SIRతో సెలబ్రిటీలకు షాక్..ఈసీ నోటీసులు!
హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా పలువురు టాలీవుడ్, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్ల వివరాల పరిశీలనలో పేర్లు, ఇతర రికార్డుల్లో వ్యత్యాసాలు గుర్తించినట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారిలో దర్శకుడు రాజమౌళి, నటుడు మహేశ్బాబు, నమ్రతా శిరోద్కర్, వెంకటేశ్, సమంత, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తదితరులు ఉన్నట్లు సమాచారం.
11-09-2026 | 05:26pm