News

తెలంగాణలో కొత్త పెన్షన్లకు నేటితో గడువు
తెలంగాణలో కొత్త పెన్షన్లకు నేటితో గడువు

తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం అలర్ట్‌ జారీ చేసింది. కొత్తగా పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునే గడువు నేటితో (సెప్టెంబర్‌ 15) ముగియనుంది. అర్హులైన నిరుపేదలు ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే ఇవాళ్టిలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4.8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 25 నాటికి దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను పరిశీలించనున్నారు. పరిశీలన అనంతరం అక్టోబర్‌ 1 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

15-09-2026 | 09:29am

తెలంగాణకు అలర్ట్.. పలుచోట్ల భారీ వర్షాలు
తెలంగాణకు అలర్ట్.. పలుచోట్ల భారీ వర్షాలు

తెలంగాణ: తెలంగాణలో నేడు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.కొన్ని చోట్ల భారీ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

15-09-2026 | 08:41am