భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) అధ్యక్షతన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. జూన్ 2 నుంచి 12 వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులుఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
26-05-2026