ఐప్యాక్పై ఈడీ సోదాలు మండిపడ్డ మమత
09-01-2026
కోల్కతా, జనవరి 8 : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణం.. తృణమూల్ కాంగ్రెస్కు రాజకీయ వ్యూహాలతో అండగా ఉన్న ఐప్యాక్ సంస్థపై ఈడీ సోదాల కలకలం. గురువారం ఒక్కసారిగా బెంగాల్ వేడెక్కింది. రాజకీయ కన్స ల్టెన్సీ గ్రూప్ ఐ-ప్యాక్ చీఫ్ ప్రతీక్జైన్ నివాసంలో, ఆ సంస్థ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడు లు చేసింది. ఐప్యాక్కు బెంగాల్ బొగ్గు గనుల కుంభకోణం కేసుకు, మనీలాండరింగ్కు సంబంధం ఉన్నట్లు తేలడంతోనే దాడులు నిర్వహించామని ఈడీ తెలిపింది.