calender_icon.png 22 January, 2026 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_54666558.webp
భూమి అమ్మకుండానే దండిగా డబ్బులు..!

22-01-2026

మేడారం, జనవరి 21 (విజయక్రాంతి): భూమి అమ్మకుండానే మేడారంలో కొందరు దండిగా డబ్బులు సంపాదిస్తున్నారు. అదేమిటి.. భూములు అమ్మకుండా డబ్బులు సంపాదించడం ఏమిటి అని అనుకుంటున్నారా.. మేడారం జాతర సందర్భం గా మేడారం పరిసర ప్రాంతాల్లోని పలువురు రైతులు, గృహాల యజమానులు తమ భూములు, ఇండ్లను, ఖాళీ స్థలాలను అద్దెకు ఇస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరకు కోట్ల మంది భక్తులు రావడం జరుగుతోంది. ఈ క్రమంలో మూడు రోజులపా టు మేడారంలోనే ఉండి వనదేవతలను దర్శించుకోవడం చాలామంది భక్తులు ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.

article_20378813.webp
ప్రమాదకరంగా ప్రయాణం

22-01-2026

కేసముద్రం, జనవరి 21 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల పరిధిలో ఉన్న పలు ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లు భారీ వర్షాలకు దెబ్బతిని నెలలు గడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు వస్తున్నాయి. అనేక చోట్ల ఈ రెండు శాఖలకు చెందిన రోడ్లు వర్షాలకు కొట్టుకుపోవడం, కల్వర్టులు దెబ్బతినడంతో ఆయా మార్గాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. మహబూబాబాద్ జిల్లాలో 2024, 2025 వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు ఈ మూడు మండలాల్లోని చాలా చోట్ల గ్రామాల నుండి మండలాలకు, మండలాల నుండి జిల్లా కేంద్రానికి అనుసంధా నంగా ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి.

article_21382375.webp
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలి

22-01-2026

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జిల్లాల తొలగింపునకు ప్రజలు అనుమతి ఇచ్చినట్లేనని, ఈ అంశాన్ని ప్రజలు స్పష్టంగా గుర్తించి రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కొత్త జిల్లాల్లో ఇప్పటికే జిల్లాలు ఎత్తేస్తారన్న భయం నెలకొం దని, ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉన్నదని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం మున్సిపాల్టీల వారీగా పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించనున్నామని, ఉమ్మడి జిల్లాలకు చెందిన వారినే బాధ్యతల్లో పెడతామని కేటీఆర్ తెలిపారు. నేడు లేదా రేపు ఇన్‌చార్జ్‌లను ప్రకటిస్తామని చెప్పారు.