calender_icon.png 7 February, 2026 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_90424767.webp
బీజేపీకి ఓటు వేస్తే.. ఢిల్లీ నుంచి నిధులొస్తాయ్

07-02-2026

హైదరాబాద్: కాంగ్రెస్ గ్యారంటీల గురించి నిలదీస్తారని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మల్కాపూర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలకు నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని వెల్లడించారు. బీజేపీకి ఓటు వేస్తే.. ఢిల్లీ నుంచి మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీల గురించి నిలదీస్తారని కేసీఆర్ బయటకి రావట్లేదని బండి సంజయ్ ఆరోపించారు. నిధులు లేవంటున్నారు కాబట్టి.. కాంగ్రెస్ కు ఓటు వేసినా నిధులు రావని బండి సంజయ్ సూచించారు.

article_23743151.webp
బీజేపీ అభ్యర్థులకు బిగ్ షాక్

07-02-2026

హైదరాబాద్: తెలంగాణలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో బీజేపీకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రచార కార్యక్రమం రద్దు అయింది. ప్రచారానికి కేవలం రెండు రోజులే మిగిలి ఉన్న తరుణంలో, షెడ్యూలింగ్‌లో సమస్యల కారణంగా కల్యాణ్ రాష్ట్ర పర్యటన రద్దు అయిందని తెలంగాణ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్. వి. సుభాష్ శనివారం తెలిపారు. దీంతో బీజేపీ అభ్యర్థులకు భారీ షాక్ తగిలింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఫిబ్రవరి 4న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి కల్యాణ్ అంగీకరించారని చెప్పారు.

article_41142668.webp
టూరిస్ట్ బస్సులో గంజాయి స్మగ్లింగ్

07-02-2026

హైదరాబాద్: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు చెందిన రాష్ట్ర టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) సిబ్బంది శనివారం ఉదయం జీడిమెట్ల సమీపంలోని సుచిత్ర జంక్షన్ వద్ద కాలేశ్వరి ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రైవేట్ టూరిస్ట్ బస్సులో అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో, ఎస్‌టీఎఫ్ బృందం సుచిత్ర జంక్షన్ వద్ద కాళేశ్వరి ట్రావెల్ బస్సును ఆపి, ప్రయాణికులను తనిఖీ చేయగా, ఒక ప్రయాణీకుడి బ్యాగులో రెండు కిలోలు మాత్రమే కనిపించాయి. ఆ ప్రయాణికుడు మహారాష్ట్ర నుండి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ఎస్టీఎఫ్ బృందం చంద్రాయణగుట్టకు చెందిన మీర్జా ఫయాజ్ అలీ బేగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ దర్యాప్తు చేపట్టింది.