బీఆర్ఎస్, కాంగ్రెస్ల మోసం
06-02-2026
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి బీసీలను, మైనారిటీలను, పేదలను, పేద పిల్లల భవిష్యత్తును వ్యవస్థాపితంగా మోసం చేశాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే శాసనసభకు సమర్పించిన అప్రాప్రియేషన్ అకౌంట్స్ ఆధారం గా సంక్షేమ నిధుల వినియోగంలో జరిగిన మోసాన్ని మల్లన్న ప్రజలకు వివరించారు.