20 June, 2026 | 3:52 AM

News -

article_10573453.webp
ధాన్యం నిల్వ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

హైదరాబాద్: ధాన్యం నిల్వ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. 23 జిల్లాల్లో సైలో టెర్మినల్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై ఏజెన్సీలతో చర్చలు జరిపారు. ధాన్యం నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను ఆధునీకరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ పేర్కొన్నారు. రూ. 4,450 కోట్ల పెట్టుబడులతో సైలో టెర్మినల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. ఆటోమేటెడ్, వెదర్ ప్రూఫ్, ప్యాడీ స్టోరేజ్ నెట్ వర్క్ ఏర్పాటుపై ప్రణాళిక సిద్ధం చేసినట్లు సూచించారు.47.5 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో సైలోల నిర్మాణ ప్రతిపాదన చేశామన్నారు. 82 సైలో టెర్మినల్స్ ద్వారా శాస్త్రీయపద్దతుల్లో ధాన్యం నిల్వకు యోచిస్తున్నట్లు వెల్లడించారు.

19-06-2026

article_24521677.webp
రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ బర్త్ డే విషెస్

హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో ఆయనకు మంచి ఆరోగ్యం, సంతోషం, దృఢత్వం లభించాలని ఆకాంక్షించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన గాంధీకి శుక్రవారంతో 56 ఏళ్లు నిండాయి. "మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిచ్చే నాయకుడు రాహుల్ గాంధీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత చాలా మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది," అని రెడ్డి తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

19-06-2026

article_61951046.webp
రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి(Rahul Gandhi birthday) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యం, దీర్ఘాయువుతో జీవించాలని ఆకాంక్షించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న గాంధీ శుక్రవారం నాడు 56వ ఏట అడుగుపెట్టారు. "లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను," అని మోదీ 'ఎక్స్' వేదికగా చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. అటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపు సంబరాలు జరుపుకుంటున్నారు.

19-06-2026

article_68182923.webp
ఫాస్ట్ ఫుడ్ లవర్స్ జర భద్రం... గోదాంలో దొరికిన రంగులు, కుళ్లిన చికెన్

హైదరాబాద్: చార్మినార్ హుస్సేనియాలం పోలీస్ స్టేషన్(Hussainialam Police Station) పరిధిలోని న్యూ లాడ్ బజార్‌లో ‘అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్’ గోదాంపై హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు శుక్రవారం మెరుపు దాడి చేశారు. లైసెన్స్ లేకుండా అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో ఫాస్ట్ ఫుడ్(fast food), ఇతర పదార్థాలు తయారు చేస్తున్న గోదాంలో దాడులు చేసి 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల కల్తీ నూనె స్వాధీనం చేసుకున్నారు. ఆహారంలో నిషేధిత పదార్థాలు, రంగులు వాడుతున్నట్లు గుర్తించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఇద్దరు నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ ఆహారంపై 8712661212 నంబర్ కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

19-06-2026