6 June, 2026 | 3:46 PM

News -

article_64540394.webp
లిక్కర్ వ్యాన్ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ జనం

బసిరెడ్డిపల్లి: చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లె సమీపంలో శనివారం మద్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. దీంతో స్థానికులు అక్కడికి పరుగులు తీసి మద్యం సీసాలను ఎత్తుకుపోవడంతో గందరగోళం నెలకొంది. మహిళలతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి, మద్యం సీసాలను సేకరించి లుంగీలు, తువ్వాళ్లు, సంచులలో వాటిని తరలించుకుపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అధికారులు అక్కడికి చేరుకునే లోపు ఈ ఘటన ఆ ప్రాంతంలో కాసేపు కలకలం సృష్టించింది. మగాళ్లతో సమానంగా మహిళలు మందు బాటిల్లు ఎత్తుకెళ్లడం విశేషం. వాహనంలో సుమారు పది లక్షల విలువ చేసే మద్యం ఉన్నట్లు డ్రైవర్ తెలిపాడు.

06-06-2026

article_35025480.webp
మహిళల భద్రత కోసం 'స్త్రీ రైడ్'.. ప్రారంభించిన డీజీపీ ఆనంద్

హైదరాబాద్: స్త్రీ రైడ్( Stree Rides) కార్యక్రమాన్ని డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand) ప్రారంభించారు. మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా విమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక ప్రాజెక్టు ఇది. తొలి విడతలో 55 మంది మహిళలకు స్త్రీ రైడర్లుగా అవకాశం కల్పించారు. అంబర్ పేట్ పోలీస్ లైన్ లో ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసిన 55 మంది మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. టూ వీలర్, త్రీ వీలర్ డైవింగ్ నైపుణ్యాల్లో మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. స్త్రీ రైడర్లు అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు సురక్షిత రవాణా సేవలు అందించనున్నారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

06-06-2026