ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతాం
12-11-2025
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలు డు తర్వాత పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో రెండోసారి అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించా రు. సమావేశంలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ దాతే పాల్గొనగా, జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నలిన్ ప్రభాత్ వర్చువల్గా హాజరయ్యారు.