ప్రజా సమస్యలను పరిష్కరించడమే ఉద్యోగుల ధర్మం
16-04-2025
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): ప్రతి గ్రామంలో తిరుగుతూ..ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి తాగునీటి సమస్య, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.