11 July, 2026 | 6:42 PM

News -

article_57508959.webp
షాబాద్ హత్యల కేసులో కీలక మలుపు.. ఎస్ఐ సస్పెండ్

షాబాద్ : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవల్‌గూడ(Daivalguda) గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఆరు హత్యల ఘటనకు సంబంధించి షాబాద్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను పోలీస్ శాఖ సస్పెండ్(Shabad SI Suspended) చేసింది. మే నెలలో 'లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం' (POCSO) కింద కేసు నమోదైన 28 ఏళ్ల నిందితుడు రాజ్‌కుమార్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలన్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ఈ ఘటన నేపథ్యంలో, షాబాద్ సబ్-ఇన్‌స్పెక్టర్‌పై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. పోక్సో (POCSO) కేసును సమర్థవంతంగా నిర్వహించడంలో షాబాద్ పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని పరిశీలిస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి శనివారం తెలిపారు.

11-07-2026

article_59632423.webp
బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

షాబాద్ : రంగారెడ్డి జిల్లా షాబాద్ సామూహిక హత్యల కేసు బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మా దేవేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డి లను పోలీసులు చెవెళ్ల-మల్కాపూర్ గేటు వద్ద అడ్డుకోవడంతో శనివారం షాబాద్ రోడ్డుపై ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన అనంతరం మరో ప్రాంతానికి తరలించారు. ఇటీవలి హత్యల నేపథ్యంలో ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న తరుణంలో ఈ చర్య తీసుకున్నారు. ఇదే సమయంలో, ఆ ఘటన తర్వాత షాబాద్ మండలంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలోనే పర్యవేక్షిస్తున్నారు. పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

11-07-2026

article_42970850.webp
దైవాలగూడలో దారుణం.. ఆరుగురి హత్యపై స్పందించిన సీపీ తరుణ్ జోషి

షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రహదారిపై ఆరుగురి మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిందితుడిని అప్పగించాలంటూ మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రాజ్ కుమార్ ను వెంటనే అరెస్ట్ చేయకపోతే మరొకరిని ప్రాణం పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాద్ నగర్ -కంది రహదారిపై బంధువులు భైఠాయించారు. హత్యల అనంతరం నిందితుడు రాజ్ కుమార్ పరారయ్యాడని సీపీ తరుణ్ జోషి(CP Tarun Joshi) ప్రకటించారు. ప్రస్తుతం నిందితుడి కోసం 7 బృందాలతో గాలిస్తున్నామని సీపీ వెల్లడించారు. నిందితుడు భార్య, పిల్లల్ని చంపడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని పేర్కొన్నారు.

11-07-2026