calender_icon.png 1 May, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_84792114.webp
పదవ తరగతి ఫలితాల్లో విజ్ఞాన్ హైస్కూల్ జిల్లా మొదటి ర్యాంక్

01-05-2025

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో భువనగిరి పట్టణానికి చెందిన విజ్ఞాన్ హై స్కూల్ విద్యార్థులు జిల్లా మొదటి ర్యాంకును సాధించారు. విద్యార్థిని ఎం అక్షయ 587/600 మార్కు లతో జిల్లాలో మొదటి ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించింది. పాఠశాలలో మొత్తం 66 మంది విద్యార్థులలో 550 కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఏడుగురు, 500 పైగా మార్పులు సాధించిన విద్యార్థులు 23, 400కు పైగా మార్పులు సాధించిన విద్యార్థులు 58, మొత్తం విద్యార్థులు 66 అందులో ప్రధమ శ్రేణిలో తిరుగులేని వారు 64 మంది విద్యార్థులు ఉన్నారు.

article_14283086.webp
కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం

30-04-2025

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 29 ( విజయ క్రాంతి ): కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని వారి లేనిదే పార్టీ లేదని వారి శ్రమ, త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణలో అధికారంలోకి వచ్చామని ఆ పార్టీ నాయకులు అన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ సంస్థాగత సమావేశం జిల్లా అధ్యక్షులు అండం సంజీవరెడ్డి అధ్యక్షతన ప్రైవేట్ హోటల్లో మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుండి ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ త్వరలోనే వార్డు, గ్రామ, మండల, జిల్లా కమిటీలను. అందరి అభిప్రాయాలతో ఏకగ్రీవంగా నియమించడం జరుగుతుందని తెలిపారు.

article_89911632.webp
రైతులకు మజ్జిగ పంపిణీ చేసిన కలెక్టర్

30-04-2025

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించి రైతులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేసారు. జిల్లా కలెక్టర్ పిలుపుమేరకు రైతులకు మజ్జిగ పంపిణీ చేసేందుకు ఆదర్శ రైతు వెంకటేష్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. వేసవికాలంలో రైతులకు వడదెబ్బ కొట్టకుండా మజ్జిగ ఉపయోగ పడుతుందన్నారు. తోటి రైతులు రైతు వెంకటేష్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా ఆదర్శంగా నిలిచిన రైతు వెంకటేష్ ను అభినందిస్తూ వెంకటేష్‌తో పాటు అతని తండ్రి అంజయ్య ని కలిపి కలెక్టర్ సన్మానించారు.

article_68310849.webp
ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్రజెండానే

29-04-2025

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 28 ( విజయక్రాంతి ): నిరంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసేది ప్రజలను పోరాటాలలో పాల్గొనేలా చైతన్యం చేసేది ఒక్క ఎర్రజెండా తప్ప ఇతర పార్టీలు కాదని సిపిఎం మాజీ ఎమ్మెల్సీ, మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. సోమవారం భువనగిరి సుందరయ్య భవనం నుండి వందలాది మందితో ప్రారంభమైన ప్రజా సమస్యల పాదయాత్ర జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరిగిన మహాధర్నా కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గతంలో పరిపాలించిన బిఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయక ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి అందరు గమనించారు.

article_35382778.webp
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

29-04-2025

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 28 ( విజయక్రాంతి ) : సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల తీరును పర్యవేక్షించేందుకు భువనగిరి మండలం నందనం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోళ్లు సెంటర్, వలిగొండ మండలంలోని సంగెం గ్రామం లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలాగే చౌటుప్పల్ మండలం నక్కలగూడెం గ్రామంలో పిఏసిఎస్, పెద్దకొండూరు గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని పరిశీలిస్తూ ... రైతులతో మాట్లాడారు . వసతుల కల్పనపై రైతులను అడిగి తెలుసుకుంటూ, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నారు.

article_20442492.webp
యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షం

27-04-2025

యాదాద్రి: తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలుక కురుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, వలిగొండ, మోటకొండూర్, ఆలేరు, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, తుర్కపల్లి, తదితర మండలాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కోసిన పంట కల్లాల్లో ఉండడంతో ధాన్యం తడుస్తుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం తడిసిన దానిని సైతం కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉంది.