calender_icon.png 22 January, 2026 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_57195265.webp
బస్సు-లారీ ఢీ: టైరు పేలి ముగ్గురు మృతి

22-01-2026

నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు లారీని ఢీకొని మంటలు చెలరేగడంతో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సునీల్ షెయోరాన్ తెలిపిన వివరాల ప్రకారం, 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న బస్సు నంద్యాల జిల్లాలోని సిరివెళ్ల మెట్ట సమీపంలో తెల్లవారుజామున 1.40 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. టైరు పగిలిపోవడంతో, బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో సహా ముగ్గురు మరణించగా, 36 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశామని షెయోరాన్ విలేకరులకు తెలిపారు.

article_88869015.webp
ఎర్రవల్లిలో కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీ

22-01-2026

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లిన హరీశ్ రావు, గులాబీ బాస్‌తో సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మంగళవారం హరీశ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఏడు గంటలపాటు సాగిన ఈ విచారణ ముగిసిన మరుసటి రోజే కేసీఆర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. సిట్ విచారణ సంద ర్భంగా అధికారులు అడిగిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలపై హరీశ్ రావు కేసీఆర్‌తో చర్చించినట్లు సమాచారం.

article_60874413.webp
మున్సిపోల్స్ బరిలో టీఆర్పీ

22-01-2026

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కత్తెర గుర్తుతో బరిలోకి దిగనుందని పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. బలమైన, ప్రజల మధ్య ఉన్న అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ మాటను పూర్తిగా మరిచిపోయిందని, ఆ హామీపై ప్రశ్నించాల్సిన బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు నోరు మెదపకపోవడం ద్వారా బీసీలకు చేసిన మోసంలో భాగస్వాములయ్యా యని మల్లన్న ఆరోపించారు.

article_78091614.webp
‘లైఫ్ సైన్సెస్’ భవిష్యత్‌లో తెలంగాణ పాలసీ

22-01-2026

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : లైఫ్ సైన్సెస్ రంగంలో అద్భుత మైన పురోగతి సాధించి ప్రపంచ లైఫ్ సైన్సె స్ రంగానికి కేంద్రంగా మారాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. లైఫ్ సైన్సెస్ రంగంలో అద్భుతమైన భవిష్యత్‌ను సృష్టించడంలో భాగంగా కీలకమైన ముందడుగు వేసింది. లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి కోసం దోహదపడే అంశాలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు అవలంభించే విధా నాలతో నూతన పాలసీని రూపొందించిం ది. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ స్థాయి ఆశయాలతో రూపొందించిన ‘లైఫ్ సైన్సెస్ పాలసీ 2026---30’ను దావోస్‌లో కొనసాగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఘనంగా ఆవిష్కరించారు.

article_30869031.webp
శరవేగంగా ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు పూర్తి చేయాలి

22-01-2026

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : రాష్ర్టంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మా ణంతోపాటు పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై తరచుగా సమీక్షించుకుని పనుల వేగవంతానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను కొనసాగించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటిం చారు.

article_43970302.webp
జీవన్‌రెడ్డి గుస్సా

22-01-2026

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : గాంధీభవన్‌లో జరుగుతున్న నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాక సమావేశం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్‌రెడ్డి బయటకు వెళ్ళిపోయారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ సమావేశానికి హాజరుకావడంతో జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నుంచి బయటికి వచ్చిన జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌తో కొట్లాడిన తమ లాంటివాళ్లకి అవమానం జరుగుతోందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను తమ పక్కన కూర్చోబెడుతున్నారని, అలా కూర్చోబెడితే ఏం గౌరవం ఉంటుందని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు.

article_54666558.webp
భూమి అమ్మకుండానే దండిగా డబ్బులు..!

22-01-2026

మేడారం, జనవరి 21 (విజయక్రాంతి): భూమి అమ్మకుండానే మేడారంలో కొందరు దండిగా డబ్బులు సంపాదిస్తున్నారు. అదేమిటి.. భూములు అమ్మకుండా డబ్బులు సంపాదించడం ఏమిటి అని అనుకుంటున్నారా.. మేడారం జాతర సందర్భం గా మేడారం పరిసర ప్రాంతాల్లోని పలువురు రైతులు, గృహాల యజమానులు తమ భూములు, ఇండ్లను, ఖాళీ స్థలాలను అద్దెకు ఇస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరకు కోట్ల మంది భక్తులు రావడం జరుగుతోంది. ఈ క్రమంలో మూడు రోజులపా టు మేడారంలోనే ఉండి వనదేవతలను దర్శించుకోవడం చాలామంది భక్తులు ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.

article_20378813.webp
ప్రమాదకరంగా ప్రయాణం

22-01-2026

కేసముద్రం, జనవరి 21 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల పరిధిలో ఉన్న పలు ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లు భారీ వర్షాలకు దెబ్బతిని నెలలు గడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు వస్తున్నాయి. అనేక చోట్ల ఈ రెండు శాఖలకు చెందిన రోడ్లు వర్షాలకు కొట్టుకుపోవడం, కల్వర్టులు దెబ్బతినడంతో ఆయా మార్గాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. మహబూబాబాద్ జిల్లాలో 2024, 2025 వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు ఈ మూడు మండలాల్లోని చాలా చోట్ల గ్రామాల నుండి మండలాలకు, మండలాల నుండి జిల్లా కేంద్రానికి అనుసంధా నంగా ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి.