శాంతివనానికి చంద్రబాబు
15-12-2025
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) సోమవారం నాడు శంషాబాద్ లోని కన్హా శాంతివనంలో(Kanha Shanti Vanam) పర్యటించనున్నారు. కన్హా శాంతివనం అధ్యక్షుడు దాజీతో చంద్రబాబు భేటీ కానున్నారు. వెల్ నెస్, మెడిటేషన్ సెంటర్, యోగా కేంద్రాలను ఆయన తిలకించనున్నారు. ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్, మెడిటేషన్ సెంటర్, బయోవార్ కేంద్రాలు, గోపీచంద్ స్టేడియం, హార్టిఫుల్ నెస్ స్కూల్ కేంద్రాలను చంద్రబాబు సందర్శించనున్నారు. అనంతరం శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం తిరిగి అమరావతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు,