21 April, 2026 | 5:44 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

News -

article_36125398.webp
మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడు: చెన్నైలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress President Mallikarjun Kharge) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే(AIADMK) నేతలు మోదీతో ఎలా చేతులు కలుపుతారని ఖర్గే ప్రశ్నించారు. మోదీ.. ఒక ఉగ్రవాది(PM Modi as terrorist) అంటూ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. బీజేపీకి సమానత్వం, న్యాయంపై నమ్మకం లేదు, అలాంటి బీజేపీ నేతలతో అన్నాడీఎంకే ఎలా చేతులు కలుపుతుందని ఖర్గే ప్రశ్నించారు. మోదీని ఉగ్రవాదిగా వ్యాఖ్యానించిన కాసేపటికే ఖర్గే వివరణ ఇచ్చారు. మోదీని ఉగ్రవాది అని నేనెప్పుడూ అనలేదు.. నా ఉద్దేశం మోదీ ఎప్పుడూ ప్రజలకు భయపెడుతున్నారనే అన్నారు. ఈ డీ, ఐటీ, సీబీఐ చూపించి మోదీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు.

21-04-2026

article_89672094.webp
జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్: సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(Congress Party Political Affairs Committee) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కర్ పాల్గొన్నారు. ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సాగుతోందని తెలిపారు. ఇటీవలే రూ. 200 కోట్లతో కొత్త ఆస్పత్రికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని వినతులు వచ్చాయని వెల్లడించారు. నారాయణఖేడ్ ఆస్పత్రిలో మరో 50 పడకలు మంజూరు చేస్తామన్నారు. జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ యోచన అన్నారు.

21-04-2026

article_76450389.webp
రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్: కేసీఆర్ వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman kumar) ఖండించారు. రెండున్నరేళ్లలోపే రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరమని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో(BRS Government) రైతుబంధు డబ్బుల కోసం ఓఆర్ఆర్ ను కుదువపెట్టారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసి వడ్డీలు కట్టలేక ఉద్యోగులకు జీతం ఇవ్వలేని స్థితికి తెచ్చారని అడ్లూరి ధ్వజమెత్తారు. గత పదేళ్లలో ప్రతిపక్ష నేతలు కనీసం మాట్లాడలేని పరిస్థితి ఉండేదన్నారు. జీవన్ రెడ్డి అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు విమర్శించడం సరికాదని సూచించారు.

21-04-2026