8 June, 2026 | 4:49 PM

News -

article_75046151.webp
బెంగళూరులో AICC నేత సూరజ్ హెగ్డే కన్నుమూత

బెంగళూరు: ఏఐసీసీ కార్యదర్శి , కర్ణాటక ప్రభుత్వ గ్యారెంటీ కమిటీ ఉపాధ్యక్షుడు సూరజ్ హెగ్డే(AICC functionary Suraj Hegde passes away) బెంగళూరులో కన్నుమూశారని పార్టీ వర్గాలు సోమవారం తెలిపాయి. ఆయన వయసు సుమారు 55 ఏళ్లు. సూరజ్ హెగ్డే గుండెపోటు కారణంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇండియన్ యూత్ కాంగ్రెస్ మాజీ ఇన్‌ఛార్జ్(Former In-charge of the Indian Youth Congress) అయిన హెగ్డే, మాజీ ముఖ్యమంత్రి దేవరాజ్ ఉర్స్ మనవడు. హెగ్డే మృతికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Chief Minister D.K. Shivakumar) సంతాపం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, AICC ప్రధాన కార్యదర్శులు కె.సి. వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు, అలాగే రాష్ట్ర, జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు కూడా హెగ్డే మృతికి సంతాపం తెలిపారు.

08-06-2026

article_34526650.webp
Mrigasira Karthi 2026: కిటకిటలాడుతున్న చేపల మార్కెట్లు

హైదరాబాద్: నగరంలోని చేపల మార్కెట్లపై మృగశిర కార్తి ప్రభావం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ముషీరాబాద్ చేపల మార్కెట్‌కు ఆదివారం భారీ సంఖ్యలో కొనుగోలుదారులు తరలివచ్చారు. మృగశిర కార్తి సోమవారం రావడం, దానికి తోడు వారాంతం కూడా తోడవడంతో చేపలకు డిమాండ్ మరింత పెరిగిపోయింది. దీంతో సముద్రపు ఆహార ప్రియులు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు తరలిరావడంతో భారీ రద్దీ ఏర్పడింది. ముషీరాబాద్ చేపల మార్కెట్ కిటకిట లాడుతోంది. సోమవారం తెల్లవారుజాము 2 గంటల నుంచే చేపల విక్రయాలు ప్రారంభమయ్యాయని విక్రేతలు తెలిపారు. మోసాలకు చెక్ పెట్టేందుకు చేపల మార్కెట్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. తప్పుడు తూనికలతో చేపలు అమ్ముతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారు.

08-06-2026

article_86268475.webp
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

ఫిలిప్పీన్స్‌లోని ఒక దక్షిణ ద్వీపాన్ని 7.8 తీవ్రతతో కూడిన భారీ భూకంపం కుదిపేసింది. రెక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనావో దీవి వద్ద భూకంపం వచ్చింది. భూకంపం ధాటికి పలు నగరాల్లో భవనాలు దెబ్బతిన్నాయి. జనరల్ శాంటోస్ నగరానికి సమీపంలో భూకంప కేంద్రగా ఉన్నట్లు గుర్తించారు. ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఫిలిప్పీన్స్ తీరంలో 10 అడుగుల ఎత్తున అలలు ఎగిరిపడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. భారీ భూకంపంలో ముగ్గురు మరణించగా, నలుగురు గాయపడ్డారని పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. అత్యవసర సేవా విభాగాలను వెంటనే రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు.

08-06-2026