సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నారు. 22ఏ నిషేధిత భూముల వివాదంపై ప్రధానంగా మంత్రివర్గంలో చర్చించి 22ఏ వివాదానికి ముగింపు పలికేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. పాతబస్తీలో మెట్రోరైలు విస్తరణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం, ఆహార, ఔషధ కల్తీపై ప్రత్యేక విభాగం ఏర్పాటు, తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ట్రాఫిక్ మేనేజ్ మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో(టీమార్స్) ఏర్పాటు, సంక్షేమ పథకాల విస్తరణపై పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరుకు మంత్రి వర్గం ఆమోదించనుంది. కొత్త ల్యాండ్ పూలింగ్ విధానం, గాంధీ సరోవర్ అభివృద్ధిపైనా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికలపై కేబినెట్ లో కీలకంగా చర్చించే అవకాశముంది.
14-08-2026