14 July, 2026 | 9:15 PM

News -

article_32434477.webp
తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం

హైదరాబాద్: తెలంగాణలో SIR(Special Intensive Revision) గడువు పొడిగింపుపై మంగళవారం నాడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి( Chief Electoral Officer) సుదర్శన్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బలమురి వెంకట్, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, నవీన్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్, మోత రోహిత్, టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ రాజేష్ తదితర నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి తెలంగాణలో SIR గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు

14-07-2026

article_30834223.webp
మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్

హైదరాబాద్: అయోధ్యలో(Ayodhya Ram Temple Theft) అవినీతి జరుగుతుంటే స్వామీజీలు ఎందుకు మాట్లాడరు? అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్) ప్రశ్నించారు. అయోధ్యలో అవినీతిని నిరసిస్తూ ఈ నెల 23న ఢిల్లీ జంతర్ మంతర్(Delhi Jantar Mantar) వద్ద మౌనదీక్ష చేస్తానని వి. హనమంతరావు సూచించారు. అయోధ్యలో ఇంత జరుగుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), అమిత్ షా స్పందించరెందుకు? అని ప్రశ్నించారు. అయోధ్యలో చోరీపై సీబీఐ విచారణ(CBI inquiry) చేసి.. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు ఓట్, సీట్ చోరీ.. ఇప్పుడు రాముడి సొమ్ము చోరీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

14-07-2026

article_14037013.webp
గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం

అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా దాని ఉనికిని విస్తరించడానికి ఒక కీలక చర్యగా, పార్టీ డాక్టర్ రాజాను గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌గా నియమించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. పార్టీకి డాక్టర్ రాజా అచంచలమైన నిబద్ధతను, ప్రచారం కోరుకోకుండా తెరవెనుక తరచుగా పనిచేసే ఆయన అమూల్యమైన సేవలను గుర్తించి, పార్టీ నాయకత్వం ఆయనకు ఈ కీలక బాధ్యతను అప్పగించింది. తనను గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌గా నియమించి, తనపై విశ్వాసం ఉంచినందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కి డాక్టర్ రాజా కృతజ్ఞతలు తెలిపారు.

14-07-2026

article_77111337.webp
Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన

తిరుమల: RAW NTR తిరుపతి ఈవెంట్ పై వివాదం నెలకొంది. RAW సంస్థతో తమకు సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం వివరణ ఇచ్చింది. ఎన్టీఆర్ తో సంబంధం ఉన్నట్లు ప్రజల్లో భావన కలిగిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. ఎన్టీఆర్ తరుఫున ప్రాతినిధ్యం వహించే హక్కు ఆ సంస్థకు లేదని ఎన్టీఆర్ తేల్చిచెప్పారు. సేవా కార్యక్రమాలు మా అధికారిక బృందం వెల్లడిస్తోందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. అనధికారిక వ్యక్తులు, సంస్థల ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోవద్దని సూచించారు. అపోహలు, వదంతులు, ఊహాగానాలకు ముగింపు పలకాలని కోరారు.

14-07-2026

article_76558576.webp
LeT వ్యవస్థాపకుడిపై NIA నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

జమ్మూ: పహల్గామ్ ఉగ్రవాద దాడికి(Pahalgam terror attack) సంబంధించిన దర్యాప్తులో భాగంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ 'లష్కర్-ఏ-తైబా'కు చెందిన పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న అధినేత హాఫిజ్ సయీద్‌పై ప్రత్యేక ఎన్‌ఐఏ ( National Investigation Agency) కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి కేసులో సయీద్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన రెండు రోజుల తర్వాత, అంటే జూలై 8న NIA కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈ ఉత్తర్వును జారీ చేశారు. భారత్,అమెరికాచే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించబడిన సయీద్, 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారిగా కూడా పరిగణించబడుతున్నాడని అధికారులు వెల్లడించారు.

14-07-2026

article_86525978.webp
CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం నాడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో(Union Ministers) రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 9.45 గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర సహకార అంశాలపై కేంద్రమంత్రులతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్‌తో మెట్రో విస్తరణ, కింజరాపు రామ్మోహన్ నాయుడుతో విమానాశ్రయాల అభివృద్ధి, నితిన్ గడ్కరీతో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

14-07-2026