calender_icon.png 19 January, 2026 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_35299126.webp
మరో పదేళ్లు మాదే అధికారం!

19-01-2026

ఖమ్మం, జనవరి 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో 10 ఏళ్ల వరకు అంటే 2043 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజలకు సంక్షేమ పాలనను అందిస్తుంటే ఓర్వలేని బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు విషం కక్కుతున్నారని, కేసీఆర్ రాక్షసుల గురువు శుక్రాచార్యుడిలా, కేటీఆర్, హరీశ్‌రావు మారీచ, సుభాహుల్ల వ్యవహరిస్తున్నారని చురకలాంటించారు. ప్రజల ఆశీస్సులు ఉంటే బీఆర్‌ఎస్‌ను 100 మీటర్ల లోతులో బొంద పెడతామని విమర్శించారు. భద్రాద్రిని అయోధ్యల మారు స్తామని అన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు.

article_36400453.webp
నా జీవితానికి సార్థకం మేడారం

19-01-2026

మేడారం, జనవరి 18 (విజయక్రాంతి): ప్రతి మనిషి మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యులు లేదంటే అతని మిత్రులు బంధువులు అతను చేసిన ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేసిండా అని వెనితిరిగి చూసుకుంటే చాలామంది జీవితాల్లో శూన్యం కనిపిస్తుందని, కానీ తన జీవితంలో మరణం అంటూ వస్తే ఆ రోజు తనకు సమ్మక్క సారలమ్మ జాతరకు ఘనమైన ఏర్పాట్లు చేసి గిరిజనులకే కాదు గిరిజనేతరులకు ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అందించిన సంతృప్తి మిగులుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్విగ్నంగా పేర్కొన్నారు. ఆదివారం ములుగు జిల్లా మేడారంలో నిర్వహించిన క్యాబినేట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. అంతకుముందు సీఎం, మంత్రులు మేడారం ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

article_76629673.webp
భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

18-01-2026

ములుగు: జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న మేడారం మహా జాతర నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో మేడారానికి తరలిరావడం ప్రారంభించారు. సెలవులు ఎక్కువగా ఉండటంతో, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రార్థనలు చేస్తుండటంతో సమ్మక్క సారలమ్మ గద్దెలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో జరగనున్న క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. జాతర సమయంలో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి, భక్తుల రాకపోకలు సజావుగా సాగేలా చూడటానికి కూడా చర్యలు తీసుకున్నారు. మేడారం వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు.