2 September, 2026 | 8:35 PM

Breaking News

రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •   ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి.. ఖబర్దార్   •  

News -

article_58899096.webp
సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటఆర్

కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ఛార్జ్ షీట్ విడుదల చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన కాదు... ఇది పీడన అని, రాష్ట్రంలో దరిద్రం దండయాత్ర మొదలుపెట్టి వెయ్యి రోజులు అయ్యిందని ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ విఫలమైందని, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన క్రిమినల్ వేస్ట్ అన కేటీఆర అన్నారు. కాంగ్రెస్ ది రైతులను రాచిరంపాన పెడుతున్న రాక్షస పాలన అని, ఈ శతాబ్ధపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో అని, వాటిలో 13 డిక్లరేషన్ లు, 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు.

02-09-2026 | 12:34pm

article_64807733.webp
దివంగత సీఎం వైఎస్ఆర్ నివాళులర్పించిన సీఎం రేవంత్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా తెలుసుకుని, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేసుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, పేదలకు గృహ నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచిన ప్రజానాయకుడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

02-09-2026 | 11:13am