26 June, 2026 | 9:11 AM

News -

article_67050223.webp
సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: సికింద్రాబాద్(Secunderabad) పరిధిలోని సూర్య కిరణ్ బిల్డింగ్ లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్వప్నలోక్(Swapnalok Complex) కాంప్లెక్స్ పక్కనున్న సూర్యకిరణ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. మంటలను గమనించిన స్థానికులు, అక్కడి షాపుల్లోని సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

25-06-2026

article_85264805.webp
మైలార్‌దేవ్‌పల్లిలో అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్ట్

మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని మైలార్‌దేవ్‌పల్లిలో గల మెహఫిల్ హోటల్ సమీపంలో, దోపిడీ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, కమిషనర్ టాస్క్ ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం గురువారం ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్టు చేశాయి. పోలీసులు నిందితుల నుంచి రెండు నాటు తుపాకులు, ఏడు సజీవ తూటాలు, ఒక కారు, మూడు మొబైల్ ఫోన్లు మరియు రూ. 5 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసుల వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన ఒక కార్ల డీలర్, నాందేడ్‌కు చెందిన వ్యక్తితో సహా ఈ నిందితులకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నేర చరిత్ర ఉందని, నేరానికి పాల్పడే ఉద్దేశంతోనే వీరిద్దరూ ఆయుధాలతో సంచరిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

25-06-2026