ఈనెల 29 నుంచి ఈఏపీసెట్ పరీక్షలు
18-04-2025
హైదరాబాద్: ఈఏపీసెట్(EAPCET Exams) పరీక్షల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఈ నెల 29 నుంచి మే 4వ తేదీ వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 29,30 తేదీల్లో అగ్రికల్చర్(Agriculture), ఫార్మా ప్రవేశ పరీక్ష, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజు రెండు సెషన్లలో ఈఏపీసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాల్లో ఈఏపీ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది హాజరు కానున్నారు. అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.