calender_icon.png 4 February, 2026 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_26976811.webp
ఎస్‌ఎఫ్డీఆర్ ప్రయోగం సక్సెస్

04-02-2026

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౩: భారత రక్షణ వ్యవస్థ అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. దేశ క్షిపణి వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు డీఆర్డీవో ప్రతిష్ఠాత్మకంగా తయారుచేసి న సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ క్షిపణి (ఎస్‌ఎఫ్డ్‌ఆర్)ని మంగళవారం ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ప్ర యోగించి సక్సెస్ అయింది. గగనతలం నుంచి గగనతలంలోకే ప్రయోగించేందుకు ఈ క్షిపణిని ఉపయోగపడుతుంది. ప్రయోగ పరీక్షలో అన్ని రకాల సాంకేతిక వ్యవస్థలు సక్రమంగా పనిచేశాయని డీఆర్డీవో వర్గాలు ప్రకటించా యి. క్షిపణి ద్వారా సుదూరంగా ఉన్న శత్రు దే శాల లక్ష్యాలను సులభంగా ఢీకొట్టవచ్చని తెలిపాయి. ప్రయోగానికి అనేక సంస్థలు సహాయ, సహకారాలు అందించాయని పేర్కొన్నాయి.

article_10145515.webp
భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ

04-02-2026

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౩: అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిస్తుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో మంగళవారం నేషనల్ డెమోక్రాటిక్ కూటమి (ఎన్డీయే) ఎంపీలతో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా విధిస్తున్న వస్తు సుంకం 18 శాతానికి తగ్గడం భారత ఎగుమతిదారులకు లభించిన గొప్ప విజయమని అభివర్ణించారు. కొనియాడారు. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయంగా తయారీ రంగం బలోపేతం అవుతుందని ప్రధాని ఆకాంక్షించారు. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారత్ తన ముద్ర వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

article_82881070.webp
అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరింది

04-02-2026

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౩: ‘భారత్ అమెరికా మధ్య సోమవారం జరిగిన వాణిజ్య ఒప్పందం జరిగింది. ఒప్పందం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, డెయిరీ, ఐటీ, ఫిషరింగ్, టెక్స్‌టైల్స్, లెదర్ వస్తువుల తయారీ రంగాలు లబ్ధి పొందుతాయి. అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై సుంకం ౨౫ శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. తద్వారా దేశానికి చెందిన ఎగుమతిదారులు లాభపడతారు’ అని కేంద్ర మంత్రి పరిశ్రమలశాఖ పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ‘ప్రతీకార సుంకాలను విధించింది అమెరికానే, తిరిగి సుంకాన్ని తగ్గించిందీ అమెరికానే. ఇక దీనిలో విమర్శకు తావెక్కడుంద’ని ప్రతిపక్షాలను ఆయన ప్రశ్నించారు. న్యూఢిల్లీ నుంచి మంగళవారం ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు అనవసరంగా సభలో గందరగోళం సృష్టిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

article_54366361.webp
రాజ్యాంగ ఉల్లంఘనలను సహించం

04-02-2026

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౩: భారత్‌కు వినియోగదారుల వ్యక్తిగత గోప్యత విషయంలో రాజ్యాంగ నిబంధనలను పాటించలేకపోతే దేశం విడిచి వెళ్లిపోవాలని సోషల్ మీడియా దిగ్గజం మెటా, వాట్సాప్ సంస్థలను సుప్రీం కోర్టు హెచ్చరించింది. డేటా షేరింగ్ పేరుతో పౌరుల గోప్యత హక్కులతో ఆడుకోవడాన్ని సహించబోమని తేల్చిచెప్పింది. వాట్సాప్ సంస్థ కొత్తగా అమలు చేస్తున్న గోప్యతా విధానంపై దాఖలైన అనేక పిటిషన్లపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. వాట్సాప్ నిబంధనలు సామాన్యులకు అర్థం కాని విధంగా, సంక్లిష్టంగా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాంటప్పుడు మారుమూల గ్రామాలకు చెందిన పేదలు, నిరక్షరాస్యులు ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించింది.