అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల భారీ ర్యాలీ
గుండాల, మార్చి 10 (విజయక్రాంతి): మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఏవీఎస్పీ, సీపీఎం, బీఆర్ఎస్, సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా, తుడుందెబ్బ సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ బోర్లకు 24 గంటలు త్రిపేస్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని, విద్యుత్ కోతలను నిలిపివేయాలని, లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులతో కలిసి మంగళవారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
11-03-2026