28 July, 2026 | 3:18 PM

National -

article_46568744.webp
సింగరేణి నష్టాలకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్సే కారణం

న్యూఢిల్లీ: వాజ్ పేయి హయాంలో కేంద్రం సింగరేణికి చేయూత అందించిందని, కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao).. సింగరేణి వ్యతిరేక విధానాలు అవలంభించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister kishan reddy ) తెలిపారు. సింగరేణికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు భారీగా బకాయిలు పెట్టాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి నష్టాలకు ఈ రెండు పార్టీలే కారణమని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గుబ్లాక్ ల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ఆరోపించారు. ఆనాడు కేసీఆర్ అవలంభించిన వైఖరి వల్ల సింగరేణికి కొత్త బ్లాక్ లేకుండా పోయాయని విమర్శించారు.

27-07-2026