17 July, 2026 | 11:45 PM
Breaking News
గద్వాల, జూలై 16: వరుసగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గద్వాల మండలం చేనుగొనిపల్లి గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో వానదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తూ వాన పాటలు పాడుతూ బిక్షాటన చేపడుతున్నారు.
17-07-2026
మల్దకల్, జూలై 16: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతిరోజూ ప్రభుత్వ పాఠశాలకు నడిచి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దూరం నడవడం వల్ల అలసట, కాళ్ల నొప్పులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
అలంపూర్ జూలై 16: జోగులాంబ గద్వాల జిల్లా రాజోళి పరిసరాల్లో తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపు జోరుగా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో విషాదం చోటు చేసుకుంది. వాటర్ హీటర్ కు కరెంట్ షాక్ తగిలి 26 ఏళ్ల వివాహిత మంజుల భాయి మృతి చెందారు.ఈ ఘటన బుధవారం రాత్రి సమయంలో జరిగింది. మంజుల భాయి స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్లారు.
16-07-2026
గద్వాల టౌన్, జూలై 15: ప్రేమించి వివాహం చేసుకున్న అనంతరం భర్త తనను ఇంట్లోకి తీసుకెళ్లలేదని ఆరోపిస్తూ ఓ యువతి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఘటన గద్వాల మండలం అనంతపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
అలంపూర్, జూలై 15: ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ఉపాధి హామీ పథకం కింద నాటిన మొక్కల సంరక్షణ లేక బూడిదవుతున్నాయి. అలంపూర్ చౌరస్తా నుంచి ఉండవల్లి వైపు వెళ్ళే ప్రధాన రహదారి ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఒకవైపు మొక్కలు పచ్చగా పెరిగి కనిపిస్తుండగా, మరోవైపు పూర్తిగా వాడిపోయి కనిపించడం అధికారుల పర్యవేక్షణపై అనుమానాలకు తావిస్తోంది.
గట్టు, జులై 15: భారత్మాల జాతీయ రహదారి నిర్మాణంలో స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరసన దీక్షలు గురువారం నాటికి 150వ రోజుకు చేరుకున్నాయి. కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారిపై అండర్పాస్ ఏర్పాటు చేయడంతో పాటు రాయపురం స్టేజీ సమీపంలోని రెండు వరుసల రోడ్డు వద్ద వంతెన (బ్రిడ్జి) నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
గద్వాల, జులై 15: గట్టు మండల కేంద్రంలో పురాతన నిధుల వెలికితీత తీవ్ర సంచలనం రేపింది. గ్రామంలోని ఓ పాత ఇంటిని కూల్చి మరమ్మతులు చేపడుతుండగా, తవ్వకాల సమయంలో కూలీలకు పురాతన వెండి నాణేలు, బంగారు ఆభరణాలు లభించినట్లు సమాచారం.
గద్వాల, జూలై 15: శెట్టి ఆత్మకూర్ గ్రామంలో సంచలనం సృష్టించిన డోజర్ రాజు హత్య కేసును గద్వాల రూరల్ పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించారు.తండ్రి హత్యకు ప్రతీకారంగా పథకం ప్రకారం గుంటిపల్లి రాజు అలియాస్ డోజర్ రాజును కర్రలతో కొట్టి హత్య చేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వై. మొగులయ్య బుధవారం వెల్లడించారు.
గద్వాల, / మల్దకల్ జూలై 14 : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని కుర్తి రావులచెరువు సమీపంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీల ఏర్పాటు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది.
15-07-2026
గద్వాల, జూలై 14 (విజయక్రాంతి)/గద్వాల/అలంపూర్/మల్దకల్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలతో పాలమూరు రైతుల కాళ్లు కడుగుతుందని చెప్పారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని కుర్తి రావులచెరువు సమీపంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీల ఏర్పాటు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సరిత తిరుపతయ్య వర్గం కార్యకర్తలు తమ నాయకుల ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో పరస్పరం వాగ్వాదానికి దిగారు.
14-07-2026