6 August, 2026 | 4:35 PM

News -

article_40921483.webp
తెల్లాపూర్‌లో తీవ్ర విషాదం: చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి

తెల్లాపూర్‌: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెల్లాపూర్‌ చెరువులో(Tellapur Lake) పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. చిన్నారి తండ్రి ఉదయ్ కిరణ్ ఉదయం శ్రీకర్ వండర్ నెస్ట్ ప్లే స్కూల్లో(Srikar Wonder Nest Play School) షణ్ముక్‌ను దింపాడు. ప్లే స్కూల్లో బోనాల ఉత్సవాలు జరుగుతుండగా బాలుడు బయటకి వెళ్లినట్లు తెలుస్తోంది. చెరువు పక్కనే స్కూల్ ఉండడంతో బాలుడు అందులో పడ్డాడు. స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నారి మృతికి ప్లే స్కూల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

06-08-2026

article_61306774.webp
ప్రొఫెసర్ జయశంకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పడంలో, ఉద్యమానికి దిశానిర్దేశం చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని సీఎం కొనియాడారు. తన జీవితమంతా తెలంగాణ ప్రజల హక్కులు, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అంకితం చేసిన గొప్ప విద్యావేత్త, మేధావి, ఉద్యమకారుడు ఆచార్య జయశంకర్ అన్నారు. జయశంకర్ సారు ఆశయాలు, విలువలు, నిబద్ధత నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని, తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజాసేవ లక్ష్యాల సాధనకు ఆయన చూపిన మార్గం ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని తెలిపారు.

06-08-2026