1 April, 2026 | 5:18 PM

National

article_59911630.webp
ప్రధాని మోదీ, పినరయి విజయన్ కు తేడా లేదు

తిరువనంతపురం: కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ముట్టతార (Muttathara) రోడ్ షోలో పాల్గొన్నాను. ప్రధాని మోదీ, పినరయి విజయ్ కు తేడా ఏమీ లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేరళం ప్రజలు తెలివైన వారు, విద్యావంతులని కొనియాడారు. మతతత్వ శక్తులు కేరళంలోకి ప్రవేశించకుండా నియంత్రించాలని ఆ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మతతత్వ శక్తులు రాకుండా ఇక్కడి ప్రజలు లక్ష్మణ రేఖ గీశారని సీఎం తెలిపారు. కేరళంకు భవిష్యత్తు లేకుమా చేయాలని మోదీ, పినరయి చూస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులు తెచ్చి కేరళంను అభివృద్ధి చేసేవారికే ఓటు వేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

01-04-2026

article_83536723.webp
కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ పోరాటంలో 369 మందిని కాల్చి చంపింది

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. రేపు రాజ్యసభ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. బిల్లుపై చర్చ సందర్భంగా సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ విడిపోయిందని తెలిపారు. తెలంగాణ పోరాటంలో 1969లో కాంగ్రెస్ పార్టీ 369 మందిని తుపాకులతో కాచ్చి చంపిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. జై తెలంగాణ అన్నందుకు విద్యార్థులను కాల్చిచంపారని ధ్వజమెత్తారు. చివరి దశలో కూడా 1200 మంది ఆత్మ బలిదానంతోనే తెలంగాణ వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

01-04-2026

article_16031253.webp
లోక్‎సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు.. కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని(Amaravati Bill) అధికారికంగా ప్రకటించడంతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగర ప్రాజెక్టుకు చట్టబద్ధమైన అండను కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం(Central Government) బుధవారం నాడు లోక్‌సభలో 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026'ను ప్రవేశపెట్టింది. అమరావతికి చట్టబద్ధత బిల్లును హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్(Nityanand Rai) బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుపై గంట సేపు చర్చించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా(Lok Sabha Speaker Om Birla) అనుమతించారు. అవసరమైతే మరో గంట చర్చిద్దామని స్పీకర్ సూచించారు. అమరావతికి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపింది.

01-04-2026