అజిత్ పవార్ అంత్యక్రియలు.. భారీగా వచ్చిన అభిమానులు
29-01-2026
బారామతి: విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం పుణె జిల్లాలోని బారామతిలో విద్య ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. అజిత్ పవార్ అంత్యక్రియలకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ శిండే, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, భారీగా అభిమానులు తరలి వచ్చారు. బుధవారం ఉదయం పూణే నుండి 100 కి.మీ దూరంలో ఉన్న బారామతి ఎయిర్స్ట్రిప్ సమీపంలో చార్టర్డ్ లియర్జెట్ కూలిపోవడంతో అజిత్ పవార్ మరణించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్ అటెండెంట్, ఒక వ్యక్తిగత భద్రతా అధికారి కూడా మరణించారు. గురువారం ఉదయం, అజిత్ పవార్ పార్థివ దేహాన్ని రాత్రంతా ఉంచిన బారామతిలోని పుణ్యశ్లోక్ అహల్యాదేవి ఆసుపత్రి నుండి, బారామతి సమీపంలో ఉన్న ఆయన స్వగ్రామమైన కాటేవాడికి తరలించారు.