13 December, 2025 | 11:17 AM
13-12-2025
డిసెంబర్ 9, 11 తేదీలలో రెండు దశల్లో కేరళలోని స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి ట్రెండ్ల ప్రకారం... కేరళలోని మూడు ప్రధాన కూటములైన ఎల్డిఎఫ్, యుడిఎఫ్, ఎన్డిఎ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
ఢిల్లీలో వాయు నాణ్యత శనివారం ఉదయం తీవ్రంగా క్షీణించిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సమీర్ యాప్ పేర్కొంది. నగరంలో మొత్తం ఏక్యూఐ 387కి చేరడంతో పరిస్థితి తీవ్రమైన కేటగిరీకి దగ్గరగా చేరుకుంది.
ముంబై, డిసెంబర్ ౧౨: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ (౯౦) శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతున్నారు.
చర్ల/రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో శుక్రవారం బస్తర్ ఐజీ సుందర్ రాజ్, సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ముందు 10 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ధురంధర్’. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతున్నది.
న్యూయార్క్, డిసెంబర్ ౧౨: ‘ఒక హెచ్౧బీ ఉద్యోగి ౧౦౦ మంది అక్రమ వలసదారులతో సమానం’ అంటూ అమెరికా వ్యాఖ్యా త, పోలింగ్ కంపెనీ రాస్ముస్సేన్ సీఈవో మార్క్ మిచెల్ భారతీయ ఉద్యోగులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.
ఇస్లామాబాద్, డిసెంబర్ ౧౨: పాకిస్తాన్ విద్యావ్యవస్థ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదేశంలోనే మొట్టమొదటిసా రిగా లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సెన్సైస్ యాజమాన్యం వర్సిటీ పరిధి లో సంస్కృత భాషను ఒక అధికారిక కోర్సు ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ ౧౨: ఇండిగో విమాన సర్వీసుల రద్దు, ఆలస్యం, అంతరాయ సమస్యలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మరో కఠిన నిర్ణయం తీసుకున్నది. విమాన సర్వీసుల కార్యాచరణ పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినట్లు నిర్ధారించి నలుగురు ఫ్లుటై ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ల (ఎఫ్ఓఈ)ను డీజీసీఏ సస్పెండ్ చేసింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ ౧౨: త్రివేండ్రం ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూ ర్ వరుసగా కీలక పార్టీ సమావేశాలకు గైర్హాజరవుతుండటం పార్టీలో కలకలం రేపు తోంది.
అమరావతి, డిసెంబర్ 12: ఏపీలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 9 మంది మృత్యువు పాలయ్యారు. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: కేంద్ర క్యాబినెట్ 2027లో రెండు విడతల్లో జనగణన చేపట్టాలని నిర్ణయిం చింది. ప్రక్రియ చేపట్టేందు కు రూ.11,718 కోట్ల బడ్జెట్కూ ఆమోదం తెలిపింది. అత్యాధునిక డిజిటల్ సాంకేతికతను విని యోగించి జనగణన చేపడతామని స్పష్టం చేసింది. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గృహాలను జాబితా చేసి లెక్కిస్తామని, 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని తెలిపింది. దేశవాప్తం గా 30 లక్షల మంది సిబ్బంది ప్రక్రియలో భాగస్వాములవుతారని పేర్కొంది.
12-12-2025
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పాటిల్(Former Union Minister Shivraj Patil passes away) చకుర్కర్ శుక్రవారం మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో స్వల్ప అనారోగ్యంతో మరణించారు. శివరాజ్ పాటిల్ వయసు 90 సంవత్సరాలు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితం, ఆయన లోక్సభ స్పీకర్, అనేక మంత్రిత్వ శాఖలతో సహా కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులను నిర్వహించారు.