24 April, 2026 | 1:51 AM

News -

article_64915113.webp
ఉత్తరాఖండ్‌లో ఘోరప్రమాదం: ఎనిమిది మంది మృతి

న్యూ తెహ్రీ: ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand) తెహ్రీ జిల్లాలోని చంబా ప్రాంతంలో గురువారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక యుటిలిటీ పికప్ వాహనం లోతైన లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. ఘన్సాలీలోని థ్యోల్ధార్ గ్రామానికి చెందిన బాధితులు, హరిద్వార్‌లో ఒక గ్రామస్తుడి అంత్యక్రియలు పూర్తిచేసుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, డ్రైవర్ బొలెరో క్యాంపర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని తెహ్రీ జిల్లా మేజిస్ట్రేట్ నితికా ఖండేల్వాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో సుమారు 10 మంది ఉన్నారని, అత్యవసర, సహాయక బృందాలు ఎనిమిది మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి.

23-04-2026

article_46813465.webp
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం(Telangana Cabinet meeting) ప్రారంభమైంది. కాళేశ్వరం అంశంలో హైకోర్టు తీర్పుపై కేబినెట్ చర్చించనుంది. హైకోర్టు తీర్పుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. ఎంపీటీసీ, జడ్పీ టీసీ ఎన్నికలపై చర్చించే అవకాశముంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుపై నిర్ణయం వెలువడే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, కేబినెట్ భేటీలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చించాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

23-04-2026

article_50120881.webp
అధికారంలోకి వచ్చాక విస్మరించడం తప్పు... జగ్గారెడ్డి సంచలన పోస్ట్

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(TPCC Working President Jagga Reddy) అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షంలో ఉంటే ఒక మాట.. అధికారంలోకి వస్తే మరో మాట సరికాదని జగ్గారెడ్డి సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ... ఎవరూ మాట మార్చినా తప్పే, రాష్ట్రంలో అయినా, కేంద్రంలో అయినా మాట మార్చటం తప్పే అన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించి.. అధికారంలోకి వచ్చాక విస్మరించడం తప్పు అని జగ్గారెడ్డి తేల్చిచెప్పారు. జగ్గారెడ్డి ఎక్స్ లో పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె వేళ జగ్గారెడ్డి వ్యాఖ్యలు పోస్టు సంచలనంగా మారింది.

23-04-2026

article_14458917.webp
ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్

హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల నిరసనలో(TGSRTC strike) ఉద్రిక్తత నెలకొంది. నర్సంపేటలో డ్రైవర్(RTC Driver) శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తక్షణమే అప్రమత్తమైన కార్మికులు శంకర్ గౌడ్ ను ఎంజీఎంకు తరలించారు. డ్రైవర్ శంకర్ గౌడ్ రెండు రోజులుగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) తమకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. అయితే ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన 32 డిమాండ్లలో 29 డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

23-04-2026

article_55847993.webp
3 గంటల వరకు తమిళనాడులో 70%, బెంగాల్‌లో 78.77% పోలింగ్‌ నమోదు

చెన్నై: తమిళనాడు, బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, గురువారం తమిళనాడులో 70 శాతం పోలింగ్ నమోదైంది. భారత ఎన్నికల సంఘం (EC) గణాంకాల ప్రకారం, మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఓటింగ్ శాతం సరిగ్గా 70 శాతంగా నమోదైంది. 75.79 శాతం ఓటింగ్ శాతంతో సేలం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. అటు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఉత్సాహంగా సాగినప్పటికీ, పలు ప్రాంతాల్లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు, బెదిరింపులు, బీజేపీ అభ్యర్థులపై జరిగిన దాడులు పోలింగ్‌పై నీలినీడలు కమ్మేలా చేశాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి, మొత్తం 3.60 కోట్ల మంది ఓటర్లలో 78.77 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

23-04-2026