సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష
సంగారెడ్డి: జగ్గారెడ్డి, నిర్మల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ లు, మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులతో వివరంగా సమీక్షించారు. సదాశివపేట పట్టణంలోని ప్రతీ ఇంటికి రోజూ గంటన్నర పాటు మంచినీళ్లు సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించారు. సింగూరు డ్యామ్ నుండి నేరుగా ఇంటింటికి మంజీర నీళ్లు అందేలా ఇంటెక్ వేల్, ఫిల్టర్ బెడ్, ట్యాంకులు, కొత్త పైపులైన్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. సదాశివపేటకు ప్రతిరోజూ గంటన్నర నీళ్లు ఇవ్వాలంటే రూ. 135 కోట్లు ఖర్చవుతుందని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
16-04-2026