కిటకిటలాడుతున్న ఎంజీబీఎస్, జేబీఎస్
10-01-2026
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. మకర సంక్రాంతికి(Makar Sankranti) వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్ కిటకిటలాడుతున్నాయి. దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, తార్నాక కూడళ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, రైల్వేశాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. అటు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వాహనాలతో ప్రధాన రహదారులపై రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగను సొంతవాళ్లతో జరుపుకునేందుకు పట్నం జనం పల్లెబాట పట్టారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా బారులు తీరాయి. హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవే పై బారీగా పెరిగిన వాహనాల రద్దీ పెరగడంతో టోల్ గేట్ల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.