నీటి హక్కులు సాధిస్తాం
08-01-2026
సూర్యాపేట, జనవరి 7 (విజయక్రాంతి): కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి హక్కులు సాధిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ర్ట నీటి హక్కులను సుప్రీంకోర్టు, కేంద్ర జల సంఘం, కేంద్ర ప్రభుత్వం వద్ద బలమైన వాదనలు వినిపించి సాధిస్తామని చెప్పారు. హుజూర్నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను, హుజూర్నగర్ పట్టణంలో ప్రభు త్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణాలను, రోడ్లు, భవనాల గెస్ట్ హౌస్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్, నీటిపారుదల శాఖ కార్యాలయ పనులను బుధవారం మంత్రి పరిశీలించారు.