calender_icon.png 21 January, 2026 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_28982459.webp
విద్య, వైద్య రంగాల అభివృద్ధికి రూ.4కోట్లు వెచ్చించడం సంతోషకరం

21-01-2026

అలంపూర్ జనవరి 20: గ్రామాలను దత్తత తీసుకుని ఎస్బీఐ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఎస్బి ఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి స్వగ్రామమైన పెద్ద పోతులపాడు గ్రామంలో ఎస్బిఐ ఫౌండేషన్, భవిష్య భారత్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో చేపట్టిన గ్రామ సేవ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎంపీ మల్లు రవితో పాటు ఎమ్మెల్యే విజయుడు, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్బీఐ తెలంగాణ రాష్ట్ర సిజిఎం రాధాకృష్ణన్ పాల్గొన్నారు.

article_77025465.webp
టెంకాయల సంచిని లాక్కోవడం సరైన పద్ధతి కాదు

21-01-2026

అలంపూర్ జనవరి 20: అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలకు టెంకాయలు కొట్టే సమయంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్పను అడ్డుకుని టెంకాయల పంచిని లాక్కోవడం ఎమ్మెల్యే విజయుడుకు తగదని ఎంపీ మల్లు రవి అన్నారు.మంగళవారం పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల అనంతరం ఎంపీ మల్లు రవి ప్రెస్ మీట్ లో ఈ సంఘటనపై ప్రస్తావిస్తూ ...ప్రోటోకాల్ విషయంలో నేను వ్యతిరేకిని కాను అన్నారు.ఇక్కడికి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ నాయకులు టెంకాయలు కొట్టడం సహజం ఎంపీగా ప్రోటోకాల్ ఉన్న నాకే టెంకాయ ఇవ్వకుండా సంచి లాక్కోవడం ఏంటనిఎమ్మెల్యే విజయుడికి ఇది పద్ధతి కాదని చెప్పారు.

article_81306990.webp
మాదాసి కురువ, మదారి కురువ సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరణ

15-01-2026

అయిజ, జనవరి 14: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మునిసిపాలిటీలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మాదాసి కురువ - మదారి కురువ సంక్షేమ క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశామని గద్వాల జిల్లా మాదాసి కురువ సంఘం అధ్యక్షులు పుల్లూరు వెంకటేష్ అన్నారు. ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ మాదాసి కురువ - మదారి కురువల ఐక్యతకు నిదర్శనమని భవిష్యత్తులో మాదాసి కురువ మాదారి కురువలకు ఏ సమస్య వచ్చినా సంఘటితంగా పోరాడి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని వెంకటేష్ అన్నారు. ఈకార్యక్రమంలో తిక్కయ్య, మధు,రవి ప్రకాష్, మల్లికార్జున మొదలగు వారు పాల్గొన్నారు.

article_59450350.webp
అయిజ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

14-01-2026

అయిజ, జనవరి 13: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అయిజను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని అయిజ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని టీపిసిసి అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి అన్నారు.రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ నేత సంపత్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం అయిజ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయిజ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు.గత పదేళ్ల పాలనలో టిఆర్‌ఎస్ అయిజను సర్వ నాశనం చేసిందని అభివృద్ధిలో పూర్తిస్థాయిలో వెనుకబడిందని అన్నారు.