7 June, 2026 | 11:18 AM

News -

article_10480427.webp
గండిపేట భూముల కబ్జా కేసు: బొల్లా బ్రహ్మనాయుడు కోర్టుకు తరలింపు

హైదరాబాద్: నిన్న కాంచీపురంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంచీ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. గండిపేటలో సర్వే నంబర్ 18లో ఉన్న 9.28 ఎకరాల భూకబ్జా కేసులో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. బ్రహ్మనాయుడు నకిలీ జీవోలు సృష్టించి భూమి కబ్జా, విక్రయానికి ప్రయత్నించారు. బొల్లా బ్రహ్మనాయుడు వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. అంతకు ముందు గండిపేట భూ కబ్జా కుట్ర కేసులో బొల్లాను పోలీసులు ప్రశ్నించారు.

06-06-2026

article_33130784.webp
ఖైరతాబాద్‌లో విషాదం.. ప్రాణాలు పోతున్నా.. మనవడిని కాపాడుకున్న మహిళ

హైదరాబాద్: ఖైరతాబాద్‌లో(Khairatabad) ఆనంద్ నగర్ కాలనీలోని భావనా అపార్ట్‌మెంట్స్‌లో జరిగిన విషాదకరమైన లిఫ్ట్ ప్రమాదంలో(Lift Accident) శనివారం ఒక మహిళ మరణించగా, ఆమె మనవడు గాయపడ్డాడు. బాధితురాలిని రాధ(53)గా గుర్తించారు. లిఫ్ట్‌ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్‌ రాకముందే రాధ గేటు తెరవడంతో ఐదో అంతస్తు నుంచి పడిపోయింది. ఆమెతో ఉన్న 13 నెలల మనవడికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లిఫ్ట్ నిర్వహణ సరిగా లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణం కావచ్చని అపార్ట్‌మెంట్ సముదాయ నివాసితులు ఆరోపించారు.

06-06-2026

article_39816551.webp
కాంగ్రెస్ నిరసన ర్యాలీ

హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజీ, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు(Hike in petrol and diesel prices), సీబీఎస్ఈ వైఫల్యాలు, రూపాయి పతనం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ(Telangana Congress Protest) నిర్వహించింది. ఈ ర్యాలీలో పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్‌ తో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. విద్యార్థులను, సామాన్య ప్రజలను బాధిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పామని, కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

06-06-2026