calender_icon.png 15 December, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_24422920.webp
సిడ్నీలో కాల్పుల కలకలం..

14-12-2025

ఆస్ట్రేలియా: సిడ్నీ(Sydney) నగరంలోని పర్యాటక ప్రాంతమైనా బాండి బీచ్‌(Bondi Beach)లో ఆదివారం సాయంత్రం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 10 మంది మరణించారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో వందలాది మంది పర్యాటకులు, స్థానికులు భయాందోళనకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రసిద్ధ బీచ్‌ ఫ్రంట్ ప్రాంతం నుంచి పారిపోయారు. బాండి బీచ్‌లో జరిగిన ఘటనపై ఆస్ట్రేలియా పోలీసులు స్పందించారు. ప్రజలు ఘటన ప్రాంతానికి దూరంగా ఉండాలని సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో తెలిపారు. సంఘటనా స్థలంలో ఉన్న వారందరూ సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం పొందాలని వారు సూచించారు.

article_13339752.webp
విస్తృతస్థాయి సమావేశం.. హాజరుకానున్న బీఆర్ఎస్ అధినేత

14-12-2025

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఈనెల 19వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS chief KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి కృష్ణ జలాలను కొల్లగొడుతున్నా కూడా దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇటువంటి సందర్భంలో.. తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని భావించడం జరుగుతున్నది.

article_22723700.webp
రెండో దశలో 80.84 శాతం పోలింగ్ నమోదు

14-12-2025

హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ(Telangana Gram Panchayat) ఎన్నికల రెండో దశ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. నిర్ణీత సమయం తర్వాత కూడా క్యూలలో ఉన్న ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.84 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. అధికారులు ముందుగా వార్డు సభ్యుల స్థానాలకు పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. సర్పంచ్ ఫలితాలు ప్రకటించిన తర్వాత, ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించబడుతుంది.

article_89906003.webp
ఆలయం కూలి నలుగురు మృతి

14-12-2025

జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లో(Kwazulu-Natal Province) నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల హిందూ దేవాలయం(Hindu temple) కూలిపోవడంతో మరణించిన నలుగురిలో 52 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇథెక్విని (గతంలో డర్బన్) నగరానికి ఉత్తరాన రెడ్‌క్లిఫ్‌లోని ఒక నిటారుగా ఉన్న కొండపై ఉన్న కొత్త అహోబిలం రక్షణ దేవాలయం విస్తరణ పనులు జరుగుతున్నప్పుడు, శుక్రవారం కార్మికులు అక్కడే ఉన్న సమయంలో భవనంలోని ఒక భాగం కూలిపోయింది. టన్నుల కొద్దీ శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్న కార్మికులు, ఆలయ అధికారుల కచ్చితమైన సంఖ్య తెలియదు.

article_86204729.webp
సెల్ టవర్ ఎక్కిన సర్పంచ్ అభ్యర్థి

14-12-2025

హైదరాబాద్: తన ప్రత్యర్థి ఓటర్లకు డబ్బులు పంచుతున్నా, దాన్ని అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ఆగ్రహించిన ఒక సర్పంచ్ అభ్యర్థి(Pedda Tanda Sarpanch candidate), ఆదివారం తెల్లవారుజామున నార్సింగి మండలం నర్సంపల్లి పెద్ద తాండాలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, పోటీదారుడైన శంకర్ నాయక్ తన ప్రత్యర్థి ఓటుకు రూ. 2,000 పంపిణీ చేసి లబ్ధి పొందుతున్నాడని ఆరోపించారు. ఎన్నికల ప్రచార సమయంలో తన ప్రత్యర్థి అక్రమాలకు పాల్పడుతున్నా, అధికారులు అతడిని ఆపడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ప్రచార కార్యక్రమాలపై ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, తన ప్రత్యర్థి ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఇంటింటికీ తిరిగి డబ్బులు పంపిణీ చేశాడని నాయక్ ఆరోపించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, సెల్ టవర్ పైనుంచి కిందకు దిగమని అతడిని ఒప్పించారు.

article_62007309.webp
మణిపూర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్

14-12-2025

ఇంఫాల్: మణిపూర్‌లో(Manipur) బలవంతపు వసూళ్ల కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో మూడు నిషేధిత సంస్థలకు చెందిన ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు మిలిటెంట్లను భద్రతా బలగాలు అరెస్టు చేశాయని ఆదివారం ఒక పోలీసు ప్రకటన తెలిపింది. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని మోయిరంగ్‌కంపూ సజెబ్ మఖా లీకై ప్రాంతంలో యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (కోయిరంగ్)కు చెందిన ఇద్దరు చురుకైన మహిళా కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిని తఖెల్లంబమ్ సనథోయి చాను (19), కొంగ్‌బ్రైలత్పమ్ రామేశ్వరి దేవి (19)గా గుర్తించారు. వారి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, కమ్యూనికేషన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బంది వారి వద్ద నుండి 12 రౌండ్లతో నిండిన మ్యాగజైన్‌ లు, ఒక 9ఎంఎం పిస్టల్, రెండు 38 క్యాలిబర్ తూటాలు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.