బాగున్నరా అమ్మ!
09-01-2026
హైదరాబాద్/గజ్వేల్, జనవరి 8 (విజయక్రాంతి): దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గురువారం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మేడారం సమ్మక్క సారల మ్మ జాతరకు రావాలని కోరుతూ ప్రభు త్వం తరఫున ఆహ్వానించారు. కేసీఆర్కు శాలువా కప్పి ఆహ్వాన పత్రికను అందజేసి, మేడారం ప్రసాదం అందజేశారు. తన ఇం టికి వచ్చిన మహిళా మంత్రులకు మాజీ సీ ఎం కేసీఆర్ దంపతులు సాదరంగా ఆహ్వా నం పలికారు.