తెలంగాణలో భారీ వర్షాలు.. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) హెచ్చరించింది. ఇవాళ, రేపు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. 8 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.
28-07-2026