28 August, 2026 | 4:29 AM

News -

article_39796270.webp
తండ్రి మొబైల్ వాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని కాచిగూడకు చెందిన ఒక యువతి మొబైల్ ఫోన్ వాడకానికి బానిస కావడంపై తండ్రి మందలించడంతో గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం, ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆమె ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న కాచిగూడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించి, ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఉప్పుగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

27-08-2026

article_54896816.webp
కొండా మురళితో భేటీకి సిద్ధం.. హైకమాండ్ చేతిలో మంత్రి సురేఖ భవితవ్యం

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొండా మురళితో(Konda Murali) భేటీకి సిద్ధంగా ఉన్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC Mahesh Kumar Goud) ప్రకటించారు. కొండా సురేఖ అంశంలో ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపారు. బీసీలకు కాంగ్రెస్ ఇచ్చినంత ప్రాధాన్యత ఏ పార్టీ ఇవ్వలేదని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ భవితవ్యం ఢిల్లీ హైకమాండ్ చేతిలో ఉందని చెప్పారు. క్రమశిక్షన కమిటీ కూలంకషంగా పరిశీలించి నివేదిక సమర్పించింది. మీనాక్షి నటరాజన్ పరిశీలన తర్వాత నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలిపారు. కొండా మురళి ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు.

27-08-2026