15 July, 2026 | 9:29 PM

News -

article_39279299.webp
నూతనంగా నియమితులైన నర్సింగ్ అధికారులకు రాష్ట్రస్థాయి ద్వితీయ విడత ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం

వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం (డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ – DME) ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, నాణ్యమైన మానవ వనరులను అభివృద్ధి చేయడం, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడం, నిరంతర సామర్థ్యాభివృద్ధికి కట్టుబడి ఉన్న తెలంగాణ ప్రభుత్వం, 2026 బ్యాచ్‌కు చెందిన నూతనంగా నియమితులైన నర్సింగ్ అధికారుల కోసం రాష్ట్రస్థాయి ద్వితీయ విడత ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) ఆడిటోరియంలో ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు విజయవంతంగా నిర్వహించింది.

15-07-2026

article_82567904.webp
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. తుంగతుర్తి అంశాలపై చర్చ!

హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి అంశంపై(Thungathurthy Issues) లోటస్ పాండ్‌లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. తుంగతుర్తి అంశాలపై చర్చించారు. తుంగతుర్తి అంశంపై ఈనెల 20లోపు నివేదిక ఇస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. తుంగతుర్తి అంశంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తి చూపించట్లేదని జగ్గారెడ్డి తెలిపారు. తుంగతుర్తి అంశంలో ఇన్వాల్ కాబోనని వెంకట్ రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. తుంగతుర్తి అంశాన్ని జగ్గారెడ్డి చూసుకుంటారని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కొందరు మంత్రి పదవి కోసం ఢిల్లీకి వెళ్లారు.. తాను వెళ్లలేదని కోమటిరెడ్డి సూచించారు. జగ్గారెడ్డి మాస్ లీడర్.. ఆయనను రాహుల్ గాంధీ ఇష్టపడతారని చెప్పారు. సిద్దిపేటలో జగ్గారెడ్డి పోటీ చేస్తే.. తమ మద్దతు పూర్తిగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.

15-07-2026

article_17707495.webp
ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ

హైదరాబాద్: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Cement Corporation of India) ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఢిల్లీకి బయలుదేరింది. కాసేపట్లో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామితో కేటీఆర్ బృందం భేటీ కానుంది. అదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ వినతిపత్రం సమర్పించనున్నారు. కేటీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్, CCI సాధన సమితి నాయకులు ఈ బృందంలో ఉన్నారు. సమావేశం అనంతరం ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ మాట్లాడతారని పార్టీ నేతలు వెల్లడించారు.

15-07-2026

article_49445758.webp
ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్

నిజామాబాద్: బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని(Vemula Prashanth Reddy) నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు నిర్బంధించడాన్ని భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) తీవ్రంగా ఖండించింది. బుధవారం నాడు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు వివిధ ప్రాంతాల్లో గృహ నిర్బంధంలో ఉంచారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి నిరాహార దీక్షలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు, అదుపులోకి తీసుకున్న నాయకులు, కార్యకర్తలను ఆ తర్వాత వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

15-07-2026

article_76730973.webp
ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు

అనకాపల్లి: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని(Parawada Pharma) ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని శ్రీ సాయి చందన ఫార్మా ప్రొడక్షన్ బ్లాక్-2లో అగ్నిప్రమాదం సంభవించింది. భారీ మంటలు భవనాన్ని చుట్టుముట్టగా, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి 12 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. గంటల తరబడి సాగిన అగ్నిమాపక చర్యల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న 40 మంది కార్మికులూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణం, జరిగిన నష్టం తీవ్రత ఇంకా నిర్ధారించబడలేదని అధికారులు పేర్కొన్నారు.

15-07-2026

article_52592987.webp
చెన్నూరు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులంలో కలకలం

చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులంలో(Chennur Mahatma Jyotiba Phule Gurukulam) కలకలం రేగింది. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల వసతి గృహంలో తగిన వసతులు లేవని ఆరోపిస్తూ, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 17 మంది విద్యార్థులు బయటకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు మంచిర్యాల ఎమ్మెల్యే భార్యను(Mancherial MLA's wife) కలిసి, హాస్టల్‌లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. హాస్టల్‌లో కనీస సౌకర్యాలు కూడా లేవని ఆరోపించారు. ఆమె విద్యార్థులతో మాట్లాడి, వారిని ఓదార్చి, వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, హాస్టల్‌లో మెరుగైన వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

15-07-2026

article_75572224.webp
Meerpet Fire Accident: మీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం

మీర్‌పేట్: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్(Meerpet Police Station) పరిధిలో ఉన్న నందనవనంలోని ఒక ప్లాస్టిక్ గోదాములో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మూడు అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. గోదాములో భారీ పరిమాణంలో ప్లాస్టిక్ సామాగ్రి నిల్వ ఉండటంతో జరిగిన అగ్నిప్రమాదం వల్ల భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణంపై దర్యాప్తు జరుగుతోంది.

15-07-2026