మేడారం జాతరకు 3.70 కోట్లు
24-01-2026
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): కేంద్రప్రభుత్వం మేడా రం జాతరకు రూ.3.70 కోట్లు విడుదల చేసిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఈ నిధులను తన ప్రత్యేక చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ, గిరిజన మంత్రిత్వశాఖలు విడు దల చేశాయని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామర వాయి, మల్లూరు, బోగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించనుంది.