calender_icon.png 16 October, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_38469144.webp
ధాన్యం కొనండి మహాప్రభో

16-10-2025

వలిగొండ,(విజయక్రాంతి): వరి కోతలు ప్రారంభమై పక్షం రోజులు కావస్తున్న నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ధాన్యం కొనండి మహాప్రభో అని ప్రభుత్వాన్ని అధికారులను వేడుకుంటున్నారు. గత నాలుగు రోజుల క్రితం వలిగొండ మండలంలోని(Valigonda Mandal) వివిధ గ్రామాలతో పాటు వలిగొండ మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షంతో రైతుల ధాన్యం తడిసిపోయింది. కాగా పలువురి రైతుల(Farmers) ధాన్యం పూర్తిగా తడవడంతో ధాన్యం మొలకెత్తింది. వలిగొండ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం మొలకెత్తడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు రైతుల పట్ల కనికరించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మొలుకెత్తిన ధాన్యాన్ని చూసి తమ ఆరుగాలం కష్టం నష్టపోయామని మొత్తుకుంటున్నారు.

article_60673378.webp
రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలో నీటిని తోడేందుకు కృషి చేసిన ఎంపీడీవో జలంధర్ రెడ్డి

14-10-2025

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని ఎదుల్లగూడెం, పొద్దుటూర్ గ్రామాలకు వెళ్లే రహదారిలో నిర్మించిన రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ లో పెద్దఎత్తున నీరు నిలిచిపోవడంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. విషయం తెలిసి వలిగొండ మండలం ఎంపీడీవో జలంధర్ రెడ్డి మంగళవారం రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకొని రైల్వే సిబ్బందితో సంప్రదించి నిల్వవున్న నీరు మోటార్ సహాయంతో తోడించారు. అయితే పైనుండి వరద నీరు వస్తున్నందున మొత్తం నీటిని తొలగించేందుకు రెండు రోజులు పట్టే అవకాశం ఉందని రాకపోకలకు కృషి చేస్తానని తెలియజేయగా ఆయనకు రెండు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

article_13820679.webp
వలిగొండ మార్కెట్ యార్డును ఆకస్మికంగా పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి

14-10-2025

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ను యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మార్కెట్ యార్డ్ లో రైతులు వచ్చిన ధాన్యం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షం నుండి కాపాడుకోవడానికి రైతులకు కావలసిన టార్పాలిన్లను అందిస్తామని రైతులు ఆందోళన చెందవద్దని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని అరబెట్టుకునేందుకు డ్రైయర్ మిషన్ వాడుకోవాలని దీంతో తేమశాతం తగ్గే అవకాశం ఉందని అన్నారు.