మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు
15-01-2026
కరింనగర్, జనవరి14(విజయక్రాంతి): త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు జిల్లాల అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. తుది ఓటర్ల జాబితా ను, పోలింగ్ భూత్ ల వివరాలను ఇప్పటికే వెల్లడించారు. ఈ నెల16న ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను వెలువరిం చనున్నారు. ఈ తంతు పూ ర్తయిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ సంక్రాంతి పండుగ తర్వాత విడుదలయ్యే సూచనలు కనబడుతున్నాయి. షెడ్యూల్ వి డుదలకు ముందే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.కరింనగర్ జిల్లాలో కరింనగర్ కార్పొరేషన్, హుజురాబాద్, జ మ్మికుంటా, చొప్పదండి మున్సిపాలిటీ లు, పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానా బాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి.