calender_icon.png 27 January, 2026 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_76375435.webp
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్

27-01-2026

న్యూఢిల్లీ: భారత్ భాగస్వామ్యం సరికొత్త శిఖరాలకు చేరుతోందని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. భారత్-ఈయూ మధ్య మంగళవారం నాడు చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రధాని మోదీ ఇండియన్ ఎనర్జీ వీక్ వేదికగా ప్రకటించారు. ఈ ఒప్పందాన్ని "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్"గా అభివర్ణించారు. ఈ ఒప్పందంతో భారత వాణిజ్యంలో సరికొత్త శకం మొదలైదని తెలిపారు. భారతదేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద స్వేచ్ఛావాణిజ్య ఒప్పందమని ప్రధాని పేర్కొన్నారు. టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ రంగాల్లో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం జరిగిందన్నారు. ప్రపంచ జీడీపీలో 25 శాతం, వాణిజ్యంలో మూడో వంతు వాటా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. కోట్లాది భారతీయులకు, యూరోపియన్లకు అపారమైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

article_23074498.webp
కాశ్మీర్‌లో మంచు తుఫాను.. విమాన సర్వీసులు రద్దు

27-01-2026

న్యూఢిల్లీ: కాశ్మీర్‌లో మంచు తుఫాను కారణంగా మంగళవారం శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరే అనేక విమానాలు రద్దు చేయబడ్డాయని అధికారులు తెలిపారు. "ప్రతికూల వాతావరణ పరిస్థితులు, శ్రీనగర్ విమానాశ్రయంలో కొనసాగుతున్న మంచు తుఫాను దృష్ట్యా, విమానయాన సంస్థలు ఈరోజు కొన్ని విమానాలను రద్దు చేశాయి" అని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 16 విమానాలు రద్దు చేయబడ్డాయి. వాటిలో ఎనిమిది వచ్చేవి, ఎనిమిది వెళ్లేవి ఉన్నాయి. తాజా సమాచారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రయాణికులు తమ సంబంధిత విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించినట్లు అధికారులు సూచించారు. వారాంతం, గణతంత్ర దినోత్సవ సెలవులను లోయలో గడిపి తిరిగి రావాల్సిన వందలాది మంది పర్యాటకులు విమానాల రద్దు కారణంగా కాశ్మీర్‌లో చిక్కుకుపోయారు.

article_25801461.webp
400 కోట్ల దోపిడీ కేసుపై దర్యాప్తునకు సిద్ధం

27-01-2026

బెంగళూరు, జనవరి 26: గోవా సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో రూ.400 కోట్లను తరలిస్తున్న రెండు కంటైనర్లను దోపిడీ దొంగలు దారి మళ్లించిన వ్యవహారం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర స్పందిస్తూ గ్రేట్ రాబరీపై దర్యాప్తుకు సిద్ధమని ప్రకటించారు. బాధితులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని వెల్లడించారు. గోవా నుంచి మహారాష్ట్రకు సుమారు రూ.400 కోట్ల నగదు తరలిస్తున్న రెండు ట్రక్ కంటైనర్లు కర్ణాటకలో గత అక్టోబర్‌లో అదృశ్యమయ్యాయి. మహారాష్ట్రకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిశోర్ సేఠ్ ఈ నగదును తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

article_79606379.webp
శుభాంశు శుక్లాకు అశోక చక్ర

26-01-2026

న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station)పై అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) సోమవారం భారతదేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారమైన అశోక చక్ర( Ashoka Chakra) ప్రదానం చేశారు. రాష్ట్రపతి జాతీయ రాజధానిలోని ప్రధాన రహదారి అయిన కర్తవ్య పథ్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శుక్లాకు ఈ అవార్డును ప్రదానం చేశారు. గత సంవత్సరం జూన్‌లో, శుక్లా చారిత్రాత్మక యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను సందర్శించిన మొదటి భారతీయుడిగా నిలిచారు. రష్యన్ సోయుజ్-11 అంతరిక్ష యాత్రలో వ్యోమగామి రాకేష్ శర్మ ప్రయాణించిన 41 సంవత్సరాల తర్వాత ఆయన 18 రోజుల అంతరిక్ష యాత్ర జరిగింది.