News

అసెంబ్లీలో బడే భాయ్.. చోటే భాయ్ బంధం
అసెంబ్లీలో బడే భాయ్.. చోటే భాయ్ బంధం

డైవర్షన్ రాజకీయాలతో ప్రజల దృష్టిని మళ్లించలేరని, ఆంధ్రప్రదేశ్ లో క్రాప్ హాలుడే లేదు.. కానీ తెలంగాణలో క్రాప్ హాలుడే ప్రకటించారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తలేరని రాష్ట్రంలోని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, కాళేశ్వరం మోటార్లు ఎందుకు ఆన్ చేయట్లేదని రైతులు అడుగుతున్నారు. లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నప్పటికీ ఎందుకు ఇవ్వలేదని హరీష్ రావు ప్రశ్నించారు.

08-09-2026 | 04:50pm

రేవంత్..చిల్లర నా కొడుకు: కేటీఆర్
రేవంత్..చిల్లర నా కొడుకు: కేటీఆర్

హైదరాబాద్: ఎర్రవల్లి నివాసానికి వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర నేతలను పోలీసులు హకీంపేట వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడు కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులు ఎస్కార్ట్ ఇస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులపై తమకు నమ్మకం లేదని, కేసీఆర్‌ను తామే కాపాడుకుంటామని మండిపడ్డారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. గూండాలతో కేసీఆర్‌ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు.

08-09-2026 | 01:15pm

గజ్వేల్‎లో టెన్షన్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ తోపులాట
గజ్వేల్‎లో టెన్షన్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ తోపులాట

సిద్దిపేట, సెప్టెంబర్ 8(విజయ క్రాంతి): మర్కుక్ మండలం దామరకుంట వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా, కాంగ్రెస్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగినట్లు సమాచారం. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎస్సీ నేతలు ఎర్రవల్లిలో డప్పులతో నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలకు పోటీగా బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాస పరిసరాల్లో 144 సెక్షన్ విధించి, వెంకటాపూర్, ఎర్రవల్లి శివారులో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

08-09-2026 | 12:17pm

హరీశ్‌రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ గుస్సా
హరీశ్‌రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ గుస్సా

హైదరాబాద్: మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత, కోవా లక్ష్మి తనకు తోబుట్టువులతో సమానమని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. సబితమ్మ ఘటనపై తానే విచారణ జరిపించాలని సూచించానని తెలిపారు. మహిళా సభ్యులపై దురుసు ప్రవర్తనపై నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హరీశ్‌రావుతో వాగ్వాదం సందర్భంగా స్పీకర్ భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీకు కాదు ఆవేశం.. నాకు ఉండాలి’’ అంటూ హరీశ్‌రావును ప్రశ్నించారు. తన మాటలు వినకుండా ఎందుకు ఆవేశం వ్యక్తం చేస్తున్నారని నిలదీశారు.

08-09-2026 | 11:11am