calender_icon.png 25 June, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_43987405.webp
శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్

25-06-2025

మహబూబాబాద్, (విజయక్రాంతి): శాంతి భద్రతల(Peace and security) పరిరక్షణలో భాగంగా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశానుసారం బయ్యారం మండలం రామచంద్రాపురంలో కార్డన్ సెర్చ్(Cordon and search) నిర్వహించినట్టు ఎస్ ఐ కొగిళ్ళ తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వచేసిన 7 వేల రూపాయల విలువైన మద్యం, 5వేల రూపాయల విలువైన గుట్కా పాకెట్స్, 10 లీటర్ల గుడుంబా, 500 లీటర్లు బెల్లం పానకం పట్టుకొని నలుగురి పైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే సరైన ధృవ పత్రాలు లేని 20 వాహనాలను సీజ్ చేశారు. గ్రామస్థులకు ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్ గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించి, ప్రభుత్వ నిషేధిత గుడుంబా, గంజాయి, గుట్కా, నల్ల బెల్లం, గేమింగ్ దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఐ పుల్లారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

article_76715130.webp
జీడిమెట్ల ఘటనతో ఇనుగుర్తిలో విషాదం

24-06-2025

హైదరాబాదు నగరంలోని జీడిమెట్ల(Jeedimetla Tragedy)లో పదో తరగతి చదువుతున్న బాలిక తన ప్రేమకు అడ్డు చెప్పిందని ఆక్రోశంతో ప్రియుడితో కలిసి తల్లిని చంపిన ఘటన... మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో తీవ్ర విషాదం నెలకొంది. కన్న కూతురి చేతిలో హతమైన తల్లి సట్ల అంజలి పుట్టినిల్లు ఇనుగుర్తిలో కలకలం సృష్టించింది. ఇనుగుర్తికి చెందిన సట్ల ధనమ్మ, మల్లయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు శోభ, అంజలి, జ్యోతి కాగా, తండ్రి మల్లయ్య మరణంతో తల్లి ధనమ్మ కూడా అంజలితో 10 ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ కు వెళ్లిపోయారు. కరోనా సమయంలో ఒకసారి ధనమ్మ తన కుమార్తె అంజలి మనవరాల్ల కలిసి ఇనుగుర్తి కి వచ్చి కరోనా లాక్ డౌన్ తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

article_31992415.webp
నారాయణపురం రైతుల సమస్యలు పరిష్కరించాలి

24-06-2025

మహబూబాబాద్ జిల్లాలో ధరణి వల్ల తీవ్రంగా నష్టపోయిన నారాయణపురం రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని, రికార్డులను సరిచేసి అర్హులైన రైతులకు పట్టా పాస్ పుస్తకాలు అందజేసి, రైతు భరోసా, రైతు బీమా తదితర పథకాలను వర్తింపజేయాలని రాష్ట్ర సచివాలయంలో సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్(CCLA Commissioner Lokesh Kumar)ను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత ప్రభుత్వ హాయంలో నారాయణపురం రైతులకు గతంలో ఉన్న పట్టా పాస్ పుస్తకాలు పూర్తిగా రద్దు అయ్యాయని, ధరణిలో సాగు చేసుకుంటున్న భూములను అడవిగా నమోదు చేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ రికార్డుల నుండి అడవి తొలగించారని అయితే చాలామంది రైతులకు కొత్తగా పాస్ పుస్తకాలు ఇవ్వలేదని కొందరికి సరిపెట్టారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

article_58950403.webp
మానుకోట జిల్లాలో ఘనంగా ‘రైతు భరోసా’ సంబరం

24-06-2025

రైతు భరోసా వేడుకలు మానుకోట జిల్లాలో సంబరంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో రైతు వేదికల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. మహబూబాబాద్ పట్టణంలోని ఏటిగడ్డ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. సీఎం ప్రసంగాన్ని ఆధ్యాంతం రైతులు ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ... వానాకాలం 2025 కి సంబంధించి జిల్లాలో 2,05,789 మంది రైతులకు రైతు భరోసా రూపాయలు 243, 45,70,876 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.

article_89662741.webp
రైతు వేదిక వద్ద రైతుల నిరసన

24-06-2025

ధరణిలో తమ సాగు భూములను అడవిగా నమోదు చేయడంతో రైతుబంధు, రైతు భరోసా పథకాలకు దూరమవుతున్నామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యకు పరిష్కారం చూపి, సాగు చేసుకుంటున్న భూములను రికార్డుల్లో నమోదు చేసి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి, రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైతు వేదిక వద్ద నారాయణపురం గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ రవి మాట్లాడుతూ... గత ప్రభుత్వ హాయంలో నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం గ్రామంలో ఉన్న తమ గ్రామాన్ని కేసముద్రం మండలానికి మార్చారని, ఆ తర్వాత భూ ప్రక్షాళన సమయంలో తమ గ్రామ రైతులు సాగు చేసుకుంటున్న భూములను రెవిన్యూ అధికారులు అడవిగా పేర్కొనడం వల్ల అప్పటివరకు ఉన్న పట్టా పాస్ పుస్తకాలు, పహాని రికార్డులు వినియోగించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.

article_25349137.webp
ఇరాన్ పై అమెరికా దాడి పట్ల వామపక్షాల నిరసన

24-06-2025

ఇరాన్ పై అమెరికా దాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్(US President Donald Trump) దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు సాదుల శ్రీనివాస్, మండల వెంకన్న, పాయం చిన్న చంద్రన్న, గౌని ఐలయ్య పెరుగు కుమార్, మదార్ మాట్లాడుతూ... ఇరాన్ పై అమెరికా వెంటనే దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రెండు వారాల్లో ఇరు దేశాల మధ్య శాంతి చేస్తానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు అమెరికా ఇరాన్ పై దాడులకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. చమురు నిల్వల కోసం అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తుందన్నారు.

article_86999367.webp
మరో రోడ్డుకు మోక్షం..!

24-06-2025

మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలో మరో రోడ్డు విస్తరణ పనులకు మోక్షం లభించింది. కేసముద్రం-గూడూరు ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి(Former MLA Vem Narender Reddy) కృషితో కేసముద్రం పట్టణంలోని ఉప్పరపల్లి చౌరస్తా నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు విస్తరణ పనులను గుత్తేదారు ప్రారంభించారు. ఇప్పటికే అంబేద్కర్ సెంటర్ నుండి కోరుకొండ పల్లి క్రాస్ రోడ్డు వరకు పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపట్టగా, తాజాగా మరో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడం, బైపాస్ రోడ్డును విస్తరించడంతో పట్టణ రోడ్లన్నీ విశాలంగా మారుతున్నాయి.

article_78407353.webp
ప్రభుత్వ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

24-06-2025

మహబూబాబాద్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి వేగంగా వైద్యం అందించాలని సూచించారు. హాస్పిటల్ లోని మెడికల్, ఫీవర్, క్యాజువాలిటీ, ఐసీయూ, మెడికల్ కేర్, పిరియాడిటిక్, జనరల్ సర్జికల్ వార్డు, మెడికల్ స్టోర్, డయాలసిస్ తదితర వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న పేషెంట్ ధ్రవిడ్, ఆలన సెంటర్ లో క్యాన్సర్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్, హోమ్ కేర్ లతో మాట్లాడారు.