అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు-ఎస్పై
06-09-2026 | 06:22pm
బోధన్ సెప్టెంబర్ 06 (విజయ క్రాంతి): సాలూర మండలం(Salur Mandal) మందర నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను బోధన్ రూరల్ పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. మార్గమధ్యంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. కేసు నమోదు చేసి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.






