30 June, 2026 | 2:05 PM

National -

article_73225885.webp
రాజ్యసభ సభ్యుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం రాజ్యసభ సభ్యుడిగా(Rajya Sabha member) ప్రమాణ స్వీకారం(Mallikarjun Kharge takes oath) చేశారు. ఆయన ఇటీవల తిరిగి ఎన్నికయ్యారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ తన ఛాంబర్‌లో ఖర్గేతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార సమయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఖర్గే ఎగువ సభలో కర్ణాటక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2021 నుండి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు.

29-06-2026