గాంధీ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026
హైదరాబాద్: గాంధీ భవన్ లోగణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వైస్ ఛైర్మన్ ఫేహీం ఖురేషి, బెల్లయ్య నాయక్, సేవదళ్ చైర్మన్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ సేవాదళ్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జాతీయ నాయకులకు నివాళులు అర్పించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో జాతీయ జెండాను ఎగురవేసే గౌరవం తనకు లభించిందని మహేష్ గౌడ్ తెలిపారు.