10 July, 2026 | 6:26 PM

News -

article_68234003.webp
పేదలకు ఒక న్యాయం.. ఉన్నవారికి మరో న్యాయమా?

హైదరాబాద్: ఒవైసీ కళాశాల(Owaisi college) చెరువులో లైదని నమ్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) ఆరోపించారు. అందిరికీ కనిపిస్తున్న అక్రమ నిర్మాణాలను హైడ్రా చూడలేకపోతుందని బండిసంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి చూపు సమస్య ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు, కాంగ్రెస్ రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఎఫ్ టీఎల్ మారుతోందన్నారు. పేదలకు ఒక న్యాయం.. ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నవారికి మరో న్యాయామా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులు, ఎఫ్ టీఎల్ విషయంలో ప్రభుత్వం ద్వందవైఖరి వీడాలని హెచ్చరించారు.

10-07-2026

article_15988101.webp
ఫిలింనగర్‌లో నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లో(Film Nagar) అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న యువకులు కారు నడపడంతో ధర్మ ఇంట్లోకి దూసుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారు ఇంట్లోకి దూసుకొచ్చిన ఘటనపై ధర్మ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఫిలింనగర్ పోలీసులు కారు నడిపిన యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కారు ఢీకొట్టడంతో గొడ కూలిపోయింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.

10-07-2026

article_17740861.webp
పరుగెత్తినా వెంటాడి.. మర్మాంగాలపై కొట్టి చంపిన స్నేహితులు

పెద్ద అంబర్‌పేట్: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో యువకుడి హత్యకేసును పోలీసులు చేధించారు. ఈనెల 8న పసుమాములకు చెందిన సుహాస్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. పెద్ద అంబర్ పేట శ్మశానవాటిక వద్ద సుహాస్ మృతదేహం గుర్తించారు. సుహాన్ ఇంటికి వెళ్లి బయటకు తీసుకువచ్చి స్నేహితులే దారుణంగా కొట్టి చంపారని పోలీసులు తేల్చారు. సుహాస్ పరుగెత్తినా వెంటాడి.. తీవ్రంగా కొట్టి చంపినట్లు గుర్తించారు. మర్మాంగాలపై తీవ్రమైన గాయాలతో చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు బయటపడ్డాయి. అనంతరం దుండగులు మృతదేహాన్ని రోడ్డు పక్కన సిమెంట్ దిమ్మెపై పడేసి పారిపోయారు. యువతి వ్యవహారం, ఆర్థిక వివాదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

10-07-2026

article_62908250.webp
అమర్‌నాథ్ యాత్రలో విషాదం: నేపాల్ యాత్రికుడు మృతి

బనిహాల్/జమ్మూ: అమర్‌నాథ్ గుహాలయం నుంచి తిరుగు ప్రయాణంలో ఉండగా బనిహాల్ వద్ద తీవ్ర అనారోగ్యానికి గురైన నేపాల్‌కు చెందిన 61 ఏళ్ల యాత్రికుడు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరణించిన వ్యక్తిని కాఠ్‌మాండ్‌లోని మోహత్రికి చెందిన కృష్ణ దేవ్ ఠాకూర్‌గా గుర్తించారు. బల్తాల్ మార్గం గుండా తిరిగి వస్తుండగా బనిహాల్‌లోని నవయుగ సొరంగం సమీపంలో ఆయన స్పృహ తప్పి పడిపోయారని తెలిపారు. అతనిని లాంబర్ యాత్రా మైదానంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించి, అక్కడి నుంచి బనిహాల్‌లోని సబ్-డిస్ట్రిక్ట్ హాస్పిటల్ (SDH)కు రిఫర్ చేశారు. అనంతరం అతన్ని అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు అధికారులు ప్రకటించారు.

10-07-2026