APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా(Kadapa) పుల్లంపేటలో సోమవారం ఘోరప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Andhra Pradesh State Road Transport Corporation)కు చెందిన అల్ట్రా డీలక్స్ బస్సు లారీని ఢీకొనడంతో ఇద్దరు మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు. తిరుపతి నుంచి కడపకు వెళ్తున్న బస్సు, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఉడుమువారిపల్లి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు కుడి వైపున ఉన్న సుమారు ఆరు సీట్లు దెబ్బతిన్నాయని, దీనివల్ల ప్రాణనష్టం, గాయాలు సంభవించాయని పోలీసులు తెలిపారు.
22-06-2026