3 August, 2026 | 1:35 PM

News -

article_27846275.webp
రాజ్యసభ వాయిదా

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ ఆరోపణలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ కు హాజరు కావాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు సభకు అంతరాయం కలిగించడం కొనసాగించడంతో, రాజ్యసభ కార్యకలాపాలను సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. గత నెలలో రాజధానితో పాటు ఇతర రాష్ట్రాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో సహా ప్రతిపక్ష సభ్యులు హోం మంత్రి నుండి సమాధానం కోరుతూ నినాదాలు చేశారు. అయోధ్యలోని రామమందిరానికి సంబంధించిన విరాళాల చోరీ ఆరోపణలపై ఎంపీలు నినాదాలు చేశారు.

03-08-2026

article_89449871.webp
సీజేపీ ఆందోళనపై సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ (Cockroach Janata Party) ఆందోళనపై సుప్రీంకోర్టులో విశ్రాంత ఎయిర్ ఫోర్స్ అధికారి(Retired Air Force officer) పిటిషన్ వేశారు. సీజేపీ నిర్వాహకులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. నిర్వాహకుల జవాబుదారీతనాన్ని పరిశీలించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ప్రభుత్వం ఉదారంగా ఉన్నప్పటికీ.. సీజేపీ (CJP Protests) నిర్వాహకులు బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేశారని సూచించారు. సోషల్ మీడియాలో(social media) యువతీయువకులు దుర్భాషలాడుతూ వీడియోలు పెట్టారని పిటిషన్ వెల్లడించారు. దుర్భాషలాడిన యువతపై కేసు పెట్టకుండా సామాజిక సేవ చేయించాలని కోర్టును కోరారు. పిటిషన్ రేపు లేదా ఎల్లుండి విచారణ జాబితాలో చేర్చాలని సీజేఐ ధర్మాసనం(CJI's Bench) సూచించింది.

03-08-2026

article_40244906.webp
ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగుల మెరుపు ధర్నా

హైదరాబాద్‌: నగరంలోని ఇందిరా పార్క్(Indira Park) చౌరస్తాలో నిరుద్యోగులు(Unemployed) మెరుపు ధర్నా చేపట్టారు. 7,437 పోస్టులతో కాకుండా 19 వేల పోలీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల(Notification released) చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 36,ఎస్సై పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 38 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే దరఖాస్తు రుసుమును తక్షణమే తగ్గించాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నిరుద్యోగుల ప్రభుత్వానికి హెచ్చరించారు.

03-08-2026

article_57955833.webp
భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు(Secunderabad Ujjaini Mahankali Bonalu) ఘనంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కన్నులపండువగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భవిష్యవాణి(Mathangi Swarnalatha Bhavishyavani ) జరిగింది. పచ్చికుండపై నిల్చొని మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు. తాను సంతోషంగా రాలేదని, క్రోధంతో వచ్చానని భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత చెప్పారు. ప్రజల్లో అహంకారం ఎక్కువవుతోంది, తగ్గించుకుంటే మంచిదన్నారు. తన విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని చేయలేదని భవిష్యవాణిలో తెలిపారు.

03-08-2026

article_38663602.webp
అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్: గాజులరామారంలోని(Gajularamaram) ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేస్తున్నారు. డీఐఎల్ సంస్థకు కేటాయించిన భూమిలో నిర్మించినట్లుగా చెబుతున్న అనధికార నిర్మాణాలను అధికారులు నేల మట్టం చేశారు. సర్వే నంబర్ 49లో ఆక్రమణలను గుర్తించిన తర్వాత కూల్చివేతలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో పారిశ్రామిక షెడ్లు, వాణిజ్య సముదాయాలను కూల్చివేయగా, నివాస గృహాలను మాత్రం అలాగే వదిలివేశారు. ఆక్రమణదారులుగా భావిస్తున్న కొందరు అధికారులు కూల్చివేతను చేపట్టకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ కొనసాగుతున్నంత సేపు శాంతిభద్రతలను కాపాడేందుకు రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలంలోనే మోహరించి ఉన్నారు.

03-08-2026

article_40848532.webp
బంకీపూర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం పాట్నాలో ప్రారంభమైంది. రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఏప్రిల్‌లో తన స్థానానికి రాజీనామా చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ లో 'జన్ సురాజ్ పార్టీ' చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 862 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జన సురాజ్ పార్టీ తరపున తొలిసారిగా బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్, బీజేపీ నుంచి ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటారా? లేదా అన్నదానిపై అందరి దృష్టి నెలకొంది. బంకీపూర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. జూలై 30న జరిగిన ఉప ఎన్నికలో 34.30 శాతం ఓటింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 41.45 శాతంతో పోలిస్తే ఇది ఏడు శాతానికి పైగా తక్కువ. బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఈసారి మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నవంబర్ 2025లో తన సమీప ప్రత్యర్థి అయిన ఆర్జేడీ (RJD)కి చెందిన రేఖా గుప్తాపై 50,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించిన నబిన్ వరుసగా ఐదవసారి అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు.

03-08-2026