1 July, 2026 | 11:32 AM

News -

article_60992292.webp
సరూర్‌నగర్‌లో పేలుడు.. ధ్వంసమైన ఇల్లు

హైదరాబాద్: సరూర్‌నగర్‌(Saroornagar) బాపూనగర్‌లో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ ఇంట్లో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు కానీ గృహోపకరణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్, సిలిండర్లు, ఫ్రిడ్జ్, గీజర్ అన్నీ సురక్షితంగా ఉండటం, అగ్ని ప్రమాద ఆనవాళ్లు లేకపోవడంతో పేలుడుకు కారణం మిస్టరీగా మారింది. వంటగదిలోని సామాగ్రి పూర్తిగా పాడైపోయింది. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, పేలుడుకు గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంటి నుండి ఆధారాలను సేకరించేందుకు 'క్లూస్ టీమ్'ను కూడా రంగంలోకి దించారు.

30-06-2026

article_68262394.webp
నితిన్ నబీన్ పర్యటన రాజకీయాలకే

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్(BJP National President Nitin Nabin) తెలంగాణ పర్యటన రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయాలకే పరిమితమైందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Government Whip Adi Srinivas) అన్నారు. తెలంగాణకు అవసరమైన మెట్రో రెండో దశ, రీజినల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవనం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Rangareddy Project), ఫ్యూచర్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర నిధులు, అనుమతులపై ఒక్క హామీ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం కోరిన ప్రాజెక్టులకు కేంద్రం వెంటనే ఆమోదం తెలిపి నిధులు విడుదల చేయాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం కేవలం గాలిలో మాటలేనని విమర్శించారు.

30-06-2026

article_35298282.webp
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ కొత్త సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్: తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజు(Telangana New CS Sanjay Jaju) మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ (MCRHRD) ఇన్‌స్టిట్యూట్, బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన మధ్యాహ్నం తర్వాత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు(K. Ramakrishna Rao) తన పొడిగించిన పదవీకాలం పూర్తి చేసుకుని పదవీ విరమణ చేసే జూన్ 30 నుంచి అమల్లోకి వచ్చేలా, జాజును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం లాంఛనంగా ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

30-06-2026