26 May, 2026 | 3:04 AM

News -

article_38529842.webp
మహిళల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 8,000 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి చెందుతోందని సీఎం చెప్పారు. 29 నెలల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు రూ. 10 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించామని తెలిపారు. కొంతమందికి మహిళల ఉచిత బస్సు ప్రయాణం నచ్చలేదని చెప్పారు. మహిళలను బస్సులకు యజమానులు చేశామని వెల్లడించారు. అంబానీ, అదానీ చేసే పెట్రోల్ వ్యాపారం మహిళలు కూడా చేయాలనే బంక్ లు పెట్టించామని పేర్కొన్నారు.

25-05-2026