నాలుగు నెలల జీతాలు అడిగిన పాపానికి ఉద్యోగం ఊడింది..?
గద్వాల,(విజయక్రాంతి): గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం గ్రామంలో తీవ్ర విషాద ఘటన గురువారం చోటు చేసుకుంది. గత ఏడు సంవత్సరాలుగా గ్రామపంచాయతీ వర్కర్గా విధులు నిర్వహిస్తున్న రాజు అనే కార్మికుడు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని గ్రామ సెక్రటరీ శంషాద్ బేగం , గ్రామ సర్పంచ్ ను పలుమార్లు వేడుకున్నాడు. అయితే ఆయనకు సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగం కోల్పోవడం, కుటుంబ పోషణ కష్టమవడం వల్ల తీవ్ర మనస్థాపానికి గురైన రాజు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
22-05-2026