ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
19-08-2025
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 18 (విజయక్రాంతి): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జి ల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం యాదగిరిగుట్ట మండలం మర్రిగూడెం గ్రామాల మధ్య రోడ్డు పైనుంచి పారుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్డును మూసివేశారు.