29 June, 2026 | 10:52 AM

News -

article_13026847.webp
బీజేపీ నేతలతో నితిన్ నబీన్ బ్రేక్‎ఫాస్ట్ మీటింగ్

హైదరాబాద్: రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ లతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్(BJP National President Nitin Nabin) బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. బేగంపేట పర్యాటక భవన్ లో రామచందర్ రావు(Ramachander Rao) అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ కీలక భేటీకి అభయ్ పాటిల్, సునీల్ బన్సల్, ఆశిష్ సెల్లార్, రేఖా శర్మ, చంద్రశేఖర్ తివారీతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ కమిటీల పనితీరుపై సమావేశంలో చర్చించారు. పార్టీ పరిస్థితి, అధికారంలోకి వచ్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. మూడు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా నితిన్ నవీన్ రాష్ట్రానికి వచ్చారు.

29-06-2026

article_82571617.webp
కూకట్‌పల్లి ఏటీఎంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: కూకట్‌పల్లిలోని(Kukatpally) వడ్డేపల్లి ఎన్‌క్లేవ్‌లో సోమవారం తెల్లవారుజామున ఏటీఎం కియోస్క్‌లో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. స్థానికంగా ఉన్న DBS ఏటీఎం సెంటర్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో సమీపంలోని నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కొద్ది నిమిషాల్లోనే మంటలను ఆర్పేసింది. ఆ కియోస్క్‌లో అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కియోస్క్‌కు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని పోలీసులు బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు.

29-06-2026