16 March, 2026 | 1:56 PM

National

article_50402777.webp
ప్రభుత్వాసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం: 10 మంది మృతి

భువనేశ్వర్: ఒడిశాలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. కటక్ లోని ఎస్సీబీ(SCB Hospital fire) వైద్య కళాశాల ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఆస్పత్రి అత్యవసరన విభాగంలోని ట్రామా కేర్ ఐసీయూలో అర్ధరాత్రి మంటలు అంటుకున్నాయి. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ(Mohan Charan Majhi) ఘటనాస్థలిని పరిశీలించి బాధితులను పరామర్శించారు. రోగులను సురక్షితంగా కాపాడే క్రమంలో ఆసుపత్రి సిబ్బందిలో సుమారు 11 మందికి కాలిన గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ట్రామా కేర్ ఐసియు, పక్కనే ఉన్న వార్డులో 23 మంది రోగులు ఉన్నట్లు సమాచారం.

16-03-2026