రక్షణ రంగం బలోపేతం..
02-02-2026
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: గతేడాది మన పొరుగున ఉన్న పాకిస్థాన్, చైనా నుంచి భద్రతా సవా ళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొ న్నారు. ఈ నేపథ్యంలో రక్షణ రంగాన్ని పటిష్టపరిచేందుకు బడ్జెట్లో రూ. 7,84, 678 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2025 బడ్జెట్లో ఇదే రక్షణ రంగానికి రూ.6, 81, 210 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రక్షణ రంగానికి 15 శాతం నిధు లు అదనంగా కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందులో మూలధన వ్యయం రూ. 2,19, 306 కోట్లుగా నిర్ణయించగా, రెవెన్యూ వ్యయం రూ. 5,53, 668 కోట్లుగా ఉంది. ఇందులో పెన్షన్లకు రూ. 1,71,338 కోట్లు ఉన్నాయి. ఇక దేశ భద్రత దృష్ట్యా ఈసారి సాయుధ దళాల ఆధునీకరణకు బడ్జెట్లో పెద్దపీట వేశారు.