ఈ కాలభైరవుడిని పట్టించుకోరా?
రాణి రుద్రమదేవి కాలం నాటి చారిత్రక నేపథ్యాన్ని మోస్తున్న ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే సుమారు ఒక కిలోమీటర్ మేర ప్రమాదకరమైన కొండదారిలో ప్రయాణించాల్సి వస్తోంది. ఎత్తున రాళ్లు, ముళ్ల పొదలు, జారుడు బండల మధ్య నడుస్తూ భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
24-05-2026