calender_icon.png 18 January, 2026 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_55546065.webp
గిరిపుత్రుల వేడుక చూసొద్దాం!

18-01-2026

ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 17 (విజయక్రాంతి): ఆదివాసీ గిరిజనులు ఘనంగా జరుపుకునే నాగోబా జాతరకు ఎంతో విశిష్టత ఉంది. అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఏటా ఏటా పుష్య మాసం అమావాస్య రోజున అర్ధరాత్రి నాగోబాకు మహా పూజలతో మెస్రం వంశస్థులు జాతరను ప్రారంభి స్తా రు. నాగోబా పూజలకు డిసెంబర్ 22వ తేదీన మహా పూజలకు శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 30వ తేదీన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామ శివారులోని గోదావరి నదిలోని పవిత్ర గంగా జలం కోసం మెస్రం వంశీయులు మహా పాదయాత్ర చేపట్టారు. జనవరి 7వ తేదీన గంగా జలాన్ని సేకరించి, ఈ నెల 14న కేస్లాపూర్ మరి చెట్ల వద్దకు చేరుకు న్నారు.

article_60025589.webp
ఈశ్వర్‌చారి కుటుంబానికి అండగా ఉంటాం

18-01-2026

హైదరాబాద్, జనవరి 17(విజయక్రాంతి): బీసీల ఆత్మగౌరవం కోసం, సమాన హక్కుల కోసం ఆత్మబలిదానం చేసుకొని అసువులు బాసిన బీసీ బిడ్డ, అమరుడు సాయి ఈశ్వర్ చారి కుటుంబానికి ఇచ్చిన మాటను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబెట్టుకుంది. సాయి ఈశ్వర్ చారి ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం 5 లక్షల రూపాయల చొప్పున, మొత్తం 15 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం చెక్కులను పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శనివారం పార్టీ కార్యాలయంలో స్వయంగా కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మాట తప్పని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ‘బీసీల హక్కుల కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన సాయి ఈశ్వర్ చారి మరణం అత్యంత బాధాకరం అని అన్నారు.

article_53472239.webp
మొదటి మొక్కు గట్టమ్మకే!

18-01-2026

మేడారం మహా జాతరకు తరలి వచ్చే లక్షలాదిమంది భక్తులు ముందుగా ములుగు జిల్లా జాకారం వద్ద కొలువైన గట్టమ్మ దేవాలయంలో అమ్మవారికి మొదటి మొక్కు సమర్పిస్తారు. ఆదివాసి నాయకపోడు ఇలవేల్పుగా విలసిల్లుతున్న గట్టమ్మ తల్లికి ఘన చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో సైన్యం తో జరిగిన పోరాటంలో గట్టమ్మ కూడా ప్రాణాలు అర్పించినట్లు చరిత్రకారులు చెబుతారు. గట్టమ్మ తల్లి కుటుంబంలో మొత్తం ఏడుగురు ఆడపడుచులు ఉన్నారని, వీరిలో గట్టమ్మ అందరికంటే పెద్ద అని, జాతరకు వచ్చే భక్తులకు ఘట్టమ్మ తల్లి రక్షణగా ఉంటుందని నమ్మిక. ఆ ప్రకారం మేడారం వచ్చే భక్తు లు ముందుగా గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించి మేడారం బయలుదేరడం ఆనవాయితీగా వస్తోంది.

article_50077479.webp
ఒక్కరోజు రాజధానిగా మేడారం

18-01-2026

మేడారం, జనవరి 17 (విజయక్రాంతి): ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.. మరో కొత్త ఆవిష్కరణకు వేదిక కానుంది. కాకతీయుల కాలంలో సామంత రాజ్యంగా విలసిల్లిన ‘మేడారం’ మళ్లీ ఒక్క రోజు రాష్ట్ర ‘రాజధాని’గా నిలవనుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం ఆదివారం సాయంత్రం మేడారంలో నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రివర్గ సభ్యులు, అధికార యంత్రాంగం మొత్తం ఆదివారం రాత్రి మేడారంలో బస చేయనున్నారు. దీనితో మేడారం ‘ఆదివారం’ ఒక్కరోజు రాష్ట్ర రాజధానిగా నిలవనుంది.

article_54234729.webp
మతసామరస్యానికి ప్రతీక జాన్‌పహాడ్

18-01-2026

మతం పేరిట విద్వేషాలను రెచ్చగొడుతూ స్వప్రయోజనాలను పొందాలని చూసే కొందరు స్వార్థపరుల ఆలోచనలను అణగదొక్కుతూ సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది స్యూర్యాపేట జిల్లాలోని పాలకవీడు మండలం జాన్‌పహాడ్ సైదులు దర్గా. ఇది కృష్ణానది సమీపాన ఉండడంతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ జాన్ పహాడ్ సైదులు బాబా దర్గా ఉర్సుకు సిద్ధమైనది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 400 సంవత్సరాల ఘనమైన చరిత్ర గల దర్గా భక్తుల కోరిన కోర్కెలు తీర్చేదిగా పేరుగాంచింది. దర్గాకు చేరుకోవాలంటే నేరేడు చర్ల పట్టణం నుంచి 19 కిలోమీటర్లు ప్ర యాణించాలి. అదే దామరచర్ల నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

article_72619448.webp
రేపల్లె షణ్ముఖరావుకు అరుదైన గౌరవం

18-01-2026

‘వ్యవసాయ, వ్యవసాయతేర పనులను సులువుగా చేసుకోవడానికి.. స్థానిక వనరులతో.. తక్కువ ఖర్చుతో..అనువైన పరికరాల సృష్టికర్తగా నిలుస్తున్న మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన రేపల్లె షణ్ముఖరావుకు 2026 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొ నేందుకు అరుదైన గౌరవం దక్కింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రం పంపించగా పోస్టల్ శాఖ అధికారులు ఇటీవల ఆయన నివాస గృహంలో అందజేశారు. ఆహ్వా న పత్రంతో పాటు రాష్ట్రపతి భవన్‌లో పాల్గొనేందుకు గుర్తింపుగా కొన్ని ప్రత్యేక బహుమతులను కూడా పంపించారు.’

article_46400500.webp
వైభవంగా త్రిశూల స్నాన ఘట్ట వేడుకలు

18-01-2026

భీమదేవరపల్లి,జనవరి17(విజయక్రాంతి): కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో త్రిశూల స్నాన ఘట్ట వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు లక్షల్లో తరలివచ్చారు. త్రిశూల స్నానం వల్ల శారీరక రుగ్మతలు, దోష పరిహారం జరుగుతుందని, సకాలంలో వర్షాలు కురుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని ఆలయ అర్చకులు వినయ్‌శర్మ తెలిపారు. వీరభద్రుడికి తొమ్మిది రోజులు ఘనంగా పూజలు చేసిన తదుపరి ఆలయం వద్ద నుంచి స్వామి వారిని త్రిశూల మూర్తిగా ఏర్పాటు చేసి ఆలయం చుట్టూ మూడుమార్లు ప్రదక్షణ చేయిస్తారు. అనంతరం పవిత్ర పుష్కరిణిలో కుంభాయుక్తంగా త్రిశూల స్నానం చేయిస్తారు. స్వామివారిని ఆలయ నుంచి తీసుకువచ్చే సమయంలో వీర శైవులు స్వామివారిని స్తుతిస్తూ వీరఖడ్గాలు వేస్తారు.