News

కాంగ్రెస్ ప్రభుత్వంపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
కాంగ్రెస్ ప్రభుత్వంపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

హైదరాబాద్: తెలంగాణ ప్రస్తుత గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లాతో బీఆర్ఎస్ సభ్యుల సమావేశం ముగిసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల తీరును నిరసిస్తూ గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గవర్నర్‌కు వివరంగా తెలిపామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని అరచేతిలో స్వర్గం చూపారని ఆరోపించారు. అన్ని వర్గాలకు డిక్లరేషన్లు, బాండ్ పేపర్లు, అఫిడవిట్ల పేరిట 420 హామీలిచ్చారని గుర్తుచేశారు. ప్రజలకు హామీలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.

09-09-2026 | 02:59pm

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది "కీచక పర్వం".. సీతక్క వీడియో విడుదల
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది "కీచక పర్వం".. సీతక్క వీడియో విడుదల

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మూడో కొనసాగుతున్నాయి. శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌(Speaker Prasad Kumar) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఘటనపై మంత్రి సీతక్క వీడియో విడుదల చేశారు. సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరించారని సీతక్క ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. సబిత, సునీత, కోవా లక్ష్మిని గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి వెనుక నుంచి తోశారని వివరించారు.

09-09-2026 | 12:41pm

రాష్ట్రాన్ని విపక్ష నేతలు ఏం చేయాలనుకుంటున్నారు?
రాష్ట్రాన్ని విపక్ష నేతలు ఏం చేయాలనుకుంటున్నారు?

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ(Telangana Assembly)సమావేశాలు మూడో రోజు ప్రారంభమై కొనసాగుతున్నాయి. సభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.... సభాపతికి చేయాల్సిన అవమానాలన్నీ బీఆర్ఎస్ నేతలు చేశారని సూచించారు. అవమానాలను కొనసాగించే పరిస్థితి మానుకోవాలని భట్టి విక్రమార్క బీఆర్ఎస్ సభ్యులను కోరారు. సభాపతి సూచన చేస్తే వాదన పెట్టుకోకుండా సజావుగా నడిచేలా చూడాలని కోరారు. వెల్ లోకి వచ్చి చేయాల్సిన అవమానాలన్నీ చేసి స్పీకర్ పై సవాల్ విసురుతున్నారని మండిపడ్డారు. స్పీకర్ సూచనలపై వాదనలు వినిపించే ప్రవర్తన బాగోలేదని భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు.

09-09-2026 | 10:43am