14 April, 2026 | 11:44 PM

News -

article_67219493.webp
తెలంగాణకు ప్రజలకు హెచ్చరిక.. ఎల్లుండి నుంచి భానుడి భగభగలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. రాష్ట్రంలో 42 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఉమ్మడి నిజామాబాద్ లో 42.4, ఆదిలాబాద్ లో 42.3, ఉమ్మడి మహబూబ్ నగర్ లో 41, ఖమ్మంలో 40.4, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఎల్లుండి నుంచి మరింత ఎండలు ఠారెత్తించనున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు(Heat Wave Alert) వీచే అవకాశం ఉంది. ఎల్లుండి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

14-04-2026

article_80701127.webp
67 మంది యువతులకు వల.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో న‌కిలీ పోలీస్ అరెస్ట్

హైదరాబాద్: మ్యాట్రిమోనీలో సైట్ లో పోలీస్ వేషంతో యువతులకు వల వేస్తూ 67 మంది మహిళలను పెళ్లిళ్లపేరుతో మోసం చేస్తున్న న‌కిలీ CISF అధికారి గుట్టు రట్టు అయింది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారిగా నటిస్తున్న ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణగా గుర్తించబడిన నిందితుడు, సీఐఎస్ఎఫ్ యూనిఫాం ధరించి విమానాశ్రయ ప్రాంగణంలో హడావిడి చేస్తూ కనిపించాడు. బాలకృష్ణ తీరుపై సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అనుమానం కలిగింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను అధికారిక సిబ్బంది కాదని అధికారులు గుర్తించారు.

14-04-2026

article_81384313.webp
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు కేసీఆర్ ఘన నివాళి

హైదరాబాద్: ​రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి(Ambedkar Jayanti) సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao) తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ 135వ జయంతిని పురస్కరించుకుని జాతికి అంబేద్కర్ చేసిన కృషిని, సేవలను కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) స్మరించుకున్నారు. ​అన్ని రంగాల్లో వివక్షారహిత సామాజిక సమానత్వం కోసం, వర్ణ, కుల, మత, లింగ భేదాలు లేకుండా భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే దిశగా కృషి చేసిన మహాదార్శనికుడు అంబేద్కర్ అనిఆయన కొనియాడారు. భారత సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల్లో మానవీయత పరిఢవిల్లి, విశ్వనరుడుగా భారత పౌరుడు ఎదిగేందుకు దోహదం చేసేలా రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ ప్రపంచ మేధావి అన్నారు.

14-04-2026