వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత్ జోరు
అహ్మదాబాద్, సెప్టెంబర్ 8: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్(World Archery Para Series) స్టేజ్-3 టోర్నమెంట్లో భారత పారా ఆర్చర్లు అద్భుతమైన ప్రదర్శనతో పతకాల పంట పండిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ సబర్మతి రివర్ఫ్రంట్ వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో భారత్ ఇప్పటివరకు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
09-09-2026 | 05:10am