10 April, 2026 | 4:40 AM

Districts - Yadadri Bhuvanagiri

article_54748544.webp
అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు

గుండాల,(విజయక్రాంతి): మండలంలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీస్కుంటామని మండల అధికారులు హెచ్చరించారు. సోమవారం స్థానిక అధికారులు ఎస్సై సైదా రావుఫ్, తహసీల్దార్ ఖాసీం, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా అక్రమ ఇసుక రవాణా మరియు త్రవ్వకాలను అరికట్టుటకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సాయనపల్లి గ్రామ సమీపంలోని కిన్నెరసాని వాగు వంతెన వద్ద జేసీబీ తో రెండు గుంతలు త్రవ్వించి అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగించే మార్గాన్ని మూసివేసి ఆ దారికి అడ్డుకట్ట వేశారు. మండలంలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే ఆ వాహనాలను సీజ్ చేయటంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని స్థానిక ఎస్సై సైదా రావుఫ్ ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరించారు.

06-04-2026

article_30143127.webp
యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు

యాదగిరిగుట్ట,(విజయకాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం కొండ కింద గిరిప్రదక్షిణలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఉదయం5 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేరసాగింది. యాదగిరీశుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భవాని శంకర్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Lakshmi Narasimha Swamy Temple) వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం గిరిప్రదక్షిణ కావడంతో రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొండ కింద రాజగోపురం వద్ద ఎటు చూసినా వాహనాలతో నిండిపోయింది.

04-04-2026