17 April, 2026 | 3:01 AM

News -

article_25233512.webp
సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష

సంగారెడ్డి: జగ్గారెడ్డి, నిర్మల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ లు, మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులతో వివరంగా సమీక్షించారు. సదాశివపేట పట్టణంలోని ప్రతీ ఇంటికి రోజూ గంటన్నర పాటు మంచినీళ్లు సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించారు. సింగూరు డ్యామ్ నుండి నేరుగా ఇంటింటికి మంజీర నీళ్లు అందేలా ఇంటెక్ వేల్, ఫిల్టర్ బెడ్, ట్యాంకులు, కొత్త పైపులైన్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. సదాశివపేటకు ప్రతిరోజూ గంటన్నర నీళ్లు ఇవ్వాలంటే రూ. 135 కోట్లు ఖర్చవుతుందని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

16-04-2026

article_42790780.webp
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య(BJP MP Tejasvi Surya) వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పాకిస్తాన్‌ విభజనతో పోల్చిన తేజస్వి వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటమన్న హరీశ్ రావు వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితమని వెల్లడించారు.

16-04-2026