నితిన్ నబిన్ కొత్త టీమ్ ఇదే! పురందేశ్వరికి కీలక పదవి
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సోమవారంనాడు BJP పార్టీకి సంబంధించిన కొత్త జాతీయ కార్యవర్గ సభ్యుల బృందాన్ని ప్రకటించారు. వసుంధర రాజే సింధియా, డి. పురందేశ్వరి, తీరథ్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత జై పాండా, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బి.ఎల్. సంతోష్ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.
17-08-2026