భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
భద్రాచలం, సెప్టెంబర్ 4: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణతో కలిసి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ముక్కోటి ఉత్సవాల నాటికి ఉత్తర ద్వార అభివృద్ధి పనులు, వచ్చే శ్రీరామనవమి నాటికి మిగతా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ఘాట్లు, పరిసర ప్రాంత అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆలయ పరిసరాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.276 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
04-09-2026 | 12:38pm