6 June, 2026 | 9:47 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

News -

article_10480427.webp
గండిపేట భూముల కబ్జా కేసు: బొల్లా బ్రహ్మనాయుడు కోర్టుకు తరలింపు

హైదరాబాద్: నిన్న కాంచీపురంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంచీ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. గండిపేటలో సర్వే నంబర్ 18లో ఉన్న 9.28 ఎకరాల భూకబ్జా కేసులో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. బ్రహ్మనాయుడు నకిలీ జీవోలు సృష్టించి భూమి కబ్జా, విక్రయానికి ప్రయత్నించారు. బొల్లా బ్రహ్మనాయుడు వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. అంతకు ముందు గండిపేట భూ కబ్జా కుట్ర కేసులో బొల్లాను పోలీసులు ప్రశ్నించారు.

06-06-2026

article_33130784.webp
ఖైరతాబాద్‌లో విషాదం.. ప్రాణాలు పోతున్నా.. మనవడిని కాపాడుకున్న మహిళ

హైదరాబాద్: ఖైరతాబాద్‌లో(Khairatabad) ఆనంద్ నగర్ కాలనీలోని భావనా అపార్ట్‌మెంట్స్‌లో జరిగిన విషాదకరమైన లిఫ్ట్ ప్రమాదంలో(Lift Accident) శనివారం ఒక మహిళ మరణించగా, ఆమె మనవడు గాయపడ్డాడు. బాధితురాలిని రాధ(53)గా గుర్తించారు. లిఫ్ట్‌ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్‌ రాకముందే రాధ గేటు తెరవడంతో ఐదో అంతస్తు నుంచి పడిపోయింది. ఆమెతో ఉన్న 13 నెలల మనవడికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లిఫ్ట్ నిర్వహణ సరిగా లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణం కావచ్చని అపార్ట్‌మెంట్ సముదాయ నివాసితులు ఆరోపించారు.

06-06-2026

article_39816551.webp
కాంగ్రెస్ నిరసన ర్యాలీ

హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజీ, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు(Hike in petrol and diesel prices), సీబీఎస్ఈ వైఫల్యాలు, రూపాయి పతనం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ(Telangana Congress Protest) నిర్వహించింది. ఈ ర్యాలీలో పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్‌ తో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. విద్యార్థులను, సామాన్య ప్రజలను బాధిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పామని, కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

06-06-2026

article_24126188.webp
వికారాబాద్‌లో ఘోరప్రమాదం.. హోటల్ స్లాబ్ కూలి ఒకరు మృతి

మార్పల్లి: వికారాబాద్ జిల్లాలోని మార్పల్లిలో శనివారం మధ్యాహ్నం ఒక హోటల్ కాంక్రీట్ స్లాబ్ కొంత భాగం కూలిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడగా, ఒకరు మరణించారు. స్థానికులు గాయపడిన వారిని బయటకు తీయగా, వారిని చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మిగిలి ఉన్న వ్యక్తుల కోసం వెతకడానికి జేసీబీ యంత్రం సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలంలో దర్యాప్తు నిర్వహిస్తూ, భద్రతను నిర్ధారిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా ఎంత మంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

06-06-2026

article_64540394.webp
లిక్కర్ వ్యాన్ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ జనం

బసిరెడ్డిపల్లి: చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లె సమీపంలో శనివారం మద్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. దీంతో స్థానికులు అక్కడికి పరుగులు తీసి మద్యం సీసాలను ఎత్తుకుపోవడంతో గందరగోళం నెలకొంది. మహిళలతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి, మద్యం సీసాలను సేకరించి లుంగీలు, తువ్వాళ్లు, సంచులలో వాటిని తరలించుకుపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అధికారులు అక్కడికి చేరుకునే లోపు ఈ ఘటన ఆ ప్రాంతంలో కాసేపు కలకలం సృష్టించింది. మగాళ్లతో సమానంగా మహిళలు మందు బాటిల్లు ఎత్తుకెళ్లడం విశేషం. వాహనంలో సుమారు పది లక్షల విలువ చేసే మద్యం ఉన్నట్లు డ్రైవర్ తెలిపాడు.

06-06-2026

article_35025480.webp
మహిళల భద్రత కోసం 'స్త్రీ రైడ్'.. ప్రారంభించిన డీజీపీ ఆనంద్

హైదరాబాద్: స్త్రీ రైడ్( Stree Rides) కార్యక్రమాన్ని డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand) ప్రారంభించారు. మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా విమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక ప్రాజెక్టు ఇది. తొలి విడతలో 55 మంది మహిళలకు స్త్రీ రైడర్లుగా అవకాశం కల్పించారు. అంబర్ పేట్ పోలీస్ లైన్ లో ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసిన 55 మంది మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. టూ వీలర్, త్రీ వీలర్ డైవింగ్ నైపుణ్యాల్లో మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. స్త్రీ రైడర్లు అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు సురక్షిత రవాణా సేవలు అందించనున్నారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

06-06-2026