calender_icon.png 20 February, 2026 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_50018944.webp
అంబర్‌పేటలో యూట్యూబర్‌పై దాడి

20-02-2026

హైదరాబాద్: అంబర్‌పేటలోని ఒక మతపరమైన ప్రదేశం సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జామా మసీదు(Jama Masjid) సమీపంలో వీడియో చిత్రీకరించినందుకు ఒక యూట్యూబర్‌పై(YouTuber attacked) ఒక గుంపు దాడి చేసింది. "అంబర్‌పేటలోని జామా మసీదు సమీపంలో ఒక యూట్యూబర్ వీడియో చిత్రీకరిస్తున్నాడు. అతనిపై ప్రజలు దాడి చేశారు. యాదృచ్ఛికంగా, ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj) ఊరేగింపు వెళుతుండగా, రెండు వర్గాలు నినాదాలు చేశాయి. మా పోలీసు అధికారులు అక్కడికక్కడే ఉండి పరిస్థితిని నియంత్రించారు" అని అంబర్‌పేట పోలీసులు(Amberpet Police) తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తమకు ఎవరి నుండి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.

article_79661222.webp
ఢిల్లీలో మూడో రోజు రేవంత్ రెడ్డి పర్యటన

20-02-2026

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) మూడో రోజు హస్తినలో పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు శుక్రవారం మధ్యాహ్నం ఇండియా ఏఐ సమ్మిట్- 2026లో పాల్గొనున్నారు. స్వీడన్ వ్యాపార ప్రతినిధుల బృందంతో శ్రీధర్ బాబు సమావేశం కానున్నారు. భరత్ మండపం వెస్ట్ వింగ్ లో జరిగే కార్యక్రమంలో శ్రీధర్ బాబు పాల్గొననున్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కీలక భేటీ జరిగింది.