calender_icon.png 15 February, 2026 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_58890698.webp
సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం

06-02-2026

గుండాల, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మండల కేంద్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పలు సమస్యలపై వినతీ పత్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల ఇసుక తొలకాల్లో ఫారెస్ట్ , రెవిన్యూ అధికారుల జాప్యం, మండల కేంద్రంలో మరుగుదొడ్ల నిర్మాణం, బస్టాండ్ నిర్మాణం, పీహెచ్సీలో ఫస్ట్ అండ్ సెకండ్ ఏఎన్‌ఎం ల పోస్టుల భర్తీ, డ్రైనేజీ, మెయిన్ రోడ్డులో ఉండే ట్రాఫిక్, మండల కేంద్రంలో గ్రంథాలయం ఏర్పాటు, ప్రైవేట్ వ్యక్తుల భూ ఆక్రమణల గురించి సమస్యలను వివరించగా మరుగుదొడ్లు వెంటనే అమలు చేస్తామని దానికి సంబందించిన స్థలం గ్రామస్తులు కేటాయించడమే ఆలస్యం అని కలెక్టర్ తెలిపారు. డ్రైనేజీ సమస్య వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.

article_48707915.webp
ఆలేరు పీఠం అధిరోహించేదెవరో?

04-02-2026

ఆలేరు, ఫిబ్రవరి 3 : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మున్సిపాలిటీలో రెండవ సాధారణ ఎన్నికలలో చైర్మన్ పీఠం ఎవరిని వరించనున్నదోనన్న చర్చ వేడివేడిగా జరుగుతున్నది. మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడనున్నాయి. రిజర్వేషన్ వివరాలు బీసీ మహిళగా ప్రకటించడంతో ఆశావాహుల్లో ఉత్కంఠత నెలకొంది. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో మొత్తం 13,632 ఓట్లర్లు ఉన్నారు. వీరిలో 6,671 పురుషులు, 6,960 మహిళలు, ఇతరులు ఒక్కరు ఉన్నారు. చైర్మన్ పీఠంపై అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు కూడా కన్నేసినట్టు తెలుస్తోంది. దీంతో పీఠంపై కూర్చునే బీసీ మహిళ ఎవరనేది ఉత్కంఠగా మారిపోయింది.