3 June, 2026 | 2:39 AM

News -

article_28993209.webp
పవన్ కళ్యాణ్‌పై కోదండరాం ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభపై ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ఉందని తెలంగాణలో మీటింగ్ పెడతామంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు బావ ప్రకటనా స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు మీరు రావచ్చు, పోవచ్చు అని కోదండరాం సూచించారు. తెలంగాణ సెక్రటేరియేట్(Telangana Secretariat)లో పెత్తనం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ ఏర్పాటైందని తెలిపారు. ఒక్కరితోనే తెలంగాణ వచ్చిందని ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. త్వరలోనే ఉద్యమకారులను గుర్తిస్తామన్నారు.

02-06-2026

article_70242422.webp
మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఈడీ దాడులు

ముంబై: ఇటీవల టర్కీ నుండి భారత్‌కు తీసుకురాబడిన మాదకద్రవ్యాల స్మగ్లర్ మహమ్మద్ సలీం డోలాపై జరుగుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం మహారాష్ట్ర, గుజరాత్‌లలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేంద్ర సంస్థ ఒక కేసు నమోదు చేసిన అనంతరం, ముంబైలో సుమారు 20 ప్రదేశాలతో పాటు గుజరాత్‌లోని సూరత్, అంక్లేశ్వర్ (భరూచ్ జిల్లా)లలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. డోలా అలియాస్ సలీం ఇస్మాయిల్ డోలా, ప్రపంచవ్యాప్తంగా వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడని ఆరోపణలు ఉన్నాయి.ఇతనిపై అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా సిండికేట్‌ను నడుపుతున్నాడని మాదకద్రవ్యాల నిరోధక సంస్థలు ఆరోపించాయి.

02-06-2026