calender_icon.png 3 February, 2026 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_89367752.webp
నారాయణరావుపేట వైద్యునిపై కొనసాగుతున్న విచారణ

03-02-2026

సిద్దిపేట, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బాపురెడ్డి పై ఆ శాఖ మహి ళా సేఫ్టీ బృందం సభ్యులు సోమవారం వి చారణ జరిపారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విజయక్రాంతి వా ర్తా కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు డాక్టర్ నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన బృందం సోమవారం కూడా విచారణ జరిపారు. ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలి పట్ల వేధింపులకు పాల్పడినట్లు వార్త కథనాల ఆధారంగా తెలుసుకున్న బృందం సభ్యులు ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి విచారించారు.

article_42358471.webp
పెన్షన్ రాక అంతా ఆగమాగం

03-02-2026

జైనూర్/ఉట్నూర్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): పేదలకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల అందించే ఆసరా పెన్షన్ పథకం డబ్బులు రాక జిల్లాలో అంత ఆగమా గం అవున్నారు. పెన్షన్ డబ్బులు లేక వృద్ధు లు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు పరేషాన్ లో ఉన్నారు. ప్రతి నెల పంపిణీ చేసే పెన్షన్ డబ్బులు కోసం పెన్షన్ దారులు వేయి కళ్ళ తో ఎదురుచూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వివిధ రకాల పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులు మొత్తం 72, 745 మం ది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతనెల 22వ తేదీన 17 కోట్ల 24 లక్షల రూపాయలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోని సర్ఫ్ ద్వారా పోస్ట్ ఆఫీస్‌లకు విడుదల చేశారు.

article_21662533.webp
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం

02-02-2026

న్యూఢిల్లీ: అధికార కూటమికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు మంగళవారం పార్లమెంట్ హౌస్ సముదాయంలో ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ సమావేశం(NDA Parliamentary Party meeting) కోసం సమావేశం కానున్నారు. బీజేపీ, టీడీపీ, జేడీ(యూ), ఎల్జేపీ (ఆర్), శివసేన, జేడీ(ఎస్), ఎన్డీఏలోని ఇతర భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అంశాలపై చట్టసభ్యులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఇలాంటి పార్లమెంటరీ పార్టీ సమావేశాలలో, నరేంద్ర మోదీ సాధారణంగా రాజకీయ, పాలనాపరమైన అంశాలను ప్రస్తావిస్తారు. కొన్నిసార్లు పార్లమెంట్‌లో ప్రభుత్వ అజెండా గురించి కూడా చర్చిస్తారు. ప్రజల్లో, ముఖ్యంగా తమ నియోజకవర్గాలలో లేవనెత్తడానికి అవసరమైన చర్చనీయాంశాలను మోదీ తరచుగా ఎంపీలకు సూచిస్తారు.

article_68412761.webp
ప్రజల వద్దకే కాషాయ ప్రగతి రథాలు

02-02-2026

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల(Municipal elections) నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా అత్యాధునిక ఎల్ఈడీ ప్రచార రథాలను(BJP LED Campaign Vehicles Launch) సోమవారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించినట్లు పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పట్టణాల అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత ఈ రథాల ద్వారా గడప గడపకూ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెల్లార్, రాజస్థాన్ మాజీ మంత్రి అశోక్ పర్ణామి, ఎంపీ శ్రీమతి రేఖా శర్మ, శ్రీ జీవీఎల్ నరసింహారావు, ఇతరులు పాల్గొన్నారు.

article_58624874.webp
ఇమామ్ హుస్సేన్ 1443 వ జయంతి వేడుకలు

02-02-2026

జామియా మిలియా ఇస్లామియా సెంట్రల్ యూనివర్శిటీ ఇమామ్ హుస్సేన్ (A.S) 1443వ జయంతిని డాక్టర్ ఎం.ఏ అన్సారీ ఆడిటోరియంలో జరుపుకుంది. జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మజార్ ఆసిఫ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ఇరాన్ కల్చరల్ కౌన్సెలర్ డాక్టర్ ఫరీదుద్దీన్ ఫరీదాసర్ పాల్గొన్నారు. ఇతర ప్రముఖులు హాజీ హనీఫా జాన్, పార్లమెంటు సభ్యుడు (లడఖ్) బీజేపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీ బక్రి మౌలానా సయ్యద్ కల్బే రుషైద్ రజ్వీ, డా. సూఫీ రాజ్ జైన్, ప్రొఫెసర్. అజ్రా అబేది, ప్రొఫెసర్. రైహాన్ అక్తర్ ఖాస్మీ, డాక్టర్. తస్నాకోయిన్. ఫిరోజ్ అహ్మద్ స్వాగతోపన్యాసం చేయగా, ప్రొ. నషీర్ నఖ్వీ ప్రొసీడింగ్స్ నిర్వహించగా, ప్రొఫెసర్ సయ్యద్ కలీమ్ అస్గర్ జాతీయ గీతాలాపన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.