AIIMS నుంచి జేపీ నడ్డా డిశ్చార్జ్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ (All India Institute Of Medical Science)లో యాంజియోప్లాస్టీ చేయించుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా(Nadda discharged) బుధవారం డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి."యాంజియోప్లాస్టీ చేయించుకున్న అనంతరం నడ్డా ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆసుపత్రిలో సౌకర్యవంతంగా ఉన్నారు. అందించిన సంరక్షణకు వైద్యులు, నర్సులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు," అని ఎయిమ్స్ ప్రకటన తెలిపింది. ఆయనకు ఆగస్టు 17న ఆంజియోప్లాస్టీ నిర్వహించారని, ఆ తర్వాత కార్డియాలజీ విభాగంలో పర్యవేక్షణలో ఉంచారని మంగళవారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
19-08-2026