calender_icon.png 26 July, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_42499317.webp
రోగులకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలి

24-07-2025

ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్(District Collector B.M. Santosh) అన్నారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రభుత్వ ఆసుపత్రులు, పీ.హెచ్.సీల పనితీరుపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపి శాతం ఎక్కువగా ఉండేలా వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన పాటించేందుకు బయోమెట్రిక్ తప్పక అమలు చేయాలని, ఆసుప్రతిలో డెలివరీల సంఖ్యను పెంచేందుకు అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుని, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హై రిస్క్ కేసుల హిస్టరీని పరిశీలించుకుని తగిన వైద్య సేవలను అందించాలన్నారు.

article_30765680.webp
యువకుడి ఇంటి ముందు యువతి ధర్నా

24-07-2025

గద్వాల, (విజయక్రాంతి): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడి ఇంటి ముందు యువతి ధర్నా చేసింది. రెండు రోజులుగా ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. బాధితురాలు ప్రియాంక తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ గౌడ్ హైదరాబాద్ లో 2023 లో కాంపీటీషన్ ఉద్యోగ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందన్నారు. తనను 2024లో వివాహం చేసుకున్నాడని, పోలీస్ ఉద్యోగం రావడంతో వివాహం చేసుకుంటానని నమ్మిస్తూ వచ్చాడని బాధితురాలు తెలిపింది.

article_89229622.webp
రెవిన్యూ సేవలను వేగవంతంగా నిర్వహించాలి

23-07-2025

జిల్లాలో రెవిన్యూ సేవలను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్(District Collector B.M. Santosh) అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు భూ-భారతి, రేషన్ కార్డుల ధృవీకరణ, మీ - సేవ దరఖాస్తులు, ఎఫ్-లైన్ పిటిషన్లపై అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన రెవిన్యూ సేవలు ఆలస్యం కాకుండా నిబద్ధతతో చేయాలని అన్నారు. భూమి సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో చూస్తోందని, రెవిన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అన్ని దరఖాస్తులు పూర్తిగా వంద శాతం ఆన్ లైన్ నమోదు చేయాలని అన్నారు. మీసేవ ద్వారా 2022 సంవత్సరం వరకు దరఖాస్తు చేసిన వివిధ సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉంచకుండా, ఒక వారం లోపల పరిష్కరించాలని అన్నారు.