వేగం పుంజుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
18-06-2025
మహబూబాబాద్, జూన్ 17 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రభుత్వం ఇందిరమ్మ ఇం డ్లను మంజూరు చేయగా, ఎమ్మెల్యేలు జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఇండ్లను కేటాయించి, తొలి విడత ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలను ఎంపిక చేసి అందులో, ప్రధమ ప్రాధాన్యం పూర్తిగా పేదలకు కల్పించి ప్రొసీడింగ్ కాపీలను అందజేసి, ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు.