23 April, 2026 | 12:04 PM

News -

article_11937758.webp
ఆర్టీసీ సమ్మె.. ఆ కుట్రలో భాగమే.. బీఆర్ఎస్ పార్టీకి కావాల్సిందే దోపిడీ!

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను మాజీమంత్రి హరీశ్ రావు సమ్మెకు ప్రోత్సహించారని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆరోపించారు. జేఏసీ నేతలు ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడి సమ్మెకు వెళ్లారని తెలిపారు. అధికారులతో చర్చల మధ్యలో జేఏసీ నేతలు వెళ్లిపోయారని వివరించారు. అధికారులు చర్చిస్తుండగానే సమ్మెకు వెళ్లడం కుట్రలో భాగమే అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసేలా వ్యవహరించిందన్నారు. మహాలక్ష్మీ పథకం నచ్చకే ఆర్టీసీపై కుట్రలు చేస్తున్నారని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కావాల్సింది దోపిడీ మాత్రమేనని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

22-04-2026

article_54976008.webp
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే... హైకోర్టు తీర్పుపై కిషన్ రెడ్డి స్పందన

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఆధారాలు సమర్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) విఫలమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై(Kaleshwaram Commission) తెలంగాణ హైకోర్టు తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు, స్మితా సబర్వాల్, ఎస్ కే జోషీలకు ఊరట లభించింది. కోర్టు తీర్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై సరైన విచారణ జరగలేదని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే అని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు.

22-04-2026

article_10647450.webp
కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల డిమాండ్

హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై(Kaleshwaram Lift Irrigation Project) జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తెలంగాణ హైకోర్టు తప్పుబట్టలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు?, బీఆర్ఎస్ సంబరాలు చేసుకునేలా కోర్టు తీర్పులో ఏముంది? అని చామల ప్రశ్నించారు. తీర్పు కాపీ చూశాక.. తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అధికారులు, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని ఆరోపించారు. నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పిల్లర్లు కుంగినట్లు ఎన్డీఎస్ఏ చెప్పిందని వివరించారు.

22-04-2026