భూములు కోల్పోయిన రైతులకు చెక్కుల పంపిణీ
19-02-2026
ఆలేరు, ఫిబ్రవరి 18 : గంధమల్ల రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరం జిల్లా కలెక్టర్ హనుమంత రావు, అదనపు కలెక్టర్ భాస్కరరావు, తో కలసి 412 మంది రైతులకు ఎకరానికి 24 లక్షల 50 వేల చొప్పున 87 ఎకరాలకు 22 కోట్ల 80 లక్షల 58 వేలు గంధ మల్ల బండ్ పోర్షన్ చెక్కులను పంపిణీ చేశాను.