calender_icon.png 20 January, 2026 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_30653679.webp
రాజకీయ గందరగోళంలో సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు

20-01-2026

సిద్దిపేట, జనవరి19 (విజయక్రాంతి): సిద్దిపేట మునిసిపల్ ఎన్నికలు నిజంగానే జరగబోతున్నాయా? లేక ప్రజాస్వామ్య ప్రక్రియను వాయిదా వేయడమే ప్రభుత్వ ఉద్దేశ మా? గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మునిసిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ప్రకటనలతో సిద్దిపేట పట్టణ రాజకీయ ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే గడువు ముగిసిన మున్సిపాలిటీలకే ఎన్నికలు అని ఆ శాఖ మంత్రి స్పష్టంగా వెల్లడించినప్పటికి సిద్దిపేట విషయంలో మా త్రం అనుమానాల మబ్బును మరింత ద ట్టం చేసింది. గడువు ఇంకా ముగియని సిద్దిపేట మునిసిపాలిటీలో ఎన్నికలు ఉండవని అధికారులు చెబుతుంటే, మరోవైపు సోషల్ మీడియాలో రిజర్వేషన్ల పేరిట పాత జాబిత రిజర్వేషన్లు వైరల్ అవుతూ ఆశావాహులను ఊహాగానాల ఊబిలో ముంచేస్తున్నాయి.

article_41833729.webp
ఆర్టీసీ బస్సు బోల్తా, 60 మంది సేఫ్

19-01-2026

అమరావతి: విజయనగరం జిల్లాలోని అప్పన్నవలస వద్ద వారు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో అందులో ఉన్న 60 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో ఈ సంఘటన జరిగింది. బస్సు రాజం నుండి విజయనగరం వైపు వెళ్తుండగా, డ్రైవర్‌కు మూర్ఛ వచ్చి స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా, బస్సు బోల్తా పడి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారి కేకలు విని గ్రామస్తులు ప్రయాణికులను రక్షించడానికి పరుగెత్తుకొచ్చి, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.