News

ఆయన పాదయాత్ర కాదు..ఎన్ని దండాలు పెట్టినా పట్టించుకోరు: కోమటిరెడ్డి
ఆయన పాదయాత్ర కాదు..ఎన్ని దండాలు పెట్టినా పట్టించుకోరు: కోమటిరెడ్డి

హైదరాబాద్: కేసీఆర్, కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను అప్పటి సీఎం కేసీఆర్‌ ఏపీకి అప్పగించారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్‌, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి నీళ్లు తరలిపోతున్నాయని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో రూ.111 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.కృష్ణా జలాల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన, ఏపీకి నీటి తరలింపుతో నల్గొండకు అన్యాయం జరుతోందని ఆరోపించారు.

17-09-2026 | 06:25pm

కేసీఆర్‌ ‘భూబకాసురుడు’
కేసీఆర్‌ ‘భూబకాసురుడు’

హైదరాబాద్: తెలంగాణలో సీఎం, మాజీ సీఎం కేసీఆర్ ఆస్తుల పంచాయతీ కొనసాగుతోంది. నిన్న కేసీఆర్ ఆస్తులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ గురువారం కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.... 2004 వరకు కేసీఆర్ కు ఒక్క ఎకరా భూమి కూడా లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎకరా భూమి లేదని స్వయంగా కేసీఆర్ అఫిడవిట్ లో పేర్కొన్నారని తెలిపారు. నాడు ఎకరా భూమి లేని కేసీఆర్ ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ వేల కోట్ల విలువైన ఆస్తులు సంపాదించిన భూ బకాసురుడని మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

17-09-2026 | 02:40pm

కేసీఆర్ ఆస్తులపై విచారణకు సిద్ధమా? రేవంత్‌కు KTR సవాల్
కేసీఆర్ ఆస్తులపై విచారణకు సిద్ధమా? రేవంత్‌కు KTR సవాల్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బుధవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన భూముల వివరాలను వెల్లడిస్తూ కీలక వ్యాఖ్యాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉందని సీఎం విషప్రచారం చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కు 67 ఎకరాలు మాత్రమే ఉందని సీఎం ఒప్పుకున్నారని సూచించారు. ఇన్నిరోజులు విష ప్రచారం చేసినందుకు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని KTR డిమాండ్ చేశారు.

17-09-2026 | 01:50pm

రేవంత్ రెడ్డిలా డిగ్రీలు చదినవారు.. రాష్ట్రంలో కోటిమంది?
రేవంత్ రెడ్డిలా డిగ్రీలు చదినవారు.. రాష్ట్రంలో కోటిమంది?

సెప్టెంబర్, 17 జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. తాను హార్వర్డ్ వర్సిటీలో చదివానని సీఎం చెబుతున్నారని, తనకు వీసా ఇవ్వరా? అని సీఎం రేవంత్ రెడ్డి వాపోతున్నారని చమత్కరించారు. రేవంత్ రెడ్డి మాదిరిగా డిగ్రీలు చదివిన వారు రాష్ట్రంలో కోటి వరకు ఉంటారేమో? అని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో ఇల్లు కట్టడమెలా? అని వారికి చెప్పవచ్చు కదా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

17-09-2026 | 11:39am