13 August, 2026 | 11:04 PM

News -

article_43354501.webp
నాందేడ్‌లో హైఅలర్ట్: సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కత్తులతో దాడి

నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్‌లో అకాలీదళ్ అధినేత, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై గురువారం దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. గురుద్వారా సమీపంలో బాదల్‌పై దాడి జరిగిందని, ఆయనను ఆసుపత్రిలో చేర్చారని పోలీసులు తెలిపారు. తన కుడి చేతికి గుడ్డ చుట్టుకుని ఒక భవనం లోపల బాదల్ నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఒక వైరల్ వీడియోలో కనిపించింది. దాడిలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ తో పాటు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తికి సంబంధించిన మరిన్ని వివరాలు, అలాగే బాదల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ప్రమాదం నుండి బయటపడ్డారని నివేదికలు చెబుతున్నాయి.

13-08-2026

article_80367832.webp
NDA, ఇండియా కూటమి ఎంపీల మధ్య వాగ్వాదం

న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో ఉద్యోగార్థులపై పోలీసుల చర్య(Ranchi protest), అయోధ్యలోని రామమందిరానికి వచ్చిన విరాళాల అపహరణ ఆరోపణలకు సంబంధించిన అంశాలపై నిరసనలు, పరస్పర నినాదాల హోరు మధ్య, గురువారం నాడు పార్లమెంటులోని(Parliament) 'మకర్ ద్వార్' వద్ద అధికార ఎన్‌డిఎ (NDA), ప్రతిపక్ష 'ఇండియా' (INDIA) కూటమి ఎంపీలు ముఖాముఖి తలపడ్డారు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది వారి మధ్య ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థుల నిరసనలపై చర్చ నుంచి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) "పారిపోతున్నారని" ఆరోపిస్తూ, ఎన్డీఏ ఎంపీలు ఆయనను సమాధానాలు కోరగా, పేపర్ లీక్‌లపై జూలై 20న జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) జవాబుదారీతనం వహించాలని ఇండియా బ్లాక్ ఎంపీలు(INDIA bloc MPs) డిమాండ్ చేశారు. అయోధ్యలోని రామమందిరంలో విరాళాలు అపహరించబడ్డాయన్న ఆరోపణల అంశాన్ని కూడా 'ఇండియా' కూటమి ఎంపీలు లేవనెత్తారు.

13-08-2026

article_42543918.webp
కావేరీ జల వివాదం.. కర్ణాటక బంద్‌

బెంగళూరు: తమిళనాడుకు 12,000 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల(Cauvery Water Dispute) చేయడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ అనుకూల కార్యకర్త వటల్ నాగరాజ్ పిలుపునిచ్చిన కర్ణాటక బంద్‌కు(Karnataka Bandh) మిశ్రమ స్పందన లభించింది. మాండ్యలో తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వగా, పలు చోట్ల పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. అయితే బెంగళూరు, మైసూరు వంటి ప్రధాన నగరాల్లో జనజీవనంపై దీని ప్రభావం పెద్దగా కనిపించలేదు. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ (CWRC), కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) ఇచ్చిన ఆదేశాలకు నిరసనగా, వటల్ నాగరాజ్ నేతృత్వంలోని కన్నడ సంఘాల సమాఖ్య ఈ బంద్‌కు పిలుపునిచ్చింది.

13-08-2026

article_46820065.webp
20 రోజులకు చేరిన జార్ఖండ్ విద్యార్థుల నిరసన

రాంచీ: జార్ఖండ్ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విద్యార్థులు చేపట్టిన నిరసన(Student protest) గురువారంతో 20వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనను విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. నియామక పరీక్షలలో మరింత పారదర్శకతను పాటించాలని, పలు పరీక్షలను రద్దు చేయాలని, సీబీఐతో లేదా జార్ఖండ్ వెలుపలికి చెందిన విశ్రాంత న్యాయమూర్తుల బృందంతో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ‘జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్’ ఇక్కడ జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరసన ప్రదర్శనలు చేస్తోంది. CBI విచారణ జరగాలన్న డిమాండ్‌ను వారం రోజుల్లోగా నెరవేర్చకపోతే నిరాహార దీక్ష చేపడతానని మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ బుధవారం హెచ్చరించారు. మరోవైపు, ఈ అంశంపై 1,200కు పైగా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు ABVP ప్రకటించింది.

13-08-2026