3 June, 2026 | 10:44 PM

News -

article_20763668.webp
Delhi Hotel Fire: ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం, ఎక్స్‌గ్రేషియా ప్రకటన

న్యూఢిల్లీ: ఢిల్లీ మాలవీయ నగర్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో(Delhi Hotel Fire) ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తీవ్ర విచారం వ్యక్తం(PM Modi condoles) చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బుధవారం నాడు దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో ఉన్న ఒక బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 21 మంది మరణించారు. మరణించిన వారిలో పలువురు విదేశీయులు ఉన్నారని, వీరు ప్రధానంగా మధ్య ఆసియా, ఆఫ్రికాకు చెందినవారని అధికారులు తెలిపారు.

03-06-2026

article_61473157.webp
ఆర్టీసీ బస్సు బీభత్సం.. చక్రాల కింద ఇరుక్కున్న వ్యక్తి

హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్‌ స్టేషన్‌(Jubilee Bus Station) వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు శివ బస్సు టైర్ల కింద ఇరుక్కుపోయాడు. గమనించిన మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు తక్షణమే అప్రమత్తమమై శివను కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు కింద పడిన శివకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో బస్సును పక్కకు జరిపారు. బస్సు జేబీఎస్‌ నుంచి కార్ఖానా వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోటుచేసుకుంది

03-06-2026

article_74408863.webp
తెలంగాణ—దక్షిణాఫ్రికా వాణిజ్య సంబంధాలు మరింత ముందుకు

హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్(South Africa Vice President Palas Mashatil) బృందం MCRHRDలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) కలిసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, సీఎస్ రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ—దక్షిణాఫ్రికా వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇరు పక్షాలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు అవసరమైన తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారిక పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా బృందం హైదరాబాద్ వచ్చింది.

03-06-2026

article_19630599.webp
తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు(Southwest Monsoons) గురువారం నాటికి కేరళ, తమిళనాడు రాష్ట్రాలను తాకే అవకాశం ఉన్నందున బుధ గురువారాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు(Heavy Rainfall) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ములుగు జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

03-06-2026

article_81155319.webp
ట్రక్కును ఢీకొన్న మినీబస్సు: ఒకరు మృతి, 13 మందికి గాయాలు

నార్కెట్‌పల్లి: నల్గొండ జిల్లా(Nalgonda District) నార్కెట్‌పల్లి శివారులోని నార్కెట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సును ఒక ట్రక్కు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. నార్కెట్‌పల్లి వద్ద ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నిలిచి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులు అరుణాచలంలో తమ తీర్థయాత్రను పూర్తి చేసుకుని, హైదరాబాద్‌లోని తమ నివాసానికి తిరిగి వస్తున్నారు. సమాచారం అందిన వెంటనే, నార్కెట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని సరైన చికిత్స నిమిత్తం కామినేని వైద్య విజ్ఞాన సంస్థకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

03-06-2026