calender_icon.png 11 January, 2026 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_65553343.webp
గిరిజనుల కొంగుబంగారం

11-01-2026

వనదేవతలు కొలువై ఉన్న పుణ్యస్థలం.. కుంకుమ భరణికి కోటి మొక్కల నడుమ, కంక చెట్లకు వేల దండాలు వేలాడే పవిత్ర ప్రాంగణం మేడారం. దారి ఏదైనా.. అన్ని దారులు చివరికి అమ్మ దగ్గరికే తీసుకెళ్లే భక్తి భావం. పేద, ధనిక అన్ని వర్గాల వారందరికీ.. ఏ రాయిని కొలిచినా అమ్మ పలు కే... నిలువెత్తు బెల్లమే బంగారంగా కోట్లాదిమందికి కొంగుబంగారమై ప్రపంచం లోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్కసారలమ్మ జాతర నిర్వహణకు తెలంగా ణ ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరిగే ఈ మహాజాతర కోసం ఈసారి ప్రభు త్వం వందల కోట్లతో అభివృద్ధి నిధులు వెచ్చించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేపట్టింది

article_65819318.webp
మూడు రోజుల మహానగరం!

11-01-2026

మాఘశుద్ధ పౌర్ణమి ముందు రోజు వరకు దట్టమైన అటవీప్రాంతం.. కనుచూపుమేర ఎటు చూసినా జనంతో నిండి.. విద్యుత్ కాంతులతో దేదీప్య మాణంగా వెలుగొందుతూ మూడు రోజులపాటు మహానగరంగా మేడారం మారిపోవడం జరుగుతుంది. నిరుపేదల నుంచి మొదలుకొని కోట్లకు పడగలెత్తిన వారు సైతం తల్లులపై నమ్మికతో పిల్లాపాపలతో మే డారం తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు జాతరకు తరలి రావడంతో మేడా రం కీకారణ్యం మూడు రోజులపాటు జనారణ్యంగా మారుతుంది. రాష్ట్ర ప్రభు త్వం మేడారం గ్రామానికి సుమారు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో నలుదిశలా భక్తుల విడిది కోసం తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పిస్తుంది.

article_72001215.webp
నల్లమల సాగర్‌కు అభ్యంతరమెందుకు?

11-01-2026

అమరావతి, జనవరి 10: కాళేశ్వరానికి లేని అభ్యంతరం నల్లమల సాగర్‌కు ఎందు కు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లకు తాను అ డ్డు చెప్పలేదని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు నీటిని సమృద్ధిగా వాడుకొని అభివృద్ధి చెందాలన్నారు. వృథాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను తాము బనకచర్ల లాంటి ప్రాజెక్టులకు వినియోగించుకుంటే అభ్యంతరం చెప్పొద్దని చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

article_56490592.webp
డూడూ బసవన్నా.. ఆదరణ ఏదన్నా!

11-01-2026

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పది రోజుల ముందు నుంచే గంగి రెద్దుల నాట్యాలు, హరిదాసుల సంకీర్తనలు, ఇళ్ల ముంగిట రంగవళ్లులు, వాటి మధ్య గొబ్బెమ్మలు, వెరసి పచ్చటి పల్లెల్లో సంబురం వెల్లివిరుస్తుండేది. ఇదంతా ఒకప్పటి మాట. ఆధునిక యుగంలో, హడావిడి జీవనంలో సంస్కృతి, సంప్రదాయాలు ఆదరణ కోల్పోతున్నాయి. సంక్రాతి సమీపిస్తున్నా నేడు పల్లెల్లో గంగిరెద్దులు కనిపించడం లేదు. హరిదాసుల సంకీర్తనలు వినిపించడం లేదు. అందరూ సెల్‌ఫోన్లలో కబుర్లు, ఇంటర్నెట్, వాట్సాప్ చాటింగ్‌లకే పరిమితం అవుతున్నారు. దీంతో కనుమరుగవుతున్న నాటి సంక్రాంతి సంప్రదాయాలపై.. ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం..