calender_icon.png 15 December, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_42266964.webp
భద్రాచలంలో సెల్ఫీ సూసైడ్ కలకలం

15-12-2025

హైదరాబాద్: భద్రాచలంలో మహాజన మహిళా సమైఖ్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స నిమిత్తం భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒక వివాదాన్ని పరిష్కరించే విషయంలో కొంతమంది దళిత సంఘం నాయకులు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఒక మహిళకు జరిగిన అన్యాయం విషయంలో తాను జోక్యం చేసుకున్నందుకు, గుండే సుహాసిని, తోకల దుర్గా ప్రసాద్, ముద్ద పిచ్చయ్య, కనక శ్రీను, టి. రమణయ్య అనే కొందరు వ్యక్తులు తనను వేధిస్తున్నారని లత ఆరోపించారు. ఈ విషయం స్థానిక పోలీసులకు కూడా తెలుసని చెప్పారు. ఆమె మరణానికి బాధ్యులైన వారిని ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని మేకల లత విజ్ఞప్తి చేసింది. ఈ ఘటన భద్రాచలంలో కలకలం రేపింది.

article_28060955.webp
కన్హా శాంతివనాన్ని సందర్శించిన చంద్రబాబు

15-12-2025

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతివనాన్ని ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) సోమవారం నాడు సందర్శించారు. శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ చంద్రబాబకు స్వాగతం పలికారు. కన్హా శాంతి వనంలో చంద్రబాబు, దాజీ మధ్య ప్రత్యేక భేటీ జరిగింది. కన్హా శాంతివనంలో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ధ్యానం, యోగా శిక్షణపై దాజీ బాబుకు వివరించారు. ఏపీలో హార్ట్ ఫుల్ నెస్ కార్యాలయం ఏర్పాటుపై చంద్రబాబు, దాజీ చర్చించారు.

article_12921146.webp
ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి

15-12-2025

హైదరాబాద్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ కాలనీ సమీపంలో రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన కారు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఢీకొట్టింది. మృతురాలిని ఐశ్వర్యగా గుర్తించారు. ఈ ప్రమాదంలో వైద్య విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె తండ్రికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఐశ్వర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రద్దీగా ఉండే రోడ్డుపై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

article_17358787.webp
రోడ్డుప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి

15-12-2025

కౌశాంబి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కౌశాంబిలో(Kaushambi) ఆదివారం రాత్రి ఒకే బైక్‌పై వెళుతున్న నలుగురు యువకులు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. వారిలో ముగ్గురు మరణించగా, నాల్గవ వ్యక్తిని ప్రయాగ్‌రాజ్‌లోని(Prayagraj) ఎస్ఆర్ఎన్ ఆసుపత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. గ్రామంలో జరిగిన ఆహ్వాన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నట్లు తెలిసింది. పశ్చిమషరీరా ప్రాంతంలోని బరైసా గ్రామంలో(Baraisa Village) నివసించే గోపి రైదాస్ కుమారుడు 22 ఏళ్ల జితేంద్ర, తన తండ్రికి చదువుతో పాటు వ్యవసాయంలో సహాయం చేశాడు. ఆదివారం రాత్రి 8:30 గంటలకు, అతను తన పొరుగువాడు, ప్రేమ్‌చంద్ కుమారుడు 29 ఏళ్ల శ్రీచంద్ర, మహేవాఘాట్‌లోని హినౌటా నివాసి రామ్మురత్ కుమారుడు 28 ఏళ్ల అనిల్, మరొక వ్యక్తితో కలిసి మంఝన్‌పూర్ వైపు వెళ్తున్నాడు. నలుగురూ ఒకే బైక్‌పై వెళ్తున్నారు.

article_65700738.webp
టోలిచౌకిలో యువకుడి హత్య.. కారణం అదే

15-12-2025

హైదరాబాద్: టోలిచౌకి పోలీస్ స్టేషన్(Tolichowki Police Station) పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పారామౌంట్ కాలనీ గేట్ నంబర్-4(Paramount Colony Gate Number-4)లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోదరుల మధ్య ఘర్షణ ఆపేందుకు వెళ్లి ఇర్ఫాన్(24) మృతి చెందాడు. నిందితుడు బిలాల్ ఇర్ఫాన్ ను కత్తితో పొడిచి హత్య చేశాడు. హంతకుడు బిలాల్ భార్యకి మృతుడు ఇర్ఫాన్ అన్న అద్నాన్ కి మధ్య ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బిలాల్, అద్నాన్ మధ్య గొడవ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న ఇర్ఫాన్ అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో బిలాల్ కత్తితో ఇర్ఫాన్ పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పడికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని టోలిచౌకి పోలీసులు పేర్కొన్నారు.

article_76645954.webp
దూసుకొచ్చిన మృత్యువు

15-12-2025

హైదరాబాద్: మెదక్-హైదరాబాద్ రహదారిపై(Medak-Hyderabad highway) సోమవారం ఉదయం కారు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. కొల్చారం మండలం పోతాంశెట్టి టీ జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న ఘన్‌పూర్‌లోని ఐఎంఎల్ డిపోలో హమాలీగా పనిచేసే శ్రీధర్, కాలినడకన రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న కారు అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శ్రీధర్ అక్కడికక్కడే మరణించాడు. కరీంనగర్‌కు చెందిన శ్రీధర్ గాంధీ మైసమ్మలో నివసిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మెదక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

article_60182216.webp
ఇక్కడ అహంకారం చెల్లదు

15-12-2025

తిరువణ్ణామలై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్(CM MK Stalin) బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి అమిత్ షా( Union Home Minister Amit Shah) మాత్రమే కాదు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల పూర్తి దళం వచ్చినా కూడా తమిళనాడు ఎన్నికలపై ప్రభావం చూపలేరని, కాషాయ పార్టీని ఓడించి డీఎంకేనే విజయం సాధిస్తుందని స్టాలిన్ తేల్చిచెప్పారు. అమిత్ షా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ, “ఇది తమిళనాడు. ఇక్కడ అహంకారం చెల్లదు. మీరు ప్రేమతో వస్తే, మేము మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటాము. మీరు అహంకారంతో వస్తే, మేము మిమ్మల్ని ప్రతిఘటించి ఓడిస్తాము” అని అన్నారు.

article_19790333.webp
బాండీ బీచ్‌లో కాల్పులు: 16కు పెరిగిన మృతుల సంఖ్య

15-12-2025

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో మృతుల(Death Toll Rise) సంఖ్య 16కు పెరిగింది. ఆదివారం నాడు సిడ్నీలో బాండీ బీచ్((Bondi Beach shooting))లో ఇద్దరు ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. బీచ్ లోకి ప్రవేశించి పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బీచ్ లో యూదులు హనుక్కా వేడుకలు(Hanukkah Celebrations) చేసుకుంటుండగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో చిన్నారితో పాటు ఓ పోలీసు అధికారి మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. యూదులపై కాల్పుల ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. గాయపడిన 38 మందికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

article_38041994.webp
శాంతివనానికి చంద్రబాబు

15-12-2025

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) సోమవారం నాడు శంషాబాద్ లోని కన్హా శాంతివనంలో(Kanha Shanti Vanam) పర్యటించనున్నారు. కన్హా శాంతివనం అధ్యక్షుడు దాజీతో చంద్రబాబు భేటీ కానున్నారు. వెల్ నెస్, మెడిటేషన్ సెంటర్, యోగా కేంద్రాలను ఆయన తిలకించనున్నారు. ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్, మెడిటేషన్ సెంటర్, బయోవార్ కేంద్రాలు, గోపీచంద్ స్టేడియం, హార్టిఫుల్ నెస్ స్కూల్ కేంద్రాలను చంద్రబాబు సందర్శించనున్నారు. అనంతరం శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం తిరిగి అమరావతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు,