calender_icon.png 19 March, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_88206739.webp
మాట నిలబెట్టుకోకుంటే సీఎం పతనం తప్పదు

17-03-2025

భీమదేవరపల్లి మార్చి 16 (విజయ క్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అమలు తర్వాతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఉద్యోగా ఫలితాలు, నియాకాలు నిలుపుదల చెప్పట్టాలని డిమాండ్ తో ఎమ్మా ర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబెడ్కర్ కూ డలి వద్ద నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రేణిగుంట్ల బిక్షపతి మాదిగ ఎమ్మార్పీ హు స్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, మరియు ఇతర ఉద్యోగ నియామకాల పరీక్ష ఫలితాలు విడుదల చేస్తూ మాదిగల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.

article_76282506.webp
వర్గీకరణ అమలు చేశాకే నియామకాలు చేపట్టాలి

15-03-2025

హనుమకొండ, మార్చి 14 (విజయక్రాంతి): ఎస్సీల వర్గీకరణ అమలు చేశాకే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పిఎస్ మాజీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు బొడ్డు దయాకర్ మాదిగ అన్నారు. ఏకశిలా పార్కు వద్ద ఎమ్మార్పిఎస్, ఎంఎస్‌పి, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరు గుతున్న రిలే దీక్షలు 6 వ రోజుకు చేరింది. ఎమ్మార్పిఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బొడ్డు దయాకర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీలలో మాదిగల జనాభా అధికంగా ఉంటుంది కనుక మాదిగల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లలో వాట కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాకే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు.