ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయిలో విస్తరించాలి
ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల ఆర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజావాణి సేవలను మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని, మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలన్నారు.
26-04-2026