భక్తుల కొంగుబంగారం యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట, మార్చి 8 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం కొండ కింద గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం5 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేరసాగింది. యాదగిరీశుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భవాని శంకర్, ధర్మకర్త నరసింహా మూర్తి, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
09-03-2026