జమ్మూలో వంతెన కూలి ముగ్గురు కూలీలు మృతి, విచారణకు ఆదేశం
జమ్మూ: జమ్మూ శివారులో పాక్షికంగా కూలిపోయిన ఒక పాత వంతెన(Bridge collapse) శిథిలాల నుండి, 12 గంటల పాటు సాగిన గాలింపు చర్యల అనంతరం సహాయక సిబ్బంది మూడు మృతదేహాలను, ఒక గాయపడిన వ్యక్తిని వెలికితీశారని అధికారులు శనివారం తెలిపారు. బంతలాబ్లోని థుథర్ ప్రాంతంలో వంతెనలో కొంత భాగం కూలిపోయిన కాసేపటికే, శుక్రవారం నాడు గాయపడిన ఒక కార్మికుడిని రక్షించారు. ఉప ముఖ్యమంత్రి సురీందర్ కుమార్ చౌదరి అర్ధరాత్రి ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
02-05-2026