6 July, 2026 | 2:15 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

News -

article_33955612.webp
ములుగు జిల్లాలో భారీ చోరీ

వెంకటాపురం: ములుగు జిల్లా(Mulugu district) వెంకటాపురం మండలం గుంటూరుపల్లి గ్రామంలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగలు ఒక ఇంట్లోకి చొరబడి, విలువైన వస్తువులు, ముఖ్యమైన భూమి పత్రాలను అపహరించుకుపోయారు. ఈ ఘటన మోతే రమ నివాసంలో చోటుచేసుకుంది. దుండగులు సుమారు 22 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను అపహరించినట్లు బాధితులు ఆరోపించారు. అలాగే, ఇంట్లో భద్రపరిచిన కీలకమైన భూమి పత్రాలను కూడా వారు తీసుకువెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు(Police) కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించడానికి, దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.

06-07-2026

article_54022135.webp
విశాఖలో మత్స్యకారుల గల్లంతు.. గాలింపు చర్యలు ముమ్మరం

విశాఖపట్నం: విశాఖ తీరంలో బోటు ప్రమాదాలు ఆగడం లేదు. మూడు రోజులుగా సముద్రంలో అలజడి రేగుతోంది. ఇవాళ మరో బోటు మునిగి ఒకరు మృతి చెందారు. జూన్ 1న ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్లి గల్లంతైన ఆరుగురు మత్స్య కారుల కోసం విశాఖపట్నం జిల్లా యంత్రాంగం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. చేపల రేవుకు చెందిన ఏడుగురు మత్స్య కారులు గంగవరం పోర్ట్ వైపు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. శనివారం వేట ముగించుకుని తిరిగి వస్తుండగా వారి పడవ బోల్తా పడటంతో వారంతా సముద్రంలో చిక్కుకుపోయారు. పడవ నడిపే వ్యక్తి, యజమాని అయిన కారి చిన్న ఎటువంటి గాయాలు లేకుండా బయటపడగా, మిగిలిన వారు ఇంకా ఆచూకీ లేకుండా పోయారు.

06-07-2026

article_84820091.webp
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టు విచారణ

హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో( Sandhya Theatre stampede case) నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. కమిటల్ బాండ్ నేపథ్యంలో నిందితులంతా కోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. గత విచారణలో ఇద్దరు హాజరు కాకపోవడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. గత విచారణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. ఇవాళ కూడా అల్లు అర్జున్ వర్చువల్ గానే హాజరయ్యే అవకాశముంది. అల్లు అర్జున్(Allu Arjun) సినిమా షూటింగ్ నిమిత్తం ముంబయిలో ఉన్నారు. మొత్తం 23 మంది నిందితులు హాజరైతేనే తదుపరి విచారణ ఉంటుందని నాంపల్లి కోర్టు గతంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న విచారణపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

06-07-2026

article_73633139.webp
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఎందుకు పడిపోయింది? సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ కరెన్సీ( US dollar) బలపడటంతో, సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 10 పైసలు తగ్గి 95.28కి చేరుకుంది. దేశంలోకి కొత్తగా విదేశీ నిధులు ప్రవేశించినప్పుడల్లా, రూపాయి మరీ ఎక్కువగా బలపడకుండా, కేంద్ర బ్యాంకు ఆ అవకాశాన్ని తన రిజర్వ్ స్థితిని పునర్నిర్మించుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం ఉందని ఫారెక్స్ వ్యాపారులు ప్రకటించారు. అంతేకాకుండా, అమెరికా-ఇరాన్ శాంతి చర్చల పురోగతిపై అనిశ్చితి నెలకొనడం వల్ల మార్కెట్‌లో భౌగోళిక రాజకీయ రిస్క్ ప్రీమియం కొనసాగింది.

06-07-2026

article_36053288.webp
నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా? రికార్డు రూమ్‌లు సురక్షితం

నాంపల్లి: హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు(Nampally Criminal Court) మూడవ అంతస్తులోని ఒక గదిలో సోమవారం తెల్లవారుజామున సుమారు 1:00 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, రికార్డు రూమ్‌లకు వ్యాపించకుండా కాపాడారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు కోర్టుకు చేరుకుని, అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

06-07-2026