21 July, 2026 | 12:11 AM

News -

article_60378572.webp
ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ పథకానికి శ్రీకారం

హైదరాబాద్: సచివాలయం జీ-29లో హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఇందిరమ్మ ఇళ్లు హౌసింగ్ టవర్స్ పథకాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజారుద్దీన్ ప్రారంభించి బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ హైదరాబాద్ నగరంలోని CURE (Core Urban Region Expansion) ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో ఇందిరమ్మ ఇళ్లు హౌసింగ్ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇది కేవలం గృహ నిర్మాణ పథకం మాత్రమే కాదు... వేలాది కుటుంబాలకు భద్రమైన, గౌరవప్రదమైన జీవనానికి పునాదని మంత్రులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌లో సొంత ఇల్లు కొనుగోలు చేయాలనే కలను సామాన్య కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

20-07-2026

article_70878050.webp
హైదరాబాద్‌లో కలకలం.. ముగ్గురు బాలికలు అదృశ్యం

హైదరాబాద్: నగరంలో అక్కాచెల్లెళ్లతో మిస్సింగ్ కలకలం రేపుతోంది. హిమాయత్‌నగర్‌లోని తమ ఇంటి నుంచి ఇద్దరు అక్కాచెల్లెళ్లతో సహా ముగ్గురు బాలికలు సోమవారం అదృశ్యమయ్యారు. ఆ ఇద్దరు సోదరీమణులు, తమ బంధువు కూడా అయిన ఒక స్నేహితురాలితో కలిసి ఉదయం వేళ ఇంటి నుండి బయలుదేరారు. వారు చివరిసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించినట్లు పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఈ ముగ్గురు బాలికలను ఛత్తీస్‌గఢ్‌కు నుంచి వచ్చిన వలస కుటుంబాలకు చెందినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ యువతుల ఆచూకీ కనుగొనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ బాలికల ఆచూకీ కనుగొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు వైర్‌లెస్ సందేశం పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

20-07-2026