calender_icon.png 2 January, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_14103535.webp
నీటి వాటాలపై ప్రజెంటేషన్

01-01-2026

హైదరాబాద్: నీటి పారుదలశాఖపై ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్(Minister Uttam Power Point Presentation) ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఇరిగేషన్ అధికారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు పాల్గొనున్నారు. కృష్ణా, గోదావరి జలాలు, ప్రాజెక్టులపై రేపు అసెంబ్లీలో చర్చ జరగనుంది. నీటివాటాలపై చర్చ దృష్ట్యా ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం ప్రజెంటేష్ ఏర్పాటు చేశారు. నదీ జలాల వివాదాలు, ప్రాజెక్టుల స్థితిగతులపై మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, ఇతర పథకాలపై వివరించనున్నారు.

article_70145984.webp
లడఖ్ ప్రధాన కార్యదర్శిగా ఆశిష్ కుంద్రా బాధ్యతలు

01-01-2026

లేహ్/జమ్మూ: సీనియర్ ఐఏఎస్ అధికారి ఆశిష్ కుంద్రా గురువారం లడఖ్ ప్రధాన కార్యదర్శిగా(Ladakh Chief Secretary) బాధ్యతలు స్వీకరించారు. కేంద్రపాలిత ప్రాంతం అంతటా సమర్థవంతమైన పాలన, పారదర్శక పరిపాలన, సమ్మిళిత అభివృద్ధికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారని అధికారులు తెలిపారు. ఏజీఎంయూటీ కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కుంద్రా(Senior IAS officer Ashish Kundra ), బుధవారం సర్వీస్ నుండి పదవీ విరమణ చేసిన పవన్ కోట్వాల్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత, కుంద్రా సమర్థవంతమైన పాలన, పారదర్శక పరిపాలన సమ్మిళిత అభివృద్ధికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. సంస్థాగత యంత్రాంగాలను బలోపేతం చేయడం, సేవా బట్వాడా మెరుగుపరచడం, అభివృద్ధి కార్యక్రమాల సకాలంలో అమలును నిర్ధారించడం అవసరాన్ని నొక్కి చెప్పారు.

article_87479059.webp
ఈగల్ ఫోర్స్ ప్రత్యేక తనిఖీలు

01-01-2026

హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా ఈగల్ ఫోర్స్(Eagle Force) ప్రత్యేక తనిఖీలు చేశారు. ఎక్సైజ్, పోలీసులతో కలిసి మూడు కమిషనరేట్లలో ఈగల్ ఫోర్స్ దాడులు చేసింది. 15 ఈగల్ ఫోర్స్ బృందాలు, 8 ఎక్సైజ్ బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయని అధికారులు వెల్లడించారు. పబ్ లు, రిసార్ట్ లలో 51 మందికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. తనిఖీల్లో నలుగురికి డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. వాహన తనిఖీల్లో 38 మందికి పరీక్షలు చేయగా ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. కూకట్ పల్లి మాల్ లోని డీజే ప్లేయర్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అర్ధరాత్రి టెస్టులు నిర్వహించారు. డీజే ప్లేయర్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. డ్రగ్స్ కొనుగోలుపై పోలీసుల విచారిస్తున్నారు.