ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి
ఆలేరు, మార్చి 12: ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పై పూర్తి అవగాహన చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు గ్రామాలలో, వార్డులలో అందించి జిల్లాను అభివృద్ధిలో ముందు ఉంచాల్సిన బాధ్యత సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, చైర్ పర్సన్ లపై ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లు అన్నారు.
13-03-2026