70 ఎకరాల్లో మేడారం అభివృద్ధి
30-01-2026
మేడారం, జనవరి 29 (విజయక్రాంతి): సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో మేడారం జారతకు సంబంధించి శాశ్వత మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మేడారం జాతర శాశ్వత అభివృద్ధి కోసం ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించామని, మరో 41 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో శాశ్వతంగా కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, మరిన్ని మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించనున్నట్లు వివరించారు.