calender_icon.png 31 December, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_59427537.webp
చొరబాటుదారులను తరిమికొడతాం: అమిత్ షా

30-12-2025

కోల్‌కతా: ఎన్నికల ప్రయోజనాల కోసం పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం(Mamata Banerjee) బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులను తరిమేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) మంగళవారం స్పష్టం చేశారు. కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో షా మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్ ప్రజలు(Bengal people) చొరబాట్లపై ఆందోళన చెందుతున్నారని సూచించారు. తాము చొరబాటుదారులను గుర్తించడమే కాకుండా, వారిని తరిమివేస్తామని హెచ్చరించారు. 2026లో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం(BJP Government) ఏర్పాటు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక బెంగాల్ కు పూర్వవైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ హింసలో వామపక్షాలను టీఎంసీ మించిపోయిందని అమిత్ షా ఆరోపించారు.