ధాన్యం నిల్వ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
హైదరాబాద్: ధాన్యం నిల్వ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. 23 జిల్లాల్లో సైలో టెర్మినల్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై ఏజెన్సీలతో చర్చలు జరిపారు. ధాన్యం నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను ఆధునీకరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ పేర్కొన్నారు. రూ. 4,450 కోట్ల పెట్టుబడులతో సైలో టెర్మినల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. ఆటోమేటెడ్, వెదర్ ప్రూఫ్, ప్యాడీ స్టోరేజ్ నెట్ వర్క్ ఏర్పాటుపై ప్రణాళిక సిద్ధం చేసినట్లు సూచించారు.47.5 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో సైలోల నిర్మాణ ప్రతిపాదన చేశామన్నారు. 82 సైలో టెర్మినల్స్ ద్వారా శాస్త్రీయపద్దతుల్లో ధాన్యం నిల్వకు యోచిస్తున్నట్లు వెల్లడించారు.
19-06-2026