calender_icon.png 10 January, 2026 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_59325719.webp
సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయడమే లక్ష్యం

10-01-2026

అశ్వారావుపేట, జనవరి 9 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 6 లక్షలకు పైగా ఎకరాలకు నీరందించి రైతుల కష్టాలను తీర్చే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తి చేయడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వాటాలో ప్రతి నీటి బొ ట్టును ఒడిసిపడతామని, జలాలపై హక్కుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శుక్రవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో పర్యటించారు.

article_75762654.webp
శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్

09-01-2026

తిరువనంతపురం: శబరిమల బంగారు(Sabarimala Gold Case) ఆభరణాల అదృశ్యం కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team) శుక్రవారం శబరిమల ప్రధాన పూజారి (తంత్రి) కండరారు రాజీవరూను(kandararu rajeevaru) అరెస్టు చేసిందని వర్గాలు తెలిపాయి. రాజీవరును ఉదయం ఒక రహస్య ప్రదేశంలో విచారించారని, ఆ తర్వాత మధ్యాహ్నం సిట్ కార్యాలయానికి తరలించారని, అక్కడే ఆయన అరెస్టును నమోదు చేశారని వర్గాలు తెలిపాయి. అధికారుల ప్రకారం, ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, మాజీ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఈ అరెస్టు జరిగింది.

article_35230520.webp
గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన

09-01-2026

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపట్నుంచి మూడు రోజుల పాటు గుజరాత్(Gujarat)లో పర్యటించనున్నారు. రేపు సోమనాథ్ ఆలయంలో ఓంకార మంత్రి జపంలో, ఎల్లుండి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ లో ప్రధాని పాల్గొనున్నారు. ఎల్లుండి వైబ్రంట్ గుజరాత్ సదస్సును మోదీ ప్రారంభిస్తారు. అహ్మదాబాద్ మెట్రో రెండో దశ పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 12 అహ్మదాబాద్ లో జర్మన్ ఛాన్సలర్ తో నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ప్రధానిమోదీ, జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ సబర్మతి ఆశ్రయాన్ని సందర్శించనున్నారు. అనంతరం అహ్మదాబాద్ లో గాలిపటాల ఉత్సవానికి మోదీ, మెర్జ్ హాజరు కానున్నారని పీఎంవో వెల్లడించింది.