calender_icon.png 8 January, 2026 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_61170540.webp
నీటి హక్కులు సాధిస్తాం

08-01-2026

సూర్యాపేట, జనవరి 7 (విజయక్రాంతి): కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి హక్కులు సాధిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ర్ట నీటి హక్కులను సుప్రీంకోర్టు, కేంద్ర జల సంఘం, కేంద్ర ప్రభుత్వం వద్ద బలమైన వాదనలు వినిపించి సాధిస్తామని చెప్పారు. హుజూర్‌నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను, హుజూర్‌నగర్ పట్టణంలో ప్రభు త్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణాలను, రోడ్లు, భవనాల గెస్ట్ హౌస్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్, నీటిపారుదల శాఖ కార్యాలయ పనులను బుధవారం మంత్రి పరిశీలించారు.

article_87051130.webp
‘అధికారి’కంగా వసూలు..?

08-01-2026

సిద్దిపేట, జనవరి 7 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో అధికారులు విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు అనే చర్చ జరుగుతుంది. లక్షలు ఇచ్చి సిద్దిపేట జిల్లాలో పోస్ట్ పొందుతున్నారు. దాంతో జిల్లాకు వచ్చిన అధికారులు కింది స్థాయిలోనీ అధికారులను పిండించి, బెదిరించి, చిన్న చిన్న తప్పులను సాకు చూపి అందినకాడికి వసూలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అధికారి పరిధిలోని కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయాలంటే చెప్పినంత ఇవ్వాల్సిందే లేదంటే చెక్కులు సదరు అధికారి డ్రాలోనే ఉంటుంది. ఇలా జిల్లాకు వచ్చిన అధికారులు అవినీతికి పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి.

article_22189820.webp
హీటెక్కిన తమిళనాడు రాజకీయాలు

07-01-2026

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే వర్గం బుధవారం ఎన్డీఏలో చేరింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, ఆ పార్టీ నాయకుడు ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామిని కలిశారు. తమిళనాడులో జాతీయ ప్రజాస్వామ్య కూటమికి (National Democratic Alliance) ఏఐఏడీఎంకే నాయకత్వం వహిస్తోంది. రామదాస్ అధికారికంగా కూటమిలో చేరడానికి తన నివాసంలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిని కలిశారు. ఈ కూటమిలో బీజేపీ కూడా ఒక భాగస్వామిగా ఉంది. "పట్టాలి మక్కల్ కట్చి(Pattali Makkal Katchi) మా కూటమిలో చేరింది. త్వరలోనే మరిన్ని పార్టీలు ఈ కూటమిలో చేరతాయి." అని పళనిస్వామి విలేకరులతో అన్నారు. పీఎంకేకు సీట్ల కేటాయింపు ఖరారైందని, దానిని తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.

article_48347722.webp
ఫోన్లలో గేమ్ లు బారి నుంచి మైదానాలకు

07-01-2026

హైదరాబాద్: తెలంగాణలో సంక్రాంతి పండుగను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్-2026 వివిధ రాష్ట్రలకు చెందిన 1200 రకాల మిఠాయిలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. చేనేత వస్తువుల విక్రయానికి స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి జూపల్లి సూచించారు. హాట్ ఎయిర్ బెలూన్లు 2500 అడుగులు ఎత్తు వరకు వెళ్తాయన్నారు. హాట్ ఎయిర్ బెలూన్లలో ప్రయాణానికి ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.