5 May, 2026 | 4:12 PM

News -

article_28222618.webp
హైదరాబాద్ ప్రజలకు చల్లని కబురు

హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. క్యూములోనింబస్ మేఘాల(Cumulonimbus clouds) వల్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్క డిగ్రీ తగ్గాయి. రేపు, ఎల్లుండి ఉష్ణోగ్రతలు 2నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచి భారీగా ఎండలు దంచుతున్నాయి. ఎండల ధాటికి హైదరాబాద్‌ నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

05-05-2026

article_75791711.webp
ప్రభాస్ 'ఫౌజీ' చిత్ర బృందానికి ఘోర ప్రమాదం

ప్రభాస్ రాబోయే చిత్రం 'ఫౌజీ' (Fauzi) బృందం, హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరగనున్న సినిమా షూటింగ్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సినిమా షూటింగ్ ఆపేసినట్లు చిత్ర యూనిట్(Prabhas Fauzi Film Crew) తెలిపింది. ఈ ఘటనపై చిత్ర బృందం, స్థానిక అధికారులు ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 'Fauzi' చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 80 శాతం పూర్తయింది. ఈసారి అక్టోబర్ నుండి క్రిస్మస్ లోపు, ఎప్పుడైనా ఈ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

05-05-2026

article_82674086.webp
సంగారెడ్డిలో లారీని ఢీకొన్న కారు: ఇద్దరు మృతి

హైదరాబాద్: సోమవారం రాత్రి సంగారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు గాయాలతో బయటపడ్డారు. వారు చేవెళ్లలోని తమ నివాసానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్‌ వద్ద ఉన్న బైపాస్ రోడ్డును చేరుకున్న కొన్ని నిమిషాలకే, కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి, అక్కడ నిలిచి ఉన్న ఒక లారీని ఢీకొట్టాడు. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని జహీరాబాద్‌లోని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు వారిని పర్యవేక్షణలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

05-05-2026