బీజేపీలో AAP ఎంపీల విలీనానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)కి చెందిన ఏడుగురు ఎంపీలు బీజేపీలో విలీనమవడాన్ని రాజ్యసభ ఛైర్మన్(Rajya Sabha Chairman) సీపీ రాధాకృష్ణన్ సోమవారం అధికారికంగా ఆమోదించారు. దీనితో ఎగువ సభలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ బలం మూడుకు తగ్గింది. ఈ మార్పు తర్వాత, ఎగువ సభలో బీజేపీ బలం 113కు పెరిగింది. రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ శుక్రవారం నాడు AAP నుండి వైదొలిగి, పార్టీ నాయకత్వం సమక్షంలో BJPలో చేరారు. హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్జిత్ సింగ్ సాహ్నీ, స్వాతి మలివాల్ కూడా బీజేపీలోకి మారారు. ఈలోగా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఏడుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్కు పిటిషన్ దాఖలు చేశారు.
27-04-2026