పేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం!
21-01-2026
సంగారెడ్డి, జనవరి 20 (విజయక్రాంతి): మహిళా సాధికారత, పిల్లలకు నైపుణ్యాలతో కూడిన ప్రమాణవంతమైన విద్య, పేదల ఆరోగ్య భద్రతకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో కంది, కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ. 2.54 కోట్ల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి మంత్రి మాట్లాడారు. పేదల ఆరోగ్య భద్రత, వైద్య రక్షణకు ప్రభు త్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. మహిళల ఉన్నతికి మహిళా సాధికారతకు పె ద్దపీట వేస్తూ, పిల్లలకు నైపుణ్యాలు, ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు అవ సరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.