జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి(Jyotiba Phule Jayanti) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. సమానత్వం, న్యాయం, విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని కొనియాడారు. మహిళలు, అణగారినవర్గాల హక్కుల పరిరక్షణలో పూలే మార్గదర్శి అన్నారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అన్నారు. ఢిల్లీలో జ్యోతిరావుఫులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలేకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం నివాళులర్పించారు.
11-04-2026