calender_icon.png 2 July, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_72098224.webp
రెవెన్యూ సదస్సుల అప్లికేషన్లు త్వరగా పూర్తి చేయాలి

01-07-2025

భూభారతిలో భాగంగా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అప్లికేషన్లను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి(District Additional Collector Veera Reddy) అన్నారు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని తాహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో రైతులు రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకున్న వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల అప్లికేషన్లను ప్రస్తుతం పరిష్కరిస్తున్న తీరుపట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

article_25022577.webp
బునాదిగాని కాల్వను యుద్ధ ప్రతిపాదికాన పూర్తి చేసి ఖరీఫ్ పంటకు సాగునీరు అందించాలి

29-06-2025

బునాదిగాని కాల్వను యుద్ధ ప్రతిపాదికాన పూర్తి చేసి ఈ ఖరీఫ్ పంటకు సాగునీరు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్(CPI State Executive Member Bommagani Prabhakar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఐ వలిగొండ మండల 14వ మహాసభ నర్సాపురం గ్రామంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఎలగందుల అంజయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ... పేద ప్రజలకు ఎర్ర జెండానే భరోసా అని, పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా అజేయంగా నిలుస్తుందని, నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు.