కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని మోదీ
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. బెంగళూరు నుంచి మధ్యాహ్నం బేగంపేటకు చేరుకోనున్న ప్రధాని మోదీ, బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో హెచ్ఐసీసీకి వెళ్లనున్నారు. తెలంగాణలో రూ.9,377 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో కలిసి వర్చువల్ గా ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
10-05-2026