డీఎస్ఆర్ గ్రూప్పై ఐటీ దాడులు
20-08-2025
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 19 (విజయ క్రాంతి): ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ డీఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ సంస్థపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు మంగళవారం తెల్లవారుజాము 5 గంటల నుంచి దాడులు ప్రారంభించారు. సీఆర్పీఎఫ్ బలగాల పటిష్ట బందోబస్తు మధ్య 15 ఐటీ బృందాలు ఈ మెగా ఆపరేషన్ను ప్రారంభించాయి. పన్ను ఎగ వేత, లెక్కల్లో చూపని భారీ ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు వచ్చిన పక్కా సమాచారంతో హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరులోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.