calender_icon.png 8 December, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_31246324.webp
గోవా అగ్నిప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

07-12-2025

గోవా: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా రిలీఫ్‌ను ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్(Chief Minister Pramod Sawant) ప్రకటించారు. అలాగే ఈ ఘోర అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ఒక ప్యానెల్ ఏర్పాటు చేయడంతో పాటు వారంలోపు నివేదిక అందుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ ఘోర అగ్నిప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో నైట్‌క్లబ్ మేనేజర్, మరో ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేశారు. బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్ యజమానులు గౌరవ్ లూత్రా, సౌరభ్ లూత్రాపై కూడా పోలీసులు కేసు నమోదు చేయగా, అర్పోరా-నగోవా సర్పంచ్ రోషన్ రెడ్కర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

article_84764646.webp
‘డీప్ ఫేక్’ నియంత్రణకు ప్రైవేటు బిల్లు

07-12-2025

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ప్రస్తుతం క్రీడాకారులు, సినీస్టార్స్ వంటి సెలబ్రెటీలు ఎదు ర్కొం టున్న అతిపెద్ద సమస్య డీప్‌ఫేక్. కృత్రిమమేధ (ఏఐ) రంగం నానాటికీ తన పరి ధుల్ని విస్తృపరచుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. డీప్ ఫేక్ నియంత్రణకు శనివారం లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టింది. శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సోషల్ మీడియాలో డీప్ ఫేక్ కట్టడికి అవసరమైన న్యాయపరమైన నిబంధనలు రూపొందేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుందని ఆయన తెలిపారు. ఎవరికి సంబంధించిన వీడియో రూపకల్పన చేయాలనుకున్నారో, కంటెంట్ క్రియే టర్ మున్ముందు ఆ వ్యక్తి నుంచి అనుమతి తీసుకావాల్సి ఉంటుందని తెలిపారు. దురుద్దేశంతో కంటెంట్ సృష్టించినా, ఫార్వర్డ్ చేసి నా శిక్షలు పడాలన్నారు.