భారత్, నార్వే గ్రీన్ స్ట్రేటజీ.. ప్రపంచ దేశాలకు ప్రయోజనాలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఇటీవల భారత్, ఈయూ మధ్య చారిత్రక ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ ఒప్పందం వల్ల భారత్, నార్వేకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. భారత్, నార్వే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని తెలిపారు. భారత కంపెనీలు గ్లోబల్ సొల్యూషన్ సెంటర్లుగా మారాయని మోదీ వెల్లడించారు.
18-05-2026