NEET PG 2026: దేశవ్యాప్తంగా నీట్ పీజీ 2026 పరీక్ష
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (National Eligibility cum Entrance Test) 2026 పరీక్ష ఆగస్టు 30న ప్రారంభమైంది. నిర్దేశిత కేంద్రాలలో 2,73,000 మందికి పైగా వైద్య పట్టభద్రులు హాజరుకాగా, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నిర్వహించే ఈ పరీక్ష ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒకే సెషన్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతుంది. మొత్తం 180 ప్రశ్నలకు 210 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఏపీలో 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు హాజరు కాగా, తెలంగాణలో 14 జిల్లాల్లోని 56 కేంద్రాల్లో 17,600 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ ఏడాది నీట్ పీజీ పరీక్ష విధానంలో కేంద్రం మార్పులు చేసిన విషయం తెలిసిందే.
30-08-2026