calender_icon.png 4 February, 2026 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_82079249.webp
కష్టపడ్డాం.. టికెట్ ఇవ్వరా?

04-02-2026

కామారెడ్డి, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి తల నొప్పిగా మారాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ తమకు టికెట్ దక్కలేదని కొం దరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసం హరణకు చివరి రోజు కావడంతో రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో టికెట్ దక్కని కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లాలో అధికార పార్టీ కాంగ్రెస్‌లో వర్గపోరుతో పలువురు నాయకుల అ నుచరులకు టికెట్లు గల్లంతయ్యాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో షబ్బిలి అనుచరులకు కొందరికి టికెట్లు గల్లంతయ్యాయి. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులకు కొందరికి చుక్కెదురయింది.

article_11395187.webp
ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.. సజ్జనార్ వార్నింగ్

03-02-2026

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(Hyderabad Police Commissioner VC Sajjanar) మంగళవారం నాడు ప్రజలకు, ముఖ్యంగా యువతకు, ప్రమాదకరమైన రీల్స్ చేయవద్దని హెచ్చరించారు. రైల్వే ట్రాక్‌లపై పడుకుని ప్రాణాలను పణంగా పెట్టి ఒక వ్యక్తి చేసిన రీల్‌పై స్పందిస్తూ, ఆయన ‘ఎక్స్’లో ఇలా అన్నారు. “వైరల్ పిచ్చితో ఇలాంటి పనులు చేయడం సాహసం కాదు. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఒక్క సెకను తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బాధ్యతగా ఉండండి, నిర్లక్ష్యంగా ఉండకండి” అని సజ్జనార్ సూచించారు. ఫేమస్ అయిపోవాలని రీల్స్ పిచ్చిలో యువత వింత వింత ప్రయత్నాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్న విషయం తెలిసిందే.

article_59110726.webp
సీఎం సభకు ఏర్పాట్లు.. కానిస్టేబుళ్లకు ప్రమాదం

03-02-2026

హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీఏ కార్యాలయం(Miryalaguda RTA Office) వద్ద మంగళవారం కంటైనర్ బీభత్సం సృష్టించింది. మిర్యాలగూడలో అతివేగంతో దూసుకొచ్చిన కంటైనర్ బైకుపై వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుళ్లకు(Police Constables) మజార్, సురేశ్ కు తీవ్రగాయాలయ్యాయి. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సభకు బాధితులు ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తున్నారు. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.