calender_icon.png 3 January, 2026 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_12565134.webp
గాలి ఇంటిముందు గన్ ఫైర్

03-01-2026

బెంగళూరు, జనవరి ౨: కర్ణాటకలోని బళ్లారి నగరంలో రాజకీయ కక్షలు శుక్రవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గంగావతి ఎమ్మెల్యే, బీజేపీ నేత గాలి జనార్దన్‌రెడ్డి నివాసం వద్ద తెల్లవారుజామున రెండువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఉద్రిక్తత కాల్పుల వరకు దారితీయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ హింసాత్మక ఘటనలో రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త బుల్లెట్ గాయంతో అక్కడికక్కడే మరణించాడు. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి, బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వర్గాల మధ్య చోటుచేసుకున్న ఈ వివాదం రక్తపాతానికి దారితీసింది. మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో బ్యానర్లు కట్టే విషయంలోఈ వివాదం మొదలై హింసాత్మకంగా ముగిసింది.

article_38903760.webp
చలామనీ.. వర్రీ!

03-01-2026

న్యూఢిల్లీ, జనవరి 2: సామాన్యుడి జేబులో నిత్యం సందడి చేసే రూ.పది నోటు ఇప్పుడు మార్కెట్లో కనుమరుగవుతూ చిల్లర కష్టాలను పెంచుతున్నది. నిత్యావసరాలు, కూరగాయల మార్కెట్లు, టీ కొట్లు, బస్సు ప్రయాణాల్లో అత్యవసరమైన ఈ చిన్న నోటు షార్టేజీ ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త నోట్ల ముద్రణ ఆగిపోయిందనే ప్రచారం నేపథ్యంలో వినియోగదారులు పాతనోట్లనే భయం భయంగా వినియోగిస్తూ వస్తున్నారు. రూ.పది నోటుతోపాటు కొన్నిచోట్ల రూ.౫౦ నోట్ల కొరత కూడా కనిపిస్తోంది. చిన్న నోట్ల జీవితకాలం తక్కువగా ఉండటంతో వాటి స్థానంలో నాణేలను ప్రోత్సహించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.