calender_icon.png 12 December, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_77263741.webp
మంత్రి కొండా సురేఖపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

11-12-2025

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)పై నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు(Nampally Special Court) నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) పరువునష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో నాంపల్లి కోర్టు కొండా సురేఖపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీలోగా కొండా సురేఖ నేరుగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.

article_39012339.webp
ప్రశాతంగా ముగిసిన పంచాయతీ పోలింగ్

11-12-2025

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల(Telangana Gram Panchayat Elections) పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ ముగుస్తుంది. ఒంటిగంట వరకు క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం ఇస్తారు. తొలి విడతలో 3834 సర్పంచ్ స్థానాలకు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం 3,461 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించి, ఈ ప్రదేశాలలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసింది. ఎన్నికలు సజావుగా జరిగేలా చూసేందుకు దాదాపు 50,000 మంది పోలీసు సిబ్బంది, 60 ప్రత్యేక పోలీసు ప్లాటూన్లు మరియు అగ్నిమాపక, అటవీ శాఖలకు చెందిన సుమారు 2,000 మంది సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు.