15 June, 2026 | 8:15 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

Districts - Jogulamba Gadwal

article_36391093.webp
ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం

అలంపూర్ జూన్ 15: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) అలంపూరు మండలం ర్యాలంపాడు గ్రామానికి వెళ్లే దారిలో తుంగభద్ర బ్రిడ్జి పక్కన ఉన్న ప్రాచీన శివాలయం(Shiva Temple) గుప్తనిధుల వేటగాళ్ల దుశ్చర్యకు గురైంది. ఆదివారం అర్ధరాత్రి వేళ దుండగులు ఆలయ గర్భగుడి, ఆవరణలో తవ్వకాలు చేపట్టి, విగ్రహాలను ధ్వంసం చేసి బయటకు విసిరేసినట్లు స్థానికులు ఆరోపించారు. గర్భగుడిలో గొయ్యి తవ్విన ఆనవాళ్లు కనిపించాయి.గ్రామ చరిత్రకు గుర్తుగా నిలిచిన ఈ పురాతన ఆలయాన్ని రక్షించాలని,తవ్వకాలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.పురావస్తు శాఖ అధికారులు స్పందించి, ఆలయ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

15-06-2026