డ్రగ్స్ కేసులో ఏడుగురు అరెస్ట్
01-01-2026
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో న్యూ ఇయర్(New Year's Day) సందర్భంగా పోలీసులు భారీ మాదకద్రవ్యాల నిరోధక ఆపరేషన్(Anti-drug operation) నిర్వహించారు. అరెస్టు అయిన ఏడుగురిలో ఒక డాక్టర్, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) విద్యార్థి ఉన్నారు. అట్టింగల్, నెడుమంగాడ్ రూరల్ డ్యాన్సాఫ్ (డిస్ట్రిక్ట్ యాంటీ-నార్కోటిక్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్) బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఒక అద్దె ఇంట్లో నుంచి ఎండీఎంఏ, హైబ్రిడ్ గంజాయి, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన ఏడుగురిని డాక్టర్ విఘ్నేష్ దత్తన్, బీడీఎస్ విద్యార్థిని హలీనా, అసిమ్, అవినాష్, అజిత్, అన్సియా, హరీష్గా గుర్తించారు. పోలీసుల ప్రకారం, అవినాష్ ఒక ఐటీ ఉద్యోగి అని, అలాగే అసిమ్, అజిత్, అన్సియా గతంలో కూడా పలు మాదకద్రవ్యాల కేసులలో నిందితులుగా ఉన్నారని పోలీసులు నిర్ధారించారు.