27 April, 2026 | 5:45 PM

News -

article_54322340.webp
బీఆర్ఎస్ పార్టీ చచ్చిన శవంతో సమానం

బీజేపీతో పొత్తు పెట్టుకోనని కేసీఆర్ దేవుడిపై ఒట్టు వేస్తారా? కేసీఆర్ కవిత మాటలకు సమాధానం చెప్పాలి.. హైదరాబాద్: కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కవిత మాటలకు( Kavitha Remarks) సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) డిమాండ్ చేశారు. కవిత చెబుతున్నట్లు కేసీఆర్ ఎవరి బందీలో ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ మర మనిషా.. మనసున్న మనిషా.. కవితకు జవాబివ్వాలని సవాల్ విసిరారు. బీజేపీతో పొత్తు పెట్టుకోనని కేసీఆర్ దేవుడిపై ఒట్టు వేస్తారా? ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎక్స్ పైరీ గడువు తీరింది.. ఇక ఆ పార్టీతో పనిచేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) చచ్చిన శవంతో సమానం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ తన శత్రువు కాదన్న సీఎం రేవంత్(CM Revanth ) రాజకీయ ప్రత్యర్థి అన్నారు. కేసీఆర్ కు చెడు జరగాలని కోరుకుంటోంది.. ఆయన కుటుంబమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

27-04-2026

article_19952211.webp
అంబర్‌పేటలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలో(Amberpet) సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. అంబర్ పేట్ చే నంబర్ కూడలి వద్ద షోరూమ్ లో మంటలు అంటుకున్నాయి. మహీంద్ర షోరూమ్(Mahindra Showroom) లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మహీంద్ర షోరూమ్ పక్కనే నివాస సముదాయాలున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో చుట్టుపక్కల పెద్ద ఎత్తున పొగ కమ్మేసింది. మంటలను గమనించిన సిబ్బంది, స్థానికులు పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో హూటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుతోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్త చేస్తున్నారు.

27-04-2026

article_76031009.webp
కన్నతండ్రి కన్నీటి ఆవేదన.. దారి తప్పిన కొడుకు— బైక్ తగలబెట్టిన తండ్రి

విశాఖపట్నం: తన కుమారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్, పదే పదే పడుతున్న జరిమానాల పట్ల విసిగిపోయిన విశాఖపట్నం(Visakhapatnam), పెందుర్తికి చెందిన ఒక తండ్రి తాను తన కష్టార్జితంతో కొనిచ్చిన కుమారుడి మోటార్‌సైకిల్‌ను తగలబెట్టేశాడు. అధికారుల ప్రకారం, వేపగుంట సమీపంలోని బంటక కాలనీకి చెందిన ఒక ఆటో డ్రైవర్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు ఏడాది క్రితం, కాలేజీకి వెళ్లడానికి బైక్ అవసరమని ఆ బాలుడు పదేపదే అడగడంతో, తండ్రి అతనికి బైక్ కొనిచ్చాడు. ఆ ఒత్తిడికి తలొగ్గి అతను బైక్ కొన్నాడు. బైక్ సొంతం చేసుకున్న ఆనందంతో ఆ యువకుడు, స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టాడు.

27-04-2026

article_64674206.webp
తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. భారీగా బౌన్సర్ల మోహరింపు

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం(BRS Party 26th Formation Day) సందర్భంగా మరికాసేపట్లో తెలంగాణ భవన్‌లో ప్రారంభం కానున్న రజతోత్సవ వేడుకల ముగింపు సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. కాసేపట్లో కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేయన్నారు. తెలంగాణ భవన్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా బౌన్సర్లు మోహరించారు. కార్యకర్తలు లోపలికి చొచ్చుకొని వెళ్లకుండా నేతలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి.

27-04-2026

article_16602950.webp
బీజేపీలో AAP ఎంపీల విలీనానికి గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)కి చెందిన ఏడుగురు ఎంపీలు బీజేపీలో విలీనమవడాన్ని రాజ్యసభ ఛైర్మన్(Rajya Sabha Chairman) సీపీ రాధాకృష్ణన్ సోమవారం అధికారికంగా ఆమోదించారు. దీనితో ఎగువ సభలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ బలం మూడుకు తగ్గింది. ఈ మార్పు తర్వాత, ఎగువ సభలో బీజేపీ బలం 113కు పెరిగింది. రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ శుక్రవారం నాడు AAP నుండి వైదొలిగి, పార్టీ నాయకత్వం సమక్షంలో BJPలో చేరారు. హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ, స్వాతి మలివాల్ కూడా బీజేపీలోకి మారారు. ఈలోగా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఏడుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్‌కు పిటిషన్ దాఖలు చేశారు.

27-04-2026

article_59793651.webp
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

నర్మదాపురం: మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక వివాహ ఊరేగింపులో భాగమైన ఒక SUV వాహనం ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... మఖన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచల్‌ఖేడ గ్రామం సమీపంలో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఒక టవేరా వాహనం వెనుక నుండి ట్రాలీని ఢీకొనడంతో ఐదుగురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. బుధ్నిలో జరిగిన ఒక వివాహ వేడుక నుండి మృతులు తిరిగి వస్తుండగా, వేగంగా వస్తున్న వాహనం ఈ ప్రమాదానికి గురై పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులందరూ మఖన్నగర్ ప్రాంతంలోని మహేంద్రవాడి నివాసులుగా తెలిసింది. పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

27-04-2026

article_66764265.webp
శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు(BJP President Ramchander Rao) తిరుమల శ్రీవారిని(Tirumala Tirupati Devasthanams) దర్శించుకున్నారు. హిందువులను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమంతోనే ప్రభుత్వాలు నడవాలని రామచందర్ రావు పేర్కొన్నారు. తిరుమలలో ప్రసాదాలు నాణ్యతో పాటు వ్యవస్థలన్నీ బాగున్నాయని సూచించారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్(Vice President CP Radhakrishnan) నేడు తిరుమల వెంకన్నను దర్శించుకోనున్నారు. రాత్రి 9.40 గంటలకు ఉపరాష్ట్రపతి శ్రీగాయత్రీనిలయం అతిథిగృహానికి చేరుకుంటారు. రేపు ఉదయం 8 గంటలకు ఉప రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకుంటారు.

27-04-2026