calender_icon.png 4 January, 2026 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_76396420.webp
ప్రశ్నోత్తరాల్లో సీఎం సుదీర్ఘ ప్రసంగం విరుద్ధం

04-01-2026

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ ప్రసంగం చేయడం శాసనసభ చరిత్రలో ఇప్పటివరకు జరగలేదని, ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్ గంటన్నర పాటు మాట్లాడడం శాసనసభ నిబంధనకు విరుద్ధమని మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా స మావేశంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని చెబుతూనే.. ముసీ ప్రక్షాళనకు వేల కోట్లు ఎట్లా ఖర్చు చేస్తారని హరీశ్‌రావు అడిగితే సీఎం రేవంత్ సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా మాట్లాడారన్నారు.

article_31488312.webp
పురోగతి లేని ఆయిల్ పామ్ జోన్లు రద్దు

04-01-2026

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి కోసం కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో ఒప్పంద నిబంధనల ప్రకారం పురోగతి సాధించని కం పెనీలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పురోగతి లేని ఆయిల్ పామ్ కంపెనీల ఫ్యాక్టరీ జోన్లను తగ్గిస్తూ, ఆయా ప్రాంతాలను తెలంగాణ ఆయిల్ ఫెడ్‌కు కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఆయిల్ పామ్ (ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ని యంత్రణ) చట్టం, 1993, నిబంధనలు- 2008 ప్రకారం, ఆయిల్ పామ్ కంపెనీలు రైతు నాట్ల నుంచి 36 నెలల్లోపు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, ఫ్యాక్టరీ జోన్ పరిధిలో రైతులకు సేవలు అందించాల్సి ఉంటుంది.

article_49917436.webp
తిరుప‌తిలో మహాపచారం.. ఆలయ గోపురంపై మందుబాబు

03-01-2026

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోకి(Sri Govindaraja Swamy Temple) చొరబడి, ఆలయానికి చెందిన 100 అడుగుల గోపురం ఎక్కాడు. దీంతో దాదాపు మూడు గంటల పాటు తీవ్ర భద్రతా ఆందోళన నెలకొంది. అతను గోపురంపై ఉన్న రెండు కలశాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడని, దీంతో ఆలయ యంత్రాంగం, స్థానిక పోలీసులు వెంటనే స్పందించారని ఒక మీడియా నివేదిక పోలీసులను ఉటంకిస్తూ పేర్కొంది. శనివారం ఆలయంలోని భద్రతా సిబ్బంది, భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.