నిద్రిస్తున్న కుటుంబంపైకి దూసుకెళ్లిన ట్రక్కు— నలుగురు మృతి
బారాబంకి: ఉత్తరప్రదేశ్లోని(Uttar Pradesh) బారాబంకిలో(Barabanki) శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎండాకాలం కావడంతో వేడికి తట్టుకోలేక తమ ఇంటి బయట నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని వేగంగా వస్తున్న డంపర్ ట్రక్కు(Dumper truck) ఢీకొనడంతో నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతులను నీరజ్ (35), అతని కుమారుడు అనురాగ్ (13), కుమార్తెలు అన్షిక (10), అన్షు (6)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో నీరజ్ భార్య ఆర్తి (35) తీవ్రంగా గాయపడగా, మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో వేగంగా వస్తున్న డంపర్ మొదట ఒక చెట్టును ఢీకొట్టి, రోడ్డు పక్కన నిద్రిస్తున్న కుటుంబాన్ని తొక్కేసిందని వారి బంధువులు తెలిపారు.
23-05-2026