calender_icon.png 3 February, 2026 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_29513617.webp
హైకోర్టు తీర్పును అభినందిస్తున్నాం

03-02-2026

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు నమోదు చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సోమవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు సబబేనని అభినందించింది. రాజకీయ విమర్శలపై క్రిమినల్ కేసులు పెట్టొద్దని ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. అయితే అప్పీల్‌ను సుప్రీం కోర్టు సోమవారం తిరస్కరించింది. వివరాల్లోకి వెళితే.. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్త శశిధర్‌గౌడ్(నల్ల బాలు) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు

article_14232188.webp
హైస్పీడ్ హబ్‌గా హైదరాబాద్

03-02-2026

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: హైస్పీడ్ రైల్వే హబ్‌గా హైదరాబాద్ మారుతుందని, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.5,454 కోట్ల నిధులు కేటాయించామని, మూడు హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులు ఇచ్చామని రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విష యం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ రూ.53,47,315 కోట్లుగా, రైల్వే బడ్జెట్ రూ.2.77 లక్షల కోట్లుగా కేటాయించారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ రా ష్ట్రానికి కేటాయించిన రైల్వే ప్రాజెక్టులతోపాటు నిధుల కేటాయింపులను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం న్యూఢిల్లీలో విలేకర్లతో వివరించారు.

article_80350127.webp
ట్రంప్ కుటుంబానికి కనక వర్షం

03-02-2026

వాషింగ్టన్, ఫిబ్రవరి 2: క్రిప్టో కరెన్సీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం ఎంతగానో ప్రోత్సహిస్తున్నది. క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో ఆ కుటుంబం భారీగా లాభాలను అర్జిస్తున్నది. గతేడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌తో ట్రంప్ ఫ్యామిలీకి వాటాలున్న వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ ఒప్పందం చేసుకుంది. తాజాగా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)తోనూ ఒప్పందం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా మరో నాలుగు రోజుల్లో ప్రమాణస్వీకారం చేస్తారనగా యూఏఈతో ఒప్పందం జరిగింది.

article_10968823.webp
లోక్‌సభలో గందరగోళం.. రాహుల్ గాంధీ మైక్ కట్

02-02-2026

న్యూఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లడఖ్, డోక్లాం ఘటనపై ప్రస్తావించారు. దేశభక్తి ఎవరికి ఉందో ప్రజలకు తెలుసని రాహుల్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై లోక్ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రాజ్ నాథ్ సింగ్ ఖండిస్తూ ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై స్పీకర్ ఓం బిర్లా మాట్లాడాలని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంలోని అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. రాహుల్ చెబుతున్న పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని బీజేపీ నేతలు తెలిపారు.

article_22784183.webp
వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటికి నిప్పు

02-02-2026

అమరావతి, ఫిబ్రవరి 1: ఏపీ మంత్రి నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్య ల చేశారంటూ టీడీపీ శ్రేణులు ఆదివారం విజయ వాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి పై దాడి చేశారు. కొంతమంది ఇంటికి నిప్పు పెట్టారు. అయితే ఈ సమయంలో జోగి రమేశ్ ఇంట్లో లేరు. తండ్రి జోగి మోహనరా వు, భార్య శకుంతల దేవి, చిన్న కొడుకు రో హిత్ ఇంట్లో ఉన్నారు. దీంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడ భారీగా చేరుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో ఇంటి మొదట అంత స్తులో మంటలు ఎగిసిపడ్డాయి.