మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడు: చెన్నైలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress President Mallikarjun Kharge) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే(AIADMK) నేతలు మోదీతో ఎలా చేతులు కలుపుతారని ఖర్గే ప్రశ్నించారు. మోదీ.. ఒక ఉగ్రవాది(PM Modi as terrorist) అంటూ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. బీజేపీకి సమానత్వం, న్యాయంపై నమ్మకం లేదు, అలాంటి బీజేపీ నేతలతో అన్నాడీఎంకే ఎలా చేతులు కలుపుతుందని ఖర్గే ప్రశ్నించారు. మోదీని ఉగ్రవాదిగా వ్యాఖ్యానించిన కాసేపటికే ఖర్గే వివరణ ఇచ్చారు. మోదీని ఉగ్రవాది అని నేనెప్పుడూ అనలేదు.. నా ఉద్దేశం మోదీ ఎప్పుడూ ప్రజలకు భయపెడుతున్నారనే అన్నారు. ఈ డీ, ఐటీ, సీబీఐ చూపించి మోదీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు.
21-04-2026