నేషనల్ రేసింగ్ విజేత ధృవ్ గోస్వామి
17-11-2025
కోయంబత్తూర్, నవంబర్ 16 : జేకే టైర్ జాతీయ రేసింగ్ చాంపియన్షిప్లో ఈ సా రి కొత్త రేసర్లు దుమ్మురేపారు.18 ఏళ్ల యువ సంచలనం ధృవ్ గోస్వామి చాంపియన్గా నిలిచాడు. ఎల్జీబీ ఫార్ములా4 విభాగంలో అద్భుత ప్రదర్శనతో విజయం సాధించాడు. 20 ల్యాప్లతో కూడిన ఫైనల్ రేసును 7వ ప్లేస్ నుంచి ప్రారంభించినప్పటకీ, మాజీ చాంపియన్ దల్జీత్ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. అతను ఈ రేసును 19 నిమిషాల 58.57 సెకన్లలో పూర్తి చేశాడు.