హైస్పీడ్ హబ్గా హైదరాబాద్
03-02-2026
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: హైస్పీడ్ రైల్వే హబ్గా హైదరాబాద్ మారుతుందని, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.5,454 కోట్ల నిధులు కేటాయించామని, మూడు హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులు ఇచ్చామని రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విష యం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ రూ.53,47,315 కోట్లుగా, రైల్వే బడ్జెట్ రూ.2.77 లక్షల కోట్లుగా కేటాయించారు. ఈ బడ్జెట్లో తెలంగాణ రా ష్ట్రానికి కేటాయించిన రైల్వే ప్రాజెక్టులతోపాటు నిధుల కేటాయింపులను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం న్యూఢిల్లీలో విలేకర్లతో వివరించారు.