మాట నిలబెట్టుకోకుంటే సీఎం పతనం తప్పదు
17-03-2025
భీమదేవరపల్లి మార్చి 16 (విజయ క్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అమలు తర్వాతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఉద్యోగా ఫలితాలు, నియాకాలు నిలుపుదల చెప్పట్టాలని డిమాండ్ తో ఎమ్మా ర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబెడ్కర్ కూ డలి వద్ద నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రేణిగుంట్ల బిక్షపతి మాదిగ ఎమ్మార్పీ హు స్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, మరియు ఇతర ఉద్యోగ నియామకాల పరీక్ష ఫలితాలు విడుదల చేస్తూ మాదిగల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.