8 July, 2026 | 4:43 PM

News -

article_34149371.webp
వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించే ఏర్పాట్లు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. నివేదికల ప్రకారం, విగ్రహం వద్ద నివాళులు అర్పించే సమయంలో కొందరు పురుష కార్యకర్తలు మహిళా కార్యకర్తల కాళ్లపై అడుగు వేయడంతో వాగ్వాదం మొదలైంది. మహిళలు వారి ప్రవర్తనను ప్రశ్నించడంతో పరిస్థితి ముదిరి, శారీరక ఘర్షణకు దారితీసింది. పార్టీలోని సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకోగా, పురుషులు పెనుగులాటలో పాల్గొని, ఆ గందరగోళంలో చొక్కాలు చించుకున్నారు. ఆకస్మిక ఘర్షణ పార్టీ కార్యాలయంలో గందరగోళాన్ని సృష్టించి, కార్యక్రమానికి అంతరాయం కలిగించింది.

08-07-2026

article_79306728.webp
ఓయూలో బీఆర్ఎస్వీ, విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని తక్షణమే అమలు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ(BRSV), ఇతర విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ నిర్వహించాయి. 2 లక్షల ఉద్యోగాలు, 20 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని, ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు నిరుద్యోగ యువతతో కలిసి బీఆర్ఎస్వీ, ఇతర విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి.

08-07-2026

article_40235781.webp
ప్రజలే తన కుటుంబంగా భావించిన నేత YSR: సీఎం రేవంత్

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవల విస్తరణ, విద్య ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రజలనే తన కుటుంబంగా భావించి, వారి సంక్షేమమే పరమావధిగా జీవితాంతం కృషి చేసిన మహోన్నత ప్రజానాయకుడని సీఎం కొనియాడారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు, ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం, మానవతా దృక్పథం నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

08-07-2026