రిటైర్డు ఇంజినీర్లపైనా ఏసీబీ కన్ను!
22-06-2025
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన ఇద్దరు కీలక ఇంజినీర్లపై ఏసీబీ దాడులు నిర్వహించగా, వందల కోట్ల అక్రమాస్తుల చిట్టా బహిర్గతమైన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్లో భాగస్వాములైన ఇద్దరు ఇంజినీర్లను విచారిస్తేనే వందల కోట్ల అక్రమాస్తులు బయటపడితే, బరాజ్ నిర్మాణంలో పనిచేసిన పైస్థాయి అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులను విచారిస్తే వేల కోట్ల అక్రమాస్తులు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.