calender_icon.png 15 January, 2026 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_47687844.webp
ప్రైవేటు వ్యక్తులు జల్లికట్టు నిర్వహించొద్దు!

15-01-2026

చెన్నై, జనవరి 14: తమిళులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించుకునే జల్లికట్టు నిర్వహణపై మద్రాస్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. ‘జల్లికట్టు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కాదు.. తమిళుల సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీక. ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీలను ప్రైవేటు సంస్థలు నిర్వహించకూడదు. ప్రభుత్వం మాత్రమే నిర్వహించాల’ని తేల్చిచెప్పింది. పోటీలను ప్రైవేట్ వ్యక్తులు లేదా గ్రామ కమిటీలు నిర్వహించొద్దనే ఆదేశాలివ్వాలని పి.మురుగన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈమేరకు తీర్పు వెలువరించింది. మరోవైపు పోటీలకు అక్కడి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈనెల ౧౭న మధురై జిల్లాలోని ఏరుతళువుతలణలో సీఎం ఎంకే స్టాలిన్ పోటీలను ప్రారంభించనున్నారు.

article_59271502.webp
థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం

15-01-2026

బ్యాంకాక్, జనవరి 14: థాయ్‌లాండ్‌లో బుధవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ప్యాసింజర్ రైలుపై క్రెయిన్ పడి ౩౨ మంది తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందారు. ౭౦ మంది ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం ధాటికి రైలు పెట్టెలు నుజ్జునుజ్జు అవ్వడమే కాకుండా, ఒక భోగిలో మంటలు చెలరేగడంతో మిగిలిన ప్రయాణికులు కూడా భీతిల్లారు. ఈశాన్య థాయ్‌లాండ్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై థాయ్‌లాండ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. చైనా ఆర్థిక సహకారంతో బ్యాంకాక్ నుంచి లావోస్ వరకు నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు పనుల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని ఆ దేశ ప్రధాని అనుతిన్ చార్న్విరకుల్ ప్రకటించారు.

article_75864216.webp
29 మంది మావోయిస్టుల లొంగుబాటు

15-01-2026

చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో బుధవారం ౨౯ మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టులకు కంచుకోటగా భావించే దర్భా డివిజన్ పరిధిలోని కేరళపాల్ ఏరియా కమిటీకి చెందిన ౨౯ మంది మావోయిస్టులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునా రావాస పథకాలకు ఆకర్షితులై, మావోయిస్టు పార్టీ విధి విధానాలు నచ్చక వారంతా పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో గొ గుండా ప్రాంతానికి చెందిన మావోయి స్టు పార్టీ డీఏకేఎంఎస్ చీఫ్ పోడియం బుధ్రా కూడా ఉన్నాడు. బుధ్రాపై రూ. 2 లక్షల రివార్డు ఉంది. గడిచిన ఎనిమి ది రోజుల్లోనే సుక్మా, దంతెవాడ జిల్లా ల్లో కలిపి వంద మందికి పైగా మావోయిస్టులు లొంగిపోవడం గమనార్హం.

article_66268975.webp
మావోలకు భారీ ఎదురుదెబ్బ

14-01-2026

సుక్మా: నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) అనుబంధ సంస్థలకు చెందిన ఇరవై తొమ్మిది మంది నక్సలైట్లు బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో అధికారుల ముందు లొంగిపోయారు. ఇది దర్భా డివిజన్‌లో మావోయిస్టులకు పెద్ద దెబ్బగా పరిగణించబడుతోంది. సుక్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్, పూనా మార్గెం పునరావాస కార్యక్రమం కింద ఈ లొంగుబాట్లు జరిగాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం, గోగుండలో ఇటీవల భద్రతా శిబిరాన్ని ఏర్పాటు చేయడం వల్లే మావోయిస్టుల కీలక స్థావరాన్ని నిర్మూలించడం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ బృందంలో గోగుందకు చెందిన, రూ. 2 లక్షల రివార్డు ఉన్న దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్ (డీఏకేఎంఎస్) అధిపతి పోడియం బుధ్రాతో పాటు, డీఏకేఎంఎస్, మిలీషియా, జనతన సర్కార్ విభాగాలకు చెందిన సభ్యులున్నారు. భద్రత కల్పించి, సమాజంలోకి తిరిగి చేర్చుకుంటామనే పునరావాస వాగ్దానాలకు ప్రభావితులై, వారు సీనియర్ పోలీసు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారు.