calender_icon.png 18 January, 2026 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_67587206.webp
భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపా

18-01-2026

వాషింగ్టన్, జనవరి 17: భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధా న్ని ఎంతో మంచి పనిచేశానని తనకు తానే కితాబునిచ్చుకున్నారు. యుద్ధ ఆగిపోవడం వల్ల కోటి మంది ప్రాణాలను కాపాడగలిగానని డాంబికాలు పలికారు. అందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ తనకు కృతజ్ఞతలు కూడా తెలిపారని చెప్పుకొచ్చారు. అమెరికాకు చెందిన ‘సదరన్ బౌలేవార్డ్’ అనే సంస్థ పేరు ను తాజాగా ఆయన ‘డొనాల్డ్ జే ట్రంప్ బౌలేవార్డ్’గా మార్చారు. ఈ సందర్భంగా నిర్వహిం చిన ఓ కార్యక్రమంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

article_28637549.webp
పేదల నిధులు.. టీఎంసీ లూటీ

18-01-2026

కోల్‌కతా, జనవరి 17: పేదలకు అందాల్సిన నిధులను టీఎంసీ ప్రభుత్వం లూటీ చేస్తున్నదని ప్రధాని మోదీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా టౌన్ రైల్వేస్టేషన్‌లో శనివారం ఆయన హౌరాణొ గువాహటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. అలాగే రూ.3,250 విలువైన రైల్వే, రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. మాల్దాలో పరిశ్రమలు లేకపోవడం వల్ల స్థానిక యువత వలస వెళ్తున్నారని, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాల్దా మామిడి రైతులకు మేలు చేసే విధంగా కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పిస్తామని భరోసానిచ్చారు. రాష్ట్రంలో అధికార మార్పు రావాలని, అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీనే కావాలని ఆకాంక్షించారు.

article_52088927.webp
మెక్సికోపై భూతల దాడికి అమెరికా సిద్ధమైందా?

18-01-2026

వాషింగ్టన్, జనవరి ౧౭: మెక్సికోపై భూతల దాడికి అమెరికా సిద్ధమవుతున్నదా ? అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ ఏఏ) అందుకే ఎయిర్‌లైన్స్ సంస్థలకు కీలక మార్గదర్శకాలు ఇచ్చిందా? మెక్సికో, సెంట్రల్ అమెరికా, పనామాతోపాటు తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో గగనతలం మీదుగా వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యహరించాలని, ౬౦ రోజుల పాటు ఈ హెచ్చరికలు అమలు చేయాలనే ఎఫ్‌ఏఏ సూచనలు దాడికి సంకేతాలా? అనే ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీ యంగా చర్చనీయాంశలయ్యాయి. సైనికదాడులు మొ దలయ్యే అవకాశాలు ఉన్నందు నే ఎఫ్‌ఏఏ పై విధంగా హెచ్చరికలు జారీ చేసిందా.. అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

article_21727582.webp
బంగ్లాదేశ్‌లో దారుణం

18-01-2026

ఢాకా, జనవరి ౧౭: వాహనంలో పెట్రోల్ నింపించున్న మేర డబ్బు చెల్లించమని అడిగిన ఉద్యోగిని ఓ వాహనదారుడు కారు గుద్ది హతమార్చిన ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసు కున్నది. శుక్రవారం తెల్లవారుజామున రాజ్‌బరి జిల్లాలోని ఒక పెట్రోల బంక్‌లో ఈ ఘటన జరిగింది. గోలందమోర్‌లోని కరీం పెట్రోల్ బంక్‌లో రిపన్ సాహా అనే హిందూ యువకుడు సనిచేస్తున్నాడు. రోజూలాగానే సాహా తెల్లవారుజామున విధుల్లోకి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత బంక్‌లోకి ఓ కారు వచ్చిం ది. కారు యాజమాని ౫ వేల టాకాల విలువైన ఇంధనాన్ని కారులో నింపించుకున్నాడు. తర్వాత డబ్బులు ఇవ్వకుండా కారు స్ట్రాట్ చేసి వెళ్తుండగా రిపన్ సాహా కారుకు అడ్డంగా వెళ్లాడు.

article_47515329.webp
కాలువలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 14 మంది మృతి

17-01-2026

లాహోర్: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో దట్టమైన పొగమంచు కారణంగా సుమారు డజను మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ట్రక్కు వంతెన పైనుంచి కిందపడటంతో ఆరుగురు పిల్లలతో సహా కనీసం 14 మంది మరణించారు. ఈ ప్రమాదం లాహోర్ నుండి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గాధా జిల్లాలోని కోట్ మోమిన్‌లో శనివారం తెల్లవారుజామున జరిగింది. పంజాబ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ రెస్క్యూ 1122 ప్రతినిధి ప్రకారం, ట్రక్కులో 23 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విస్తృత కుటుంబానికి చెందినవారు, ఇస్లామాబాద్ నుండి ఫైసలాబాద్‌లో జరిగే అంత్యక్రియలకు హాజరు కావడానికి వెళ్తున్నారు.

article_81230821.webp
ఇరాన్‌పై సైనిక దాడి వద్దు!

17-01-2026

టెహ్రాన్/ వాషింగ్టన్: అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు గల్ఫ్ దేశాలు దౌత్యపరంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరాన్ పౌరుల నిరస నలను అణచివేసేందుకు ఆ దేశ ప్రభుత్వం తీవ్రమైన బలప్రయోగం చేస్తుండటం, ఆ ఊచకోతలో ౨,6౦౦ మందికి పైగా మరణించడంపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించడంతో ఇరాన్‌పై యుద్ధమేఘాలు కుమ్ముకున్నాయి. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో శాంతిభద్రతలను దెబ్బతీస్తాయ ని భావించిన సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్‌తో పాటు గల్ఫ్ దేశాలు దౌత్యపరంగా పావులు కదుపుతున్నాయి. ఈ దేశాల జాబితాలో ఈజిప్ట్ కూడా ఉంది.