అనర్హత పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్న సభాపతి
17-12-2025
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఐదు మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం తీర్పు ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేలు తెల్లాం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు వెలువరించనున్నట్లు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం తెలిపింది.