12 August, 2026 | 10:38 PM

News -

article_22125484.webp
పాన్ మసాలా ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌పై FSSAI నిషేధం

న్యూఢిల్లీ: భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) పాన్ మసాలా ప్యాకేజింగ్ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం, పాన్ మసాలాను ప్లాస్టిక్ రహిత కాగితం, పేపర్‌బోర్డ్, సెల్యులోజ్, టిన్ లేదా గాజు పాత్రలలో మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ప్రజారోగ్య, పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్, ప్లాస్టిక్ లామినేషన్, అల్యూమినియం ఫాయిల్ వాడకంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పూర్తి నిషేధాన్ని విధించింది. ప్లాస్టిక్ ప్యాకెట్లలో పాన్ మసాలాను నిల్వ చేయడం వల్ల కలిగే రసాయన ప్రతిచర్యలు, మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ప్రమాదాన్ని తగ్గించడం, తద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ఈ చర్య లక్ష్యమని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది.

12-08-2026

article_63651279.webp
లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో వర్షాకాల సమావేశాల ముగింపునకు ముందు రోజున లోక్‌సభ(Lok Sabha adjourned) బుధవారం నాడు వివాదాస్పద FCRA సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. అలాగే, గనులు, ఖనిజాల అభివృద్ధికి సంబంధించిన చట్టాలను సవరించే బిల్లును ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించింది. విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ 13.08.2026 ఉదయం 11:00 గంటలకు వాయిదా పడింది. రోజు ప్రారంభంలో నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష సభ్యులతో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, అధికార పక్షంతో వారి విధానాలు, ఆలోచనలు భిన్నంగా ఉన్నప్పటికీ, సభ సజావుగా సాగాలని దేశం కోరుకుంటోందని అన్నారు. నిరసనలు, నినాదాలతో సభ ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదని నొక్కి చెబుతూ, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.

12-08-2026

article_32264761.webp
NEET-UG 2026 పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం

న్యూఢిల్లీ: NEET-UG 2026 పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్ (NEET) పేపర్ లీక్ కేసులో సీబీఐ(Central Bureau of Investigation) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ కోర్టు బుధవారం పరిగణనలోకి తీసుకుంది. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ గుప్తా 13 మంది నిందితులపై ఆ సంస్థ సమర్పించిన తుది నివేదికను పరిగణనలోకి తీసుకున్నారు. 13 మంది నిందితులపై సీబీఐ 20 వేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ( CBI Chargesheet) అభియోగాలపై రౌస్ అవెన్యూ కోర్టు రేపు వాదనలు విననుంది. "ప్రభుత్వ పరీక్షలలో ప్రశ్నపత్రాల లీకేజీ, ఇతర అక్రమ పద్ధతుల వినియోగానికి సంబంధించిన క్రిమినల్ కేసులను" విచారిస్తున్న ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టుకు సీబీఐ ఇటీవల తన తుది నివేదికను సమర్పించింది. NTAకు చెందిన ముగ్గురు సబ్జెక్ట్‌ నిపుణులే పేపర్‌ లీక్‌ చేసినట్లు CBI ఆరోపిస్తోంది. ఛార్జ్‌షీట్‌లో 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 కీలక ఆధారాలు ఉన్నాయని సీబీఐ వెల్లడించింది.

12-08-2026

article_33824882.webp
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా సీఎం విజయ్ తీర్మానం

చెన్నై: డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మాణం చేసింది. లోక్‌సభ సభ్యుల సంఖ్యను శాశ్వతంగా 543గా నిర్ణయించాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్(CM Vijay) బుధవారం అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2029లో జరగనున్న తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సమర్థిస్తూ, దిగువ సభ (లోక్‌సభ) ప్రస్తుత బలం అయిన 543 స్థానాల ఆధారంగానే ఈ ప్రతిపాదిత కోటాను అమలు చేయాలని ముఖ్యమంత్రి విజయ్ తన తీర్మానంలో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ తో ముడిపెట్టవద్దని కేంద్రాన్ని కోరారు.

12-08-2026

article_13424473.webp
అమిత్‌షా వ్యాఖ్యలకు రాహుల్‌ గాంధీ కౌంటర్

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) వ్యాఖ్యలపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా ఉపన్యాసం వినేందుకు సిద్ధంగా లేమని రాహుల్ గాంధీ వెల్లడించారు. మాకు ఉపన్యాసాలు కాదు.. సమాధానాలే కాలని డిమాండ్ చేశారు. మన విద్యార్థులపై కాల్పులు జరిపిందెవరు?, మన విద్యార్థులపై కాల్పులకు ఆదేశించిందెవరు?, ఒక విద్యార్థి కళ్లు పోగొట్టిందెవరు?, మేకులతో ఉన్న కర్రలతో దాడికి ఆదేశాలిచ్చిందెవరు? అని వరస ప్రశ్నలు సంధించారు. ఈ ఆదేశాలన్నీ హోంశాఖ నుంచే వాచ్చాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాల్పులకు ఆదేశించింది అమిత్ షాయేనా?, కాల్పులకు అమిత్ షా ఆదేశించి ఉంటే రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే సమయానికి అమిత్ షా డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు.

12-08-2026

article_75813795.webp
జార్ఖండ్‌లో 19వ రోజుకు చేరిన విద్యార్థుల నిరసన

రాంచీ: జార్ఖండ్(Jharkhand) నియామక పరీక్షలలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాలపై ఉద్యోగార్థులు(Student protests) చేపట్టిన ఆందోళన బుధవారంతో 19వ రోజుకు చేరుకుంది. డాక్టర్లు రాంచీలో జైపాల్ సింగ్ స్టేడియం వద్దకు వచ్చి నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆందోళనకారులు స్పష్టం చేశారు. నియామక విధానంలో సంస్కరణల విషయంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం(Hemant Soren government) హామీలు ఇచ్చినప్పటికీ, 'JPSC-JSSC సంస్కరణల మంచ్' (JPSC-JSSC Reforms Manch) ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు తమ ఆందోళనను విరమించడానికి నిరాకరించారు.

12-08-2026