బీజేపీ నేతలతో నితిన్ నబీన్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్
హైదరాబాద్: రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ లతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్(BJP National President Nitin Nabin) బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. బేగంపేట పర్యాటక భవన్ లో రామచందర్ రావు(Ramachander Rao) అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ కీలక భేటీకి అభయ్ పాటిల్, సునీల్ బన్సల్, ఆశిష్ సెల్లార్, రేఖా శర్మ, చంద్రశేఖర్ తివారీతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ కమిటీల పనితీరుపై సమావేశంలో చర్చించారు. పార్టీ పరిస్థితి, అధికారంలోకి వచ్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. మూడు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా నితిన్ నవీన్ రాష్ట్రానికి వచ్చారు.
29-06-2026