రక్తదానానికి యువత ముందుకు రావాలి
22-12-2025
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడటానికి యువత ముందు కు రావాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచం పల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్, ఎస్ఏసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించా రు. ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. సుమారు 120 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేశారు.