పురపాలనలో అతివలదే ఆధిపత్యం
19-02-2026
మహబూబాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల నిర్వహించిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కౌన్సిలర్లు, వైస్ చైర్పర్సన్, చైర్ పర్సన్లు గా అతివలు ఎన్నికయ్యారు. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 12 చైర్పర్సన్లకు గాను మహబూబాబాద్, ములుగు, జనగామ, నర్సంపేట, కేసముద్రం, మరిపెడ, డోర్నకల్ ఏడు మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ పదవుల ను అతివలు కైవసం చేసుకున్నారు.