యాదాద్రిలో తెప్పోత్సవం
24-04-2024
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంగళవారం చైత్ర శుద్ధపౌర్ణమి సందర్భంగా విష్ణుపుష్కరిణిలో స్వామి వారి తెప్పోత్సవం నిర్వహించారు. స్వామివారికి నిత్యారాదన, సుదర్శన హోమం నిర్వహించారు. వివిధ సేవాల ద్వారాస్వామి వారు ఆదాయం రూ. 16,90,140లక్షల వచ్చినట్లు ఆలయ ఈఓ భాస్కర్రావు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్త నర్సింహ మూర్తి, ప్రధాన అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.