calender_icon.png 18 July, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Sports/Eductation

article_41461175.webp
లార్డ్స్‌ టెస్టు.. పీకల్లోతు కష్టాల్లో భారత్

14-07-2025

లార్డ్స్‌(Lords)లో జరుగుతున్న భారత్ vs ఇంగ్లాండ్ మూడో టెస్ట్‌ 5వ రోజు ఆట హైప్రెజర్ లో జరుగుతుంది. 5వ రోజు తొలి సెషన్‌లోనే భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. పంత్(9), కెఎల్ రాహుల్(39), వాషింగ్టన్ సుందర్(0) త్వరత్వరగా వెనుదిరిగారు. ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా టెస్ట్ విజయాలు సాధించాలనే భారత కలలు భారీ ప్రమాదంలో పడ్డాయి. 193 పరుగుల లక్ష్యఛేదనలో ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా(16), నితీష్ రెడ్డి(10) క్రీజులో ఉండటంతో భారత్ 36 ఓవర్ల తర్వాత 107/7 స్కోరును చేరుకుంది. జోఫ్రా ఆర్చర్ తన మెరుగైన ఆటతీరును ప్రదర్శించి, పంత్‌ను రిప్పర్‌తో వెనక్కి పంపి, సుందర్‌ను అవుట్ చేయడానికి అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు.