జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. భారీగా పన్ను వసూళ్లు జరగడంతో మార్చిలో తొలిసారిగా రూ.2,00,0 64 కోట్లకి చేరుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం మార్చిలో స్థూల జీఎస్టీ వసూ ళ్లు రూ.2,00,064 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో వసూలైన రూ. 1,83,845 కోట్లతో పోలిస్తే ఇది 8.8 శాతం అధికం. దేశీయంగా స్థిరమైన ఆదాయంతో పాటు దిగుమతులపై పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రధాన కార ణంగా నిలిచింది.
02-04-2026