calender_icon.png 16 January, 2026 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_68710781.webp
సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు

16-01-2026

హైదరాబాద్: సైబర్ క్రైమ్ పోలీసులకు నటి అనసూయ(Actress Anasuya) ఫిర్యాదు చేసింది. గతేడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్ లైన్ వేధింపులు పెరిగాయని ఫిర్యాదులో పేర్కొంది. అశ్లీల వ్యాఖ్యలు, లైంగిక దూషణలు, బెదిరింపులు జరిగాయని వాపోయింది. నటి అనసూయ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 42 మందిపై కేసు నమోదు చేశారు. కొందరు వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఖాతాదారులపై కేసులు బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనసూయ ఫిర్యాదుతో బొజ్జ సంధ్యారెడ్డి, గోగినేని ప్రయాచౌదరి, పావని, శేఖర్ బాషా, రజిని,కరాటే కల్యాణి, విజయలక్ష్మి, యాంకర్ రోహిత్, ఓ ఛానెల్ యాంకర్, దుర్గ, యాంకర్ మనోజ్, ఇతర ఛానెళ్లు, ఆన్ లైన్ మీడియా పేజీలపై కేసు బుక్ చేశారు. అనసూయ నిందితుల పేర్లతో పాటు సోషల్ మీడియా లింకుల ఫిర్యాదుతో జత చేసింది.

article_87909058.webp
మాజీ ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి 20 ఏళ్ల జైలు శిక్ష

16-01-2026

డెహ్రాడూన్: తన మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసిన కేసులో డెహ్రాడూన్‌లోని ఒక కోర్టు మాజీ వైమానిక దళ సిబ్బందికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. బుధవారం వెలువరించిన తన తీర్పులో కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ, తన కుమార్తెను రక్షించాల్సిన బాధ్యత ఉన్న తండ్రి, దానికి బదులుగా ఆమె శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేశాడని, అటువంటి నేరస్థుడి పట్ల ఎలాంటి కనికరం చూపకూడదని పేర్కొంది. పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి అర్చన సాగర్ దోషిపై రూ. 25,000 జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి పరిహారంగా రూ. 3 లక్షలు చెల్లించాలని ఆదేశించారు.

article_37333337.webp
అత్తాపూర్‌లో డ్రగ్ స్మగ్లర్లు అరెస్ట్

16-01-2026

హైదరాబాద్: నగరంలోని టాస్క్ ఫోర్స్ శుక్రవారం అత్తాపూర్‌లో ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేసి, లక్ష రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. నిందితుల వద్ద 8 గ్రాముల ఎండిఎంఏ, 0.8 గ్రాముల ఓజీ లభించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులు వాటిని నగరంలోని వినియోగదారులకు విక్రయించాలని భావించినట్లు ఆరోపణలున్నాయి. అరెస్టు అయిన వారిని ఐటీ రిక్రూటర్ అన్వర్ హుస్సేన్ (33), కారు డ్రైవర్ బుర్రా సంపత్ (31)గా గుర్తించారు. ఈ ఇద్దరూ బెంగళూరుకు చెందిన చరణ్ అనే సరఫరాదారుడి నుండి మాదకద్రవ్యాలను సేకరించారని, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు నిషేధిత వస్తువులను కొనుగోలు చేయడానికి ఆన్‌లైన్‌లో రూ. 38,000 బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా, టాస్క్ ఫోర్స్ ఆ ఇద్దరినీ పట్టుకుని, తదుపరి చర్యల కోసం అత్తాపూర్ పోలీసులకు అప్పగించింది.

article_69220800.webp
మైసమ్మ ఆలయంలో విగ్రహాం ధ్వంసం.. నిందితుడి అరెస్ట్

16-01-2026

హైదరాబాద్: పురానాపూల్ దర్వాజా సమీపంలోని మైసమ్మ ఆలయంలో జరిగిన విధ్వంసానికి సంబంధించి కామటిపురా పోలీస్ స్టేషన్‌లో(Kamatipura Police Station) నమోదైన కేసులో పోలీసులు శుక్రవారం ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటనలో ఆలయ వరండాలో ఉంచిన ఫ్లెక్సీ బ్యానర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం ధ్వంసమయ్యాయి. పోలీసులు వేగంగా స్పందించి, సంఘటన జరిగిన 24 గంటలలోపే నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. నిందితుడిని విచారిస్తున్నామని, ఈ కేసులో అదనపు సాక్ష్యాలను సేకరించేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించబడిందని రాజేంద్రనగర్ డీసీపీ జారీ చేసిన పత్రికా ప్రకటన శుక్రవారం తెలిపింది.

article_26615156.webp
కేస్లాపూర్‌లో రోడ్లకు మరమ్మత్తులు

15-01-2026

ఉట్నూర్, జనవరి 14(విజయక్రాంతి): రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చే ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. జాతర సందర్భంగా రోడ్ల మరమ్మత్తులు చేపట్టారు. ‘మరమ్మత్తులకు నోచని నాగోబా రోడు’ అనే శీర్షికతో మంగళవారం ‘విజయక్రాంతి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు బుధవారం రోడ్లకు మరమ్మత్తులను ప్రారంభించారు. సమస్యను పరిష్కరించిన ‘విజయక్రాంతి’ దినపత్రికకు, జిల్లా కలెక్టర్ రాజర్షిషాకు మెస్రం వంశస్థులు, గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.

article_66353537.webp
మీ రాజకీయ వివృత క్రీడలో జర్నలిస్టులు బలి

15-01-2026

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? అని మాజీమంత్రి హరీశ్‌రావు తెంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా జర్నలిస్టుల అరెస్టుపై స్పందించారు. ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా?, జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.