19 June, 2026 | 3:25 AM

News -

article_79641821.webp
తెలంగాణ డిజిటల్ క్యాబినెట్

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాలను పేపర్ లెస్ గా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు ఆమోదించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరికి స్పెషల్ ట్యాబ్ లు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఈ బుక్ ద్వారానే మంత్రులకు క్యాబినెట్ సమావేశం ఎజెండాగా పెట్టుకున్నారు. పేపర్ లెస్ గవర్నెన్స్ లో భాగంగా తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ నిర్వహించారు.

18-06-2026

article_59572833.webp
రాజీనామా చేస్తే దిమ్మతిరుగుతుంది..! మంత్రి అడ్లూరిపై కొప్పుల ఈశ్వర్ ఫైర్

కరీంనగర్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నేత లక్ష్మణ్(Minister Adluri Laxman) కు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమశాఖ టెండర్స్ పై హరీశ్ రావు ప్రశ్నిస్తే ఉలిక్కిపడుతున్నావ్ అన్నారు. రూ. 2 వేల కోట్ల స్కామ్ జరిగిందా లేదా నిరూపించుకోవాలని సూచించారు. స్థానికేతరులకు టెండర్లతో కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. అందుకు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ప్రతిసారి రాజీనామా చేస్తానంటున్న లక్ష్మణ్.. ఒక్కసారి రాజీనామా చేస్తే దిమ్మతిరుగుతుందని చమత్కరించారు.

18-06-2026

article_89978154.webp
సచివాలయంలో మంత్రివర్గం అనధికార భేటీ

హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో(Telangana Secretariat) కాసేపట్లో మంత్రివర్గ అనధికార భేటీ ప్రారంభం కానుంది. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), మంత్రులు చర్చించనున్నారు. రైతుభరోసా నిధులు, వ్యవసాయరంగంలో చేపట్టాల్సిన చర్యలు, కేంద్రంపై ఒత్తడి తెచ్చే అంశాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించే అవకాశముందని పార్టీ నేతలు వెల్లడించారు. SIR తో అర్హులైన ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తం చేయాల్సిన అంశాలపై చర్చించనున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారెజి ఎత్తుపై ఎలా ముందుకు పోవాలనే అంశంపై నేతలు నిర్ణయం తీసుకోనున్నారు.

18-06-2026