ప్రభుత్వ విధానాలు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేలా ఉండాలి: ప్రధాని మోదీ
24-05-2025
పదో నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో దేశ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి టీమిండియాలా పని చేస్తే ఏదీ అసాధ్యం కాదని, 2047 నాటికి వికసిత్ భారత్ గా మారడంపైనే అందరి దృష్టి ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రం, నగరం, గ్రామాన్ని వికసిత్ గా మార్చడమే తమ లక్ష్యమని, కలిసి పనిచేస్తే లక్ష్యం చేరేందుకు 2047 వరకు వేచివుండే పనిలేదని తెలిపారు.