62 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేసిన జగ్గారెడ్డి
సంగారెడ్డి పట్టణంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న 62 మంది చిన్నారులకు జగ్గారెడ్డి ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటివరకు తమ కార్యాలయంలో పేర్లను నమోదు చేయించుకున్న విద్యార్థులకు విడతల వారీగా సైకిళ్లు అందిస్తున్నామని వివరించారు. సైకిళ్ళ పంపిణీ సందర్భంగా చిన్నారులతో జగ్గారెడ్డి ముచ్చటించారు. తాము ఇంటి నుంచి పాఠశాలకు పోయి వచ్చేందుకు ఈ సైకిళ్ళు కావాలని అడిగినట్లు విద్యార్థులు జగ్గారెడ్డికి వివరించారు. 25మంది బాలికలు, 37 మంది బాలురకు సైకిల్స్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేర్యాల ఆంజనేయులు, జార్జ్ మాథ్యూస్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీకాంత్, మహేష్ ముదిరాజ్, రాజు, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.
30-04-2026