అన్నీ సోమవారం ఉదయం నుంచి వాహనాల రద్దీ నెలకొంది. కొన్నచోట్ల పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపో యింది. ముఖ్యంగా భీమవరం చినవంతెన నుంచి రెండు కిలోమీటర్లు పొడవునా ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. ప్రకాశం చౌక్, అంబేద్కర్ కూడళ్లలో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది.

article_15926106.webp
ఎవరు నరుకుతారో చూస్తా

13-01-2026

చెన్నై, జనవరి ౧౨: ‘రాజ్ థాక్రే ఎవరు నన్ను బెదిరించడానికి? నేను ఒక రైతు బిడ్డను. ఆయన కేవలం నన్ను తిట్టడానికే సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేను కచ్చితంగా ముంబైకి వస్తా. నా కాళ్లు ఎవరు.. ఎలా నరుకుతారో చూస్తా.. అలాంటి బెదిరింపులకు భయపడితే నేను నా ఊరిలోనే ఉండిపోయేవాడిని. గొప్పనేతలను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన వాడిని నేను. ఎవరో బెదిరిస్తే బెదురుతానా’ అంటూ తమిళనాడు బీజేపీ నేత అన్నామలై తీవ్రంగా స్పందించారు. తాను ముంబైకి వస్తే అడ్డుకుంటానని, అవసరమైతే కాళ్లు నరుకుతానని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్)అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై సోమవారం అన్నామలై స్పందించారు.

article_31540563.webp
పీఎస్‌ఎల్వీ- సీ62 ప్రయోగానికి అంతరాయం

13-01-2026

శ్రీహరికోట, జనవరి ౧౨: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సోమవారం ఉదయం 10.18 గంటలకు శ్రీహరికోట కేంద్రంగా ప్రతిష్ఠాత్మకంగా పీఎస్‌ఎల్వీ- సీ62 రాకెట్ ప్రయోగానికి అంతరాయం ఏర్పడింది. దేశ రక్షణ రంగానికి విశేష సేవలందించే ‘అన్వేష’ అనే ఈవోఎస్-ఎన్ 1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రయోగించిన రాకెట్‌లో సమస్య తలెత్తింది. ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో పూర్తి కావాల్సి ఉండగా, మూడో దశ తర్వాత అడ్డంకులు ఎదురయ్యాయి. మూడో దశ చివర్లో నిర్దేశించిన మార్గంలో రాకెట్ వెళ్లకపోవడంతోనే ఈ అంతరాయం ఏర్పడింది. ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ వీ నారాయణన్ స్పష్టత ఇస్తూ.. మూడో దశ ఇంజిన్ ఛాంబర్‌లో ప్రెజర్ అకస్మాత్తుగా పడిపోవడంతో సమస్య తలెత్తిందని తెలిపారు.

article_27502713.webp
‘బంగ్లా’లో హిందువు హత్య

13-01-2026

ఢాకా, జనవరి ౧౨: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఓ హిందువు దారుణ హత్యకు గురయ్యాడు. దగన్‌భుయాన్ ప్రాంతానికి సమీర్ దాస్ (౨8) అనే హిందువు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి అతడి ఇంటివద్దకు వెళ్లిన దుండగులు కిరాతకంగా కొట్టి, కత్తితో పొడిచి చంపారు. హత్య అనంతరం ఆటోను సైతం అపహరించి పరారయ్యారు. ఈ హత్యను ‘బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఖండించింది. మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడడం సరికాదని, నిందితులకు శిక్షపడేలా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు సమీర్ దాస్ హత్యపై చిట్టగాంగ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

article_30263853.webp
ఇరాన్ ప్రభుత్వం హద్దు మీరుతోంది !

13-01-2026

వాషింగ్టన్/టెహ్రాన్: ‘ఇరాన్ ప్రభుత్వం హద్దు మీరుతోంది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఇరానీయన్లపై హింసను సహించం. ప్రజా నిరసనల అణచివేతను ఉపేక్షిం’ అంటూ తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌లో రెండు వారాల నుంచి జరుగుతున్న ఘర్షణల్లో 500 మందికి పైగా మృతిచెందడం, ౧౦ వేల మంది పౌరులను అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించేందుకు అవసరమైతే తానే స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తోనైనా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్‌ను వినియోగించైనా అక్కడి ప్రజలకు కమ్యూనికేషన్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.