అఫ్గానిస్థాన్ ఉగ్ర స్థావరంగా మారకూడదు: భారత్
18-09-2025
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పర్వతనేని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి త్రైమాసిక సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్లో శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని ప్రోత్సహించడానికి భారత్ ఆసక్తిగా ఉందని చెప్పారు. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సాంస్కృతిక బంధం ఉందన్నారు. అఫ్గానిస్తాన్ లోని భద్రతా పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త సమన్వయంతో కూడిన ప్రయత్నాలకు పిలుపునిస్తూ, ఐఎస్ఐఎల్, అల్ ఖైదా, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి గ్రూపులు ఆఫ్ఘన్ భూభాగంలో కార్యకలాపాలు సాగించకుండా ఐరాస సంస్థలు, వ్యక్తులతో పాటు అంతర్జాతీయ సమాజం ప్రయత్నాలు చేయాలని కోరారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఆఫ్ఘనిస్తాన్ ఖండించడాన్ని ఆయన స్వాగతించారు. చివరగా, ఆఫ్ఘనిస్తాన్కు కొత్త విధాన సాధనాలతో కూడిన తాజా విధానం అవసరమని చెప్పారు. ఆఫ్ఘన్ ప్రజలకు మానవతా సహాయం అందించడం, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను అమలు చేయడంలో భారత్ తక్షణ ప్రాధాన్యతలను పర్వతనేని హైలైట్ చేశారు.