శివ్ నాడార్ యూనివర్సిటీ హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ ప్రోగ్రాం ప్రారంభం
27-11-2025
హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలోనూ, పలు కోర్సుల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ శివ్ నాడార్ యూనివర్సిటీ ఇంటర్ డిసిప్లినరి హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ లో భారతదేశంలో మొదటిసారి బీఏ (పరిశోధన) కార్యక్రమం ప్రారంభించింది. పెరుగుతున్న సంక్లిష్టమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దడానికి సమర్థవంతులైన నిపుణులను ప్రోత్సహించడానికి దీనిని తీసుకొచ్చినట్టు తెలిపింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్తలు, స్కూల్ నాయకులు, అకాడమీషియన్స్ హాజరయ్యారు. భారతదేశపు ఉన్నత విద్యకు సంబంధించి ఇది కీలకమార్పుగా చెబుతున్నారు.