విద్యుత్ శాఖ నిర్లక్ష్యం
మేడిపల్లి, జూన్ 1 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాదిగూడ డివిజన్ మల్లకార్జున నగర్లో 11 కె.వి భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు స్థానికులకు ఇబ్బందికరంగా మారాయి. విద్యుత్ కేబుల్ ఏర్పాటు కోసం రోడ్లపై తవ్విన గుంతలను పూడ్చకుండా కేబుల్ పనులను మున్సిపల్ శాఖ, హెచ్ఎండబ్ల్యూఎస్, ఎస్బి అధికారుల సమన్వయ లోపంతో అధికారులు, కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.
02-06-2026