3 గంటల వరకు తమిళనాడులో 70%, బెంగాల్లో 78.77% పోలింగ్ నమోదు
చెన్నై: తమిళనాడు, బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, గురువారం తమిళనాడులో 70 శాతం పోలింగ్ నమోదైంది. భారత ఎన్నికల సంఘం (EC) గణాంకాల ప్రకారం, మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఓటింగ్ శాతం సరిగ్గా 70 శాతంగా నమోదైంది. 75.79 శాతం ఓటింగ్ శాతంతో సేలం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. అటు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఉత్సాహంగా సాగినప్పటికీ, పలు ప్రాంతాల్లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు, బెదిరింపులు, బీజేపీ అభ్యర్థులపై జరిగిన దాడులు పోలింగ్పై నీలినీడలు కమ్మేలా చేశాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి, మొత్తం 3.60 కోట్ల మంది ఓటర్లలో 78.77 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
23-04-2026