23 May, 2026 | 8:23 PM

News -

article_86711355.webp
TG POLYCET Results 2026.. ఒక్క క్లిక్‌తో పాలీసెట్ ఫలితాలు

హైదరాబాద్: తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ (పాలిటెక్నిక్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG Polycet 2026 ఫలితాలు(TG POLYCET Results 2026.) శనివారం విడుదలయ్యాయి. మొత్తం 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 79.92 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 86.38గా నమోదైంది. వరంగల్‌కు చెందిన నమల లోకేష్ మొదటి ర్యాంకును, సూర్యాపేటకు చెందిన బోనోతు హేమనాథ్ రెండో ర్యాంకును సాధించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా తమ ఫలితాలను, ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పాలీసెట్ ఫలితాలు https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

23-05-2026

article_66498328.webp
ఫిర్యాదు నమోదుకు ‘ఏఐ కాప్‌రైటర్’.. ఆవిష్కరించిన హైదరాబాద్ సీపీ

హైదరాబాద్: పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భాషా పరమైన ఇబ్బందులు కలగకుండా, వారి ఫిర్యాదులను త్వరితగతిన, కచ్చితత్వంతో నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ కాప్‌రైట‌ర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలో శనివారం ఏఐ కాప్‌రైట‌ర్ యాప్ ను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్(Hyderabad CP VC Sajjanar) ఆవిష్కరించారు. అనంతరం దాని ప‌నితీరును ప‌రిశీలించారు.

23-05-2026

article_12144061.webp
నిద్రిస్తున్న కుటుంబంపైకి దూసుకెళ్లిన ట్రక్కు— నలుగురు మృతి

బారాబంకి: ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బారాబంకిలో(Barabanki) శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎండాకాలం కావడంతో వేడికి తట్టుకోలేక తమ ఇంటి బయట నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని వేగంగా వస్తున్న డంపర్ ట్రక్కు(Dumper truck) ఢీకొనడంతో నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతులను నీరజ్ (35), అతని కుమారుడు అనురాగ్ (13), కుమార్తెలు అన్షిక (10), అన్షు (6)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో నీరజ్ భార్య ఆర్తి (35) తీవ్రంగా గాయపడగా, మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో వేగంగా వస్తున్న డంపర్ మొదట ఒక చెట్టును ఢీకొట్టి, రోడ్డు పక్కన నిద్రిస్తున్న కుటుంబాన్ని తొక్కేసిందని వారి బంధువులు తెలిపారు.

23-05-2026

article_10633758.webp
కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం: ఐదుగురు దుర్మరణం

కలబురగి: కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన ఒక క్రూయిజర్ వాహనం లారీని ఎదురుగా ఢీకొనడంతో ఒకరికొకరు బంధువులైన ఐదుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. కలబురగి జిల్లాలోని చిత్తాపూర్ తాలూకా పరిధిలో గల లాడ్లాపూర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారి 150పై శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు పేర్కొన్నారు. మృతులను చిత్తాపూర్ తాలూకాలోని ఇంగలగి గ్రామానికి చెందిన తోలుసాబ్ కాశ్వర్ (27), హుస్సేన్ షా (48), మైబూబ్ అలీ (45), రసూల్ బీ (42), ఫాతిమా అలీ (38)గా గుర్తించారు.

23-05-2026