జల వివాదాలపై కమిటీ సమావేశం
30-01-2026
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలపై కమిటీ భేటీ అయింది. కేంద్ర జలసంఘం కార్యాలయంలో కమిటీ సమావేశమైంది. నీటి పంపకాలు, సమస్యలు, వివాదాలపై తొలిసారి అధికారుల కమిటీ భేటీ అయింది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ అధ్యక్షతన జలసంఘం కార్యాలయంలో సమావేశం కొనసాగుతోంది. కేంద్ర జలశక్తి శాఖ నీటి వివాదాలపై ఈ నెల 2న కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సీడబ్ల్యూసీ అధికారులు, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, ఎన్ డబ్ల్యూ డీఏ ఛైర్మన్లు, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజినీర్, తెలుగు రాష్ట్రాల అధికారులున్నారు.