23 June, 2026 | 6:32 AM

News -

article_50234526.webp
నాంపల్లి కోర్టు విచారణకు హాజరైన హీరో అల్లు అర్జున్

హైదరాబాద్: సంధ్య థియేటర్(Sandhya Theatre) తొక్కిసలాట కేసులో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్(Film actor Allu Arjun) నాంపల్లి కోర్టులో వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. షూటింగ్ కారణంగా వ్యక్తిగతంగా అల్లు అర్జున్ హాజరుకాలేదు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు కోర్టు అనుమతిచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో(Sandhya Theatre Stampede Case) అల్లు అర్జున్ ఏ 11గా ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసును నాంపల్లి కోర్టు జులై 6వ తేదీకి వాయిదా వేసింది. Pushpa 2: The Rule (పుష్ప 2: ది రూల్) సినిమా సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా,ఆమె కొడుకు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

22-06-2026

article_57589375.webp
డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం

హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి(Bhupalpally) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విధినిర్వహణలో ఉన్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకన్న( DTO Venkanna) మృతి తీవ్ర దిగ్బ్రాంతి గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆవేదన వ్యక్తం చేశారు. వెంకన్న భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయం వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వెంకన్న మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధినిర్వహణలో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.

22-06-2026