కమర్షియల్ గ్యాస్ సరఫరాపై కేంద్రం గుడ్న్యూస్
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం(Central Government) రాష్ట్రాలకు కేటాయించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల వాటాను 50 శాతం నుండి 70 శాతానికి పెంచింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం దృష్ట్యా, ఉక్కు, ఆటోమొబైల్ అధిక శ్రామిక శక్తి అవసరమయ్యే పరిశ్రమల అవసరాలను తీర్చడానికి ఈ చర్య తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చమురు కార్యదర్శి నీరజ్ మిట్టల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో, అదనపు సరఫరాను శ్రమ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
27-03-2026