calender_icon.png 31 January, 2026 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_66618653.webp
కెనడాపై మరోసారి ట్రంప్ సుంకాల మోత

31-01-2026

వాషింగ్టన్, జనవరి 30 : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ తన పొరుగు దేశమైన కెనడాపై వాణిజ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశారు. కెనడా నుంచి అమెరికాకు విక్రయించే అన్ని రకాల విమానాలపై ఏకంగా 50 శాతం సుంకాలు విధిస్తానని తాజాగా సం చలన హెచ్చరిక జారీ చేశారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ట్రంప్‌కు ఉన్న విభేదాలు ఇప్పుడు రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను ప్రమాదంలో నెట్టేస్తున్నాయి. అమెరి కాకు చెందిన ’గల్ఫ్‌‌‌రరస్టీమ్ ఏరోస్పేస్’ తయారు చేసిన జెట్ విమానాలకు కెనడా అనుమతి ఇవ్వడానికి నిరాకరిస్తోందని.. దానికి ప్రతీకారంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రం ప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

article_48897890.webp
అజిత్ పవార్ భార్యకు పదోన్నతి

31-01-2026

ముంబై, జనవరి 30 : మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మర ణం పాలైన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్యకు కీలక బాధ్యతలు అప్పగించాలని మహాయుతి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అజిత్ పవార్ వారసులిగా ఆయన స్థానంలో డిప్యూటీ సీఎంగా భార్య సునేత్రా పవార్‌కు అవకాశం కల్పించాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె రేపు మహారాష్ట్ర కొత్త డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తు తం మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్న సునేత్రా పవార్‌కు ప్రమో షన్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని సర్కార్ నిర్ణయించింది.

article_51983266.webp
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు లొంగుబాటు

30-01-2026

సుక్మా: ఛత్తీస్గఢ్‌లో(Chhattisgarh) మావోయిస్టులకు మరో భారీ షాక్ తగిలింది. రూ. 8 లక్షల రూపాయల రివార్డులు కలిగిన ఇద్దరు మహిళలతో సహా నలుగురు నక్సలైట్లు శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో తమ ఆయుధాలతో పాటు లొంగిపోయారని(Naxalites surrender) ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మావోయిస్టుల దక్షిణ బస్తర్ డివిజన్‌లోని కిష్టారం ఏరియా కమిటీకి చెందిన కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ 'పూనా మార్గెం' కార్యక్రమం కింద లొంగిపోయారని బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్(Inspector General of Police Sundarraj) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానం తమను ఆకట్టుకుందని నక్సలైట్లు పోలీసులకు చెప్పారని పేర్కొన్నారు.

article_63543620.webp
కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులు చెల్లవు

30-01-2026

హైదరాబాద్: కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)కు ఇచ్చిన సిట్ నోటీసులు(SIT Notices) చెల్లవని బీఆర్ఎస్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు(Supreme Court BRS Advocate) వెల్లడించారు. సీఆర్పీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నోటీసులు ఇచ్చారని వివరించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సిట్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. చట్టబద్ధంగా ఆంక్షలు ఉన్నందున కేసీఆర్(KCR)కు నోటీసులు ఇవ్వలేరని వెల్లడించారు. 65 ఏళ్లు దాటినవారిని ఇంటికి వెళ్లి విచారించాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ కక్ష సాధింపు మాత్రమే అన్నారు. ఏళ్ల తరబడి విచారణకు పిలుస్తామంటే కుదరని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని చెప్పారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని మోహిత్ రావు స్పష్టం చేశారు.