తెలంగాణ హైకోర్టులో ఐపీఎస్లకు చుక్కెదురు
30-04-2025
హైదరాబాద్: ఐపీఎస్ అధికారుల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) విచారణ ముగించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి హైకోర్టు నిరాకరించింది. భూములను నిషేధిత జాబితా(Prohibited list)లో ఉంచాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై అదే బెంచ్ లో వెకేట్ పిటిషన్ వేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. రవిగుప్తా, మహేష్ భగవత్, శిఖా గోయల్, సౌమ్యా మిశ్రా, తరుణ్ జోషి, రాహుల్ హెగ్డె వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.