2 May, 2026 | 3:23 PM

News -

article_53946749.webp
అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్

హైదరాబాద్: మనం చేసే తప్పులు ఎవరూ చూడడం లేదని రెచ్చిపోతాయి. ఈ నేపథ్యంలోనే నేరగాళ్లు ఎవరు చూస్తాలేరని విచ్చలవిడిగా హత్యలు, నేరాలు, చోరీలు, చైన్ స్నాచింగ్ లు చేస్తుంటారు. అలాంటి వారిని నిఘా నేత్రాలు(CCTV footage) పట్టిస్తాయి. తాజాగా అత్తను ఓ అల్లుడు హెల్మెట్‌తో కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన స్నేహిత్(28) అనే యువకుడు హైదరాబాద్ కు చెందిన కావ్య అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఏప్రిల్ 29వ తేదీన కావ్య తల్లి అరుణ(39)ను బండిపై తీసుకెళ్తూ అల్లుడు స్నేహిత్ హెల్మెట్‌తో కొట్టాడు.

02-05-2026

article_59750517.webp
శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి

హైదరాబాద్: శంషాబాద్ వద్ద(Shamshabad Road Accident ) ఓఆర్ఆర్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు సిరిసిల్ల వాసుల పార్థివ దేహాలకు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. నిన్న శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఇద్దరు, వారి భార్యాపిల్లలు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మ‌ృతదేహాలను సిరిసిల్లకు తరలించేందుకు 2 అంబులెన్సులను ఏర్పాటు చేశారు.

02-05-2026

article_78677947.webp
ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ లో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బాల్కొండకు చెందిన సాయికుమార్ తో యువతి ప్రేమలో ఉంది. సాయి అంతకుముందే తనకు పెళ్లి అయ్యిందనే విషయాన్ని దాచిపెట్టాడు. సాయికుమార్ పెళ్లి విషయం దాచిపెట్టి మోసం చేశాడని యువతి మనస్థాపం చెందింది. మోసం చేసిన సాయికుమార్ పై యువతి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. సాయికుమార్ పై ఫిర్యాదు చేసి.. స్టేషన్ భవనంపై కిందకి దూకింది. తీవ్రంగా గాయపడిన యువతిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

02-05-2026

article_44110236.webp
బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో గల రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన రీపోలింగ్‌లో ఓటింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 16 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మగ్రాహత్ పశ్చిమ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాలలో, ఎన్నికల అవకతవకలు జరిగినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో ఒక రోజు క్రితం తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశించిన డైమండ్ హార్బర్‌లోని నాలుగు పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. బెంగాల్‌ రీపోలింగ్‌లో ఉదయం 9 గంటల వరకు సుమారు 16.23 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు.

02-05-2026

article_82734380.webp
బెంగాల్‌లోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో భాగంగా ఏప్రిల్ 29న పోలింగ్ జరిగిన 15 కేంద్రాల్లో శనివారం రీపోలింగ్(West Bengal Repolling) జరుగుతోంది. పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి (EC) ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అక్రమాలకు సంబంధించిన నివేదికల నేపథ్యంలో, ఎన్నికల సంఘం ఒక రోజు ముందే ఈ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మగ్రాహట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లోనూ, డైమండ్ హార్బర్‌లోని నాలుగు కేంద్రాల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని అధికారి తెలిపారు.

02-05-2026