calender_icon.png 30 December, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_59427537.webp
చొరబాటుదారులను తరిమికొడతాం: అమిత్ షా

30-12-2025

కోల్‌కతా: ఎన్నికల ప్రయోజనాల కోసం పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం(Mamata Banerjee) బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులను తరిమేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) మంగళవారం స్పష్టం చేశారు. కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో షా మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్ ప్రజలు(Bengal people) చొరబాట్లపై ఆందోళన చెందుతున్నారని సూచించారు. తాము చొరబాటుదారులను గుర్తించడమే కాకుండా, వారిని తరిమివేస్తామని హెచ్చరించారు. 2026లో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం(BJP Government) ఏర్పాటు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక బెంగాల్ కు పూర్వవైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ హింసలో వామపక్షాలను టీఎంసీ మించిపోయిందని అమిత్ షా ఆరోపించారు.

article_22754249.webp
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కన్నుమూత

30-12-2025

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా(Khaleda Zia dies) దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారని ఆమె వ్యక్తిగత వైద్యుడు మంగళవారం తెలిపారు. దేశపు తొలి మహిళా ప్రధానమంత్రి(Bangladesh former Prime Minister ), బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పి) అధ్యక్షురాలైన జియా 80 ఏళ్ల వయసులో కన్నుమూశారని ఢాకా ట్రిబ్యూన్ పత్రిక నివేదించింది. ఆమె వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఏజెడ్ఎం జాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, ఆమె మంగళవారం తెల్లవారుజామున ఢాకాలోని ఎవర్కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని తెలిపారు. 1945 ఆగస్టు 15 న బెంగాల్ జల్ పాయిగుడిలో ఖలీదా జియా జన్మించారు. బంగ్లాదేశ్ చరిత్రలో ఖలీదా జియా మొదటి మహిళా ప్రధాని. జియా మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.