NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య
న్యూఢిల్లీ: NEET-UG 2026 పరీక్షా పత్రాల లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation) దూకుడు పెంచింది. ఈ కేసలో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన ఒక వైద్యుడు, పూణేకు చెందిన ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన అధ్యాపకుడితో సహా తాజాగా జరిగిన అరెస్టులతో, ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 13కి చేరింది. తాజాగా అరెస్టు అయిన నిందితులలో లాతూరుకు చెందిన వైద్యుడు డాక్టర్ మనోజ్ షిరూరే, పుణేలోని డాక్టర్ అభంగ్ ప్రభు మెడికల్ అకాడమీ (APMA)లో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న తేజస్ హర్షద్కుమార్ షా ఉన్నారు.
27-05-2026