7 July, 2026 | 3:20 PM

Breaking News

పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •   అన్ని వర్గాల ప్రజలకు అండగా ఎమ్మార్పీఎస్   •   ప్రతి ఓటరును చైతన్యం చేయండి   •   ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ముప్పు   •   మొహమ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లో ఎస్‌ఐఆర్ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ విక్టర్   •   సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •  

News -

article_45372750.webp
కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్

హైదరాబాద్: కాళేశ్వరంపై(Kaleshwaram Lift Irrigation Project) బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) స్పందించారు. వారం రోజుల్లో నీళ్లు ఇస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మహేశ్ గౌడ్ హితవు పలికారు.. కాళేశ్వరం పేరుతో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కాళేశ్వరంపై ఇంజినీర్ల సూచనలు పట్టించుకోలేదని విమర్శించారు. కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారిందని మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఇంజినీర్లను పక్కనపెట్టి కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. కాళేశ్వరంపై కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ప్రకటనలు అనుభవరాహిత్యం అన్నారు. NDSA పైపింగ్, పునాదుల్లో లోపాలను గుర్తించిందన్నారు. లోపాలను సరిచేయకుండా నీళ్లు నిల్వ చేయాలా? అని ప్రశ్నించారు. BRSలాగా మేము అశాస్త్రీయంగా వ్యవహరించమని పేర్కొన్నారు.

07-07-2026

article_76234326.webp
తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు: కవిత

హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత్ర కట్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం విరుచుకుపడ్డారు. హైదరాబాద్ మహా నగర ప్రజలు నీటి కష్టాలతో అల్లాడిపోతుంటే ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని కవిత ఆరోపించారు. హైదరాబాద్ నగరాన్ని నీటి కష్టాల నుండి దూరం చేయడానికి దూరదృష్టి కొరవడటంతోనే ఈ దుస్థితి తలెత్తిందని విమర్శించారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి హైదరాబాద్ సమీపంలోని కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా మల్లన్నసాగర్ నుంచి గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్ -2, ఫేజ్ - 3 ను ప్రభుత్వం చేపట్టిందని ధ్వజమెత్తారు.

07-07-2026

article_41996522.webp
స్కూళ్లు, కాలేజీలు మూసివేత.. 'ఆరెంజ్' అలర్ట్ జారీ

ముంబై: మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ(India Meteorological Department) 'ఆరెంజ్' అలర్ట్ జారీ(Orange Alert) చేయడంతో మంగళవారం ఉదయం ముంబై నగరవాసులు మేఘావృతమైన ఆకాశం, బలమైన గాలులతో కూడిన వాతావరణాన్ని చూశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా మంగళవారం నాడు ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేట్, మున్సిపల్ పాఠశాలలు, కళాశాలలు అన్నీ మూసివేయబడతాయని అధికారులు ప్రకటించారు. సోమవారం కురిసిన ఎడతెరిపి లేని వర్షం ముంబై, పొరుగు జిల్లాలను దాదాపుగా స్తంభింపజేసింది. అనేక రోడ్లు నీట మునిగాయి, చెట్లు కూలిపోయాయి. గోడలు, హోర్డింగ్‌లు కూలిపోయిన పలు ఘటనలు నమోదయ్యాయి.

07-07-2026