calender_icon.png 16 October, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_28278640.webp
ఓట్ల చోరీపై హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్

16-10-2025

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీ(Vote Chori) జరిగిందంటూ తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్(BRS ) పార్టీ పిటిషన్ వేసింది. హైకోర్టులో బీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది శేషాద్రి నాయుడు(Advocate Seshadri Naidu) వాదనలు వినిపించారు. జూబ్లీహిల్స్ లో ఓట్ల చోరీ జరిగిందంటూ శేషాద్రి నాయుడు కోర్టుకు సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయని శేషాద్రి నాయుడు తెలిపారు. జూబ్లీహిల్స్ లో ఓట్ల చోరీ జరిగిందంటూ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(BRS candidate Maganti Sunitha), కేటీఆర్ పిటిషన్ వేశారు. జూబ్లీహిల్స్ తో సంబంధం లేనివారికి ఓట్లు ఉన్నాయని న్యాయవాది తెలిపారు. ఈ ఓట్ చోరీ పిటిషన్ పై ప్రత్యేక ఆదేశాలివ్వాల్సిన అవసరం లేదంటూ తెలంగాణ హైకోర్టు విచారణ ముగించింది.

article_62764321.webp
కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం

16-10-2025

హైదరాబాద్: ప్రజలను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు(Cyber ​​criminals) కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలు వెలుగుచూస్తున్నాయి. సైబర్ నేరగాళ్ల వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ లింక్స్ పంపుతున్నారు. ఆయా పథకాలకు అర్హత చెక్ చేసుకోవాలంటూ లింకులు పంపి మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. తొందరపడి ఎవరూ ఫేక్ లింక్స్ క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. అధికారిక వెబ్ సైట్లు మాత్రమే చూడాలని పోలీసులు సూచించారు. అపరిచితులు పంపే లింక్ లు , మోసేజ్ లకు స్పందించ వద్దని పోలీసులు సూచించారు.

article_82381583.webp
సున్నిపెంట హెలీప్యాడ్ కు చేరుకున్న ప్రధాని మోదీ

16-10-2025

హైదరాబాద్: కాసేపట్లో శ్రీశైలం మల్లన్నను ప్రధాని మోదీ(Prime Minister Modi) దర్శించుకోనున్నారు. భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి పూజలు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్ లో శ్రీశైలానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ వెంట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ శ్రీశైలం వెళ్లారు. కాసేపట్లో సున్నిపెంట హెలీప్యాడ్ కు ప్రధాని చేరుకుంటారు. సున్నిపెంట హెలీ ప్యాడ్(Sunnipenta helipad) నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలానికి వెళ్లనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా పలు చోట్ల వాహనాలు మళ్లించారు. ఈగల పెంటలో వాహనాలు నిలిపివేశారు. ప్రధాని పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శ్రీశైలం, సున్నిపెంట ప్రాంతాల్లో 1500 మంది పోలీసులు భద్రతలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానికి స్వాగతం పలికారు.

article_53106743.webp
అన్నపై తమ్ముడు కత్తితో దాడి.. అడ్డొచ్చిన వదిన మృతి

16-10-2025

హైదరాబాద్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురంలో(Kondapuram) దారుణం చోటుచేసుకుంది. అన్న రమేశ్ పై తమ్ముడు మేరుగుర్తి సురేశ్ కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన వదినపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. అన్న రమేశ్ కు తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అన్నదమ్ముల మధ్య ఘర్షణ ఆస్తుల వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.