కారు, ప్రైవేట్ బస్సు ఢీకొని ముగ్గురి మృతి
27-12-2025
అమరావతి, డిసెంబర్ 26: గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలోని అంకిరెడ్డిపాలెం సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలోని అంకిరెడ్డిపాలెం సమీపం లో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వెంకయ్య(70), సుశీల(64), మహే ష్ అనే యువకుడు, మరికొందరు కుటుంబసభ్యులు తిరుపతికి కారులో వెళ్లి తిరిగొ స్తున్నారు.