13 June, 2026 | 11:38 PM

News -

article_86150926.webp
అనగనగా ఓ డిటి.. రక్త దానం

మహబూబాద్ జిల్లా గూడూరు మండలం కొత్త గూడ అటవీ ప్రాంతం.1999 లో నేను మానుకోట కు డి టి గా పని చేస్తున్నపుడు.. ఓ రైస్ మిల్లు ఇన్స్పెక్షన్ కోసం సాయంత్రం 4 గంటలకు నా టూ వీలర్ పై వెళ్తున్న.. సరిగ్గా 5 గంటల ప్రాంతం లో కొత్త గూడ అటవీ ప్రాంతంలో ఉన్న ముసలవ్వ గుడి దేవాలయం సమీపానికి చేరుకుంటా..అనగా..అక్కడికి సమీపం లో ఓ వ్యక్తి రోడ్డు పై పడి ఉన్నాడు. ఆ పరిసరాల్లో ఎక్కడా మనుష్య సంచారమే లేదు.ఎవరైనా అతన్ని ఇక్కడ వదిలి వెళ్ళారా.?! అని అనుమానించడానికి. ఓ వైపు 6 గంటలకల్లా.. రైస్ మిల్లు కు వస్తా అని చెప్పాను.ఇక్కడ కళ్లెదుట ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో..అపస్మారక స్థితిలో. . ఉన్నాడో..పోయాడో తెలియదు.చుట్టూ..దట్టమైన అడవి. ఏమ్ చేయాలో తోచని పరిస్థితి. ఆ వ్యక్తి కి సాయం చేద్దాం అంటే..నా ప్రాణం ను నేను పణంగా పెట్టి రిస్క్ తీసుకోవడమే.. ఎందుకంటే.. ఏ పొద చాటు నుంచి ఏ క్రూర మృగం వచ్చి ..నా ప్రాణం తీస్తుందో తెలియదు.

13-06-2026

article_21875687.webp
చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో విషాదం.. పెంపుడు కుక్క మృతి

తుని: కాకినాడ జిల్లా తునిలో చిన్నారి మిస్సింగ్ కేసులో(Kakinada Girl missing case) విషాదం చోటుచేసుకుంది. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక ఆధారమైన పెంపుడు కుక్క మృతి చెందింది. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో కుక్క ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కుక్క మృతితో చిన్నారి అదృశ్యం దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు. 80 నిమిషాల్లో పెంపుడు కుక్క ఎనిమిది కిలో మీటర్లు సంచరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పెంపుడు కుక్క జీపీఎస్ ట్రాకర్ తో గాలింపు చర్యల్లో పాల్గొంది. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగున్నాయి. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

13-06-2026

article_37155032.webp
జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్

హైదరాబాద్: జీడిమెట్లలో(Jeedimetla) అక్రమంగా ఉంటున్న ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్ట్(Seven Bangladeshis arrested) చేశారు. పాస్ పోర్టు, వీసా సహా ఎలాంటి చెల్లుబాటు పత్రాలు లేవని పోలీసులు గుర్తించారు. అక్రమంగా భారత్ లోకి ప్రవేశించి నివసిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశీయులను మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్‌కు(Jogipet Deportation center) తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన వాళ్లను వారి స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కూకట్‌పల్లి జోన్ ఎస్వోటీ సిబ్బంది(Kukatpally Zone SOT personnel) ఈ ఆపరేషన్ నిర్వహించింది.

13-06-2026

article_59246853.webp
న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నందికొండ : నల్గొండ జిల్లా నందికొండ (నాగార్జున సాగర్) పరిధిలోని హిల్ కాలనీలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హిల్ కాలనీ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఒక కారు, థార్ (Thar) SUV వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మరణించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందికొండలోని కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.

13-06-2026