4 June, 2026 | 12:30 PM

News -

article_20763668.webp
Delhi Hotel Fire: ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం, ఎక్స్‌గ్రేషియా ప్రకటన

న్యూఢిల్లీ: ఢిల్లీ మాలవీయ నగర్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో(Delhi Hotel Fire) ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తీవ్ర విచారం వ్యక్తం(PM Modi condoles) చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బుధవారం నాడు దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో ఉన్న ఒక బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 21 మంది మరణించారు. మరణించిన వారిలో పలువురు విదేశీయులు ఉన్నారని, వీరు ప్రధానంగా మధ్య ఆసియా, ఆఫ్రికాకు చెందినవారని అధికారులు తెలిపారు.

03-06-2026

article_61473157.webp
ఆర్టీసీ బస్సు బీభత్సం.. చక్రాల కింద ఇరుక్కున్న వ్యక్తి

హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్‌ స్టేషన్‌(Jubilee Bus Station) వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు శివ బస్సు టైర్ల కింద ఇరుక్కుపోయాడు. గమనించిన మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు తక్షణమే అప్రమత్తమమై శివను కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు కింద పడిన శివకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో బస్సును పక్కకు జరిపారు. బస్సు జేబీఎస్‌ నుంచి కార్ఖానా వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోటుచేసుకుంది

03-06-2026