News

తెలంగాణకు వర్షసూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణకు వర్షసూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో గంటలకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

20-09-2026 | 08:03am

బీఆర్ఎస్ నేతల భూములపై కాంగ్రెస్ దండయాత్ర
బీఆర్ఎస్ నేతల భూములపై కాంగ్రెస్ దండయాత్ర

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్, మొయినాబాద్ లో కాంగ్రెస్ నేతలు ఆదివారం పర్యటించనున్నారు. టీ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల భూములను క్షేత్రస్థాయిలో సందర్శించే అవకాశముంది. సర్వే నంబర్లు, పాత రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలు, భూసేకరణ పత్రాలు, శాటిలైట్ చిత్రాలను పరిశీలించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిన్న జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్లడంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అటు సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ పరిసరాల్లో రెవెన్యూ శాఖ అధికారులు వరుసగా శనివారం మూడో రోజు సర్వే నిర్వహించారు. ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో భూ సర్వే కొనసాగుతోంది. మార్కూక్ మండలానికి చెందిన ఎర్రవల్లి, శివారు వెంకటాపురం, వరదరాజాపురం గ్రామాల్లో విస్తరించి ఉన్న ఈ సర్వే నంబర్‌లోని 388 ఎకరాల భూమి సరిహద్దులను, సర్వే, భూ రికార్డులను గుర్తించారు. ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చేసిన వాఖ్యలతో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల భూములను పరిశీలిస్తున్నారు.

20-09-2026 | 07:35am

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ రియాక్షన్‌
జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ రియాక్షన్‌

హైదరాబాద్, సెప్టెంబర్ 19: జన్వాడ ఫాంహౌస్‌ వ్యవహారంపై బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉందని అన్నారు. తాము ఏదైనా తప్పు చేసినట్లు తేలితే ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమని స్పష్టం చేశారు. అధికారం మీ చేతుల్లోనే ఉందని, అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గుమ్మడం, పెబ్బేరు సబ్‌స్టేషన్లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో ఎక్కడా 12 గంటల విద్యుత్ సరఫరా కూడా జరగడం లేదని ఆరోపించారు.

19-09-2026 | 05:55pm

తెలంగాణకు రెయిన్ అలర్ట్
తెలంగాణకు రెయిన్ అలర్ట్

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సాయంత్రం 5 గంటలలోపు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్‌ ఉన్నట్లు పేర్కొంది. జనగామ, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, నిర్మల్, నాగర్‌కర్నూల్, మెదక్, మంచిర్యాల, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

19-09-2026 | 03:49pm