calender_icon.png 25 May, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_57102939.webp
రాహుల్ గాంధీకి కొత్త చిక్కు, నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

24-05-2025

న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై(Congress MP Rahul Gandhi) జార్ఖండ్‌లోని చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్(Non-bailable warrant) జారీ చేసింది. ఈ వారెంట్ 2018 నాటి పరువు నష్టం కేసుకు సంబంధించినది. జూన్ 26న జరగనున్న విచారణకు రాహుల్ గాంధీని స్వయంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ న్యాయ బృందం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. 2018 కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసినట్లుగా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈ కేసు నమోదైంది. అప్పటి భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురించి ఆయన వ్యాఖ్యలు చేశారని, "హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా బిజెపి అధ్యక్షుడు కావచ్చు" అని పేర్కొన్నారని బిజెపి నాయకుడు ప్రతాప్ కటియార్(BJP leader Pratap Katiyar) జూలై 9, 2018న చైబాసా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సిజెఎం) కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు.

article_72542830.webp
పాకిస్తాన్ చొరబాటుదారుడిని కాల్చిచంపిన బీఎస్ఎఫ్ దళాలు

24-05-2025

బనస్కాంత: గుజరాత్‌లోని(Gujarat) బనస్కాంత జిల్లాలో భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ చొరబాటుదారుడిని సరిహద్దు భద్రతా దళాలు (Border Security Force) శుక్రవారం రాత్రి మట్టుబెట్టాయి. అంతర్జాతీయ సరిహద్దును దాటిన తర్వాత సరిహద్దు కంచె వైపుకు వస్తున్న అనుమానాస్పద వ్యక్తిని భద్రతా దళాలు గుర్తించాయని భద్రతా దళాల ప్రకటన తెలిపింది. నిన్న రాత్రి బనస్కాంత జిల్లా(Banaskantha District)లో చొరబాటుకు యత్నించాడు. దీంతో బీఎస్ఎఫ్ దళాలు భారత్ లోకి రావద్దని హెచ్చరించారు. బీఎస్ఎఫ్ హెచ్చరికలు ఖాతరు చేయకుండా చొరబాటుకు యత్నించాడు. హెచ్చరించినా వినకపోవడంతో చొరబాటుదారుడిపై కాల్పులు జరిపారు.

article_57738247.webp
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

24-05-2025

తిరువనంతపురం: నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) శనివారం కేరళను తాకాయి. ఎనిమిది రోజుల ముందుగానే నైరుతి పవనాలు కేరళకు(Kerala) చేరుకున్నాయి. 2009 తర్వాత రుతుపవనాలు త్వరగా రావడం ఇదే తొలిసారి. కేరళ నుంచి రెండు, మూడు రోజుల్లో ఏపీలోకి విస్తరించే అవకాశముందని వాతావరణ శాఖ(Department of Meteorology) ప్రకటించింది. గత రెండు రోజులుగా అల్పపీడన ద్రోణి సాగుతుంది. రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రారంభానికి అనుకూలమైన అన్ని పరిస్థితులు ఇప్పుడు కేరళలో ఏర్పడ్డాయి. దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో తూర్పు-మధ్య అరేబియా సముద్రంపై అల్పపీడనం ఏర్పడింది.