calender_icon.png 9 December, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_32058568.webp
హెరాయిన్‌తో ముగ్గురు డ్రగ్స్ వ్యాపారులు అరెస్ట్

09-12-2025

జమ్మూ: జమ్మూ నగర శివార్లలో 170 గ్రాముల హెరాయిన్, కొన్ని ఆయుధాలతో ఒక మహిళ సహా ముగ్గురు మాదకద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. సరిహద్దు పట్టణం ఆర్ఎస్ పురాలో దల్జీత్ చౌక్ వద్ద కారులో ఉన్నవారు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు కారును అడ్డగించినప్పుడు ఈ అరెస్టులు జరిగాయని తెలిపారు. అయితే, ఆ బృందం వాహనాన్ని విజయవంతంగా ఆపి, ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించడం కోసం అదుపులోకి తీసుకుంది. వాహనం, అందులో ఉన్నవారిని తనిఖీ చేస్తున్నప్పుడు, పోలీసులు 170 గ్రాముల హెరాయిన్, రెండు పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

article_17818600.webp
తెలంగాణ సీఎంఓ, లోక్‌భవన్‌కు బాంబు బెదిరింపు

09-12-2025

హైదరాబాద్: సోమాజిగూడలోని ప్రజా భవన్, రాజ్ భవన్ లకు బాంబు బెదిరింపు ఈమెయిల్ అందడంతో హైదరాబాద్ పోలీసులు, భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వాసుకి ఖాన్ అనే దుండగుడు గవర్నర్ కార్యాలయానికి ఒక ఇమెయిల్ పంపాడు. అందులో కార్యాలయాన్ని పేల్చడానికి కుట్ర జరుగుతోందని తెలిపాడు. ఆ ప్రాంగణాన్ని తనిఖీ చేయడానికి బాంబు నిర్వీర్య దళాన్ని రంగంలోకి దించారు. సోమాజిగూడలోని ప్రజా భవన్‌కు కూడా ఇలాంటి బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. లోక్ భవన్, ప్రజా భవన్‌లను క్షుణ్ణంగా శోధించిన తర్వాత, బాంబు నిర్వీర్య దళం అది నకిలీ ఇమెయిల్ అని ప్రకటించింది. అయితే, దీని వెనుక ఉన్న వారిని గుర్తించడానికి పంజాగుట్ట పోలీసులు ఈమెయిల్ మూలాన్ని పరిశీలిస్తున్నారు. గవర్నర్ సీఎస్ఓ శ్రీనివాస్ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

article_31923742.webp
గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం వరుస సమావేశాలు

09-12-2025

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వివిధ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో పెట్టుబడులకు పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. సుమధుర గ్రూప్, టీసీసీఐ తైవాన్ గ్రూప్ ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ప్రెస్టీజ్ గ్రూప్ సీఈవో స్వరూప్ అనివేశ్, అనలాగ్ ఏఐ ఓటూడ్లోజ్, డ్రీమ్ వాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్, సెంబ్ కార్ప్(సింగపూర్) ప్రతినిధులు, తాజ్ జీవీకే మేనేజింగ్ డైరెక్టర్ శాలిని భూపాల్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

article_45971062.webp
ఫార్మా రంగం మరింత విస్తరణ

09-12-2025

హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) తొలి సెషన్ లో జీనోమ్ వ్యాలీ, లైఫ్ సైన్సెస్ అంశంపై చర్చ జరిగింది. జోనోమ్ వ్యాలీ, లైఫ్ సైన్సెస్ చర్చలో మంత్రి శ్రీధర్ బాబు, లారస్ ల్యాబ్స్ ప్రతినిధి చావా సత్యనారాయణ, అరబిందో ఫార్మా డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ది కీలక పాత్ర అని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఫార్మా రంగం మరింత విస్తరిస్తోందని సూచించారు. జోనోమ్ వ్యాలీ ప్రారంభమై 25 ఏళ్లు అయిందని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ 25 ఏళ్లలో హైదరాబాద్ ఎంతో మారిందన్నారు.

article_49795464.webp
తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయికి అనేకమంది

09-12-2025

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) కొనసాగుతోంది. హాల్-2లో తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అంశంపై చర్చ జరిగింది. చర్చలో గోపీచంద్, పీవీ సింధు, గుత్తా జ్వాలా, కావ్యమారన్, అంబటి రాయుడు పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కోచింగ్ పై చర్చించారు. తెలంగాణ నుంచి అనేక మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి వెళ్లారని మైనార్టీల సంక్షేమం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖల మంత్రి అజారుద్దీన్ అన్నారు. గోపీచంద్ అకాడమీ నుంచి అనేక మంది వచ్చారని తెలిపారు. క్రీడాభివృద్ధిలో మైదానాల పాత్ర చాలా కీలకమని అజారుద్దీన్ వెల్లడించారు. ఫుట్ బాల్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల మంచి పేరు తెచ్చుకున్నారని మంత్రి కొనియాడారు. క్రీడాకారులకు ఆర్థిక సమస్యలు లేకుండా చూడాలని కోరారు. క్రీడా పాలసీతో అనేక ఉపయోగాలు ఉన్నాయని వివరించారు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అండదండలు అవసరం అన్నారు. క్రీడాకారులకు ఆర్థిక సాయం చేయాలి.. మంచి ఉద్యోగం ఇవ్వాలని మంత్రి అజారుద్దీన్ కోరారు.

article_14541377.webp
ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ

09-12-2025

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) కొనసాగుతోంది. సెషన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ పై దృష్టి పెట్టామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్యూర్, క్యూర్, రేర్ గా విభజించి ప్రణాళికలు చేపట్టామని వెల్లడించారు. ఆవిష్కరణల కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(Ease of Doing Business)తో ముందుకుపోతున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. త్రీ ట్రిలియన్ డాలర్ ఎనానమీ(Three Trillion Dollar Economy) లక్ష్యం కోసం మూలధనం, ఉత్పాదకత పెంచడం అంశంపై చర్చించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టామని ఆయన సూచించారు. రాష్ట్రం నుంచి మరిన్ని ఆవిష్కరణలు వచ్చేలా కృషి చేస్తామని విక్రమార్క తెలిపారు.

article_13273466.webp
మహాలక్ష్మీ పథకానికి రెండేళ్లు.. మంత్రి పొన్నం శుభాకాంక్షలు

09-12-2025

హైదరాబాద్: మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మహిళలకు ఆర్టీసీ ఉద్యోగులకు , సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 9,2023 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలకు మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిందని మంత్రి వెల్లడించారు. నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పటి వరకు 251 కోట్ల మంది మహిళలు 8459 కోట్ల విలువైన ప్రయాణం పొందగలిగారని వివరించారు.

article_78939636.webp
తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం

09-12-2025

హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఫ్యూచర్ సిటీ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, ఒక్కొక్కటి 18 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాలు నిర్మించారు. రూ. 5.8 కోట్లతో 33 కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... 2009 డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు.

article_78069210.webp
రెండోరోజు గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీకి చేరుకున్న సీఎం

09-12-2025

హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) రెండో రోజు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా సీఎం రేవంత్ కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను(Telangana Thalli statue) ఆవిష్కరిస్తారు. మంగళవారం నాడు 20కిపైగా సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఆనంద్ మహీంద్రాతో ఈవీ, రూరల్ ఎంటర్ ప్రైజెస్ రంగాలపై చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. రాత్రి 7 గంటలకు గిన్నిస్ రికార్డ్ డ్రోన్ షో ఏర్పాటు చేశారు. నేటి సమ్మిట్ లో రూ. లక్ష కోట్లకుపైగా ఒప్పందాలు జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిన్న ఒక్క రోజే రూ. 3,97,500 కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.