calender_icon.png 8 February, 2026 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_90424767.webp
బీజేపీకి ఓటు వేస్తే.. ఢిల్లీ నుంచి నిధులొస్తాయ్

07-02-2026

హైదరాబాద్: కాంగ్రెస్ గ్యారంటీల గురించి నిలదీస్తారని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మల్కాపూర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలకు నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని వెల్లడించారు. బీజేపీకి ఓటు వేస్తే.. ఢిల్లీ నుంచి మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీల గురించి నిలదీస్తారని కేసీఆర్ బయటకి రావట్లేదని బండి సంజయ్ ఆరోపించారు. నిధులు లేవంటున్నారు కాబట్టి.. కాంగ్రెస్ కు ఓటు వేసినా నిధులు రావని బండి సంజయ్ సూచించారు.