19 April, 2026 | 5:10 AM
Breaking News
భారత నారీశక్తి ఎదగకుండా విపక్షాలు అడ్డుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించా రు. భారత మహిళల కలలను ధ్వంసం చేశారని విమర్శించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపో యిన నేపథ్యంలో.. దేశ ప్రజలను ఉద్దేశించి శనివారం ప్రధాని ప్రసంగించారు.
19-04-2026
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామి క విజయమని, ఎన్డీయే కూటమికి బ్లాక్ డే అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అభివర్ణించారు. విపక్షాల ఐక్యతకు ఇదొక నిదర్శనమని హర్షం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు అందించింది. కరువు భత్యాన్ని (డీఏ) 2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. కొత్త డీఏ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశం
మున్నూరు కాపులను రాజకీయంగా, సామాజికంగా అణచివేసేందుకు పాలక ప్రభుత్వ వర్గాల స్థాయిలోనే కుట్రలు ప్రారంభమయ్యాయని, వీటిని తక్షణమే తిప్పి కొట్టకపోతే కుల సమాజ ఉనికికే ప్రమాదం అని అన్ని పార్టీల మున్నూరు కాపు నేతలు స్పష్టం చేశారు.
వాషింగ్టన్/టెహ్రాన్, ఏప్రిల్ ౧౮: హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచుతామని ప్రకటించిన మరుసటి రోజే, ఇరాన్ మళ్లీ జలసంధిని మూసివేసింది. ఇరాన్లోని ఓడరేవుల వద్ద అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగించడంతోనే మూసివేత నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౮: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై అధికార, విపపక్షాల మధ్య శనివారం దేశవ్యాప్తంగా వాగ్యుద్ధం జరిగింది. మహిళా సాధికారతకు బాటలు వేసే చారిత్రక బిల్లును అడ్డుకున్నారంటూ అధికార పక్షం విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
మహిళా బిల్లు ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టి దక్షిణాది రాష్ట్రాలను బలహీనపరచాలని కేంద్రం చూస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు.
మహిళలను మోసం చేయడమనేది కాంగ్రెస్కు మొదటి నుంచి అలవాటేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౮: లోక్సభ, రాజ్యసభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. దీంతో జనవరిలో మొదలైన బడ్జెట్ సమావేశాలు ముగిసిపోయినట్లయింది. సెషన్కు కొనసాగింపుగా ఈ నెల ౧౬ నుంచి ౧౮ వరకు మూడురోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక సమావేశాలుకూ తెరపడినట్లయింది.
చెన్నై, ఏప్రిల్ ౧౮: మహిళా సాధికారతకు బద్ధ వ్యతిరేకి డీఎంకే అంటూ ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. తమిళనాడులోని కొయంబత్తూరులో శనివారం బీజేపీ నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన నిప్పులు చెరిగారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): మహిళా బిల్లు, డీలిమిటేషన్పై ఇండియా కూటమిని ఒక్కటి చేసి, పార్లమెంటులో ఏ విధంగా పోరాడారో బీసీ డిమాండ్లపై కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి,
చెన్నై, ఏప్రిల్ ౧౮: కావాలంటే నటులను ఎంతగానైనా అభిమానించవచ్చు గానీ, దేశా న్ని నటుల చేతిలో పెట్టలేమని సీనియర్ సినీ నటుడు ప్రకాశ్రాజ్ వ్యాఖ్యానించారు.