26 March, 2026 | 10:26 PM

National

article_41230346.webp
డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 14 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!

మార్కాపురం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మార్కాపురం జిల్లాలో గురువారం ఘోర బస్సు ప్రమాదం(Markapuram Bus Accident) జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ను హరికృష్ణ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో 14 మంది సజీవదహనం అయ్యారు. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జరిపిన ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు ప్రమాదం జరిగినట్లు తేలింది. మలుపు తిరుగుతున్నప్పుడు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, ఆ క్రమంలో టిప్పర్‌ను ఢీకొట్టినట్లు బాధితులు తెలిపారు. బస్సులో మంటలు చెలరేగిన ప్రమాదంలో 10 మంది మరణించగా, మృతుల సంఖ్య 14కు పెరిగింది. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయాయి.

26-03-2026