18 August, 2026 | 1:20 AM

News -

article_45123663.webp
ప్రజావాణిలో రెండే దరఖాస్తులు

బోథ్, ఆగస్టు 17( విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కేవలం రెండే దరఖాస్తులు రావడం జరిగింది. కుచ్చలాపూర్ గ్రామంలో 11 కెవి విద్యుత్ తీగలు తమ ఇండ్లపై నుండి ఉన్నాయని వాటిని తొలగించాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇక మండలంలో బోర్వెల్ మెకానిక్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ మనకు రావాల్సిన వేదనం అందడం లేదని వేతనం అందే విధంగా చూడాలని ఫిర్యాదు చేశారు. కాగా సమావేశంలో 23 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా కేవలం 12 శాఖల అధికారులు మాత్రమే సమావేశానికి వచ్చారు.

17-08-2026