నేడు తుది విడత పంచాయతీ పోరు
17-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రా మంలో తుది విడత పోలింగ్ బుధవారం జరగనుంది. ఈ మూడో విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉద యం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానున్నది. ఈ మూడో విడత ఎన్నికలకు 4,159 గ్రామ పంచాయతీలను నోటిఫై చేయగా 11 చోట్ల సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డులకు 116 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 394 సర్పంచ్ స్థానాలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.