calender_icon.png 24 January, 2026 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_69379821.webp
పల్లా x ప్రతాప్‌రెడ్డి

24-01-2026

జనగామ, జనవరి 23 (విజయక్రాంతి): మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జనగామ పర్యటనలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య వాగ్వా దం నెలకొంది. మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తుండగా ఉద్రిక్త వాతావరణం నెలకొ ంది. బైపాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్ శిల్పాలు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న విగ్రహాల ఆవిష్కరణలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ను కొబ్బరి కాయ కొట్టాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలిచారు.

article_59078134.webp
కోట్లు పెట్టు.. పదవి పట్టు!

24-01-2026

నారాయణపేట. జనవరి 23 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా కేంద్రంలో తాజా మాజీ వైస్ చైర్మన్ గతంలో బిఆర్ ఎస్ నుండి కౌన్సిలర్ పోటీ చేసి డబ్బుతో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మద్దతుతో వైస్ చైర్మన్ పదవి దక్కించుకొనిఐదు సంవత్సరాలలో తను ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు కు కనీసం ప్రజలకు అందుబా టులో లేకపోవడంతో పాటు వార్డు అభివృద్ధికి పాటు పడకుండా, ఆయన అమెరికా, దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ తను ప్రా తినిధ్యం వహించిన వార్డు ప్రజలకు అందుబాటులో ఉండకుండా తను చేస్తున్న వ్యాపా రాల అభివృద్ధి కోసం పాటు పడుతూ తన స్వంత అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయాల్లోకి రావడం తన స్వంత ఆస్తులు కాపాడుకోవటం కోసమే పదవులు తెచ్చుకోవటం అలవాటుగా మారిందని ప్రజలు విమర్శలు సైతం వ్యక్తం చేస్తున్నారు.

article_34423373.webp
కేటీఆర్ సిట్ విచారణపై ఉత్కంఠ

23-01-2026

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్(Jubilee Hills Police Station)లో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. రెండు గంటలుగా కేటీఆర్ ను సిట్ బృందం విచారిస్తోంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో(Former Task Force DCP Radhakishan Rao) కలిపి విచారిస్తున్నారు. వ్యాపారవేత్తలను బెదిరించి బీఆర్ఎస్ కి విరాళాలు ఇప్పించిన వ్యవహారంపై విచారిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) శుక్రవారం భారీ పోలీసు మోహరింపు మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. తెలంగాణ భవన్, జూబ్లీ హిల్స్ వద్ద నిరసనలు చెలరేగడంతో పోలీసులు పార్టీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి.