calender_icon.png 26 December, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_21150941.webp
సమస్యలు పరిష్కరించుకుందాం

26-12-2025

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సర్పంచ్(Congress Sarpanchs)లకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించే వరకు యాత్ర కొసాగాలని తెలిపారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ల సమస్యలపై చొరవ చూపే బాధ్యత తమదని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామాల్లోని అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయంతో కేసీఆర్ కు గుబులు మొదలైందని మంత్రి వివేక్ వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసిందన్నారు. బీఆర్ఎస్ కు పట్టు ఉన్న జూబ్లీహిల్స్ లోనూ విజయం సాధించామని తెలిపారు. రెండేళ్ల పాటు ఫాంహౌస్ లో ఉండి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్దారు.

article_33329974.webp
విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్

26-12-2025

హైదరాబాద్: వరస సెలవుల రావడంతో జనం సొంత ఊళ్లకు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై(Hyderabad-Vijayawada National Highway) భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) జంక్షన్ నుండి విజయవాడ వైపు వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి. కార్లు, బస్సులు, ట్రక్కుల పొడవైన వరుసలు కిలోమీటర్ల మేర విస్తరించాయి. కొన్ని చోట్ల తాము గంటకు పైగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయామని ప్రయాణికులు తెలిపారు. జరుగుతున్న రహదారి విస్తరణ పనుల కారణంగా కీలక ప్రదేశాలలో రహదారి ఇరుకుగా మారి, ట్రాఫిక్ రద్దీకి కారణమవుతోంది. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్(Traffic jam)తో వాహనదారుల ఇబ్బంది పడుతున్నారు.

article_22109133.webp
నల్లకుంటలో దారుణం

26-12-2025

హైదరాబాద్: అనుమానంతో కట్టుకున్న భర్తే తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని నల్లకుంటలో(Nallakunta) చోటుచేసుకుంది. డిసెంబర్ 24న ఆ దంపతుల పిల్లల సమక్షంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం, నల్గొండ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన వెంకటేష్ అనే నిందితుడు తన భార్య త్రివేణిపై వారి నివాసంలో పెట్రోల్ దాడి చేశాడు. వారి కుమార్తె జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా, నిందితుడు ఆమెను కూడా మంటల్లోకి తోసివేశాడని, దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఇంటికి చేరుకుని త్రివేణిని, ఆమె గాయపడిన కుమార్తెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

article_47003164.webp
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

26-12-2025

హైదరాబాద్: వరస సెలవులు రావడంతో తెలుగురాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. వరస సెలవులు రావడంతో గుట్టకు భక్తుల తాకిడి పెరిగిందని అధికారులు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ధర్మదర్శనానికి దాదాపు మూడు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అటు శ్రీశైలం ఆలయానికి కూడా భక్తుల తాకిడి పెరిగింది. శుక్రవారం వేకువజాము నుంచే క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

article_70218719.webp
శ్రీవారి సేవలో ఆర్ఎస్ఎస్ చీఫ్

26-12-2025

తిరుపతి: ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్(RSS Chief Mohan Bhagwat) శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భగవత్‌కు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు ఆయనను దర్శనం కోసం తీసుకెళ్లారు. భగవత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారని, దర్శనానికి వెళ్లే ముందు టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారి తెలిపారు. దర్శనం అనంతరం, రంగనాయక మండపంలో అర్చకులు ఆయన్ను (ఆర్ఎస్ఎస్ అధిపతిని) పట్టు వస్త్రాలతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. టీటీడీ అనేది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన హిందూ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయానికి అధికారిక సంరక్షక సంస్థ.