News

క్షమాపణ చెప్పాకే.. మిగతా కార్యకలాపాలు : మంత్రి శ్రీధర్ బాబు
క్షమాపణ చెప్పాకే.. మిగతా కార్యకలాపాలు : మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ సభ్యుల నిరసనతో నెలకోన్న తీవ్ర ఉద్రిక్తతపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను సభ్యసమాజం అసహ్యించుకునే భాషను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడారని, ఈ ఘటనపై స్పందించాల్సిన బాధ్యత మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఉందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. స్పీకర్ కు క్షమాపణ చెప్పాకే.. మిగతా కార్యకలాపాలు ఉంటాయని, మహిళా సభ్యులకు ఇబ్బంది జరిగుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఐటీ మంత్రి వెల్లడించారు.

07-09-2026 | 08:28pm

తాతా మధు కామెంట్స్‌తో.. కాంగ్రెస్‎కు పెరిగిన హీట్
తాతా మధు కామెంట్స్‌తో.. కాంగ్రెస్‎కు పెరిగిన హీట్

హైదరాబాద్: స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం.తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఆయనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.అయితే తన వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించి చేసినవి కాదని తాతా మధు వివరణ ఇచ్చారు. అసెంబ్లీ బయట తనను గొంతు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వారిని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు.తాతా మధు వివరణతో వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం కొనసాగుతోంది.

07-09-2026 | 02:25pm