calender_icon.png 16 October, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Sports/Eductation

article_11441963.webp
సిరీస్ క్లీన్ స్వీప్

16-10-2025

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2 క్లీన్ స్వీప్ చేసింది. న్యూఢిల్లీ అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్‌గా శుభమన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. అలాగే రెండో సిరీస్‌లోనే సారథిగా క్లీన్‌స్వీప్ విజయాన్ని సొంతం చేసుకున్న కెప్టెన్‌గానూ నిలిచాడు. 1 వికెట్ నష్టానికి 63 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరిరోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ తొలి సెషన్ సగంలోనే మ్యాచ్‌ను ముగించింది. సాయిసుదర్శన్(39), గిల్(13) వికె ట్లు కోల్పోయినప్పటకీ... కేఎల్ రాహుల్ (58) హాఫ్ సెంచరీతో రాణించాడు. జురెల్‌తో కలిసి జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. దీంతో 3 వికె ట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.

article_66634422.webp
నేటి నుంచే రంజీ ట్రోఫీ

15-10-2025

హైదరాబాద్,అక్టోబర్ 14 : దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ టోర్నీ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 91వ ఎడిషన్ బుధవారం నుంచే ఆరం భం కానుంది. దేశవ్యాప్తంగా మొత్తం 32 జట్లు రంజీ బరిలో ఉండగా.. ప్రతీ గ్రూప్‌లో 8 జట్లు పోటీపనన్నాయి. ప్రతీ గ్రూప్ నుంచి టాప్ 2 లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గత సీజన్‌లో విదర్భ చాంపియన్‌గా నిలిస్తే.. కేరళ రన్నరప్‌గా నిలిచింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై ఏకంగా 42 సార్లు విజేతగా నిలిచింది. ఈ సారి పలువురు స్టార్ క్రికెటర్లు సైతం రంజీ సీజన్ ఆడుతున్నారు. రహానే, సంజూ శాంసన్, షమి, ఇషాన్ కిషన్, కరుణ్ నాయర్, రింకూ సింగ్, తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, శివమ్ దూబే,సర్ఫరాజ్ ఖాన్, మయాంక్ అగర్వాల్ వంటి ప్లేయర్స్ ఆడుతున్నారు. హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.