మాకూ పీపీటీకి అవకాశం ఇవ్వండి
30-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపో తల ప్రాజెక్టు, నదీ జలాలకు సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో నిర్వహించనున్న పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్కు తమకూ అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ సభాపక్షం కోరింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు ఆయన ఛాం బర్లో బీఆర్ఎస్ఎల్పీ నేతలు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి తదితర నేతలు వినతిపత్రం అందజే శారు.