నేడు ఇంజినీరింగ్ అడ్మిషన్లపై అవగాహన
21-06-2025
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): జేఎన్టీయూహెచ్లో శనివా రం ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రధానంగా కోర్ బ్రాంచీలైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూ ద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్, జేఎన్టీయూ అధికారులతోపాటు పారిశ్రా మిక వేత్తలు, విద్యావేత్తలు తల్లిదండ్రు లు హాజరుకానున్నారు.