calender_icon.png 3 February, 2026 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_11395187.webp
ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.. సజ్జనార్ వార్నింగ్

03-02-2026

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(Hyderabad Police Commissioner VC Sajjanar) మంగళవారం నాడు ప్రజలకు, ముఖ్యంగా యువతకు, ప్రమాదకరమైన రీల్స్ చేయవద్దని హెచ్చరించారు. రైల్వే ట్రాక్‌లపై పడుకుని ప్రాణాలను పణంగా పెట్టి ఒక వ్యక్తి చేసిన రీల్‌పై స్పందిస్తూ, ఆయన ‘ఎక్స్’లో ఇలా అన్నారు. “వైరల్ పిచ్చితో ఇలాంటి పనులు చేయడం సాహసం కాదు. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఒక్క సెకను తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బాధ్యతగా ఉండండి, నిర్లక్ష్యంగా ఉండకండి” అని సజ్జనార్ సూచించారు. ఫేమస్ అయిపోవాలని రీల్స్ పిచ్చిలో యువత వింత వింత ప్రయత్నాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్న విషయం తెలిసిందే.

article_59110726.webp
సీఎం సభకు ఏర్పాట్లు.. కానిస్టేబుళ్లకు ప్రమాదం

03-02-2026

హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీఏ కార్యాలయం(Miryalaguda RTA Office) వద్ద మంగళవారం కంటైనర్ బీభత్సం సృష్టించింది. మిర్యాలగూడలో అతివేగంతో దూసుకొచ్చిన కంటైనర్ బైకుపై వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుళ్లకు(Police Constables) మజార్, సురేశ్ కు తీవ్రగాయాలయ్యాయి. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సభకు బాధితులు ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తున్నారు. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

article_89367752.webp
నారాయణరావుపేట వైద్యునిపై కొనసాగుతున్న విచారణ

03-02-2026

సిద్దిపేట, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బాపురెడ్డి పై ఆ శాఖ మహి ళా సేఫ్టీ బృందం సభ్యులు సోమవారం వి చారణ జరిపారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విజయక్రాంతి వా ర్తా కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు డాక్టర్ నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన బృందం సోమవారం కూడా విచారణ జరిపారు. ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలి పట్ల వేధింపులకు పాల్పడినట్లు వార్త కథనాల ఆధారంగా తెలుసుకున్న బృందం సభ్యులు ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి విచారించారు.