25 May, 2026 | 9:06 PM

News -

article_38529842.webp
మహిళల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 8,000 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి చెందుతోందని సీఎం చెప్పారు. 29 నెలల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు రూ. 10 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించామని తెలిపారు. కొంతమందికి మహిళల ఉచిత బస్సు ప్రయాణం నచ్చలేదని చెప్పారు. మహిళలను బస్సులకు యజమానులు చేశామని వెల్లడించారు. అంబానీ, అదానీ చేసే పెట్రోల్ వ్యాపారం మహిళలు కూడా చేయాలనే బంక్ లు పెట్టించామని పేర్కొన్నారు.

25-05-2026

article_56880414.webp
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పేలిన సిలిండర్.. షాప్ ధ్వంసం: వ్యక్తికి తీవ్రగాయాలు

హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా ఎక్స్ రోడ్స్(Kapra X Roads) సమీపంలో ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో(Fast Food Center) సోమవారం నాడు ఎల్.పీ.జీ (LPG) సిలిండర్ పేలిపోవడంతో(LPG cylinder exploded) ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ పేలుడు కారణంగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలోని స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడుకు గల కారణాలను అధికారులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

25-05-2026

article_42563176.webp
బక్రీద్ పై మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబై: మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే(Maharashtra Minister Nitesh Rane) వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వర్చువల్(VIRTUAL BAKRID)గా బక్రీద్ నిర్వహించుకోవాలని మహారాష్ట్ర మంత్రి సలహా ఇచ్చారు. కంప్యూటర్ లో మేక ఫొటో పెట్టుకుని వధిస్తున్నట్లు చూపాలని నితీష్ రాణే సూచించారు. అలాంటి సలహా చెప్పే ధైర్యం పర్యావరణ వాదులకు ఉందా? అని నితీష్ రాణే(Nitesh Rane) ప్రశ్నించారు. ఒక సారి చెప్పి చూడండి, తర్వాత వాళ్లు ఎక్కడెక్కడ తిరుగుతారో తెలుస్తోందన్నారు. హోళీ, దీపావళి పండగలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని హిందువులకు సలహాలు ఇస్తున్నారంటూ మంత్రి నితీష్ రాణే ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులకు కొందరు హిందువుల వల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

25-05-2026