16 June, 2026 | 12:36 AM

News -

article_27383776.webp
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. వ్యతిరేకించిన ఇజ్రాయెల్

జెరూసలేం: అమెరికా-ఇరాన్ మధ్య ప్రాథమిక శాంతి( US-Iran peace agreement) ఒప్పందాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకింది. సరిహద్దుల వెంబడి సైన్యాన్ని వెనక్కి పిలిచే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్(Israel ) తేల్చిచెప్పింది. బలగాల ఉపసంహరణకు విధించిన గడువు పాటించబోమని తెలిపింది. ఇదే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెప్పినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. దేశ భద్రత, సైన్యం మోహరింపుల్లో మార్పు ఉండబోదని ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్, సిరియా, గాజా సరిహద్దుల్లో దళాల మోహరింపు కొనసాగుతోందని ఇజ్రాయెల్ తెలింది. ఒత్తిళ్లున్నా లెబనాన్ నుంచి వైదొలగడాన్ని తిరస్కరించింది.

15-06-2026

article_80006440.webp
గోల్కొండలో యూట్యూబర్ హత్య కేసును చేధించిన పోలీసులు

హైదరాబాద్: గోల్కొండలో యూట్యూబర్(YouTuber) హత్య కేసును పోలీసులు చేధించారు. మసూద్ చాందీ హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నలుగురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రేమ వివాహమే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. బావమరిది, బంధువుల దాడిలో మసూద్ చాంధీ మృతి చెందింది. ఇనుప రాడ్లు, కత్తులతో ఇంట్లోకి చొరబడి మసూద్ పై దాడి చేశారు. దాడి ఘటనలో మసూద్ తండ్రికి గాయాలయ్యాయి. నిందితుల నుంచి కత్తి, ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

15-06-2026

article_17322721.webp
పవన్ కళ్యాణ్ బీజేపీ నడిపిస్తున్న తోలుబొమ్మ

హైదరాబాద్: జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ అన్నారు. తెలంగాణకు రావొద్దని పవన్ కళ్యాణ్ ను ఎవరూ ఆపడం లేదన్న మహేష్ గౌడ్ సినిమా నటుడిగా పవన్ వస్తే ఇంటికి పిలిచి భోజనం పెడతానని తెలిపారు. పవన్ చాలా చిన్నవాడు రాజకీయాల్లో ఇంకా చాలా నేర్చుకోవాలని సూచించారు. బీజేపీ పలికించేవే పవన్ మాట్లాడుతున్నారని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ ఎలా వచ్చిందో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలన్నారు. ఇది సినిమా కాదు.. సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని పవన్ ను హెచ్చరించారు. కాంగ్రెస్ చరిత్ర గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.

15-06-2026

article_85151101.webp
మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు నిధుల విడుదలలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం ఆరోపించారు. తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం నుంచి ఏకైక క్యాబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మెట్రో విస్తరణకు అవసరమైన నిధులు సమకూరేలా చూడాల్సిన బాధ్యతను కలిగి ఉన్నారని, అదే సమయంలో బండి సంజయ్ కుమార్ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ జోక్యం ఉందని ఆరోపించిన ముఖ్యమంత్రి, మాజీ సీఎం KCR, కేటీఆర్ (KTR) ఆదేశాల మేరకే కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసేందుకు, సచివాలయంలో కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలకు సమగ్రమైన పవర్-పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

15-06-2026

article_13423886.webp
ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. విద్యార్థులకు టిఫిన్ తినిపించిన మంత్రి పొన్నం

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో(Schools) చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం, పాఠశాలకు హాజరును పెంచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోని లోక్ భవన్ పాఠశాలలో(Lok Bhavan School) మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. తరగతులు ప్రారంభించే ముందు విద్యార్థులకు పౌష్టికరమైన ఉదయపు భోజనం అందించడం, తద్వారా వారి ఏకాగ్రత, మొత్తం ఆరోగ్యం మెరుగుపడటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా అమలు చేయాలని యోచిస్తోంది.

15-06-2026