News

మేం అసెంబ్లీ నుంచి పోలేదు.. నువ్వే పంపించావు: హరీశ్‌ రావు
మేం అసెంబ్లీ నుంచి పోలేదు.. నువ్వే పంపించావు: హరీశ్‌ రావు

హైదరాబాద్‌: అసెంబ్లీ నుంచి తాము వెళ్లిపోలేదని,ప్రభుత్వం పథకం ప్రకారం తమను సభ నుంచి సస్పెండ్ చేసిందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు ఆరోపించారు.“మేం అసెంబ్లీ నుంచి పోలేదు..పథకం ప్రకారం నువ్వే పంపించావు.సభ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసింది నువ్వే కదా. ఒక సెషన్‌ కాదు.. మొత్తం సెషన్‌ సస్పెండ్‌ చేశారు” అని హరీశ్‌ రావు అన్నారు.తమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీజేపీ కూడా కోరిందని ఆయన పేర్కొన్నారు. “మేం సభలో ఉండాలనుకుంటే.. సస్పెన్షన్‌ ఎందుకు ఎత్తివేయలేదు?” అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్నందుకే తమపై బురద రాజకీయాలు చేస్తున్నారని హరీశ్‌ రావు విమర్శించారు. “ఎంతకాలం ఈ అబద్ధాలు చెబుతారు?” అని ప్రశ్నించారు.

16-09-2026 | 06:29pm

వివేకా హత్య కేసు.. డిశ్చార్జ్‌ పిటిషన్లు కొట్టివేత
వివేకా హత్య కేసు.. డిశ్చార్జ్‌ పిటిషన్లు కొట్టివేత

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో నాంపల్లిలోని ప్రత్యేక సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమపై నమోదైన అభియోగాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ప్రధాన నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. కేసులో ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ3 ఉమాశంకర్‌ రెడ్డి, ఏ6 గజ్జల ఉదయ్‌ కుమార్‌ రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు డిశ్చార్జ్‌ పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లు, సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం.. నిందితులపై ఉన్న అభియోగాలు విచారణకు అర్హమైనవేనని న్యాయస్థానం పేర్కొంది.

16-09-2026 | 06:03pm

నిజాం వన్ ఆఫ్ ద బెస్ట్ రూలర్
నిజాం వన్ ఆఫ్ ద బెస్ట్ రూలర్

హైదరాబాద్: పాలకుల్లోనే అత్యంత గొప్ప పాలకుడు నిజాం అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీల్లో ప్రకటించారు. నిజాం పాలనలో రైతుల దగ్గర 60 శాతం భూమి, నిజాం దగ్గర 40 శాతం భూమి ఉండేదన్నారు. హైదరాబాద్ చుట్టు నిజాం భూములకు హద్దులు లేవని వివరించారు. హైదరాబాద్ చుట్టుపక్కల నిజాం, జమీందార్ల ప్రాపర్టీలకు సరైన హద్దులు లేవని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు. భూములకు విలువ లేని సమయంలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు రాయించుకున్నారని తెలిపారు. అందుకే హైదరాబాద్ చుట్టుపక్కల భూముల్లోనే అత్యంత భూవిభేదాలు ఉన్నాయని సూచించారు. సరైన రికార్డులు లేకపోవడంతోనే రియల్ ఎస్టేట్ మాఫియాకు అడ్డగా మారిందని సీఎం స్పష్టం చేశారు. బలవంతుడితే రాజ్యం అన్నట్లుగా భూమి చేతులు మారిందని ఆరోపించారు. 1954-55లో సమగ్ర భూ రికార్డులను ప్రకటించారని వెల్లడించారు. ఇప్పటికీ భూ రికార్డులకు 1954 కాస్రా పహాణీనే ప్రామాణికం అన్నారు. కాస్రా పహాణీలో భూ యజమానులు, అనుభవదారుల పేర్లు ఉండేవన్న సీఎం ధరణి తీసుకొచ్చి అనుభవ దారుల వివరాలు లేకుండా చేశారని తెలిపారు. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భూ హక్కులు లేకుండా పోయాయని సూచించారు.

16-09-2026 | 02:22pm

సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ బృందం భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ బృందం భేటీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ అయ్యారు. తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధులు ప్రకటించారు. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్స్ సిటీ అభివృద్ధి అంశాలను సింగపూర్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమం గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు, నైట్ ఎకానమీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి సూచించారు.

16-09-2026 | 01:28pm

దివ్యాంగుల డిమాండ్లు న్యాయమైనవే
దివ్యాంగుల డిమాండ్లు న్యాయమైనవే

హైదరాబాద్: దివ్యాంగుల డిమాండ్లు న్యాయమైనవేనని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తే అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. దివ్యాంగుల పింఛన్ ను రూ. 6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి33 నెలలైనా ఎందుకు అమలు చేయట్లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీని అమలు చేయాలన్నారు. దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ హామీ ఏమైంది? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ. లక్షల రుణ హామీని అమలు చేయాలని కోరారు.

16-09-2026 | 12:36pm