9 April, 2026 | 11:34 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

National -

article_80620236.webp
కేరళలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు: శశిథరూర్‌

తిరువనంతపురం: కేరళలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం జరిగిన ఎన్నికల్లో చురుకైన పోలింగ్(Kerala Election Polling Percentage) జరిగింది. మధ్యాహ్నం 1 గంటలోపే 50 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. ఈ కీలకమైన ఎన్నికలు, అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్ వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా, యుడిఎఫ్ తిరిగి అధికారంలోకి వస్తుందా, లేదా ద్విముఖ పోరులో బిజెపి అనూహ్య ఫలితాన్నిస్తుందా అనే విషయాలను తేల్చి చెప్పనున్నాయి. ఎన్నికల సంఘం (EC) గణాంకాల ప్రకారం, మధ్యాహ్నం 1 గంట సమయానికి, 2.71 కోట్ల మంది ఓటర్లలో 49.70 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

09-04-2026

article_43833437.webp
అమెరికా-ఇరాన్ యుద్ధం: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన, 10 డిమాండ్లు వెలుగులోకి

టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రపంచానికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందానికి ఇరాన్ అంగీకరించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌(Pakistan Prime Minister Shehbaz Sharif) అభ్యర్థన మేరకు అమెరికాతో చర్చలకు అంగీకరిస్తున్నామని ఇరాన్ స్పష్టం చేసింది. ట్రంప్ తమ 10 సూత్రాల ప్రతిపాదనకు అంగీకరించాలని ఇరాన్ కోరింది. పాక్ అభ్యర్థనతో ట్రంప్ చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకున్నామని ఇరాన్ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము ప్రతిదాడులు ఆపుతామని ఇరాన్ కండిషన్ పెట్టింది.

08-04-2026

article_54346676.webp
శబరిమల కేసులో కీలక మలుపు: మహిళల ప్రవేశంపై కేంద్రం స్టాండ్… సుప్రీంకోర్టులో హై టెన్షన్ విచారణ!

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: శబరిమల ఆలయం సహా పలు మతపరమైన ప్రదేశాలలో మహిళలపై వివక్ష, మత స్వేచ్ఛ పరిధికి సంబంధిం చిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం మంగళవారం నుంచి తుది విచారణను ప్రారంభించింది. కేంద్రం సుప్రీంకోర్టుకు తమ వివరణను సమర్పించింది. ప్రాచీనకాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలకు అనుగుణంగానే మహిళలకు శబరిమల ప్రవేశంపై నిషేధం విధించామని, దీనికి సంబంధించిన వివక్ష ఏమీ లేదని కేంద్రం తరఫున సుప్రీంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.

08-04-2026