ఎడాపెడా.. రైతన్నలకు దగా..
బాన్సువాడ, మే 19 (విజయక్రాంతి): పుడమిని నమ్ముకున్న అన్నదాతకు ఎక్కడపడితే అక్కడ నష్టమే జరుగుతుంది. అటు ప్రకృతి వైపరీత్యాలు పంటను దెబ్బతీయగా, దళారుల బెడద,ఇటు రైస్ మిల్లర్ లు మరింత కర్షకులను కన్నీరు పెట్టిస్తుంది. వడగండ్ల వానలకు చేతికొచ్చిన పంట చేజారి కూడా, మిగిలిన దిగుబడులను అమ్ముకునేందుకు రైతులు నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఆశించిన స్థాయిలో లాభ సాటి వ్యవసాయం కాకపోగా, చేతికొచ్చిన పంట అయినా మద్దతు ధర లభించే పరిస్థితి లేకుండా పోయింది.
20-05-2026