calender_icon.png 15 January, 2026 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_26615156.webp
కేస్లాపూర్‌లో రోడ్లకు మరమ్మత్తులు

15-01-2026

ఉట్నూర్, జనవరి 14(విజయక్రాంతి): రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చే ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. జాతర సందర్భంగా రోడ్ల మరమ్మత్తులు చేపట్టారు. ‘మరమ్మత్తులకు నోచని నాగోబా రోడు’ అనే శీర్షికతో మంగళవారం ‘విజయక్రాంతి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు బుధవారం రోడ్లకు మరమ్మత్తులను ప్రారంభించారు. సమస్యను పరిష్కరించిన ‘విజయక్రాంతి’ దినపత్రికకు, జిల్లా కలెక్టర్ రాజర్షిషాకు మెస్రం వంశస్థులు, గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.

article_66353537.webp
మీ రాజకీయ వివృత క్రీడలో జర్నలిస్టులు బలి

15-01-2026

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? అని మాజీమంత్రి హరీశ్‌రావు తెంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా జర్నలిస్టుల అరెస్టుపై స్పందించారు. ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా?, జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

article_83978500.webp
ప్రపంచ స్థాయి పండుగ పొంగల్

15-01-2026

న్యూఢిల్లీ, జనవరి 14: ఒకప్పుడు భారతీయ సంస్కతిలో అంతర్భాగమైన పొంగల్ నేడు అంతర్జాతీయ పండుగగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నూఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ నివాసంలో బుధవారం జరిగిన పొంగల్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కట్టెల పొయ్యిపై పొంగలి వండి అందరినీ ఆశ్చర్యపరిచారు. తర్వాత గోవులకు ఆహారం తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రకృతికి, సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడమే పండుగ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. తమిళుల సంస్కృతి, జీవనశైలి, ప్రకృతితో వారికన్న అనుబంధానికి ప్రతీక పొంగల్ అని అభివర్ణించారు.

article_30222280.webp
మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు

15-01-2026

కరింనగర్, జనవరి14(విజయక్రాంతి): త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు జిల్లాల అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. తుది ఓటర్ల జాబితా ను, పోలింగ్ భూత్ ల వివరాలను ఇప్పటికే వెల్లడించారు. ఈ నెల16న ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను వెలువరిం చనున్నారు. ఈ తంతు పూ ర్తయిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ సంక్రాంతి పండుగ తర్వాత విడుదలయ్యే సూచనలు కనబడుతున్నాయి. షెడ్యూల్ వి డుదలకు ముందే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.కరింనగర్ జిల్లాలో కరింనగర్ కార్పొరేషన్, హుజురాబాద్, జ మ్మికుంటా, చొప్పదండి మున్సిపాలిటీ లు, పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానా బాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి.

article_65932882.webp
శరభ! శరభ!.. ప్రభల భళా!

15-01-2026

“సంక్రాంతి అంటే కోనసీమ.. కోనసీమ అంటే సంక్రాంతి... తెలుగు నేలపై సంక్రాంతి పండుగను.. ఆ పండుగ పూర్తి వైభవంతో చూడాలంటే కోనసీమకు మించిన ప్రదేశం మరొకటి లేదు. ఇక్కడి ప్రభల తీర్థం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. వందల ఏళ్ల నాటి నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం, రంగురంగుల పూలతో, వస్త్రాలతో అలంకరించిన భారీ ప్రభలను భుజాలపై మోస్తూ పొలాల గట్ల వెంబడి ఊరేగింపు.. కనువిందు వర్ణనాతీతం. ఏకాదశ రుద్రుల వైభవానికి ప్రతీకగా.. ఒకే చోట 11 గ్రామాల ప్రభల సంఘమం.. కోనసీమ ఐక్యమత్యానికి నిదర్శనమై.. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన, 400 ఏళ్ల చరిత్ర గల ‘ప్రభల తీర్థం’ చూడాలంటే.. జగ్గన్న తోటకు రావాల్సిందే.. చూసి ‘శరభ.. శరభ.. ప్రభల భళా...’ అని తీరాల్సిందే..! ప్రతి హృదయం కోనసీమ అందాల హోయల తీరాల పల్లకీ పాడాల్సిందే..!!”