5 August, 2026 | 3:19 PM

News -

article_67733202.webp
ప్రధాని మోదీని తిడితే ఒక్క కేసైనా పెట్టారా?

న్యూఢిల్లీ: హస్తినా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రధాని మోదీని తిడితే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా? అని ప్రశ్నించారు. ప్రధానిని దూషిస్తే మా ప్రభుత్వం కేసు నమోదు చేసిందని తెలిపారు. ఒక డీఎస్పీని బదిలీ చేశానని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వానికి ఉన్న అధికారం అన్నారు. తన పరిధిలో ఉంది కాబట్టి తానే బదిలీ చేశానని చెప్పారు. బీజేపీ నేతలు కూడా అసభ్యంగా దూషిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీని, విద్యార్థులను అంతకంటే ఎక్కవే దూషించారని ఆరోపించారు.

05-08-2026

article_44694834.webp
Any Emergency Dial-112: అత్యవసర సేవలకు ఇకపై ఒకే నంబర్

హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డయల్ 112 సేవల సేవలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్(Telangana DGP CV Anand) ప్రారంభించారు. డీజీపీ ఆనంద్, ఉన్నతాధికారులు డయల్ 112 సేవల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డీజీలు విక్రమ్ సింగ్, శ్రీనివాస్, కమల్ హాసన్ రెడ్డి, సీపీలు రమేశ్ రెడ్డి, సుమతి, సజ్జనార్, సీఐడీ చీఫ్ చారు సిన్హా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయాల్ హాజరయ్యారు. డయల్ 112 ద్వారా 18 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. పోలీసు, అగ్నిమాపక, వైద్య సేవలు, మహిళల రక్షణ, చైల్డ్ వెల్ఫేర్, హైడ్రా, జీహెచ్ఎంసీ, ఒకే గొడుకు కిందకు వచ్చాయి. అత్యవసర సమయాల్లో అండగా ఉండేందుకు 112 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 24 గంటలు , 365 రోజులు అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని సీవీ ఆనంద్ సూచించారు. ప్రమాదాలు, నేరాలు, వైద్య సేవలకు తక్షణ సాయం అందుతోందన్నారు. ప్రజల భద్రత, అత్యవసర స్పందన సామార్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ఆనంద్ వెల్లడించారు.

05-08-2026

article_38324521.webp
కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌తో సీఎం రేవంత్ భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను(Union Forest Minister Bhupender Yadav) కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు, అటవీ సంరక్షణ, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆమోదం అవసరమైన పలు ప్రజా మౌలిక సదుపాయాలు,అభివృద్ధి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీలోని శ్రమ్ శక్తి భవన్‌లో ఉన్న కార్యాలయంలో, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో కూడా రేవంత్ రెడ్డి సమావేశమవుతారు.

05-08-2026

article_15529401.webp
చేనేత ప్రదర్శనను ప్రారంభించిన ప్రీతి పులిపాక

హైదరాబాద్: 'జగదీశ్వర్ హస్తకళ' ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, కళింగ కల్చరల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన 9 రోజుల 'హ్యాండ్ టు హ్యాండ్' చేనేత ప్రదర్శన-2026ను, 'మిసెస్ ఆసియా గ్రేట్ బ్రిటన్' రన్నరప్, టాలీవుడ్ చలనచిత్ర నిర్మాత ప్రీతి పులిపాక లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రదర్శన 2026 ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. "అందమైన డిజైన్లతో కూడిన చేతితో నేసిన కాటన్, సిల్క్ వస్త్రాలు, ప్రత్యేకమైన సిల్క్ చీరలు, చేనేత ఉత్పత్తుల కోసం వెతుకుతున్న మహిళలకు చేరువ కావడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరం." అని ప్రీతి పులిపాక అన్నారు. ఈ ప్రదర్శన నిర్వాహకుడు జయేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, చేనేత కళాకారులను ప్రోత్సహించడం, అలాగే చేనేత రంగానికి మద్దతునిస్తూ వారికి తగిన మార్కెట్ కల్పించడం ఈ ప్రదర్శన యొక్క ప్రధాన సామాజిక లక్ష్యమని తెలిపారు.

05-08-2026