మావోలకు భారీ ఎదురుదెబ్బ
14-01-2026
సుక్మా: నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) అనుబంధ సంస్థలకు చెందిన ఇరవై తొమ్మిది మంది నక్సలైట్లు బుధవారం ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో అధికారుల ముందు లొంగిపోయారు. ఇది దర్భా డివిజన్లో మావోయిస్టులకు పెద్ద దెబ్బగా పరిగణించబడుతోంది. సుక్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్, పూనా మార్గెం పునరావాస కార్యక్రమం కింద ఈ లొంగుబాట్లు జరిగాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం, గోగుండలో ఇటీవల భద్రతా శిబిరాన్ని ఏర్పాటు చేయడం వల్లే మావోయిస్టుల కీలక స్థావరాన్ని నిర్మూలించడం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ బృందంలో గోగుందకు చెందిన, రూ. 2 లక్షల రివార్డు ఉన్న దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్ (డీఏకేఎంఎస్) అధిపతి పోడియం బుధ్రాతో పాటు, డీఏకేఎంఎస్, మిలీషియా, జనతన సర్కార్ విభాగాలకు చెందిన సభ్యులున్నారు. భద్రత కల్పించి, సమాజంలోకి తిరిగి చేర్చుకుంటామనే పునరావాస వాగ్దానాలకు ప్రభావితులై, వారు సీనియర్ పోలీసు, సీఆర్పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారు.