4 August, 2026 | 2:38 PM

Breaking News

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు   •   ఏటీసీ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి   •   హైదరాబాద్‌లో పలుచోట్ల హెచ్-ఫాస్ట్ అధికారుల తనిఖీలు   •   ప్రజల్లో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై చైతన్యం పెంచాలి   •   మృతుడి కుటుంబానికి మాజీ సుడా చైర్మన్ పరామర్శ   •   విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాల పెంపుపై దృష్టి   •   విమాన ప్రయాణీకుల భద్రతపై తీసుకుంటున్న చర్యలేంటీ?   •   ఓటరు జాబితా సవరణలో నర్సాపూర్ ఆదర్శంగా నిలవాలి   •   ఏటీసీ సెంటర్ కు భూమిపూజ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్   •   34.10 టి.ఎం.సి.లకు చేరిన ఎస్సారెస్పీ నీటి మట్టం   •  

News -

article_15145843.webp
హైదరాబాద్‌ వాసులారా అప్రమత్తం!

హైదరాబాద్: నగరంలో ఈ రాత్రి వరకు భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్(Hyderabad Police Commissioner V.C. Sajjanar) కోరారు. ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. "అత్యవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఇళ్ల నుంచి బయటకు రావద్దు. ఇప్పటికే బయట ఉన్నవారు వర్షం తీవ్రత పెరగకముందే తమ పనులు త్వరగా ముగించుకుని సురక్షితంగా ఇంటికి చేరుకోండి. నీటితో నిండిన రోడ్ల గుండా లేదా వరదలు వచ్చే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణించడం అస్సలు సురక్షితం కాదు.” అని సజ్జనార్ సూచించారు. వాహనదారులు వేగాన్ని తగ్గించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకునేలా చూసుకోవాలని సజ్జనార్ తెలిపారు.

03-08-2026