calender_icon.png 13 December, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_71574629.webp
డ్రగ్స్ బానిసైన కూతురు.. తల్లి ఆత్మహత్యాయత్నం

13-12-2025

హైదరాబాద్: కూతురు డ్రగ్స్(Drug Addict) బానిసకావడంతో ఓ తల్లి(Mother) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో చోటుచేసుకుంది. ఈగల్ చీఫ్ రవికృష్ణ(Eagle Chief Ravikrishna) జీజీహెచ్ కి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఇన్‌స్టాగ్రామ్ లో కొందరు తన కూతుర్ని ట్రాప్ చేశారని తల్లి ఆరోపించింది. డ్రగ్స్ కి బానిసగా మార్చి వేధిస్తున్నారని తల్లి వాపోయింది. డ్రగ్స్ తీసుకోవడం ఆపమని, తల్లిదండ్రులు కూతురు పోన్ లాక్కున్నారు. ఆవేశంలో తల్లిదండ్రులపైనే కూతురు దాడి చేసింది. తట్టుకోలేక మెడిసిన్ ఓవర్ డోస్ తీసుకుని తల్లి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

article_79118420.webp
ప్రాణం తీసిన చేతబడి

13-12-2025

హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో క్షుద్రపూజలు(Black Magic) చేస్తున్నాడనే ఆరోపణలతో 55 ఏళ్ల వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం, కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని గాంధీ గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన దేశినేని భీమయ్య అనే వ్యక్తి డిసెంబర్ 10వ తేదీ రాత్రి హత్యకు గురయ్యాడు. ఒకే గ్రామానికి చెందిన ముత్తి నరేష్ (21), అతని అన్న మల్లేష్ (23) అనే నిందితులు భీమయ్యను హత్య చేసి, ఆ తర్వాత సాక్ష్యాలను నాశనం చేయడానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో అతని మృతదేహాన్ని కాల్చివేశారని ఆరోపణలు వచ్చాయి. ఖానాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అజయ్, కడెం సబ్-ఇన్‌స్పెక్టర్ సాయి కిరణ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నిందితుడు భీమయ్య క్షుద్రపూజలు చేస్తున్నాడని ఆరోపిస్తూ, తానే అతడిని చంపినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

article_86342583.webp
హైదరాబాద్‌ చేరుకున్న రాహుల్ గాంధీ

13-12-2025

హైదరాబాద్: రాహుల్ గాంధీ(Rahul Gandhi) శంషాబాద్ ఎయిర్ పోర్టుకు(Shamshabad Airport) చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ కోసం రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చారు. రాత్రి 7.15 గంటలకు రాహుల్ గాంధీ ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడనున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాత్రి 10.30 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. రేవంత్- మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్‌ రెడ్డి సూచించారు.