calender_icon.png 16 September, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_33288864.webp
గోకారం-నేలపట్ల రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ కు వినతి పత్రం

15-09-2025

వలిగొండ (విజయక్రాంతి): గోకారం-నేలపట్ల బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ సోమవారం సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, కార్యదర్శి కవిడే సురేష్ లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు(District Collector Hanumantha Rao)కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోకారం గ్రామం నుండి రోజు వారీగా హైదరాబాద్ వెళ్లడానికి, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వెళ్లడానికి, రెవెన్యూ డివిజన్ కేంద్రానికి వెళ్లడానికి ఇదే ప్రధానమైన రోడ్డు కావడం వలన వందలాది మంది ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా సుమారు 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఆర్ అండ్ బి రోడ్డుకు ఇప్పటికీ ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదని అన్నారు.

article_37519538.webp
శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు

13-09-2025

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోగల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామిని శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు(District Collector Hanumantha Rao) సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు పూర్ణకుంభంతో, వేద పండితుల మంత్రోచ్ఛారణాలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి విశిష్టతను తెలియజేసి కలెక్టర్ దంపతులను శాలువాతో సన్మానించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, ఆర్ఐ నగేష్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

article_55624436.webp
తెలంగాణ విమోచన దినోత్సవం గ్రామ గ్రామాన నిర్వహించాలి

13-09-2025

వలిగొండ (విజయక్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవం గ్రామ గ్రామాన నిర్వహించాలని బిజెపి జిల్లా కార్యదర్శి ఆకారం వైజయంతి(BJP District Secretary Vaijayanthi) పిలుపునిచ్చారు. శనివారం బిజెపి మండల అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైజయంతి మాట్లాడుతూ, అన్ని బూతుల్లో, అన్ని గ్రామాల్లో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణలు, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా అన్ని గ్రామాల్లో స్వచ్ఛభారత్, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని అన్నారు.