ముహూర్తం ఫిక్స్.. ఆగస్టు 10న 'వరుణయాగం'.. ఎక్కడంటే?
హైదరాబాద్: తెలంగాణ ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు, సమృద్ధిగా వర్షాలు(Rains) కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు సంపూర్ణంగా నిండాలని, ఎల్నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై లేకుండా ఉండాలని, ఆకాంక్షతో వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సీఎం సూచనల మేరకుయాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (Lord Narasimha Devasthanam - Yadagirigutta) అర్చక, సిద్ధాంతులు ఆగస్టు 10 వ తేదీన వరుణయగానికి మూహూర్తం ఫిక్స్ చేశారు. యాదగిరిగుట్ట దేవస్థాన ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదపండితులు, అర్చక బృందం సమక్షంలో మహా వరుణయాగం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర మహాయాగం కృష్ణానది తీరాన వెలసిన నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున, విజయవిహార్ ఆవరణలో నిర్వహించబడుతుంది. ఈ మహాయాగంలో సాయంత్రం 3.24 గంటలకు జరిగే పూర్ణాహుతి మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
07-08-2026