News

అసెంబ్లీ దగ్గర దాడిపై ఢిల్లీలో ఫిర్యాదు
అసెంబ్లీ దగ్గర దాడిపై ఢిల్లీలో ఫిర్యాదు

న్యూఢిల్లీ: ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ లతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు వేర్వేరుగా భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద పోలీసులు తమపై జరిపిన దాడి తీరును మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా వారికి వివరించారు. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తూ అవమానించారని, అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, శాసనసభ్యులుగా తమ హక్కులకు విఘాతం కలిగించేలా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, స్పీకర్ పై సునీత, సబిత ఫిర్యాదు చేశారు.

11-09-2026 | 03:26pm

తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర, తూర్పు, ఈశాన్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. 30-40 కిలో మీటర్ల వేగంగతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. చంద్రాపూర్ నుండి బలమైన ఉరుములతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి.

11-09-2026 | 03:11pm

స్వచ్ఛ ఆటోలపై సీఎం ప్రకటన చేయాలి: లేకపోతే ఉద్యమిస్తాం!
స్వచ్ఛ ఆటోలపై సీఎం ప్రకటన చేయాలి: లేకపోతే ఉద్యమిస్తాం!

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల సమావేశాలు ఐదోరోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో క్యూర్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు ప్రవేశ పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెత్త సేకరణకు సంబంధించిన స్వచ్ఛ ఆటోలపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రాపర్టీ టాక్స్ తో పాటే చెత్త సేకరణ డబ్బులు వసూలు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. చెత్త సేకరణను పెద్దకార్పొరేట్ సంస్థకు కట్టబెట్టబోమని ఇప్పుడున్న విధానంలోనే ప్రస్తుత స్చచ్ఛ ఆటోలతోనే చెత్త సేకరిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.

11-09-2026 | 10:40am