గాజాపై దాడులు
19-03-2025
న్యూఢిల్లీ, మార్చి 18: వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుప డింది. మంగళవారం తెల్లవారుజామున నుంచి గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 413 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా 150 మందికిపైగా గాయపడ్డారు. గాజా సిటీ, ఉత్తర గాజా, రఫా, ఖాన్ యూనిస్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 413 మంది ప్రజలు మరణించినట్టు పాలస్తీనా హెల్త్ అధికారులు మీడియాకు వెల్లడించారు.