18 April, 2026 | 7:48 PM

News -

article_44069753.webp
సీఎం రేవంత్ దక్షిణాది ప్రజలను ఏకం చేశారు: ఎంపీ చామల కిరణ్‌

హైదరాబాద్: డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుగా బీజేపీ మభ్యపెట్టిందని భువనగిరి ఎంపీ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. బిల్లును అడ్డుకోవడంతో ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయని సూచించారు. బీజేపీ కుట్రలను విపక్షాలు ఎండగట్టాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది ప్రజలను ఏకం చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషిని హరీశ్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని చామల మండిపడ్డారు. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు పిలిస్తే సీఎం వెళ్లారని వివరించారు. కేంద్రమంత్రిని సీఎం కలిస్తే హరీశ్ రావు తప్పుపడుతున్నారని వెల్లడించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రులను కోరారని తెలిపారు. గతంలో హరీశ్ రావు వేరే పార్టీల నేతల ఇళ్లకు వెళ్లలేదా? అని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు.

18-04-2026

article_82526307.webp
కేంద్రం కుట్ర భగ్నం, ప్రతిపక్షాల విజయం: ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల ముసుగులో దేశ సమాఖ్య స్వరూపాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా(Congress MP Priyanka Gandhi Vadra) శనివారం ఆరోపించారు. మహిళా కోటా చట్ట సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడం ప్రతిపక్షాల ఐక్యతకు లభించిన విజయమని ప్రియాంకా గాంధీ ఉద్ఘాటించారు. మీడియా సమావేశంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, మహిళల రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, ప్రస్తుత లోక్‌సభ సభ్యుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం 'మహిళల రిజర్వేషన్ల చట్టం-2023'ను(Women's Reservation Bill) అమలు చేయదలిస్తే, దానికి తాము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావడం వెనుక ప్రభుత్వ ఏకైక ఉద్దేశం శాశ్వతంగా అధికారంలో కొనసాగడమేనని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ దురుద్దేశాలను దేశ ప్రజలు గ్రహించగలరని పేర్కొన్నారు.

18-04-2026