అంతర్జాతీయంగా ఇంద్రజిత్ నేర సామ్రాజ్యం
01-01-2026
న్యూఢిల్లీ, డిసెంబర్ 31 : మనీలాండరింగ్ కేసులో పరారీలో ఉన్న అంతర్జాతీయ నేరగాడు రావు ఇంద్రజిత్ యాదవ్ ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు నిర్వహించింది. ఢిల్లీతో పాటు హరియాణాలోని గురుగ్రామ్, రోహతక్ ప్రాంతాల్లో ఉన్న పది ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. ఐదు లగ్జరీ కార్లు, బ్యాంక్ లాకర్లు, సుమారు 17 లక్షల నగదు, డాక్యుమెంట్లు, డిజిటల్ డివైస్లు, డిజిటల్ డేటాను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.