28 May, 2026 | 11:45 AM

News -

article_41950507.webp
సీఎం రేవంత్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఈద్ అల్-అధా(Eid al-Adha) (బక్రీద్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, ప్రేమ, దయ, సహనం అనే మహత్తర విలువలను గుర్తు చేసే ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి, ఐక్యతను నింపాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. భగవంతుడి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి కలగాలని కోరుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ 'బక్రీద్' శుభాకాంక్షలు తెలిపారు.

28-05-2026

article_24295572.webp
NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య

న్యూఢిల్లీ: NEET-UG 2026 పరీక్షా పత్రాల లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation) దూకుడు పెంచింది. ఈ కేసలో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన ఒక వైద్యుడు, పూణేకు చెందిన ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అధ్యాపకుడితో సహా తాజాగా జరిగిన అరెస్టులతో, ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 13కి చేరింది. తాజాగా అరెస్టు అయిన నిందితులలో లాతూరుకు చెందిన వైద్యుడు డాక్టర్ మనోజ్ షిరూరే, పుణేలోని డాక్టర్ అభంగ్ ప్రభు మెడికల్ అకాడమీ (APMA)లో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న తేజస్ హర్షద్‌కుమార్ షా ఉన్నారు.

27-05-2026