16 August, 2026 | 12:48 AM

News -

article_43128022.webp
గుండు ఆరవింద్ నీచపు రాజకీయాలు మానుకోవాలి: బీర్ల అయిలయ్య

ఆలేరు, ఆగస్ట్ 15 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ గుండు ఆరవింద్(MP Aravind) చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు కాకుండా ప్రజా సమస్యలు, విధానాలపై మాట్లాడాలని సూచించారు. మహేష్ కుమార్ గౌడ్‌పై చేసిన వ్యాఖ్యలకు గుండు ఆరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం, పదవులు శాశ్వతం కాదని, ప్రజలే అంతిమ నిర్ణేతలని బీర్ల అయిలయ్య అన్నారు.

15-08-2026

article_86018456.webp
బొమ్మరాసిపేటలో బీఆర్ఎస్ నాయకులకే భూములు

మేడ్చల్, ఆగస్టు 15 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం లోని బొమ్మరాసిపేటలో వివాదం కొనసాగుతున్న సర్వే నెంబర్లలో బి ఆర్ ఎస్ నాయకులకే భూములు ఉన్నాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం షామీర్పేట్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బి ఆర్ ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ నాయకుల పై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఆ భూమిలో కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 2023 జూలై 15వ తేదీన ఆ పార్టీ కి చెందిన నమస్తే తెలంగాణ దినపత్రికలో ఆ భూమిలో ఉన్నవారు రైతులు కాదు కబ్జాదారులని రాయించారని, ప్రస్తుతం బాధిత రైతులని రాయించడం విచిత్రంగా ఉందన్నారు. బి ఆర్ ఎస్ నాయకుల, నమస్తే తెలంగాణ పత్రిక ద్వంద వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

15-08-2026

article_60949506.webp
మహనీయుల త్యాగాల ఫలితమే స్వతంత్ర భారతం

కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): మహనీయుల త్యాగాల ఫలితమే స్వతంత్ర భారతం అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శనివారం కామారెడ్డి ఎస్పీ కార్యాలయం లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... జిల్లా ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.భావితరాలకు స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని తెలియజేయాలన్నారు. సాయుధ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాలే ప్రధాన కారణమని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.

15-08-2026