కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం
30-04-2025
న్యూఢిల్లీ: కులగణనపై కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Union Minister Ashwini Vaishnaw) మాట్లాడుతూ, “రాబోయే జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చాలని రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈరోజు నిర్ణయించింది” అని అన్నారు. జనాభా లెక్కింపు ప్రారంభించడానికి వైష్ణవ్ తేదీని ప్రకటించలేదు. ప్రతి దశాబ్దానికి ఒకసారి నిర్వహించే జనాభా సర్వే 2021లో జరగాల్సి ఉంది, కానీ మహమ్మారి, సాంకేతిక, రవాణా అడ్డంకుల కారణంగా ఆలస్యం అయిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ (Central Consumer Protection Authority) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.