శ్రీపాదరావు పేరుతో అసెంబ్లీ సెంట్రల్ హాల్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ హాల్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరుతో దీనికి నామకరణం చేశారు. కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులర్పించి, సీఎం సభ్యులతో కలిసి అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్నారు.
07-09-2026 | 02:09pm