ఉప్పల్ స్టేడియంలో IPL 2026 మ్యాచ్లు— 2,000 మందితో పోలీసు భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో(Uppal Stadium) ఏప్రిల్ 5 నుంచి మే 22 తేదీల్లో జరగనున్న IPL 2026 మ్యాచ్ల కోసం విస్తృతమైన భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. ఆటగాళ్లు , క్రికెట్ అభిమానులకు భద్రత కల్పించేందుకు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, ప్రత్యేక దళాలతో సహా దాదాపు 2,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు. స్టేడియం లోపల, చుట్టుపక్కల 430కి పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చడంతో పాటు, అక్కడి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
02-04-2026