లడఖ్లో భూకంపం
19-01-2026
న్యూఢిల్లీ: నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) ప్రకారం, సోమవారం లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని లేహ్లో రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఈ ప్రకంపనలు ఉదయం 11:51 గంటలకు (ఐఎస్టి) నమోదయ్యాయి. భూమి ఉపరితలం నుండి 171 కిలోమీటర్ల లోతులో ఉద్భవించాయి. "భూకంప తీవ్రత: 5.7, సమయం: 19/01/2026 11:51:14 IST, అక్షాంశం: 36.71 ఉత్తరం, రేఖాంశం: 74.32 తూర్పు, లోతు: 171 కి.మీ., ప్రదేశం: లేహ్, లడఖ్," అని ఎన్సిఎస్ తెలిపింది. భూకంపం ధాటికి ఎలాంటి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవని అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్థానిక అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.