ప్రధాని మోదీ, పినరయి విజయన్ కు తేడా లేదు
తిరువనంతపురం: కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ముట్టతార (Muttathara) రోడ్ షోలో పాల్గొన్నాను. ప్రధాని మోదీ, పినరయి విజయ్ కు తేడా ఏమీ లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేరళం ప్రజలు తెలివైన వారు, విద్యావంతులని కొనియాడారు. మతతత్వ శక్తులు కేరళంలోకి ప్రవేశించకుండా నియంత్రించాలని ఆ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మతతత్వ శక్తులు రాకుండా ఇక్కడి ప్రజలు లక్ష్మణ రేఖ గీశారని సీఎం తెలిపారు. కేరళంకు భవిష్యత్తు లేకుమా చేయాలని మోదీ, పినరయి చూస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులు తెచ్చి కేరళంను అభివృద్ధి చేసేవారికే ఓటు వేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
01-04-2026