calender_icon.png 23 January, 2026 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_58337537.webp
లీకు వీరుడు.. పీకేదేమిటి?

23-01-2026

రాజన్న సిరిసిల్ల, జనవరి 22 (విజయక్రాంతి): ‘మేం ఏ తప్పు చేయలేదు. ఎవ డి అయ్యకు భయపడేది లేదు. దావోస్ నుంచి వచ్చేవరకు తన పదవిని ఊడిపోకుండా కాపాడుకోవడానికే సిట్ నోటీ సులతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘కార్తీకదీపం’ టీవీ సీరియల్‌లా విచారణ సాగ దీస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు.. లొట్టపీసు కేసు అని ఇదివరకే చెప్పాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనేవిధంగా కేసులు నడుస్తున్నాయి. మీడియాకు లీకులిస్తూ ఆనందిస్తున్న ముఖ్యమంత్రి మమ్మల్ని పీకేదేమిటి’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గురువారం సాయంత్రం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశం లో ఆయన.. సిట్ విచారణకు హాజరుకావాలని జారీచేసిన నోటీసుపై మాట్లాడారు.

article_51261183.webp
మున్సిపోల్స్‌తో మంత్రులు ఉక్కిరి బిక్కిరి!

23-01-2026

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): రానున్న మున్సిపల్, కార్పొరే షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి పనిచేయడమంటే రెండు పడవల్లో కాళ్లు పెట్టి ప్రయాణించడంలా రాష్ట్ర మంత్రులు భావిస్తున్నా రు. మున్సిపోల్స్‌లో భారీసంఖ్యలో మున్సిపల్, కార్పొరేషన్ స్థానాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాం గ్రెస్ పార్టీ మంత్రులకు ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగించింది. దీంతో సొంత నియోజకవర్గం, జిల్లాలోని మున్సిపాలిటీలను గెలిపించుకోవడంతో పాటు.. మరోవైపు ఇన్‌చార్జ్‌గా ఉన్న పార్లమెంట్ నియోజక వర్గాల్లో పార్టీ విజ యం కోసం మంత్రులు పనిచేయాల్సి ఉంటుంది.

article_44458705.webp
శంకర్‌పల్లి ‘బాద్‌షా’ ఎవరు?

23-01-2026

శంకర్ పల్లి, జనవరి 22( విజయక్రాంతి):మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో శంకర్ పల్లిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చైర్మన్ స్థానం జనరల్ కేటాయించడంతో ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. వార్డు లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఆశించి దక్కని నాయకులు ఇతర పార్టీల బాట పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ దండు సంతోష్ తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ నుంచి కూడా వలసలు కొనసాగుతున్నాయి.

article_56507389.webp
పురపోరులో.. పై చేయి ఎవరిది?

23-01-2026

గద్వాల, జనవరి 22 : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ గద్వా ల పురపోరులో పాగ వేసేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలన్నీ గెలుపు గుర్రాలపైనే దృష్టి సారించాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు వార్డుల వారీగా బలబలాలను బేరీజు వేసుకుంటూ గెలిచే అవకాశం ఉన్న నేతలకే టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్న ఆశావహులకు అంత సునాయా సంగా టికెట్లు దక్కే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది.