28 April, 2026 | 6:29 PM

News -

article_82835035.webp
సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్: రైల్వే స్టేషన్ల వద్ద రోడ్ల విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రోడ్డు విస్తరణ కోరుతూ కిషన్ రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద రోడ్లు ఇరుకుగా ఉన్నాయని తెలిపారు. ఎఫ్ సీఐ గోదాం నుంచి స్టేషన్ వరకు రోడ్డు విస్తరించాలని కోరారు. పార్కింగ్ కోసం స్టేషన్ వద్ద సుమారు 5 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. నీటి కనెక్షన్ కోసం డబ్బులు ఇచ్చినా.. పని ఇంకా పూర్తి కాలేదన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)ను కేంద్రం కొత్తగా అభివృద్ధి చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వేస్టేషన్ వద్ద రోడ్లు ఇరుకుగా ఉన్నాయన్నారు. అల్ఫా హోటల్ నుంచి బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ చేయాలన్నారు. మీరు ఆదేశాలు ఇచ్చినా రోడ్డు విస్తరణ పనులు ఇంకా మొదలు కాలేదన్న కేంద్రమంత్రి రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

28-04-2026

article_42506772.webp
కిషన్ బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. సోఫా వర్క్‌షాప్‌లో మంటలు

హైదరాబాద్: నగరంలోని బహదూర్ పురాలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. కిషన్ బాగ్(Kishan Bagh) లోని సోఫా తయారీ కేంద్రంలో భారీగా మంటలు ఎగిరిపడుతున్నాయి. దీంతో దట్టంగా పొగ కమ్మేసింది. మంటల ధాటికి సిబ్బంది, స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ. లక్షల విలువైన ఫర్నిచర్, సోఫా సెట్లు, ఫ్లైవుడ్లు, సోఫా సామాగ్రి అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

28-04-2026

article_84947150.webp
తెలంగాణ టెన్త్ ఫలితాలకు డేట్ ఫిక్స్.. రేపు మధ్యాహ్నం రిజల్ట్స్

హైదరాబాద్: పదో తరగతి (SSC) పరీక్షా ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పరీక్షల సంచాలకుల శాఖ (Directorate of Government Examinations) ప్రకారం, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మార్చి 14న ప్రారంభమైన SSC పరీక్షలు, రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 13న ముగిశాయి. ఈ సంవత్సరం సుమారు 5 లక్షల 28 వేల 239 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 23న పూర్తయింది. ఫలితాలు మే మొదటి వారంలో విడుదల అవుతాయని అధికారులు ఇంతకుముందు సూచించినప్పటికీ, ఇప్పుడు వాటిని ఏప్రిల్ 29న ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు.

28-04-2026

article_14251297.webp
ఉమ్మడి వరంగల్ జిల్లా BRS నాయకులకు KTR దిశానిర్దేశం

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal district) బీఆర్ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సమావేశం అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ సభ్యత్య నమోదు పై చర్చ జరిగింది. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. వరంగల్ కార్పొరేషన్(Warangal Corporation) ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాల్లో స్థితిగతులపై చర్చించారు. సర్(Special Intensive Revision) ప్రక్రియలో పార్టీ తరుపున పోషించాల్సిన పాత్రపై సూచనలు చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పార్టీ నేతలను ఆదేశించారు. సర్ ప్రక్రియలో అర్హులైన ఒక్కరు కూడా ఓటు కోల్పోకుండా చూడాలని నాయకులకు కేటీఆర్ సూచించారు.

28-04-2026

article_54931268.webp
పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు

హైదరాబాద్: మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ (Moinabad farmhouse case) కేసులో రోహిత్ రెడ్డికి హైకోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారంలో ఒకరోజు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావలని కండిషన్ పెట్టింది. పాస్ పోర్టును పోలీసులకు సరెండర్ చేయాలని రోహిత్ రెడ్డికి(Pilot Rohit Reddy) ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని హైకోర్టు సూచించింది. రోహిత్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైలుతో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

28-04-2026

article_73344561.webp
మహబూబాబాద్‌లో దారుణం.. కుమారులను చంపి తండ్రి ఆత్మహత్య

హైదరాబాద్: కుటుంబ కలహాలతో ప్రాణాలు పోయాయి. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) తొర్రూరులో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి, తర్వాత తండ్రి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇద్దరు కుమారులు విలాస్(5), వికేష్(3)కు ఉరి వేసిన అనంతరం తండ్రి షావలి(35) తొర్రూరు మార్కెట్ ఎదురుగా చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతులను మహబూబాబాద్ జిల్లా అమ్మ పురం వాసులుగా గుర్తించారు. నిన్న భార్యతో గొడవపడి పిల్లలను తీసుకుని షావలి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

28-04-2026