calender_icon.png 21 January, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Sports/Eductation

article_22942902.webp
నేటి నుంచి ఇండోనేషియా మాస్టర్స్

21-01-2025

ఇండియా ఓపెన్ ముగిసిన రెండు రోజుల వ్యవధిలోనే మరో బ్యాడ్మింటన్ టోర్నీకి తెరలేచింది. నేటి నుంచి జకర్తా వేదికగా ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ ప్రారంభం కానుంది. ఇండియా ఓపెన్‌లో సెమీస్‌లో ఓటమి పాలైన భారత డబుల్స్ ద్వయం సాత్విక్ జోడీ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. తొలి రౌండ్‌లో ఈ జంట చైనీస్ తైపీకి చెందిన చెన్ జి యు చెహ్‌తో తలపడనుంది. మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధూ కూడా టోర్నీలో ఆడనుంది. పెళ్లి తర్వాత బరిలోకి దిగిన ఇండియా ఓపెన్‌లో క్వార్టర్స్ చేరి మంచి ఆటతీరును ప్రదర్శించిన సింధూ ఇండోనేషియా మాస్టర్స్‌లో విజేతగా నిలవాలని భావిస్తోంది.

article_89336916.webp
రంజీల్లో ఆడనున్న కోహ్లీ, రోహిత్

21-01-2025

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ సీజన్ రంజీ ట్రోఫీలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నాడు. ఈ నెల 30న రైల్వేస్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఢిల్లీ తరఫున కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. దీంతో పుష్కరకాలం తర్వాత కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడనుండడం విశేషం. మెడ నొప్పితో బాధపడుతున్న కోహ్లీ జనవరి 23న సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్లు ఇదివరకే తెలిపాడు. కాగా నొప్పి నుంచి ఉపశమనం పొందిన కోహ్లీ రైల్వేస్ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నట్లు స్వయంగా తెలిపాడు. కోహ్లీతో పాటు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఢిల్లీ తరఫున ఆడనున్నాడు.