పాఠశాలను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
27-01-2026
హైదరాబాద్: నల్గొండ బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ప్రాథమిక(Komatireddy Pratheek Govt High School), ఉన్నత పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్ చంద్రశేభర్, ఎస్పీ శరత్ చంద్రపవార్ పాల్గొన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ బొట్టుగూడలో సరికొత్త స్కూల్ నిర్మించింది. రూ, 8 కోట్ల వ్యయంతో పాఠశాలను నిర్మించారు. బొట్టగూడ ప్రభుత్వ పాఠశాలలోని నాలుగు అంతస్థులో 40 గదులను నిర్మించారు. పాఠశాలలో అత్యాధునిక తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, అన్ని రకాల క్రీడాసదుపాయాలు, టాయిలెట్లు , 36 గదుల్లో ఏసీ సదుపాయం, ఆడిరోరియం, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ లు, ఇండోర్ స్పోర్ట్స్ రూమ్, వాటర్ ప్లాంట్లు, ఫ్రిజ్ లు ఏర్పాటు చేశారు.