భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు
05-12-2025
న్యూఢిల్లీ: భారత్-రష్యా(India and Russia) దేశాలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇరుదేశాల మధ్య సహకారం, వలస విధానం, వైద్య, ఆరోగ్య రంగాలు, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ సరఫరా, సముద్ర ఆహార ఉత్పత్తులు, కార్మికులు, షిప్పింగ్ పై కీలక ఒప్పందాలు జరిగాయి. అనంతరం ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... రష్యా మనకు ఎప్పటి నుంచో మిత్ర దేశం అన్నారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.