టీఆర్పీ అడ్డాగా ఆలేరు
22-01-2026
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): యాదాద్రి జిల్లా ఆలేరు నియోజక వర్గం టీఆర్పీకి అడ్డాగా మారుతున్నది. తుర్కపల్లి మండలంలోని 11 (ముల్కలపల్లి, సంగ్యా తండా, రాంపూర్, బాబుల నాయక్ తండా, పెద్ద తండా, రుస్తాపూర్, ధర్మారం, రామోజీనాయక్ తండా, గొల్లగూడెం, పల్లెపహాడ్, మొతిరాం తండా) గ్రామాల్లో టీఆర్పీ జెండాలను బుధవారం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎగురవేశారు. తెలంగాణలో జనాభాలో సుమారు 55 శాతం పైగా బీసీలు ఉన్నప్పటికీ, రాజకీయ అధికారంలో మాత్రం బీసీల వాటా 5 శాతం కూడా లేదని స్పష్టమైన లెక్కలతో తీన్మార్ మల్లన్న వివరించారు.