పలు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
గుండాల, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): మండల పరిధిలోని రైతు వేదికలో సోమవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి - సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. యాభై నాలుగు మంది లబ్ధిదారులకు రూ. 54,06,264 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులు, ముగ్గురు లబ్ధిదారులకు రూ. 1,20,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
24-02-2026