23 July, 2026 | 7:24 AM

News -

article_56473629.webp
ఎస్‌ఐఆర్ కమిటీతో కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్: ఎస్ఐఆర్(SIR)పై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కమిటీతో కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) సమావేశం అయ్యారు. కేటీఆర్ క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు. సర్ ప్రక్రియను అందరూ సీరియస్ గా తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. ఆగస్టు 3 లోపు అందరూ ఎన్యుమరేషన్లు ఇచ్చేలా చూడాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నోటీసులు వచ్చాక అసలు పని ప్రారంభం అవుతూందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్సీ ఎల్. రమణ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కేటీఆర్‌కు వివరించింది.

22-07-2026