బీజేపీతో సీఎం చీకటి ఒప్పందం
20-01-2026
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో సింగరేణి టెండర్ల కుంభకోణం, సీఎం, మంత్రుల వాటాల పంచాయితీలు చూస్తున్నామని, సీఎం రేవంత్రెడ్డి, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం లేకుంటే ఈ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్రావు కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సవాల్ విసిరారు.