calender_icon.png 16 September, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_87116975.webp
నేను కేటీఆర్ వెంటే ఉంటా: విష్ణువర్ధన్ రెడ్డి

15-09-2025

హైదరాబాద్: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. తెలంగాణ భవన్ లో వెంగళ్ రావు నగర్ డివిజన్ నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy ) మాట్లాడుతూ.. గతంలో చెప్పాను.. ఇప్పుడు చెప్తున్నాను.. నేను కేటీఆర్ ఎంటే ఉంటా.. కేటీఆర్ కు ప్రమోషన్ వస్తే.. రాజకీయంగా నాకూ ప్రమోషన్ వస్తుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాలుగా తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతలు చేసిందేమీ లేకపోయినా.. ప్రచారం చేసుకుంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని ప్రజలు నిలదీస్తున్నారని ఆయన వెల్లడించారు.

article_90196528.webp
మేధా పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

15-09-2025

హైదరాబాద్: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పరిధిలోని మేధా పాఠశాల(Medha School)ను సోమవారం విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. పాఠశాల విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపనున్నట్లు ఎంఈవో హరి చందన్(MEO Hari Chandan) వెల్లడించారు. మేధా పాఠశాల విద్యార్థులను ఇతర పాఠశాలలో చేర్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పాఠశాలలో 63 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మేధా పాఠశాల వద్ద పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల సీజ్ అయిన విషయం తెలియక ఈరోజు విద్యార్థులు బడికి వచ్చారు. పాఠశాల నుంచి పరీక్షలు నిర్వహిస్తారని సందేశం రావడంతో పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలకు తీసుకుని వచ్చారు.

article_56617431.webp
దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్ర అపూర్వం: సీఎం రేవంత్

15-09-2025

హైదరాబాద్: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి(Visvesvaraya Jayanti 2025) రోజున జరుపుకునే జాతీయ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్ర అపూర్వమని, వారి సృజనాత్మక ఆవిష్కరణలే జాతికి మార్గదర్శనం చేస్తున్నారని గుర్తుచేసుకున్నారు. ఇంజినీరుగా, దార్శనికుడిగా, విద్యాప్రదాతగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రత్యేకతను చాటారని కొనియాడారు. అత్యుత్తమ ఇంజనీరింగ్ సాంకేతికతతో వివిధ రంగాలలో ఆయన చేసిన కృషి భారతదేశ ఇంజనీరింగ్ రంగానికి ఆదర్శంగా నిలిచాయని సీఎం తెలిపారు. మూసీ వరదల నుంచి హైదరాబాద్ నగరాన్ని రక్షించేందుకు జల నియంత్రణ ప్రణాళికలు, ఎన్నో గొప్ప నిర్మాణాలు చేపట్టడంలో ప్రత్యేక చొరవ చూపించారని గుర్తుచేశారు.

article_87512000.webp
తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్

15-09-2025

హైదరాబాద్: హనుమకొండలో స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) సుబేదారి పోలీసులు గృహనిర్బంధం చేశారు. రఘునాథపల్లి మండలంలో రాజయ్య పర్యటన దృష్ట్యా గృహనిర్భంధం చేశారు. కడియం శ్రీహరిపై రాజయ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి(Kadiyam Srihari) రాజయ్య క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. రాజయ్యను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతలు పిలుపుతో రంగంలోకి దిగిన పోలీసులు రాజయ్యను ఇంట్లో నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ... బీఆర్‌ఎస్‌ నేతలపై అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. రైతుల కోసం తాను చేపట్టిన పోరాటాన్ని ఎన్ని అడ్డుంకులు వచ్చిన ఆపేది లేదని, రైతుల కోస తన పోరాటం కొనసాగుతోందని తేల్చిచెప్పారు. రాజయ్యను గృహనిర్బంధం చేశారన్న విషయం తెలుసుకున్న పార్టీ నేతలు ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

article_86391877.webp
గుండ్లపోచంపల్లిలో విషాదం.. గోడ కూలి కార్మికుడు మృతి

15-09-2025

హైదరాబాద్: పేట్ బషీరాబాద్‌లోని గుండ్లపోచంపల్లిలోని(Gundlapochampally) వీ కన్వెన్షన్ హాల్ వద్ద సోమవారం తెల్లవారుజామున గోడ కూలి ఒక వలస కార్మికుడు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, రాత్రిపూట కురిసిన భారీ వర్షాల తర్వాత తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు గగన్ (50) అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన వారిని చికిత్స కోసం సీఎంఆర్ ఆసుపత్రికి తరలించారు. బాధితులు అపర్ణ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యంలోని రెడీ-మిక్స్ ప్లాంట్‌లో పనిచేస్తున్న వలస కార్మికులని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వర్షాల ప్రభావంతో కూలిపోయిన కన్వెన్షన్ హాల్ గోడకు ఆనుకుని నిర్మించిన తాత్కాలిక టిన్ షెడ్లలో వారు నివసిస్తున్నారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తున్నారు.

article_68705162.webp
ఔటర్‌పై కారు బోల్తా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

15-09-2025

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్(Abdullapurmet ) వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు సరళ మైసమ్మ వద్దకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బెంగుళూరు గేట్ నుంచి పోచారం వైపు వెళ్తుండగా కారు బోల్తా పడిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.