20 August, 2026 | 3:21 AM

News -

article_45005816.webp
AIIMS నుంచి జేపీ నడ్డా డిశ్చార్జ్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ (All India Institute Of Medical Science)లో యాంజియోప్లాస్టీ చేయించుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా(Nadda discharged) బుధవారం డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి."యాంజియోప్లాస్టీ చేయించుకున్న అనంతరం నడ్డా ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆసుపత్రిలో సౌకర్యవంతంగా ఉన్నారు. అందించిన సంరక్షణకు వైద్యులు, నర్సులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు," అని ఎయిమ్స్ ప్రకటన తెలిపింది. ఆయనకు ఆగస్టు 17న ఆంజియోప్లాస్టీ నిర్వహించారని, ఆ తర్వాత కార్డియాలజీ విభాగంలో పర్యవేక్షణలో ఉంచారని మంగళవారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది.

19-08-2026

article_44007985.webp
జానీ మాస్టర్‌కు ఊహించని షాక్.. సస్పెన్షన్ కంటిన్యూ!

హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం(Telugu Film Federation Emergency meeting) జరిగింది. 23 శాఖల అధ్యక్షులు, కార్యదర్శులు ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశానికి హాజరయ్యారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత తీరుపై ఫెడరేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ కు ఫెడరేషన్ నుంచి ఎలాంటి సహకారం ఉండదని ఫెడరేషన్‌ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్(Federation President Vallabhaneni Anil) స్పష్టం చేశారు. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై సస్పెన్షన్ కొనసాగుతోందని వల్లభనేని పేర్కొన్నారు. జానీ మాస్టర్ ఫెడరేషన్ కు ఇచ్చిన రూ. 3 లక్షలు తిరిగి పంపిస్తామని సూచించారు. డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌కి తప్ప మిగతా 24 క్రాఫ్ట్స్‌కి మా మద్దతు ఉంటుందని ఫెడరేషన్‌ ప్రెసిడెంట్ అనిల్ స్పష్టం చేశారు.

19-08-2026

article_70474403.webp
మండల కాంగ్రెస్ కమిటీల నియామక ప్రక్రియ.. ఈ నెలాఖరులోగా

నిజామాబాద్: కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh goud) కీలక సూచనలు చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ( Nizamabad PAC Meeting) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గత PAC సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలకు వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలిపారు. ఓటరు జాబితాల సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో(Armoor Constituency) ఓట్ల తొలగింపు అధికంగా జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) అప్రమత్తంగా వ్యవహరించాలని పీసీసీ చీఫ్ హెచ్చరించారు. 2002 ఆధారిత పత్రాల పరిశీలనతో పాటు ఓటరు జాబితాల వివరాల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, సవరణ ప్రక్రియ సజావుగా జరగని ప్రాంతాలపై డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డర్ వేశారు. మండల కాంగ్రెస్ కమిటీల నియామక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు.

19-08-2026