సుహృత్ వాతావరణంలో తేనీటి విందు
20-12-2025
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పార్లమెంట్ సభ్యులకు తేనీటి విందునిచ్చారు. విందుకు ప్రధాని నరేంద్రమోదీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాత్ సింగ్, రామ్మోహన్నాయుడు, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్రయాదవ్, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సులే, సీపీఐ అగ్రనేత డీ రాజాతోపాటు పలువురు అఖిలపక్ష ఎంపీలు హాజరయ్యారు. విందు సుహృత్ వాతావరణంలో సాగింది. సభ్యులు మధ్య నవ్వులు విరబూయించింది. ప్రధాని మోదీ, ఎంపీ ప్రియాంకా గాంధీ ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రధాని మోదీ వాయనాడ్లో లభించే ఆయుర్వేద మూలిక గురించి ప్రియాంకకు తెలియజేశారు.