22 August, 2026 | 3:53 AM

News -

article_19908895.webp
సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం

సిలిగురి: తమ సరిహద్దులను సురక్షితం చేసే వరకు పశ్చిమ బెంగాల్ గానీ, భారతదేశం గానీ సురక్షితంగా ఉండవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) శుక్రవారం నాడు స్పష్టం చేశారు. పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, రాష్ట్రంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుకు కంచె వేయడానికి అవసరమైన భూమిని గత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేటాయించలేదని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన గత ముఖ్యమంత్రులెవరూ ఎప్పుడూ బీఎస్‌ఎఫ్ (BSF) కార్యక్రమాలకు హాజరుకాలేదని పేర్కొన్న అమిత్ షా, ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టినందుకు బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని అభినందించారు.

21-08-2026

article_30766144.webp
షావుకారు జానకి మరణవార్త ఎంతో బాధ కలిగించింది: NTR

ప్రముఖ నటి షావుకారు జానకి(Veteran Actress Sowcar Janaki Passes Away) 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఆసుపత్రిలో చేరిన ఆమె, శుక్రవారం మధ్యాహ్నం 1:59 గంటలకు తుదిశ్వాస విడిచారు. షావుకారు జానకి మరణ వార్త ఎంతో బాధ కలిగించిందని జూనియర్ ఎన్టీఆర్(Nandamuri Taraka Rama Rao) పేర్కొన్నారు. షావుకారు జానకి భారత సినీ రంగంలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. జానకి సినీ ప్రయాణం.. ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు. షావుకారు జానకి ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ ప్రార్థించారు. జానకి కుటుంబసభ్యులకు ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

21-08-2026