calender_icon.png 21 January, 2026 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_36949377.webp
సమస్యలు పరిష్కారించాలని అధికారులకు ఆదేశం

20-01-2026

ఆలేరు, జనవరి 19 (విజయక్రాంతి): భువనగిరి కలెక్టర్ ఆఫీస్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల(రెవెన్యూ) అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు, సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ భాస్కర్ రావు వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 29 అర్జీలను స్వీకరించారు, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.

article_84934853.webp
యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం: ఇఎల్వి భాస్కర్

13-01-2026

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి ఉపాధి అవకాశాలను వెతికి ప్రయోజకులు కావాలని వారికి తన సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఇ ఎల్ వి ఫౌండేషన్ చైర్మెన్ భాస్కర్ అన్నారు.సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేలు గ్రామంలోని మూడు చెరువులలో లక్ష చేప పిల్లలను వదిలారు.సర్వేలు గ్రామ సర్పంచ్ చిలకరాజు చందన రాజు కోరిక మేరకు హామీ ఇచ్చిన మూడు రోజులలోనే భీమవరం నుండి చేప పిల్లలను తెప్పించడం జరిగిందని భాస్కర్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చెరువులన్నింటిలో వచ్చే సంవత్సరం చేప పిల్లల పెంపకం చేపట్టబోతున్నామని యువతకు ఉపాధి కల్పించడమే ఇఎల్వి ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలుకరాజు చందన రాజు,ఉప సర్పంచ్ కట్కూరి భాస్కర్,వార్డు సభ్యులు బోయ చందు, ఈసం గీత రామకృష్ణ,శివశంకర్,నరసింహ,గ్రామ ప్రజలు,యువత అధికసంఖ్యలో పాల్గొన్నారు.

article_48644036.webp
సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మిచెక్కుల పంపిణీ

12-01-2026

ఆలేరు, జనవరి 11 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట పట్టణం ప్రభుత్వ విప్ కార్యలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మీ పథకం కింద మంజూరైన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు, ఆలేరు నియోజకవర్గం లోని ఎనిమిది మండలాలకు సంబంధించిన సుమారు 200 మంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సుమారు 100 కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మీ వంటి పథకాల ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు అండగా నిలుస్తోందన్నారు.