calender_icon.png 14 January, 2026 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_66268975.webp
మావోలకు భారీ ఎదురుదెబ్బ

14-01-2026

సుక్మా: నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) అనుబంధ సంస్థలకు చెందిన ఇరవై తొమ్మిది మంది నక్సలైట్లు బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో అధికారుల ముందు లొంగిపోయారు. ఇది దర్భా డివిజన్‌లో మావోయిస్టులకు పెద్ద దెబ్బగా పరిగణించబడుతోంది. సుక్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్, పూనా మార్గెం పునరావాస కార్యక్రమం కింద ఈ లొంగుబాట్లు జరిగాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం, గోగుండలో ఇటీవల భద్రతా శిబిరాన్ని ఏర్పాటు చేయడం వల్లే మావోయిస్టుల కీలక స్థావరాన్ని నిర్మూలించడం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ బృందంలో గోగుందకు చెందిన, రూ. 2 లక్షల రివార్డు ఉన్న దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్ (డీఏకేఎంఎస్) అధిపతి పోడియం బుధ్రాతో పాటు, డీఏకేఎంఎస్, మిలీషియా, జనతన సర్కార్ విభాగాలకు చెందిన సభ్యులున్నారు. భద్రత కల్పించి, సమాజంలోకి తిరిగి చేర్చుకుంటామనే పునరావాస వాగ్దానాలకు ప్రభావితులై, వారు సీనియర్ పోలీసు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారు.

article_57489934.webp
ట్రంప్ సుంకాల బాంబ్

14-01-2026

వాషింగ్టన్, జనవరి ౧౩: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల బాంబ్ పేల్చారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న ఏ దేశమైనా ఇకపై అమెరికాతో వ్యాపారం చేయాలంటే 25 శాతం అదనపు సుంకం చెల్లించాలని హుకుం జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేశారు. ఇరాన్ ప్రభుత్వం అక్కడి పౌరులను అణచివేస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేల్చిచెప్పారు. చైనా తర్వాత ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇండియానే కాబట్టి మన దేశంలోపై సుంకాల ప్రభావం ఎక్కువ ఉండనుంది. అమెరికా ఇప్పటికే భారత్‌పై ౫౦శాతం సుంకాలు విధిస్తున్నది. ఇరాన్ సాకుతో విధించే సుంకంతో ఎగుమతి సుంకం కాస్తా ౭5 శాతానికి చేరుకోనున్నది. ట్రంప్ తాజా ప్రకటన భారత ఎగుమతిదారులకు పెద్ద శరాఘాతమే.