calender_icon.png 31 January, 2026 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_88387898.webp
ఉత్సవ విగ్రహాలుగా విద్యుత్ స్తంభాలు!

31-01-2026

ఉట్నూర్, జనవరి 30 (విజయక్రాంతి): ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని గిరిజన రైతుల కు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు మం జూరైన బోరు బావులు తవ్వుకొని... విద్యుత్ సౌకర్యం కోసం రైతులు ఎదురు చూస్తున్నా రు. ఐటిడిఏ పరిధిలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, సిరికొండ, నార్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్ తదితర మండలాల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల రైతులకు ‘ఇంద్రజల ప్రభ‘ పథకంలో ప్రభుత్వం బోరు బావులు మంజూ రు చేసింది. బోరు బావులు మంజూరైన రైతు లు సాగునీటిని సద్విని చేసుకునేందుకు విద్యు త్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కోసం రైతుల వారిగా డీడీ లు చెల్లించారు.