6 May, 2026 | 1:17 PM

News -

article_56048945.webp
కామాఖ్య అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి

అస్సాం రాష్ట్రంలోని కామాఖ్య టెంపుల్( Kamakhya Ammavari Temple)లో తన పుట్టిన రోజు సందర్భంగా TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త(Uppala Srinivas Gupta) కుటుంబ సమేతంగా విశేష భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతదేశంలో అత్యంత ప్రాచీన శక్తిపీఠాలలో ఒకటైన ఈ పవిత్ర దేవాలయంలో అమ్మవారి దర్శనం పొందడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామునే దేవాలయానికి చేరుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, దేశ ప్రజల శాంతి, సుభిక్షం, కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

05-05-2026