calender_icon.png 13 January, 2026 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_64153664.webp
భీమవరంలో ట్రాఫిక్ జామ్

13-01-2026

అమరావతి, జనవరి 12: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందడి పెద్ద ఎత్తున కనిపిస్తోంది. పండగకి హైదరాబాద్ తదితర నగరాల్లో ఉన్నవాళ్లంతా సొంతూళ్లకు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వచ్చే వాహనాలతో నగర, పలు పట్ణణ రహదారులపై తీవ్ర రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రహదారులు అన్నీ సోమవారం ఉదయం నుంచి వాహనాల రద్దీ నెలకొంది. కొన్నచోట్ల పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపో యింది. ముఖ్యంగా భీమవరం చినవంతెన నుంచి రెండు కిలోమీటర్లు పొడవునా ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. ప్రకాశం చౌక్, అంబేద్కర్ కూడళ్లలో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది.

article_15926106.webp
ఎవరు నరుకుతారో చూస్తా

13-01-2026

చెన్నై, జనవరి ౧౨: ‘రాజ్ థాక్రే ఎవరు నన్ను బెదిరించడానికి? నేను ఒక రైతు బిడ్డను. ఆయన కేవలం నన్ను తిట్టడానికే సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేను కచ్చితంగా ముంబైకి వస్తా. నా కాళ్లు ఎవరు.. ఎలా నరుకుతారో చూస్తా.. అలాంటి బెదిరింపులకు భయపడితే నేను నా ఊరిలోనే ఉండిపోయేవాడిని. గొప్పనేతలను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన వాడిని నేను. ఎవరో బెదిరిస్తే బెదురుతానా’ అంటూ తమిళనాడు బీజేపీ నేత అన్నామలై తీవ్రంగా స్పందించారు. తాను ముంబైకి వస్తే అడ్డుకుంటానని, అవసరమైతే కాళ్లు నరుకుతానని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్)అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై సోమవారం అన్నామలై స్పందించారు.

article_31540563.webp
పీఎస్‌ఎల్వీ- సీ62 ప్రయోగానికి అంతరాయం

13-01-2026

శ్రీహరికోట, జనవరి ౧౨: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సోమవారం ఉదయం 10.18 గంటలకు శ్రీహరికోట కేంద్రంగా ప్రతిష్ఠాత్మకంగా పీఎస్‌ఎల్వీ- సీ62 రాకెట్ ప్రయోగానికి అంతరాయం ఏర్పడింది. దేశ రక్షణ రంగానికి విశేష సేవలందించే ‘అన్వేష’ అనే ఈవోఎస్-ఎన్ 1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రయోగించిన రాకెట్‌లో సమస్య తలెత్తింది. ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో పూర్తి కావాల్సి ఉండగా, మూడో దశ తర్వాత అడ్డంకులు ఎదురయ్యాయి. మూడో దశ చివర్లో నిర్దేశించిన మార్గంలో రాకెట్ వెళ్లకపోవడంతోనే ఈ అంతరాయం ఏర్పడింది. ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ వీ నారాయణన్ స్పష్టత ఇస్తూ.. మూడో దశ ఇంజిన్ ఛాంబర్‌లో ప్రెజర్ అకస్మాత్తుగా పడిపోవడంతో సమస్య తలెత్తిందని తెలిపారు.

article_27502713.webp
‘బంగ్లా’లో హిందువు హత్య

13-01-2026

ఢాకా, జనవరి ౧౨: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఓ హిందువు దారుణ హత్యకు గురయ్యాడు. దగన్‌భుయాన్ ప్రాంతానికి సమీర్ దాస్ (౨8) అనే హిందువు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి అతడి ఇంటివద్దకు వెళ్లిన దుండగులు కిరాతకంగా కొట్టి, కత్తితో పొడిచి చంపారు. హత్య అనంతరం ఆటోను సైతం అపహరించి పరారయ్యారు. ఈ హత్యను ‘బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఖండించింది. మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడడం సరికాదని, నిందితులకు శిక్షపడేలా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు సమీర్ దాస్ హత్యపై చిట్టగాంగ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

article_30263853.webp
ఇరాన్ ప్రభుత్వం హద్దు మీరుతోంది !

13-01-2026

వాషింగ్టన్/టెహ్రాన్: ‘ఇరాన్ ప్రభుత్వం హద్దు మీరుతోంది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఇరానీయన్లపై హింసను సహించం. ప్రజా నిరసనల అణచివేతను ఉపేక్షిం’ అంటూ తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌లో రెండు వారాల నుంచి జరుగుతున్న ఘర్షణల్లో 500 మందికి పైగా మృతిచెందడం, ౧౦ వేల మంది పౌరులను అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించేందుకు అవసరమైతే తానే స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తోనైనా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్‌ను వినియోగించైనా అక్కడి ప్రజలకు కమ్యూనికేషన్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.

article_17895268.webp
పతంగ్ ఎగరేసిన ప్రధాని మోడీ

12-01-2026

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) సోమవారం అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్-2026ను ప్రారంభించారు. తరువాత జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో(German Chancellor Friedrich Merz) కలిసి గాలిపటాలు ఎగురవేయడాన్ని ఆస్వాదించారు. సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన తర్వాత, ప్రధాని మోదీ, ఛాన్సలర్ మెర్జ్ సబర్మతి రివర్‌ఫ్రంట్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పతంగుల పండుగను నిర్వహించింది. కార్యక్రమ వేదిక వద్ద, ప్రధాని మోదీ, మెర్జ్ మహిళా కళాకారులతో ముచ్చటించి, గాలిపటాలు తయారుచేసే ప్రక్రియను తెలుసుకున్నారు. ప్రారంభోత్సవం అనంతరం, ఇద్దరు నాయకులు ఒక తెరిచిన వాహనంలో మైదానంలో పర్యటించారు. కైట్ ఫెస్టివల్ ప్రాంగణంలో సాంస్కృతిక ప్రదర్శనలను ప్రధాని తిలకించారు. సందర్శకులకు ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్స్ లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ అభివాదం తెలిపారు.

article_65673577.webp
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ62

12-01-2026

శ్రీహరికోట: ఇస్రో వాహక నౌక పీఎస్ఎల్‌వీ, దేశీయ, విదేశీ వినియోగదారుల కోసం ఒక భూ పరిశీలన ఉపగ్రహంతో పాటు మరో 14 వాణిజ్య పేలోడ్‌లను మోసుకుని సోమవారం శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది తొలి ప్రయోగంగా చేపట్టిన ఈ మిషన్, ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ కు లభించిన కాంట్రాక్టులో భాగం. 44.4 మీటర్ల పొడవున్న నాలుగు దశల పీఎస్ఎల్‌వీ-సీ62 రాకెట్ సోమవారం ఉదయం 10.18 గంటలకు ముందుగా నిర్ణయించిన సమయానికి మొదటి ప్రయోగ వేదిక నుండి నింగిలోకి దూసుకెళ్లింది. ఈఓఎస్-ఎన్-1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్‌వీ సీ62(ISRO PSLV-C62) రాకెట్ కక్ష్యలోకి మోసుకెళ్తుంది.