22 April, 2026 | 7:19 PM

Breaking News

ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు   •   గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •   నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం   •  

Districts - Warangal

article_85669230.webp
“నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన

వరంగల్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): ప్రజాపాలన–ప్రగతి కార్యాచరణలో భాగంగా జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో పెట్రోల్ బంక్ యజమానులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని,ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయడానికి “నో హెల్మెట్- నో పెట్రోల్” అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని పెట్రోల్ బంక్ యజమాన్యాన్ని ఆదేశించారు.పెట్రోల్ బంకులకు వచ్చే వాహనదారులకు హెల్మెట్ అవసరంపై అవగాహన కల్పించాలని, నియమాలు పాటించే వారిని ప్రోత్సహించాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని, ప్రజల్లో భద్రతపై చైతన్యం పెంచడంలో పెట్రోల్ బంక్ యజమానులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

18-04-2026