15 April, 2026 | 12:00 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

News -

article_12127612.webp
తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి

హైదరాబాద్: తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) హైదరాబాద్ లోని చారిత్రక కట్టడాలను సందర్శించారు. ఆర్కియాలజీ విభాగం(Department of Archaeology) సమన్వయంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు వచ్చేలా సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. సౌకర్యాల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయిస్తామన్నారు. పర్యాటక ప్రాంతాల వద్ద మెరుగైన మౌలిక వసతులను కలిపిస్తామని తెలిపారు. నగరంలోని కుతుబ్‌షాహీ టూంబ్స్, కటోరా హౌస్, చార్మినార్ ప్రాంతాలను పరిశీలించి, వారసత్వ సంపద పరిరక్షణ, పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. చారిత్రక కట్టడాలకు పూర్వవైభవం తీసుకువస్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

15-04-2026

article_61017819.webp
ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్

శక్తి: ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఉన్న వేదాంత విద్యుత్ కేంద్రంలో(Chhattisgarh Vedanta power plant blast) సంభవించిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరిందని, గాయాల కారణంగా మరో కార్మికుడు మృతి చెందాడని పోలీసులు బుధవారం తెలిపారు. సింగితరాయ్ గ్రామంలోని వేదాంత లిమిటెడ్ పవర్ ప్లాంట్‌లో బాయిలర్ నుండి టర్బైన్‌కు అధిక పీడనంతో కూడిన ఆవిరిని తీసుకువెళ్తున్న ఉక్కు గొట్టంలో భారీ పేలుడు సంభవించింది. ఈ శక్తివంతమైన పేలుడు కారణంగా పలువురు కార్మికులు తీవ్రంగా కాలిపోగా, నలుగురు కార్మికులు ఘటనా స్థలంలోనే మరణించారు. మరో 10 మంది గాయాల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు.

15-04-2026