1 May, 2026 | 5:58 PM

News -

article_30785926.webp
రెండేళ్లు భరించండి.. కేసీఆర్ వచ్చి మేలు చేస్తారు.. కేటీఆర్ హామీ

హైదరాబాద్: పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) డిమాండ్ చేశారు. సఫాయీల శ్రమను.. రేవంత్ రెడ్డి గుర్తించటం లేదని కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక సర్కార్ నడుస్తోందని ధ్వజమెత్తారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కాంగ్రెస్ బాధితులయ్యారని తెలిపారు. మంత్రుల జీతాల్లో కోత వేసి ఇస్తామనడానికి వాళ్లు వరద బాధితులా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 120 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని సూచించారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల భరించండి.. కేసీఆర్ వచ్చి కార్మికులకు మేలు చేస్తారని కేటీఆర్ హామీ ఇచ్చారు.

01-05-2026

article_48608003.webp
చివరి దశకు ఫోన్ టాపింగ్ కేసు విచారణ: డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) విచారణ చివరి దశకు చేరుకుందని డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand) పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రస్తుతం సిట్ విచారణ చేస్తోందని ఆయన వెల్లడించారు. గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడే.. ఆ కేసు గురించి తనకు తెలుసని చెప్పారు. త్వరలో ఆ కేసును సమీక్షించి తుది ఛార్జిషీట్ ఫైల్ చేస్తామని స్పష్టం చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సి.వి. ఆనంద్, శుక్రవారం లక్డీకాపూల్‌లో ఉన్న రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయడంతో పదవి నుంచి వైదొలగగా, ఆయన బాధ్యతలు స్వీకరించారు.

01-05-2026

article_61199798.webp
అసోం సీఎం భార్యపై అనుచిత వ్యాఖ్యలు.. పవన్‌ ఖేరాకు ముందస్తు బెయిల్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖెహరా(Pawan Khera)కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పవన్ ఖెహరా ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. అసోం సీఎం మహింత భార్యకు 3 పాస్ పోర్టులు ఉన్నాయని పవన్ ఖెహరా తెలిపారు. అసోం పోలీసులు పవన్ ఖెహరాపై పరువు నష్టం, ఫోర్జరీ కేసులు పెట్టారు. పరువునష్టం కేసులో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అసోం ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అసోం ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

01-05-2026

article_83981669.webp
లంచం అడిగిన చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌.. చెప్పుతో కొట్టిన కండక్టర్

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సులో టికెట్ల తనిఖీ హింసాత్మకంగా మారడంతో, రైకోడ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అధికారులు సాధారణ తనిఖీ కోసం బస్సును ఆపి, సరైన టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిని గుర్తించారు. నివేదికల ప్రకారం, ప్రయాణికుడిపైనా, కండక్టర్‌పైనా కేసు నమోదు చేయకుండా ఉండేందుకు టికెట్ ఇన్‌స్పెక్టర్ రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. ఇది ప్రయాణికులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆ తర్వాత జరిగిన వాగ్వాదంలో, కండక్టర్, ఆ ప్రయాణికుడు కలిసి టికెట్ ఇన్‌స్పెక్టర్‌పై చెప్పులతో దాడి చేశారు.

01-05-2026