శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు లారీలు ఢీ: డ్రైవర్ సజీవదహనం
శ్రీ సత్యసాయి జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) పెనుకొండ శివారులోని జాతీయ రహదారి 44పై సోమవారం రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఒక ట్రక్కు డ్రైవర్ సజీవ దహనమవ్వగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక కేంద్ర అధికారి వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ నుండి బెంగళూరుకు బంగాళాదుంపల లోడుతో వెళ్తున్న ఒక ట్రక్కును, గోధుమల లోడుతో వస్తున్న మరో ట్రక్కు వెనుక నుండి ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
25-05-2026