నాపై డీఎంకే, ఏఐఏడీఎంకే కుట్రలు
చెన్నై, మార్చి 4: ‘నేను అధికారంలోకి రాకుండా, నా పార్టీపై డీఎంకే, ఏఐఏడీఎంకే కుట్రలు చేస్తున్నాయి’ అని టీవీకే అధినేత విజయ్ ఆరోపించారు. బుధవారం తంజావూరులో మద్దతుదారులను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధికారంలోకి వస్తే రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు, భూమిలేని కార్మికుల పిల్లల విద్యా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
05-03-2026