డిజిటల్ అరెస్ట్తో రూ.15 కోట్ల మోసం
12-01-2026
న్యూఢిల్లీ, జనవరి 11: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ ఎన్నారై వృద్ధదంపతుల నుంచి దాదాపు రూ.15 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచేశారు. అంతేగాక కేటుగాళ్లు ఢిల్లీలో జనవరి 10న ఆ దంపతులను ఆర్బీఐ రీఫండ్ పేరుతో ఒక పోలీస్ స్టేషన్కు పంపడంతో ఈ మోసం బయటపడింది. అక్కడ అధికారులు వారికి రూ.14.85 కోట్లు మోసం జరిగిందని నిర్ధారించారు. బాధితులు గతంలో ఐక్యరాజ్యసమితిలో పనిచేశారు. తమ జీవితకాల పొదుపును కోల్పోయామని ఆ దంపతులు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు సమాచారం. డాక్టర్ ఓం తనేజా, అతని భార్య డాక్టర్ ఇందిరా(77) తనేజా యునైటెడ్ స్టేట్స్లో ఐక్యరాజ్యసమితిలో దాదాపు 48 సంవత్సరాలు పనిచేశారు. పదవీ విరమణ తర్వాత 2015లో భారతదేశానికి వారు తిరిగొచ్చి, ఢిల్లీలో ఉంటున్నారు. అప్పటి నుంచి, వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. డిసెంబర్ 24, 2025న వృద్ధదంపతులకు సైబర్ నేరగాళ్ల నుంచి కాల్ వచ్చింది.