పంచాయతీ పోరు.. 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్
14-12-2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 193 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల(Telangana second phase panchayat elections) రెండో దశ పోలింగ్ ఆదివారం ప్రారంభమై కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్(Polling Percentage) నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. 3,911 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం మొత్తం 12,782 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, వార్డు సభ్యుల స్థానాల కోసం 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 38,337 పోలింగ్ కేంద్రాలలో 57,22,465 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రాంరభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది.