calender_icon.png 5 January, 2026 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_24055598.webp
బీసీలకు రక్షణ చట్టం తేవాలి

05-01-2026

కడ్తల్, జనవరి 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలాగా బీసీలకు రక్షణ చట్టం తీసుకువచ్చి వెనుకబడిన కులాలకు సీఎం రేవంత్‌రెడ్డి రక్షణ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో యువజన సంఘాల ఐక్యవేదిక వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఐక్యవేదిక కన్వీనర్ రాఘవేందర్ అధ్యక్షతన ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత పేదరికంతో మగ్గుతు, వివక్షకు గురై అడుగడుగునా అన్యాయాలకు, దాడులకు, అవమానాలకు బీసీలు గురవుతున్నారని ఈ విషయంపై సీఎం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

article_72220792.webp
డబ్బు పెట్టు.. సెలక్షన్ పట్టు!

05-01-2026

కరీంనగర్, జనవరి 4 (విజయక్రాంతి): నేటి రోజులలో క్రీడలు ఆడాలంటే క్రీడాకారులు లేరు కానీ ఎక్కడో అక్కడ కొంతమంది మాత్రమే క్రీడాకారులు తయారవుతున్నారు ఆ తయారవుతున్న దానిలో క్రీడలని నమ్ముకొని ముఖ్యంగా వాలీబాల్ క్రీడనీ నమ్ముకున్న క్రీడాకారులు రాత్రి పగలు అనకుండా కష్టపడుతూ క్రీడను నేర్చుకుంటున్నారు. కానీ ఇట్టి సమయంలో సెలక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ క్రీడను నమ్ముకుని క్రీడాకారుడు తన యొక్క ప్రతిభను చూపించినప్పుడు అట్టి ప్రతిభను లెక్కచేయకుండా వాలీబాల్ క్రీడను డబ్బుతో పర్పత్తో ముడి వేస్తున్నారు. వాలీబాల్ అసోసియేషన్ వారు ఇలా చేయడం ద్వారా వాలీబాల్ క్రీడా కనుమరుగవుతుందని మరొక క్రీడాకారుడు తయారు కావడానికి ఉత్సాహం చూపించలేకపోతున్నారు.

article_66275199.webp
ఎస్సీ కార్పొరేషన్ స్థలం కబ్జా..?

05-01-2026

బెల్లంపల్లిలో ఇప్పటికే కొందరు అధికార పార్టీ లీడర్ల అవినీతి, అక్రమాలు ప్రతినిత్యం జిల్లాలో హాట్ టాపి క్‌గా మారిపోయాయి. వాటిపై మీడియాలో కథనాలు సంచలనం రేకిస్తున్నాయి. అయినప్పటికీ కబ్జాలు, అక్రమాలు ఆగడం లేదు... అధికారం మాటున ఎవరికి తోచినట్టు వారు లీడర్లే కబ్జాలను దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉండగా కబ్జాల వ్యవహారంలో తామేమీ తక్కువ కాదని అధికార పార్టీకి చెంది న మరో నేత పట్టణ నడిబొడ్డున గల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా ఇంటి నెంబర్ తీసుకున్న వైనం వెలుగులోకి ఆలస్యంగా వచ్చింది. మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా, ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఎస్సీ కార్పొరేషన్ సముదాయంపై కబ్జాదారుల కన్ను పడింది.