calender_icon.png 2 February, 2026 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Sports/Eductation

article_90811894.webp
కెప్టెన్‌గా మోనాంక్ పటేల్

31-01-2026

న్యూయార్క్ , జనవరి 30: ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ఇంకా వారం రోజులే సమయం మిగిలి ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. తాజాగా యుఎస్‌ఏ జట్టును కూడా ప్రకటించారు. 15 మంది సభ్యులు గల బృందానికి మోనాంక్ పటేల్ నాయకత్వం వహిస్తాడు. జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, మిలింద్ కుమార్, షాయన్ జహంగీర్, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెం జిగే, షాడ్లీ వాన్ షాల్క్విక్, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్ లు తిరిగి జట్టులోకి వచ్చా రు. 2024 టీ20 ప్రపంచకప్ ఆడినవారిలో 10 మంది ప్రస్తుత జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్నారు. టీ20 ప్రపంచకప్లో ఆడ డం యూఎస్‌ఏకు ఇది రెండోసారి.