2 June, 2026 | 12:44 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్   •   గ్రామ యువత ఆలం రాహుల్ ని ఆదర్శంగా తీసుకోవాలి   •   సీఎం రేవంత్ రెడ్డిపై కోవ లక్ష్మి ఫైర్   •   సఫాయి కార్మికులకు ఘన సన్మానం..   •   పవన్ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. హైకోర్టులో జనసేన రిట్ పిటిషన్   •   అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు   •   పదవీత్యాగాలకే కాదు.. ప్రాణత్యాగానికీ వెనుదీయని నేత కేసీఆర్   •   బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   సుప్రీంకోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణం   •   తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని సహించేది లేదు   •  

News -

article_36399342.webp
లారీని ఢీకొట్టిన కారు.. సిద్దిపేటలో ఇద్దరు మృతి

మెట్టపల్లి: సిద్దిపేట(Siddipet) అర్బన్ మండలం మెట్టపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. లారీ కింద కారు ఇరుక్కుపోయి అందులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మహిళ సహా ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి. మృతులు, క్షతగాత్రులు మణుగూరు వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

02-06-2026

article_80615465.webp
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) శుభసందర్భంగా ముఖ్యమంత్రిఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పరేడ్ మైదానంలో తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. పరేడ్ గ్రౌండ్ లో సీఎం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకావిష్కరణ చేశారు.

02-06-2026