అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తాం
16-01-2025
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదలకు అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంత రావు(District Collector Hanumantha Rao) అన్నారు. గురువారం ఆత్మకూర్ మండలంలోని రాయిపల్లి, కాప్రాయి పల్లి గ్రామం, మోత్కూర్ మండలంలోని మసిపట్ల గ్రామపంచాయతీ పరిధిలో శివ నగర్ హేమ్లెట్ గ్రామం, గుండాల గ్రామంలో నిర్వహిస్తున్న నాలుగు సంక్షేమ పథకాల (రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు(రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఇళ్లు) సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ హనుమంత రావు సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిశీలించారు.