calender_icon.png 12 January, 2026 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_86208798.webp
మంజీరా నది ఇక క్లీన్!

12-01-2026

ఎల్లారెడ్డి, జనవరి 11: (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా మంజీరా నది పరివాహక ప్రాంతంలో రైతులకు తీవ్ర అవస్థలు ఎదురవుతున్నప్పటికీ గత పాలకుల పాలనల్లో పలుమార్లు రైతులు వినతి పత్రాలు అందజేసిన ఫలితం లేకపోయింది. మొన్న కురిసిన భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు దిగువన మెదక్ జిల్లా నుండి హవేలీఘన్పూర్ నుండి వస్తున్న పసుపు యేరూ, మంజీరా నదిలో కలిసి భారీ ఉధృతంగా ప్రవహించడంతో మాంజీర నది పరివాహక ప్రాంతంలో నాగిరెడ్డిపేట మండలం పోచారం, మాల్ తుమ్మెద గ్రామం నుండి మొదలుకొని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మండలం రుద్రారం అల్మాజిపూర్ గ్రామాల పరిసర ప్రాంతాల వరకు నిజాంసాగర్ ఆయకట్టు ప్రాజెక్టు నీరు అధికంగా నిల్వ ఉండి రైతులకు తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయి.