శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్
25-06-2025
మహబూబాబాద్, (విజయక్రాంతి): శాంతి భద్రతల(Peace and security) పరిరక్షణలో భాగంగా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశానుసారం బయ్యారం మండలం రామచంద్రాపురంలో కార్డన్ సెర్చ్(Cordon and search) నిర్వహించినట్టు ఎస్ ఐ కొగిళ్ళ తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వచేసిన 7 వేల రూపాయల విలువైన మద్యం, 5వేల రూపాయల విలువైన గుట్కా పాకెట్స్, 10 లీటర్ల గుడుంబా, 500 లీటర్లు బెల్లం పానకం పట్టుకొని నలుగురి పైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే సరైన ధృవ పత్రాలు లేని 20 వాహనాలను సీజ్ చేశారు. గ్రామస్థులకు ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్ గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించి, ప్రభుత్వ నిషేధిత గుడుంబా, గంజాయి, గుట్కా, నల్ల బెల్లం, గేమింగ్ దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఐ పుల్లారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.