calender_icon.png 28 January, 2026 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_13658477.webp
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

28-01-2026

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం 2026-27 బడ్జెట్ సమావేశాల మొదటి రోజున పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. బిర్సాముండా, సర్దార్ పటేల్ కు రాష్ట్రపతి నివాళులర్పించారు. భారతరత్న భూపేన్ హజారికా శతజయంతి సందర్భంగా నివాళలర్పించారు. స్వేఛ్చ, సామాజిక న్యాయం అందరికీ అందాలని అంబేద్కర్ ఆకాంక్షించారని తెలిపారు. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించామని రాష్ట్రపతి స్పష్టం చేశారు. 100 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు అందించామని వెల్లడించారు. నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ చేశామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లమందికి వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సికిల్ సెల్ వంటి వ్యాధులపై పోరాటం సాగిస్తున్నామని రాష్ట్రపతి స్పష్టం చేశారు. కరోనా తర్వాత బీమాపై ప్రజల్లో అవగాహన పెరిగిందని వెల్లడించారు. వికసిత్ భారత్ లో రైతులు, మహిళలు, యువతది కీలకపాత్ర అన్నారు.

article_42613828.webp
అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

28-01-2026

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Maharashtra Deputy CM Ajit Pawar) మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. అజిత్ పవార్ దుర్మరణం కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అజిత్ పవార్ ప్రజానాయకుడని మోదీ కొనియాడారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. నిరుపేదల కోసం అజిత్ పవార్ ఎంతో కృషి చేశారని వెల్లడించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్(66) బుధవారం దుర్మరణం పాలయ్యారు. బారామతి విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ తో మోదీ, అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. విమాన ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు.

article_57206197.webp
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం

28-01-2026

బారామతి (మహారాష్ట్ర): మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత అజిత్ పవార్ బుధవారం ఉదయం విమాన ప్రమాదంలో మరణించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం, ముంబై నుండి బారామతికి వెళ్తున్న చార్టర్డ్ విమానం ఉదయం 8:45 గంటలకు కూలినప్పుడు, అందులో ఉన్న సిబ్బందితో సహా ఐదుగురు మరణించారు. ముంబై-బారామతి చార్టర్డ్ విమానం కూలిపోవడం బారామతిలోని రన్‌వే ప్రారంభంలో జరిగింది. పవార్‌తో పాటు ఒక పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్‌ఓ), ఒక సహాయకుడు, ఇద్దరు సిబ్బందితో సహా మొత్తం ఐదుగురు విమానంలో ఉన్నారు. అజిత్ పవార్ జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి బారామతికి ప్రయాణిస్తున్నారు. ఆయన మంగళవారం ముంబైలో ఉన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన మహారాష్ట్ర క్యాబినెట్ మౌలిక సదుపాయాల కమిటీ సమావేశానికి హాజరయ్యారు.

article_76375435.webp
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్

27-01-2026

న్యూఢిల్లీ: భారత్ భాగస్వామ్యం సరికొత్త శిఖరాలకు చేరుతోందని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. భారత్-ఈయూ మధ్య మంగళవారం నాడు చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రధాని మోదీ ఇండియన్ ఎనర్జీ వీక్ వేదికగా ప్రకటించారు. ఈ ఒప్పందాన్ని "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్"గా అభివర్ణించారు. ఈ ఒప్పందంతో భారత వాణిజ్యంలో సరికొత్త శకం మొదలైదని తెలిపారు. భారతదేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద స్వేచ్ఛావాణిజ్య ఒప్పందమని ప్రధాని పేర్కొన్నారు. టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ రంగాల్లో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం జరిగిందన్నారు. ప్రపంచ జీడీపీలో 25 శాతం, వాణిజ్యంలో మూడో వంతు వాటా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. కోట్లాది భారతీయులకు, యూరోపియన్లకు అపారమైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.