calender_icon.png 5 January, 2026 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_60561382.webp
అమెరికాలాగే పాక్‌పై భారత్ దాడి చేయాలి

05-01-2026

ముంబై, జనవరి 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుజులా అధ్యక్షుడు మదురోను బంధించినట్లే.. పాకిస్థాన్‌పై కూడా బారత్ దాడి చేసి, మసూద్ అజార్‌ను పట్టుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై దాడుల సూత్రధారులను భారత్ కూడా ట్రంప్ లాగే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముంబైలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యం మరో దేశంలోకి వెళ్లి అక్కడి అధ్యక్షుడినే తీసుకురాగలిగినప్పుడు భారత్ ఎందుకు వెనుకబడి ఉందని ప్రశ్నించారు. పాకిస్థాన్లో దాక్కున్న ఉగ్రవాదులను పట్టుకోవడానికి మోదీ భారత సైన్యాన్ని పంపాలని ఓవైసీ కోరారు.

article_61890332.webp
సర్ ప్రక్రియ తప్పుల తడక

05-01-2026

కోల్‌కతా, జనవరి ౪: ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో ఎన్నో లోపాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే ఆ లోపాలను సరిదిద్దాలి. లేదంటే బెంగాల్‌లో సర్ ప్రక్రియ నిలిపివేయాలి. రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ప్రక్రియను అత్యంత అశాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితా సవరణ కోసం వాట్సాప్ వంటి అనధికార మాధ్యమాలను వినియోగిస్తున్నారు. అది ఏ నిబంధన కింద వస్తుంది’ అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీస్తూ రాసిన లేఖ రాజకీయవర్గాల్లో సంచలనం సష్టిస్తోంది. బీఎల్వోలకు ఏరోజుకారోజు పొంతలేని సూచనలు వస్తుండటంతో వారు గందరగోళానికి గురవుతున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు.

article_75295539.webp
నైజీరియాలో ఘాతుకం

05-01-2026

అబుజా, జనవరి 4 : నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలో స్థానిక తిరుగుబాటుదారులు ఘోర ఘాతుకానికి పాల్పడ్డారు. శనివారం సాయంత్రం కసువాన్-దాజి అనే కుగ్రామంపై తుపాకులతో విరుచుకుపడి, రక్తపాతం సృష్టించారు. ఈ దాడుల్లో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు ధ్రువీకరించారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడమే కాకుండా అక్కడి ఇళ్లను, స్థానిక మార్కెట్‌ను నిందితులు తగులబెట్టారు. ఈ దాడుల వల్ల గ్రామంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్కరులు కొందరు మహిళలు, పిల్లలను కూడా అపహరించి అడవుల్లోకి తీసుకెళ్లారు.

article_31689113.webp
వెనిజులా పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన

04-01-2026

న్యూఢిల్లీ: వెనిజులాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(Ministry of External Affairs of India) పేర్కొంది. అమెరికా ప్రత్యేక దళాలు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్‌లను రాజధాని కారకాస్ లో బంధించిన ఒక రోజు తర్వాత భారత్ స్పందించింది. ''మేము మారుతున్న పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాము. వెనిజులా ప్రజల శ్రేయస్సు, భద్రతకు భారతదేశం తన మద్దతును పునరుద్ఘాటిస్తోంది. ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ, సంబంధిత పక్షాలందరూ చర్చల ద్వారా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మేము పిలుపునిస్తున్నాము. కారకాస్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ సమాజ సభ్యులతో సంప్రదింపులు జరుపుతోంది. సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తూనే ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Ministry of External Affairs spokesperson Randhir Jaiswal) వెల్లడించారు.

article_14542999.webp
18 నెలల్లోనే బ్రహ్మాండమైన ప్రగతి సాధించాం

04-01-2026

హైదరాబాద్: విజయనగరం జిల్లాలోని భోగాపురంలో(Bhogapuram International Airport) నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా దిగడంతో ఒక కీలక మైలురాయిని సాధించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఏటీసీ ఛైర్మన్ మరియు ఇతర అధికారులతో కూడిన ఈ విమానం ఢిల్లీ నుండి వచ్చింది. ప్రాజెక్టు డెవలపర్ అయిన జీఎంఆర్ గ్రూప్ ప్రకారం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడుతున్న ఈ విమానాశ్రయం 96 శాతం పూర్తయింది. ఈ విమానాశ్రయం జూన్ 26న ప్రారంభం కానుంది.

article_29542799.webp
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీకి ప్రియాంక సారథ్యం

04-01-2026

గౌహతి: రాబోయే అసోం అసెంబ్లీ ఎన్నికలకు(Assam Assembly Polls) అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీకి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను(Priyanka Gandhi) అధ్యక్షురాలిగా నియమించినట్లు పార్టీ జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం స్క్రీనింగ్ కమిటీల ఏర్పాటును ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (All India Congress Committee) ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ శనివారం రాత్రి ప్రకటించారు. రాబోయే రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను ఖరారు చేయడానికి అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి కోసం నలుగురు సభ్యుల కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

article_55349546.webp
రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది బైకులు దగ్ధం

04-01-2026

త్రిస్సూర్: త్రిస్సూర్ రైల్వే స్టేషన్‌లోని(Thrissur railway station) ప్లాట్‌ఫామ్ 2 ప్రవేశ ద్వారం వద్ద ఆదివారం తెల్లవారుజామున బైక్ పార్కింగ్ ప్రాంతంలో చెలరేగిన భారీ అగ్నిప్రమాదంలో 500కు పైగా ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. పార్కింగ్ మేనేజ్‌మెంట్‌లోని ఒక మహిళా సిబ్బంది మొదట గమనించి, ఇతరులకు సమాచారం అందించారు. త్రిస్సూర్ స్టేషన్ నుండి అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికి ద్విచక్ర వాహనాలు దగ్గరగా నిండిన వరుసలలో పార్క్ చేయడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.