28 July, 2026 | 9:41 AM

News -

article_13811863.webp
హైకోర్టుకు హైడ్రా కమిషనర్ క్షమాపణలు

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు(Telangana High Court) హైడ్రా కమిషనర్ రంగనాథ్(HYDRAA Commissioner) క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు(Apologizes) చెబుతూ రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టులు, న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని రంగనాథ్ పేర్కొన్నారు. లోతుకుంటలోని సర్వే నంబర్ 1,2 లోని 40 ఎకరాల్లోకి వెళ్లలేదని హైడ్రా కమిషన్ వివరించారు. పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని హైకోర్టుకు సూచించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కారణ పిటిషన్లు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఇన్ని కోర్టు ధిక్కారణ పిటిషన్లు ఎందుకు ఉన్నాయని హైకోర్టు రంగనాథ్( High Court)ను ప్రశ్నించింది.

27-07-2026

article_64939531.webp
తిరుపతిలో కరోనా కలకలం

తిరుపతి: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిన సుదీర్ఘ కాలం తర్వాత ఈ వారంలో తిరుపతిలో మొదటిసారిగా ఒక కొత్త కోవిడ్ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలు తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమెకు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆమె వయస్సు దృష్ట్యా, ఆమెకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని DMHO తెలిపారు. ప్రస్తుతం రోగి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 50కి చేరాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.

27-07-2026