calender_icon.png 1 February, 2026 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_71468217.webp
మద్యం నియంత్రణపై అవగాహన ర్యాలీ

29-01-2026

సంస్థాన్ నారాయణపూర్,జనవరి 29(విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండలం గంగమూల తండాలో మద్యం నియంత్రణపై అవగాహన ర్యాలీ సర్పంచ్ కరంటోత్ లచ్చు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేపట్టిన మహా యజ్ఞానికి తామంతా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆయన కోరుకున్న మధ్యరహిత గ్రామంలో గంగమూల తండా మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అందరి ఆరోగ్యం కోసం తీసుకున్నాడని దానికి అందరం కట్టుబడి ఉండాలని కోరారు.యువత మద్యానికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడి చిద్రమై పోతున్నాయని అందుకే వారి జీవితాలను బాగుచేయాలనే సదుద్దేశంతో మద్యం నియంత్రణ చేపట్టారని అన్నారు.గ్రామస్తులంతా సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యువత,మహిళలు పాల్గొన్నారు.

article_28388576.webp
దూలుగొండ తల్లి జాతర కరపత్రాల ఆవిష్కరణ

27-01-2026

గుండాల, (విజయక్రాంతి): మండల పరిధిలోని రోళ్లగడ్డ గ్రామంలో ప్రతీ యేటా దూలుగొండ తల్లి జాతరను అంగరంగ వైభవంగా ఈసం వంశీయులు నిర్వహిస్తారు. ప్రతీ సంవత్సరం హోళి పున్నమిలో బుధ, గురు, శుక్రవారాలలో మా కుల దేవత దూలుగొండ తల్లిని కొలుస్తూ వస్తున్నామని, ఈ సంవత్సరం కూడా మార్చి 04, 05, 06 తేదీలలో వచ్చే బుధ, గురు, శుక్రవారాలలో మూడు రోజుల పాటు ఈ జాతరను కన్నుల పండువగా వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతరకు సంబంధించిన కరపత్రాలను ఈసం కృష్ణ(టీచర్), ఈసం సారయ్య(ప్రొఫెసర్), డిస్కో వెంకన్న(టీచర్)లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈసం వంశీయులు పాపారావు, కృష్ణ, ఉదయ్, కార్తీక్, చంద్రశేఖర్, పాణి, హరికృష్ణ, రాజేష్, వడ్డెలు ప్రభాకర్, వసంత రావు తదితరులు పాల్గొన్నారు.

article_12281312.webp
హక్కులతో పాటు బాధ్యతలు ముఖ్యం

27-01-2026

భూదాన్‌పోచంపల్లి, జనవరి 26: గణతంత్రం అంటే కేవలం హక్కులే కాదని, ప్రతి పౌరుడికి బాధ్యత కూడా ఉంటుందని విజ్ఞా న్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో సోమవారం 77వ గణతంత్ర దినో త్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో ప్రొఫెసర్ వైవీ దాసే శ్వర రావు మాట్లాడుతూ.. మన దేశంలో వివిధ భాషలు, రాష్ట్రాలు ఉన్నప్పటికీ దేశం విషయంలో మాత్రం అందరం ఒక్కటేనని అన్నారు. నగరం, గ్రామం అనే తేడా లేకుం డా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని సూచించారు.

article_36949377.webp
సమస్యలు పరిష్కారించాలని అధికారులకు ఆదేశం

20-01-2026

ఆలేరు, జనవరి 19 (విజయక్రాంతి): భువనగిరి కలెక్టర్ ఆఫీస్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల(రెవెన్యూ) అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు, సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ భాస్కర్ రావు వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 29 అర్జీలను స్వీకరించారు, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.