7 August, 2026 | 5:01 PM

Breaking News

సిద్దిపేట టిఐసిసిఐ కో-ఆర్డినేటర్‌గా బిక్షపతి   •   గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •  

News -

article_32379818.webp
జోగిపేట ప్రభుత్వ వైద్యుడు సస్పెండ్

జోగిపేట: సంగారెడ్డి జిల్లాకు జోగిపేట ఏరియా ఆసుపత్రికి(Jogipet government doctor suspended) చెందిన డిప్యూటీ సివిల్ సర్జన్ (General Medicine) విధులకు గైర్హాజరై, తన స్థానంలో రోగులకు చికిత్స అందించేందుకు డాక్టర్ రవి అనే ప్రైవేట్ దంత వైద్యుడిని అనుమతించినట్లు తేలడంతో, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Health Minister Damodara Raja Narasimha) దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నివేదికల ప్రకారం, ఆరోగ్య శాఖ నిర్వహించిన విచారణలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి, డాక్టర్ రమేష్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించడంతో పాటు, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆసుపత్రిలో విధులను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై, ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

07-08-2026

article_66287070.webp
దేశ రాజధానిలో భారీ వర్షాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తిన మరుసటి రోజైన శుక్రవారం ఉదయం కూడా ఢిల్లీ భారీ వర్షం కురుస్తుంది. దీని దృష్ట్యా భారత వాతావరణ శాఖ (IMD) 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేయడంతో పాటు, రోజంతా మరింత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నగరంలోని ప్రధాన కేంద్రమైన సఫ్దర్‌జంగ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 1.3 డిగ్రీలు తక్కువగా, 25.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. స్టేషన్ల వారీగా డేటా ప్రకారం, పాలంలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలు తక్కువగా 23.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవ్వగా, లోధి రోడ్‌లో సాధారణం కంటే 0.8 డిగ్రీలు తక్కువగా 25.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రిడ్జ్ స్టేషన్‌లో సాధారణం కంటే 4.1 డిగ్రీలు తక్కువగా 22.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, అయనగర్‌లో సాధారణం కంటే 1.6 డిగ్రీలు తక్కువగా 24.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. సైనిక్ ఫామ్స్ ప్రాంతంలో నీట మునిగిన రోడ్ల గుండా వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

07-08-2026

article_71703783.webp
వర్షం పడుతున్నా.. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. జూలై 20న CJP నిరసనకారులపై జరిగిన పోలీసు చర్య, అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలకు సంబంధించి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు(Opposition MPs protest) పార్లమెంటులోని 'మకర్ ద్వార్' వద్ద నిరసన చేపట్టారు. వర్షం పడుతున్నా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గేదే లే అంటూ పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. విద్యార్థులపై దాడులకు అమిత్ షా సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అమిత్ షా సభకు ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు.అమిత్ కనిపించడంలేదంటూ విపక్ష సభ్యులు ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు.

07-08-2026

article_10724011.webp
ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు(Telangana BJP Leaders) ఢిల్లీకి వెళ్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో(BJP National President Nitin Nabin) టీ బీజేపీ నేతలు సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. హస్తినకు వెళ్తున్న వారిలో టీబీజేపీ చీఫ్ రామచందర్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై జాతీయ అధ్యక్షుడితో నేతలు చర్చించనున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ ఇంట్లో 2 రోజుల పాటు కీలక అంశాలపై చర్చించారు. అటు నేతల మధ్య సమన్వయంపై హైకమాండ్ దృష్టి సారించింది.

07-08-2026

article_49274722.webp
ముహూర్తం ఫిక్స్.. ఆగస్టు 10న 'వరుణయాగం'.. ఎక్కడంటే?

హైదరాబాద్: తెలంగాణ ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు, సమృద్ధిగా వర్షాలు(Rains) కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు సంపూర్ణంగా నిండాలని, ఎల్‌నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై లేకుండా ఉండాలని, ఆకాంక్షతో వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సీఎం సూచనల మేరకుయాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (Lord Narasimha Devasthanam - Yadagirigutta) అర్చక, సిద్ధాంతులు ఆగస్టు 10 వ తేదీన వరుణయగానికి మూహూర్తం ఫిక్స్ చేశారు. యాదగిరిగుట్ట దేవస్థాన ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదపండితులు, అర్చక బృందం సమక్షంలో మహా వరుణయాగం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర మహాయాగం కృష్ణానది తీరాన వెలసిన నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున, విజయవిహార్ ఆవరణలో నిర్వహించబడుతుంది. ఈ మహాయాగంలో సాయంత్రం 3.24 గంటలకు జరిగే పూర్ణాహుతి మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

07-08-2026

article_73566543.webp
భారతీయ సాంస్కృతిక వైభవానికి ప్రతీక చేనేత

హైదరాబాద్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప వారసత్వం మన చేనేత అని గుర్తుచేస్తూ, జాతీయ చేనేత దినోత్సవం(National Handloom Day) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేనేతలకు, నేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేతలు, చేనేత కార్మికుల శ్రమ, కళాత్మకత, సృజనాత్మకతకు గౌరవం ఇవ్వడం, వారి జీవనోపాధిని బలోపేతం చేయడం, చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, ఆధునిక సాంకేతికతతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, మార్కెటింగ్ అవకాశాలను విస్తరించడం, సంప్రదాయ కళలను పరిరక్షిస్తూ అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని సూచించారు.

07-08-2026