ఢిల్లీలో మూడో రోజు రేవంత్ రెడ్డి పర్యటన
20-02-2026
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) మూడో రోజు హస్తినలో పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం మధ్యాహ్నం ఇండియా ఏఐ సమ్మిట్- 2026లో పాల్గొనున్నారు. స్వీడన్ వ్యాపార ప్రతినిధుల బృందంతో శ్రీధర్ బాబు సమావేశం కానున్నారు. భరత్ మండపం వెస్ట్ వింగ్ లో జరిగే కార్యక్రమంలో శ్రీధర్ బాబు పాల్గొననున్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కీలక భేటీ జరిగింది.