రేవంత్రెడ్డివి అన్నీ అబద్ధాలే
08-02-2026
గజ్వేల్, ఫిబ్రవరి 7: సీఎం రేవంత్రెడ్డివి, బీజేపీవి అన్ని అబద్ధాలేనని, బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం గజ్వే ల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్రెడ్డిలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నయా పైసా పని కూడా చేయలేదన్నారు.