29 July, 2026 | 10:19 AM

News -

article_16845165.webp
లోయలో పడిన బస్సు - అమర్‌నాథ్ యాత్రికులకు గాయాలు

శ్రీనగర్: మధ్య కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లా(Ganderbal District) గుండ్ ప్రాంతంలో గల హరిగనివాన్ వద్ద 'ఎస్-మోడ్' (S-Mode) మలుపు సమీపంలో 40 మందికి పైగా భక్తులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడి, రోడ్డు పక్కనే ఉన్న లోతైన లోయలో పడిపోవడంతో కనీసం 39 మంది అమర్‌నాథ్ యాత్రికులు గాయపడ్డారు. పవిత్ర గుహాలయానికి సంబంధించిన బాల్తాల్ బేస్‌క్యాంప్‌కు దారితీసే పర్వత ప్రాంత శ్రీనగర్-లడఖ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దీనితో భద్రతా దళాలు, అత్యవసర సేవా సిబ్బంది, స్థానిక స్వచ్ఛంద కార్యకర్తలు వెంటనే భారీ స్థాయి సహాయక చర్యలను చేపట్టారు. గాయపడిన యాత్రికులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

28-07-2026