calender_icon.png 18 January, 2026 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_76629673.webp
భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

18-01-2026

ములుగు: జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న మేడారం మహా జాతర నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో మేడారానికి తరలిరావడం ప్రారంభించారు. సెలవులు ఎక్కువగా ఉండటంతో, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రార్థనలు చేస్తుండటంతో సమ్మక్క సారలమ్మ గద్దెలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో జరగనున్న క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. జాతర సమయంలో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి, భక్తుల రాకపోకలు సజావుగా సాగేలా చూడటానికి కూడా చర్యలు తీసుకున్నారు. మేడారం వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు.

article_75823323.webp
చెరువుగట్టుకు వెళ్లొస్తుండగా ప్రమాదం: మహిళ మృతి

18-01-2026

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో ఆదివారం విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై(Vijayawada-Hyderabad National Highway) చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం(Dandu Malkapur) సమీపంలో గుర్తు తెలియని వాహనం వెనుక నుండి స్కూటీని ఢీకొనడంతో ఒక మహిళ మృతి చెందగా, ఆమె భర్త, కుమారుడు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లోని గుర్రంగూడకు చెందిన పి. దుర్గ (25), ఆమె భర్త, వారి కుమారుడు ఆదివారం ఉదయం చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దుర్గ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది, కాగా ఆమె భర్త, కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

article_63068590.webp
పాలమూరుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి?

18-01-2026

హైదరాబాద్: జూరాల వద్ద సరిపడా నీటిలభ్యత లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) ఆదివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. డిసెంబర్ నెలలోనే జూరాలలో చుక్కనీరు కనపడదని వెల్లడించారు. శ్రీశైలం నుంచి అయితే... వేసవిలో కూడా నీరు తీసుకోవద్దని వెల్లడించారు. బీజేపీ నేతలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ రెండేళ్లలో పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. 90 టీఎంసీల ప్రాజెక్టును 45 టీఎంసీలకు తగ్గించాలని కేంద్రం చేస్తోందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ నిర్మించిన వాటికి ఈ సీఎం శంకుస్థాపనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ వాటా జలాలు ఏపీకి ఇవ్వకుండా పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

article_80612389.webp
సంగారెడ్డి నుంచి ఇక పోటీ చేయను

18-01-2026

సంగారెడ్డి, జనవరి 17 (విజయక్రాంతి): టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా జీవితంలో పోటీ చేయనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి అవమానం చేసిననేమో అని ఫీల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. నాకోసం రాహుల్ గాంధీ సంగారెడ్డికి వచ్చి నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తే నన్ను ఇక్కడ ఓడించారు.. అందుకే సంగారెడ్డిలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనని తెలిపారు. నా భుజంపై చేయి వేసి జగ్గారెడ్డిని గెలిపించాలని అడిగితే నన్ను ఇక్కడి వారు ఓడించారన్నారు.

article_55546065.webp
గిరిపుత్రుల వేడుక చూసొద్దాం!

18-01-2026

ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 17 (విజయక్రాంతి): ఆదివాసీ గిరిజనులు ఘనంగా జరుపుకునే నాగోబా జాతరకు ఎంతో విశిష్టత ఉంది. అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఏటా ఏటా పుష్య మాసం అమావాస్య రోజున అర్ధరాత్రి నాగోబాకు మహా పూజలతో మెస్రం వంశస్థులు జాతరను ప్రారంభి స్తా రు. నాగోబా పూజలకు డిసెంబర్ 22వ తేదీన మహా పూజలకు శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 30వ తేదీన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామ శివారులోని గోదావరి నదిలోని పవిత్ర గంగా జలం కోసం మెస్రం వంశీయులు మహా పాదయాత్ర చేపట్టారు. జనవరి 7వ తేదీన గంగా జలాన్ని సేకరించి, ఈ నెల 14న కేస్లాపూర్ మరి చెట్ల వద్దకు చేరుకు న్నారు.