ఎడ్లబండ్ల నుంచి హెలికాప్టర్ వరకు..
11-01-2026
ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మొదట్లో కాలినడకన, ఎడ్లబండ్లపై భక్తులు తరలి వచ్చేవారు. తెలంగాణ నలుమూలలతోపాటు చత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో గిరిజనులు, గిరిజనేతరులు జాతరకు వ స్తుంటారు. రవాణా సౌకర్యం సరిగా లేని రోజుల్లో చంటిపిల్లలు, మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఎడ్లబండ్లను సమకూర్చుకొని జాతరకు వారం పది రోజుల ముందుగానే ఇంటి నుంచి బయలుదేరి, జాతర ముగిసిన తర్వాత పది రోజులకు తిరిగి ఇంటికి చేరేవారు.