కాంగ్రెస్ నిరసన ర్యాలీ
హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజీ, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు(Hike in petrol and diesel prices), సీబీఎస్ఈ వైఫల్యాలు, రూపాయి పతనం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బషీర్బాగ్ చౌరస్తా నుంచి ట్యాంక్బండ్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ(Telangana Congress Protest) నిర్వహించింది. ఈ ర్యాలీలో పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్ తో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. విద్యార్థులను, సామాన్య ప్రజలను బాధిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పామని, కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
06-06-2026