నేడు భారత్- యూనియన్ శిఖరాగ్ర భేటీ
27-01-2026
న్యూఢిల్లీ, జనవరి 26 : యూరోపియన్ యూనియన్-, భారత్ మధ్య మంగళవారం ఢిల్లీ వేదికగా శిఖరాగ్ర సమావేశం జరుగనుంది. విద్యార్థుల పోస్ట్ స్టడీ వీసా నిబంధనలు, మైగ్రేషన్, మొబిలిటీ పార్ట్నర్షిప్, స్వేచ్ఛా వాణిజ్యం(ఎఫ్టీఏ)పై ఒప్పం దాలను కుదుర్చుకోనున్నాయి. ‘విజన్ 2030’ పేరుతో ఒక ఆధునిక వ్యూహాత్మక ప్రణాళికను ప్రవేశపెట్ట నున్నారు. ఇది రాబోయే ఐదేళ్లలో వాతావరణ మార్పులు, డిజిటల్ టెక్నాలజీ, ఇంధన రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తుంది.