News

ఖైరతాబాద్‌లో ఈనెల 14 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
ఖైరతాబాద్‌లో ఈనెల 14 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఖైరతాబాద్ బడా గణేష్‌ దర్శనానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఈనెల 14 నుంచి 23 వరకు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సుమారు 30లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు మెట్రో, ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ బస్సులను వినియోగించాలని ట్రాఫిక్ జాయింట్‌ సీపీ జోయల్ డెవిస్ సూచించారు. ఐమ్యాక్స్‌, హెచ్‌ఎండీఏ స్థలం, ఎన్టీఆర్‌ పార్క్‌, నెక్లెస్‌ రోడ్‌లో పార్కింగ్‌ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. వీఐపీల కోసం ప్రత్యేక రూట్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

12-09-2026 | 05:23pm

తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ
తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ

హైదరాబాద్, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు నిరసనగా తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, స్పీకర్‌గా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు వ్యవహరిస్తున్నారు. మంత్రులుగా గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ తరహాలో మాక్ అసెంబ్లీని నిర్వహించి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో పాటు ప్రభుత్వ తీరుపై నేతలు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా సభలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.

12-09-2026 | 11:45am

ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు.. 22Aపై చర్చ
ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు.. 22Aపై చర్చ

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఆరోరోజు కొనసాగనున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు స్పీకర్ శాసనసభ సమావేశాలు ప్రారంభించనున్నారు. నేడు శాసనసభలో రెండు బిల్లులు, రెండు స్వల్పకాలిక చర్చలు జరగనున్నాయి. తెలంగాణ ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ బిల్లు పరిశీలించనున్నారు. అనంతరం బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. మంత్రి శ్రీధర్ బాబు బిల్లుకు ఆమోదం తెలపాలని ప్రతిపాదించనున్నారు. కోర్ అర్బన్ రీజియన్ సమగ్ర పరిపాలన బిల్లును ఆమోదింప చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రతిపాదించనున్నారు. అసెంబ్లీలో 22ఏ నిషేధిత జాబితాపై స్పల్పకాలిక చర్చ జరగనుంది. రిజిస్ట్రేషన్ చట్టం సెక్టార్ 22ఏకు సంబంధించిన సమస్యలు, ఎల్ నినో ప్రభావాలు- నివారణ చర్యలు అనే అంశంపై సభలో చర్చించనున్నారు. సభ నుంచి సస్పెండ్ నేపథ్యంలో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వెలుపల భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

12-09-2026 | 09:11am