calender_icon.png 4 February, 2026 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_24711849.webp
కాషాయ దళపతికి ఘనస్వాగతం

04-02-2026

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ బుధవారం తెలంగాణకు చేరుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి. హైదరాబాద్ విమానాశ్రయంలో సీనియర్ బీజేపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. నబిన్ తన రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పార్టీ కార్యకర్తలతో ముచ్చటించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) సి.హెచ్. శేఖర్ మరియు ఇతర సీనియర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

article_82079249.webp
కష్టపడ్డాం.. టికెట్ ఇవ్వరా?

04-02-2026

కామారెడ్డి, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి తల నొప్పిగా మారాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ తమకు టికెట్ దక్కలేదని కొం దరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసం హరణకు చివరి రోజు కావడంతో రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో టికెట్ దక్కని కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లాలో అధికార పార్టీ కాంగ్రెస్‌లో వర్గపోరుతో పలువురు నాయకుల అ నుచరులకు టికెట్లు గల్లంతయ్యాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో షబ్బిలి అనుచరులకు కొందరికి టికెట్లు గల్లంతయ్యాయి. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులకు కొందరికి చుక్కెదురయింది.