9 May, 2026 | 3:39 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

News -

article_16689854.webp
పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణస్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోదీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ నూతన ముఖ్యమంత్రి(West Bengal CM) ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాని ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీగా వస్తున్నారు. కాసేపట్లో పశ్చిమబెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం చేయనున్నారు. కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. పశ్చిమబెంగాల్ తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి(Suvendu Adhikari). 1971 తర్వాత కలకత్తయేతర జిల్లా నుంచి సీఎం పదివికి మొదటి వ్యక్తి సువేందు. ఈ కార్యక్రమానికి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.

09-05-2026

article_57381910.webp
కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం

న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి(Raja Subramani Appointed) భారతదేశపు కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా నియమితులయ్యారు. త్రివిధ దళాల సమన్వయాన్ని నిర్ధారించే ప్రతిష్టాత్మక థియేటరైజేషన్ ప్రణాళికను అమలు చేయడం ఆయన ప్రధాన కర్తవ్యంగా ఉండనుంది. మే 30న పదవీకాలం ముగియనున్న జనరల్ అనిల్ చౌహాన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తొలి CDS జనరల్ బిపిన్ రావత్ మరణించిన తొమ్మిది నెలలకు పైగా గడిచాక, తూర్పు సైనిక దళ మాజీ కమాండర్ అయిన జనరల్ చౌహాన్, సెప్టెంబర్ 2022లో దేశపు అత్యున్నత సైనిక కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

09-05-2026

article_28597227.webp
ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (ఏవోఐ) అన్నవాహిక క్యాన్సర్ చికిత్సలో ప్రపంచ స్థాయి రికార్డు సృష్టించిం ది. ట్రిపుల్ ఐసీజీ ఫ్లోరోసెన్స్’ అనే అత్యాధునిక సాంకేతికతను రోబోటిక్ సర్జరీతో కలిపి దేశంలోనే తొలిసారిగా విజయవంతంగా ప్ర యోగించిందని ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ జగదీశ్వర్‌గౌడ్ గజగౌని వెల్లడించారు. కంటికి కనిపించని అతి చిన్న క్యాన్సర్ గడ్డలను కూడా ఈ ట్రిపుల్ ఐసీజీ టెక్నాలజీ ద్వారా స్పష్టంగా గుర్తించి, తొలగించవచ్చు. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన 54 ఏళ్ల రోగికి ఈ పద్ధతిలో విజయవంతంగా సర్జరీ చేశారు. సర్జన్ డాక్టర్ జగదీశ్వర్‌గౌడ్ గజగౌని నేతృత్వంలో ఈ చికిత్స జరిగింది.

09-05-2026