12 June, 2026 | 11:14 PM

News -

article_47468983.webp
రేవంత్ సర్కార్ రైతు డిస్కమ్ పెట్టిందే ప్రైవేటీకరణ కోసం

హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వం రైతు డిస్కమ్(Rythu DISCOM) పెట్టిందే ప్రైవేటీకరణ కోసమని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం కోసమే రైతు డిస్కమ్ అన్నారు. సీఎం రూ. 200 కోట్లతో ఇంకో క్యాంపు ఆఫీసు నిర్మించుకున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రాజసౌధాన్ని ఎందుకు దాస్తున్నారు? రహస్యం ఎందుకు?, రేవంత్ రెడ్డికి రాజసౌధాలు, భట్టి విక్రమార్కకు 3 క్యాంపు ఆఫీసులు ఎందుకు?, సీఎం రేవంత్ కు కొత్త హెలికాప్టర్లు, ఫుట్ బాల్ గ్రౌండ్ ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి71 సార్లు ఢిల్లీకి వెళ్లి రూ. 71 కూడా తేలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ను శిథిలం చేసిన.. పాతిపెట్టి పోతారని కేటీఆర్ జోస్యం చెప్పారు.

12-06-2026

article_85280408.webp
తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనబడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో ఎండలు, వడగాలులు ఇంకా మండుతున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో శుక్రవారం మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నగరంలోని దక్షిణ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉండగా, సాయంత్రం వరకు వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

12-06-2026

article_30959497.webp
భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి

నిజాం సాగర్‌: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో(Nizamsagar Project) దూకి తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి కృష్ణ నిజాంసాగర్ లో దూకాడు. బంధువుల సమాచారంతో రెస్క్యూటీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. ప్రాజెక్టులో నుంచి ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీసింది. మృతులను తండ్రి కృష్ణ(32), కుమారుడు రక్షిత్(08), కూతురు అనన్య(5)గా గుర్తించారు. మృతులను సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. భార్య‌తో గొడ‌వ‌ప‌డి తన ఇద్దరు పిల్ల‌ల‌తో కలిసి రిజ‌ర్వాయ‌ర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

12-06-2026

article_86149269.webp
నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు

న్యూఢిల్లీ: ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్‌పురి(Govindpuri) ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఐదు అంతస్తుల నివాస భవనంలో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం, తెల్లవారుజామున సుమారు 2:31 గంటలకు గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌కు(Govindpuri Police Station) అగ్నిప్రమాదానికి సంబంధించిన PCR కాల్ వచ్చింది. తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్‌లోని ఒక నివాస భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

12-06-2026