News

రవీంద్రభారతిలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం
రవీంద్రభారతిలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం

హైదరాబాద్: అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటమే ఐలమ్మకు నిజమైన నివాళలని కాంగ్రెస్ నేతలు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజనుల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహనీయురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వి.హనుమంతరావు, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

10-09-2026 | 02:19pm

అసెంబ్లీలో రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడిండు
అసెంబ్లీలో రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడిండు

హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా లేదని హరీశ్ రావు ఆరోపించారు. సమాధానం చెప్పలేక తమను సభ నుంచి సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. 22ఏ పై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రజా పోరాటాలు చేసిందని తెలిపారు. ప్రభుత్వాన్ని నిలదీసి బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధం కావాలని నేతలకు పిలుపునిచ్చారు. ఫీజు రీయింబరస్ మెంట్ చేయకుండా 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యోగాలు వచ్చినా సర్టిఫికెట్లు దొరక్క అవకాశాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చేయనందున విదేశీ విద్య అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. అన్ని ఆధారాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. చర్చలకు సిద్ధమైతే సెషన్ మొత్తం సస్పెన్షన్ దుర్మార్గం అన్నారు.

10-09-2026 | 12:25pm

తెల్లారకముందే బీఆర్ఎస్ నేతలు అరెస్ట్
తెల్లారకముందే బీఆర్ఎస్ నేతలు అరెస్ట్

హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులపై నేపథ్యంలో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముట్టడి, నిరసనకు పిలుపు లేకున్నా అరెస్టులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తారని భయంతో తెల్లవారుజామున 4 గంటలకు తుంగ బాలుని అక్రమంగా అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాక ప్రతిపక్షాల గొంతును, ప్రశ్నించే గొంతును, ముఖ్యంగా విద్యార్థి నాయకుల గొంతును అణచివేయడానికి అరెస్టులు చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు.

10-09-2026 | 09:28am

తెలంగాణ అసెంబ్లీ నాలుగో రోజు ఏం జరగనుంది?
తెలంగాణ అసెంబ్లీ నాలుగో రోజు ఏం జరగనుంది?

హైదరాబాద్: నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు(Telangana Assembly Session Day 4) వాడీవేడిగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసన సభ ప్రారంభం కానుంది. అనంతరం పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లు సభ ముందుకు రానుంది. మంత్రి సీతక్క పంచాయతీరాజ్ బిల్లును సభలో చర్చకు పెట్టనున్నారు. చర్చ తర్వాత పంచాయతీరాజ్ బిల్లు ఆమోదానికి ప్రతిపాదించనున్నారు. 2027 జనగణన రెండో దశ ప్రశ్నావళిలో సీసీలను చేర్చాలని కోరుతూ స్వల్పకాలిక చర్చ జరగనుంది. అసెంబ్లీలో ఇప్పటికే అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెన్షన్ విధించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లాను కలిసి ఫిర్యాదు చేశారు.

10-09-2026 | 09:01am

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం ఆలయ అధికారులు ప్రకటించారు. బుధవారం తిరుమల శ్రీవారిని(Lord of Tirumala) 77,670 మంది భక్తులు దర్శించుకోగా, 33,904 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) ప్రకటించింది. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

10-09-2026 | 08:31am