మరో పదేళ్లు మాదే అధికారం!
19-01-2026
ఖమ్మం, జనవరి 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో 10 ఏళ్ల వరకు అంటే 2043 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజలకు సంక్షేమ పాలనను అందిస్తుంటే ఓర్వలేని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు విషం కక్కుతున్నారని, కేసీఆర్ రాక్షసుల గురువు శుక్రాచార్యుడిలా, కేటీఆర్, హరీశ్రావు మారీచ, సుభాహుల్ల వ్యవహరిస్తున్నారని చురకలాంటించారు. ప్రజల ఆశీస్సులు ఉంటే బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతులో బొంద పెడతామని విమర్శించారు. భద్రాద్రిని అయోధ్యల మారు స్తామని అన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ప్రారంభించారు.