20 July, 2026 | 12:30 AM

News -

article_90540087.webp
SIR ప్రక్రియ చాలా కీలకం... ఎవ్వరు నిర్లక్ష్యం చేయవద్దు

హైదరాబాద్: SIR ప్రక్రియ చాలా కీలకమైనది, ఎవరూ కొంచం కూడా నిర్లక్ష్యం చేయవద్దని జూమ్ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) పేర్కొన్నారు. నాయకులు అందరూ వారి నియోజక వర్గాలలో సర్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆగస్టు 3వ తేదీ వరకు సర్ ప్రక్రియపైనే ఉండాలని, చిన్న నిర్లక్షాన్ని కూడా సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు సర్ పనులను వేగవంతం చేయాలన్నారు. బీఎల్ఏ లకు సహకారం అందించాలని కోరారు. దేశంలో సర్ వల్ల జరిగిన నష్టాలను గుర్తించి ఇక్కడ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఎంత కష్టపడుతామో అలాగే ఇప్పుడు ఈ పనులను చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సర్ పనులు పూర్తయ్యే వరకు నియోజకవర్గాలలో ఉండాలన్న పీసీసీ చీఫ్ అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా నష్టపోవొద్దని వివరించారు.

19-07-2026

article_28252706.webp
అశోక్‌నగర్‌లో కలకలం.. బుల్లెట్లు, తుపాకులతో CIDకి చిక్కిన లేడీ స్మగ్లర్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని(West bengal) ఉత్తర 24 పరగణాల జిల్లా అశోక్‌నగర్‌లో, భారీ మొత్తంలో అక్రమ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ఉన్న ఒక మహిళను(West bengal CID Arrests woman ) పశ్చిమ బెంగాల్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) ఆదివారం అరెస్టు చేసింది. బీహార్‌లోని ముంగేర్ కేంద్రంగా సాగుతున్న అంతర్రాష్ట్ర ఆయుధాల అక్రమ రవాణా ముఠాతో ఆమెకు సంబంధాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందిన సమాచారం మేరకు, నైహతి నుండి హబ్రాకు వాహనంలో ప్రయాణిస్తున్న పూజా బిశ్వాస్‌ను CID అధికారులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఆమె వాహనంలో సామాగ్రిని తనిఖీ చేయగా, అధికారులు తుపాకులు, సుమారు 200 రౌండ్ల మందుగుండు సామగ్రి, 12 మ్యాగజైన్లు, రూ. 12,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.

19-07-2026

article_36168478.webp
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. హైదరాబాద్ భక్తులు సేఫ్

తిరుమల: తిరుమలలోని రెండవ ఘాట్ రోడ్డులో(Tirumala Ghat Road) ఆదివారం ఉదయం ప్రమాదం(Road Accident) జరిగింది. ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు భక్తులకు ఈ ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వల్ల ట్రాఫిక్‌కు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

19-07-2026