ప్రపంచానికి మేడారం వైభవాన్ని చాటుతాం
12-01-2026
మేడారం, జనవరి 11 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర గిరిజనుల పండుగ మాత్రమే కాదని, ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడు, ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. , ప్రపంచానికి జాతర వైభవాన్ని చాటి చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రులు శ్రీధర్బాబు, కొం డా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి వన దేవతలను దర్శించుకుని, జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూ టీ సీఎం మాట్లాడుతూ.. సమ్మక్క, సారలమ్మ జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభ వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా శాశ్వత నిర్మాణాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నా యన్నారు.