2 June, 2026 | 9:01 PM

News -

article_28993209.webp
పవన్ కళ్యాణ్‌పై కోదండరాం ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభపై ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ఉందని తెలంగాణలో మీటింగ్ పెడతామంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు బావ ప్రకటనా స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు మీరు రావచ్చు, పోవచ్చు అని కోదండరాం సూచించారు. తెలంగాణ సెక్రటేరియేట్(Telangana Secretariat)లో పెత్తనం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ ఏర్పాటైందని తెలిపారు. ఒక్కరితోనే తెలంగాణ వచ్చిందని ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. త్వరలోనే ఉద్యమకారులను గుర్తిస్తామన్నారు.

02-06-2026

article_70242422.webp
మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఈడీ దాడులు

ముంబై: ఇటీవల టర్కీ నుండి భారత్‌కు తీసుకురాబడిన మాదకద్రవ్యాల స్మగ్లర్ మహమ్మద్ సలీం డోలాపై జరుగుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం మహారాష్ట్ర, గుజరాత్‌లలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేంద్ర సంస్థ ఒక కేసు నమోదు చేసిన అనంతరం, ముంబైలో సుమారు 20 ప్రదేశాలతో పాటు గుజరాత్‌లోని సూరత్, అంక్లేశ్వర్ (భరూచ్ జిల్లా)లలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. డోలా అలియాస్ సలీం ఇస్మాయిల్ డోలా, ప్రపంచవ్యాప్తంగా వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడని ఆరోపణలు ఉన్నాయి.ఇతనిపై అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా సిండికేట్‌ను నడుపుతున్నాడని మాదకద్రవ్యాల నిరోధక సంస్థలు ఆరోపించాయి.

02-06-2026

article_58266421.webp
మెదక్‌ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆరబెట్టిన ధాన్యం దగ్ధం

వెల్దుర్తి : మెదక్ జిల్లా(Medak district) వెల్దుర్తి మండలం దామరంచలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని రోడ్డు పక్కన ఆరబెట్టిన ధాన్యం దగ్ధమైంది. రైతు నాచారం మహేశ్ కు చెందిన 40 బస్తాల ధాన్యం కాలిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు దామరంచ శివారులో గడ్డికి నిప్పుపెట్టారు. గాలికి మంటలు వ్యాపించి వడ్లకుప్ప, ధాన్యం బస్తాలు దగ్ధం అయ్యాయి. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు మహేశ్ వేడుకుంటున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

02-06-2026

article_36399342.webp
లారీని ఢీకొట్టిన కారు.. సిద్దిపేటలో ఇద్దరు మృతి

మెట్టపల్లి: సిద్దిపేట(Siddipet) అర్బన్ మండలం మెట్టపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. లారీ కింద కారు ఇరుక్కుపోయి అందులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మహిళ సహా ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి. మృతులు, క్షతగాత్రులు మణుగూరు వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

02-06-2026

article_80615465.webp
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) శుభసందర్భంగా ముఖ్యమంత్రిఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పరేడ్ మైదానంలో తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. పరేడ్ గ్రౌండ్ లో సీఎం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకావిష్కరణ చేశారు.

02-06-2026