calender_icon.png 22 June, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_87837079.webp
ముగ్గురు ఎయిరిండియా అధికారులపై వేటు

21-06-2025

న్యూఢిల్లీ: విమాన సిబ్బంది షెడ్యూల్‌కు సంబంధించి పదేపదే ఉల్లంఘనలు జరిగిన నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) ఆదేశించింది. నిర్వహణ విధుల్లో అలసత్వం వహించిన ముగ్గురిపై డీజీసీఏ వేటు వేసింది. ఎయిరిండియా వెల్లడించిన విషయాల ఆధారంగా ముగ్గురిపై చర్యలు తీసుకోనుంది. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలున్నాసిబ్బందిని షెడ్యూల్ చేయడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ చూరాసింగ్(Divisional Vice President Choorah Singh), డీవోపీఎస్ అధికారి పింకీ మిట్లల్, సిబ్బంది షెడ్యూలింగ్, ప్లానింగ్ పాయల్ అధికారి అరోరాపై చర్యలు తీసుకోనుంది. ముగ్గురు అధికారులు విమాన లోపాలను పట్టించుకోకుండా అలసత్వం వహించారు. లైసెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘించినా అధికారులు పట్టించుకోవలని డీజీసీఏ వెల్లడించారు.

article_51183240.webp
ప్రపంచ యోగా దినోత్సవం... భారతావనికి దక్కిన గౌరవం: పవన్ కళ్యాణ్

21-06-2025

విశాఖపట్నం: ప్రపంచ యోగా దినోత్సవం(International Yoga Day 2025) భారతావనికి దక్కిన గౌరవమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy Chief Minister Pawan Kalyan) పేర్కొన్నారు. రుగ్వేదం యోగా విశిష్టతను, గొప్పదనాన్ని చెబితే ... దానిని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వవ్యాప్తం చేశారని తెలిపారు. యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, విశ్వ నరుడు నరేంద్ర మోదీ పిలుపు మేరకు యోగా దినోత్సవాన్ని ‘‘యోగా.. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’’ అనే థీమ్ ను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం విశాఖపట్నం సాగర తీరంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... “యోగా భారతీయ జీవన విధానంలో ఒక ముఖ్య భాగం. భారతీయ సనాతన ధర్మం యావత్ మానవాళికి అందించిన వరం అన్నారు. ఇది శరీరం.. మనసు మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ యోగా క్రియకు ఆది యోగి పరమ శివుడు ఆద్యుడు అయితే.. ఆ మహా యోగాన్ని ఆది శేషుడి అంశగా పతంజలి మహర్షి యోగ శాస్త్రం రూపంలో మనందరికీ అందించారని చెప్పారు.