పండుగ పూట పరేషాన్
కరీంనగర్, మార్చి 15 (విజయక్రాంతి): ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న యుద్ధ ప్రభావం భారత్ పైన, క రీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలపైన పడింది. ఈ నెల 19న ప్రజలు తీపి, చేదు కలయికతో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతుండగా యుద్ధ ప్రభా వం ప్రజలపై పడింది. ఇప్పటికే గృహ వినియోగ సిలిండర్ పై 60 రూపాపాయలు, వాణిజ్య సిలిండర్ పై 114 రూపాయలు పెరిగింది. ఇది ఉమ్మడి జిల్లా వినియోగదారు లపై నెలకు తొమ్మిదిన్నర కోట్ల భారం. గ్యాస్ తోపాటు వంట నూనె ధరలు కూడా అ మాంతం పెరిగాయి.
16-03-2026