calender_icon.png 13 January, 2026 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_10925746.webp
సంక్రాంతి కానుకగా చంద్రబాబుకు గోదావరి

13-01-2026

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): సంక్రాంతి కానుకగా గోదావరిని ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అప్పగించారని, ముందు నుంచి అనుకున్నట్టే గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీష్‌రెడ్డి మాట్లాడారు. కోర్టులకు లాయర్లు వెళ్తారు కానీ మంత్రులు వెళ్లడం ఏంటి అని ప్రశ్నించారు. శాసన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వరాని వాళ్లు కోర్టుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని విమర్శించారు.

article_60939268.webp
జైళ్ల బాట పడుతున్న యువత

13-01-2026

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో సాంకేతికత పెరిగే కొద్దీ నేరాల తీరు మారుతోంది. సైబర్ నేరాలు, డ్రంకెన్ డ్రైవ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. సోమవారం చంచల్‌గూడలోని సీకా కార్యాలయంలో నిర్వహించిన వార్షిక సమావేశంలో జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి సంబంధించిన నేరాల గణాంకాలు, శాఖ పనితీరును ఆమె వివరించారు. గత ఏడాదితో పోలిస్తే జైళ్లకు వస్తున్న ఖైదీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో 38,079 మంది అడ్మిషన్లు ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య 42,566కు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే ఖైదీల సంఖ్యలో 11.8 శాతం పెరుగుదల నమోదైంది.

article_72654896.webp
సివిల్ సూట్ వేస్తాం

13-01-2026

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి) : గోదావరి నదిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును సవాల్‌చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేయబోతున్నామని రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం చేసిన మార్గదర్శనానికి అనుగుణంగానే రాష్ర్ట ప్రభుత్వం తరపున సూట్ వేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రిట్ పిటిషన్ కంటే సూట్ ద్వారా నే గోదావరి జలాలపై అంతర్ రాష్ర్టలతో సమగ్ర విచారణకు ఆస్కారం ఉంటుందన్న సుప్రీంకోర్టు సూచనల మేరకు రాష్ర్ట ప్రభుత్వం సూట్ వేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

article_51349437.webp
నల్ల బ‘జోరు’..!

13-01-2026

కరింనగర్, జనవరి12(విజయక్రాంతి): ధూమపాన అలవాటు మరింత ఖరీదైనదిగా మారబోతోంది. ఫిబ్రవరి 1 నుండి భారతదేశంలో సిగరెట్ల ధరలు 15 నుండి 40 శాతం పెరగనున్నాయి. ప్రభుత్వం పాత పరిహార నిబంధనలను తొలగించి, దాని స్థానంలో 40% జి ఎస్ టి మరియు కొత్త ఎక్సైజ్ సుం కాన్ని విదించాలని నిర్ణయించింది. ఈ ప్రకటనను ఆధారం చేసుకుని కరింనగర్ ఉమ్మ డి జిల్లాలో బ్లాక్ మార్కెట్ దందా జోరుగా సాగుతోంది. ఎక్కువ వినియోగంలో ఉన్న గోల్ ఫ్లాక్ సిగరెట్ హోల్ సేల్ గా పాకెట్ ధర 156 రూపాయలు ఉండేది, విక్రయదారులు 180 రూపాయలకు అమ్మే వారు ప్ర స్తుతం 200 రూపాయలకు ఒక ప్యాకెట్ అ మ్ముతున్నారు. సిల్క్, కనెక్ట్ లు ఒక ప్యాకెట్ రిటైల్ లో 150 రూపాయలు ఉండగా ప్రసు తం 180 కి అమ్ముతున్నారు.

article_24495833.webp
కిటకిటలాడుతున్న మహా జాతర

13-01-2026

మేడారం, జనవరి 12 (విజయక్రాంతి): మేడారం మహా జాతరకు ముందుగానే భక్తు లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సంక్రాంతి పండుగ సెలవులు కూడా కలిసి రావడంతో భక్తుల తాకిడి మరింత ఎక్కుగా కనపిస్తున్నది. మూడు రోజులుగా మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం ఒక్కరోజే సుమారు 5 లక్షల మంది మేడారం వచ్చి, సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లను దర్శనం చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సమ్మక్క సారలమ్మ గద్దెలు కిక్కిరిసి కనిపించాయి. ఇప్పుడే ఇలా వస్తే ఇక మహాజాతర ప్రారంభమయ్యాక ఇంకా ఎంత పెద్ద మొత్తంలో భక్తులు వస్తారనే అంచనా అధికారుల అంచనాకు అందడం లేదు.

article_27000470.webp
ముస్తాబైన కొండపోచమ్మ ఆలయం

13-01-2026

జగదేవపూర్, జనవరి 12: జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో నల్లరాతి గుట్టలో వెలిసి కోరిన కోరికలు తీర్చుతున్న తల్లి కొండపోచమ్మ క్షేత్రం ఉత్సవాలకు ముస్తాబయింది. కొండపోచమ్మ కొమురవెల్లి కోర మీసాల మల్లన్న స్వామికి స్వయానా చెల్లెలు అని ప్రతీక. కొన్ని వందల సంవత్సరాల పూర్వం కొండ పోచమ్మ తల్లి కొమురవెల్లిలోనే ఉండేదనీ, తన అన్న మల్లన్న స్వామి మీద కోపంతో తీగుల్ నర్సాపూర్ గ్రామంలోని దట్టమైన అడవిలోని నల్ల గుట్టల్లోకి వచ్చి స్థిరపడింది. అన్న మల్లనకు ఈ సమాచారం తెలిసిన వెంటనే మల్లన్న కొండపోచమ్మ దగ్గరకు వచ్చి తిరిగి కొమురవెల్లి రావాలని చెల్లిని బ్రతిమిలాడగా రాను అని చెల్లి పోచమ్మ మొండికేయగా ఎం వరం కావాలో కోరుకోమన్నాడు.

article_52177935.webp
దివ్యాంగుల పెళ్లికి రూ.2 లక్షలు

13-01-2026

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): దివ్యాంగులు ఒకరినొకరు పెళ్లి చేసుకుకున్నా, వీరిని ఇతరులు చేసుకున్నా రూ.2 లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యా, ఉద్యోగాలు, క్రీడల్లో దివ్యాంగులు ఏమాత్రం రాణించినా వారికి సముచిత స్థానం కల్పిస్తామని, వారిని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశా రు. రాష్ర్ట ప్రభుత్వం దివ్యాంగులకు మానవీయ కోణంలో సహకారం అందిస్తోందని రూ.50 కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామన్నారు. సోమ వారం ప్రజాభవన్‌లో దివ్యాంగులకు సహా య ఉపకరణాల పంపిణీ, ప్రణామ్ వయో వృద్ధుల డే కేర్ సెంటర్లు, బాల భరోసా పథ కాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి, మా ట్లాడారు.

article_22133562.webp
మిగిలిన నీళ్లను వాడుకుంటే తప్పేంటి?

13-01-2026

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి) : గోదావరి నదిపై ఎగువ రాష్ట్రాలు వాడుకోగా మిగిలిన, వాళ్లు వదిలిన నీటిని పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. సో మవారం ఏపీ సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అభ్యంతరంపై స్పందించారు. పోలవరం అద్భుత మైన ప్రాజెక్టు అని, ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రమూ ఏపీతో పోటీ పడలేదన్నారు. నల్లమలసాగర్ ద్వారా రాయలసీమ ప్రాంతంతోపాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాం తాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంటుందన్నా రు.

article_63989926.webp
సంక్రాంతి సంబరాలు.. ముఖ్యమంత్రికి ఆహ్వానం

12-01-2026

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో(Khairatabad constituency) నిర్వహించనున్న సంబురాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు దానం నాగేందర్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉన్నారు. అటు భాగ్య నగరంలో సంక్రాంతి సంబురాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఐమ్యాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ముగ్గుల పోటీసులు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో భారీగా పాల్గొన్న యువతులు, మహిళలు పెద్ద ఎత్తున రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. ఈ ముగ్గుల పోటీలు ఆకట్టుకుంటున్నాయి.

article_15129903.webp
సీఎంకు ఆహ్వానం

12-01-2026

హైదరాబాద్: ఈ నెల 21 నుంచి 23 వరకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో వసంతపంచమి మహోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో, బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ అర్చకులు కలిసి ఆహ్వానం అందించారు. పండితులు ఆశీర్వచనాలు అందించారు. గద్వాలలోని ఆలంపూర్‌లో ఉన్న శ్రీ జోగులాంబ ఆలయంలో జనవరి 19 నుండి 23 వరకు జరిగే బ్రహ్మోత్సవాల కోసం ముఖ్యమంత్రికి ప్రత్యేక ఆహ్వానం పంపబడింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి అధికారులు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రాలను అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం మహా జాతర బ్రోచర్, పోస్టరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి సోమవారం ఆవిష్కరించారు.