calender_icon.png 19 April, 2025 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_31069541.webp
భూభారతి చట్టంతో ప్రజలకు మేలు

19-04-2025

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 18 ( విజ యక్రాంతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో రైతులు ప్రజలకు ఎంతో మేలు జరగనున్నదని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి లో భూదాన జయంతి వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆచార్య వినోబా భావే, ప్రథమ భూదాత వె ధిరే రామచంద్రారెడ్డి కాoస్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి భూదాన భూముల పరిష్కారాలపై అవగాహన సదస్సు నిర్వహించారు .

article_14425011.webp
కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి

19-04-2025

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 18 ( విజయ క్రాంతి ): దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని నల్లగొండ డీఎస్పీకి బీజేపీ జిల్లా అధ్యక్షులు డా.. నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా భారత దేశ ప్రధానమంత్రిగా ఎన్నికై దేశ సేవలు నిర్వహిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ నల్లగొండ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మంత్రి కోమటిరెడ్డి అనుచరులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అబ్బగోని రమేష్ తదితర అనుచరులతోటి దేశ ప్రధాని దిష్టిబొమ్మ తగలబెట్టే దుశ్చర్యకు పాల్పడ్డ అటువంటి వీరిపై వెంబటే చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు..