calender_icon.png 12 January, 2026 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_27994108.webp
అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తా

12-01-2026

సికింద్రాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరే షన్‌ను ఏర్పాటు చేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ఆదివారం బాలంరాయ్‌లోని లీ ప్యాలెస్‌లో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్‌గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమా వేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గణ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును, అస్థిత్వాన్ని దెబ్బ తీయాలని సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

article_41584602.webp
చంద్రబాబు, రేవంత్‌ల చీకటి ఒప్పందాలు

12-01-2026

సూర్యాపేట, జనవరి 11 (విజయక్రాంతి): ఆంధ్ర సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డివి చీకటి ఒప్పందాలు అని మాజీ మంత్రి, సూ ర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నా రు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి కృష్ణా, గోదారి జ లాలను ఆంధ్రకు దోచిపెడుతున్నాడని విమర్శించారు. బనకచర్ల పేరుమార్చి నల్లమల్ల సాగర్ అంటూ నీళ్ల దోపిడీ చేస్తున్నారన్నా రు. చంద్రబాబును సంతృప్తి పరచడమే రేవంత్ లక్ష్యమని మండిపడ్డారు. మొదటి నుంచి కూడా తెలంగాణకు జాతీ య పార్టీలే శత్రువులన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ తెలంగాణ నీటి హ క్కులను కాపాడుకుందామని చెప్పారు.

article_64994139.webp
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేస్తాం

12-01-2026

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకాల పను లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఎస్‌ఎల్ బీసీ టన్నెల్ పనుల పురోగతిపై ఆదివారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్, లెఫ్టినెంట్ జనరల్ హర్‌పాల్ సింగ్, ఇంజనీర్లతో మంత్రి పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సొరం గం తవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపారు.

article_80391770.webp
ప్రపంచానికి మేడారం వైభవాన్ని చాటుతాం

12-01-2026

మేడారం, జనవరి 11 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర గిరిజనుల పండుగ మాత్రమే కాదని, ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడు, ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. , ప్రపంచానికి జాతర వైభవాన్ని చాటి చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రులు శ్రీధర్‌బాబు, కొం డా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి వన దేవతలను దర్శించుకుని, జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూ టీ సీఎం మాట్లాడుతూ.. సమ్మక్క, సారలమ్మ జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభ వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా శాశ్వత నిర్మాణాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నా యన్నారు.

article_14392523.webp
రాజకీయాల్లో వారసత్వాన్ని ఇష్టపడను

12-01-2026

రాజేంద్రనగర్, జనవరి 11 (విజయక్రాంతి): రాజకీయాల్లో వారసత్వాన్ని తాను ఇష్టపడను అని, సేవా మార్గమే తాను విశ్వసించే అసలైన వారసత్వమని మాజీ ఉపరా ష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్, ముచ్చింతల్ (హైదరాబాద్ చాప్టర్)లో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సర్దార్ పటేల్ ప్రజా మందిరంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లో కుటుంబ వారసత్వా న్ని తాను ఇష్టపడనని చెప్పారు. అందుకే త న కొడుకు, కూతరును రాజకీయాల్లోకి తీసుకురాలేదని పేర్కొన్నారు. నాలుగు ‘సీ’లు..

article_86208798.webp
మంజీరా నది ఇక క్లీన్!

12-01-2026

ఎల్లారెడ్డి, జనవరి 11: (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా మంజీరా నది పరివాహక ప్రాంతంలో రైతులకు తీవ్ర అవస్థలు ఎదురవుతున్నప్పటికీ గత పాలకుల పాలనల్లో పలుమార్లు రైతులు వినతి పత్రాలు అందజేసిన ఫలితం లేకపోయింది. మొన్న కురిసిన భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు దిగువన మెదక్ జిల్లా నుండి హవేలీఘన్పూర్ నుండి వస్తున్న పసుపు యేరూ, మంజీరా నదిలో కలిసి భారీ ఉధృతంగా ప్రవహించడంతో మాంజీర నది పరివాహక ప్రాంతంలో నాగిరెడ్డిపేట మండలం పోచారం, మాల్ తుమ్మెద గ్రామం నుండి మొదలుకొని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మండలం రుద్రారం అల్మాజిపూర్ గ్రామాల పరిసర ప్రాంతాల వరకు నిజాంసాగర్ ఆయకట్టు ప్రాజెక్టు నీరు అధికంగా నిల్వ ఉండి రైతులకు తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయి.