20 April, 2026 | 4:57 AM
Breaking News
సికింద్రాబాద్/కామారెడ్డి, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): హైదరాబాద్లో ఆదివారం ఉదయం నుంచి ఎండలు దంచికొట్టినా.. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి, వడగండ్ల వాన కురిసింది.
20-04-2026
నల్లగొండ, ఏప్రిల్19 (విజయక్రాంతి): నాడు ప్రతిపక్షనేతగా ధాన్యం సెంటర్ల పరిశీలనకు వెళ్లిన రేవంత్రెడ్డి తరుగుతీస్తే... తోలుతీస్తా అని చెప్పిన రేవంత్రెడ్డి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత తాలుపేరిట తరుగు తీస్తున్నారని ఇప్పుడు రైతులు ఆయన తోలు తీయాలని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
కరీంనగర్, ఏప్రిల్19(విజయక్రాంతి): జైత్రయాత్రతో విప్లవ శంఖం పూరించిన జగిత్యాల కు మాజీ సి ఎం బి ఆర్ ఎస్ అధినేత కె సి ఆర్, తూర్పు అటవీ ప్రాంతంలో ఎర్రమల్లెలు పూయించిన ఒకప్పటి నక్సల్స్ కంచుకోట కాళేశ్వరం కు సి ఎం ఏనుమల రేవంత్ రెడ్డి లు సోమవారాం పర్యటిస్తుండటం రాజకీయుగ ప్రాధాన్యత సంతరించు కుంది.
ఖమ్మం, ఏప్రిల్ 19(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన, ఎవరి నోట విన్న ఒకటే మాట.. రేవంత్ రెడ్డి పోవాలే.. కేసీఆర్ రావాలే.. ఇది తెలంగాణ ప్రజల అభిప్రాయమని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు.
అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే.. అడుగడుగునా దళారులు కాటేస్తున్నారు. బాటసింగారంలోని కోహెడ గడ్డి అన్నారం మామిడి మార్కెట్ యార్డులో కమిషన్ ఏజెంట్ల అరాచకం హద్దులు దాటుతోంది.
హైదరాబాద్, ఏప్రిల్ 19(విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖాజాగూడ ప్రాంతంలో భూ అక్రమాల వ్యవహారం పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తోంది.
నిర్మల్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ప్రయాణికుల సేవ.. ప్రథమ కర్తవ్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీజీ ఆర్టీసీ మరింత కష్టాల్లో పడనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు టీజీ ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి మెరుపు సమ్మె చేయనున్నారు.
బిచ్కుంద, ఏప్రిల్ 19 (విజయక్రాంతి); కబ్జాదారుల కన్ను పడడంతో చెరువులు, కుంటలు మటుమాయం అవుతున్నాయి. అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదు. దీంతో కబ్జాదారులు ఆడింది ఆట పాడింది పాటగా అక్రమణలకు పాల్పడుతున్నారు. పలువురు ఆక్రమణలకు పాల్పడడంతో నామరూపాలు లేకుండా పోతున్న గుండోజి కుంట వైనం ఇది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపసింగారంలో దొంగల ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ప్రతాపసింగారంలో నివసిస్తున్న ఈ నిందితులు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో చోరీ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
19-04-2026
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలువనున్నారు. ఈ భేటీలో ఇద్దరు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఆచార్య కోదండరామ్, అజారుద్దీన్ పేర్లు ఆమోదించాలని కోరనున్నట్లు సమాచారం. ఏ సభలో సభ్యుడు కానప్పటికీ మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ ఈ నెలాఖరుకు ఆయన మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు పూర్తవుతుంది.
ముషీరాబాద్, ఏప్రిల్ 18(విజయక్రాంతి): దేశానికి మొట్ట మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశానికి దశ, దిశ, నిర్దేశం, దూర దృష్టితో పాలన చేశారని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్పై రే వంత్ సర్కారు చేతులెత్తేసి.. పేద విద్యార్థుల భవిష్యత్తో ఆడుకుంటున్నదని బీఆర్ఎస్ నేత, రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో కాలేజీలన్నీ విద్యార్థుల నుం చి ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు