17 May, 2026 | 6:59 PM

News -

article_21967858.webp
మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ కొండంత అండ

హైదరాబాద్: ప్రజాభవన్‌లో శనివారం జరిగిన ‘స్త్రీనిధి యాన్యువల్ యాక్షన్ ప్లాన్’(Stree Nidhi Annual Action Plan) అమలు కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ మహిళలకు స్త్రీనిధి ఒక నమ్మకమైన బ్యాంక్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. మైక్రో ఫైనాన్స్ వేధింపుల నుండి మహిళలకు విముక్తి కల్పించడానికే స్త్రీనిధి ఏర్పాటయిందని, ఇప్పటివరకు రూ. 24 వేల కోట్ల రుణాలను 32 లక్షల మంది మహిళలకు అందించి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడిందని కొనియాడారు. తెలంగాణ స్త్రీనిధి మోడల్‌ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని సీతక్క పేర్కొన్నారు.

16-05-2026

article_19906743.webp
కాకినాడ జిల్లాలో ఘోరప్రమాదం: నలుగురు ఉపాధి కూలీలు మృతి

అమరావతి: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో నలుగురు ఎన్‌ఆర్‌ఈజీఎస్ మహిళా కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంద్రపాలెం పోలీసుల ప్రకారం, కార్మికులు బయోమెట్రిక్ ఫోటోలు దిగడానికి కోవూరు రోడ్డు వద్ద ఉన్న జాతీయ రహదారికి వచ్చారు. ఫోటోలు దిగిన తర్వాత, వారు పనికి వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఒక లారీ అదుపుతప్పి వారిని వెనుక నుండి ఢీకొట్టింది. మృతులను వాసంశెట్టి సత్యవతి (60), పాలిక కృష్ణవేణి (35), చిట్టెమ్మ (45), చెల్లూరి అన్నవరం (45)గా గుర్తించారు.

16-05-2026