calender_icon.png 2 February, 2026 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_75423297.webp
మళ్లీ మొండి చెయ్యే!

02-02-2026

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణకు మధ్య ఉన్న అంతరం, రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న సవతి ప్రేమ ఏటా బడ్జెట్ సమయంలో స్పష్టంగా తెలుస్తోంది. ఈసారి కేంద్ర బడ్జెట్‌లోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను గమనిస్తే ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడి పదేళ్లు దాటినా తెలంగాణకు దక్కిందేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆశలు, హామీలు, ప్రతిపాదనలు అన్నీ కూడా మరోసారి ఫైళ్లకే పరిమితమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కేవలం పరిపాలనలో మాత్రమే మార్పు కాదని, ఒక ప్రాంత ప్రజల దీర్ఘకాలిక ఆశలు, ఆకాంక్షలు, ఆర్థిక న్యాయానికి ప్రతీక అని భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో ప్రతిఫలం కనిపించడం లేదనే అసంతృప్తి రాష్ట్ర ప్రజానీకంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద తెలంగాణకు ఇచ్చిన హామీలు న్యాయబద్ధమైనవే అయినప్పటికీ, పదేళ్లు గడిచినా వాటి అమలు పూర్తిస్థాయిలో జరగకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అనుమానాలను పెంచుతోంది. తాజా బడ్జెట్‌లో ఆ హామీలపై కనీస ప్రస్తావన కూడా లేకపోవడం, తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది.

article_54870173.webp
జయహో ‘నారీశక్తి’!

02-02-2026

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧: కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో మహిళా సంక్షేమం, సాధికారతకు ప్రాధాన్యమిచ్చింది. మహిళల అభ్యున్న తి, వారి కోసం అమలు చేసే పథకాల కోసం ‘నారీశక్తి’ పేరిట ఏకంగా రూ.5.08 లక్షల కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం రూ.4.49 లక్షల కోట్లు కేటాయించ గా, ఈసారి ఆ నిధులను 13 శాతం పెంచిం ది. మొత్తం బడ్జెట్‌లో మహిళల వాటా 9శాతం ఉండటం విశేషం. అలాగే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ‘షీ మార్ట్స్’ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. వీటి ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా, సభ్యులు స్వయంగా షీమార్ట్స్‌లో విక్రయించుకునేలా గ్రామీణ అవుట్‌లెట్లు అందుబా టులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చింది. ఈ విధానం ద్వారా మహిళలు రుణ గ్రహీతలు మాత్రమే కాకుండా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిలో భాగంగానే ప్రతిష్ఠాత్మకంగా ‘లఖ్‌పతి దీదీ’ పథకం అమలు చేయనున్నది. పథకంలో భాగంగా ఏటా 3కోట్ల మంది మహి ళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఊతమిస్తుంది.

article_50270209.webp
రక్షణ రంగం బలోపేతం..

02-02-2026

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: గతేడాది మన పొరుగున ఉన్న పాకిస్థాన్, చైనా నుంచి భద్రతా సవా ళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొ న్నారు. ఈ నేపథ్యంలో రక్షణ రంగాన్ని పటిష్టపరిచేందుకు బడ్జెట్‌లో రూ. 7,84, 678 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2025 బడ్జెట్‌లో ఇదే రక్షణ రంగానికి రూ.6, 81, 210 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రక్షణ రంగానికి 15 శాతం నిధు లు అదనంగా కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందులో మూలధన వ్యయం రూ. 2,19, 306 కోట్లుగా నిర్ణయించగా, రెవెన్యూ వ్యయం రూ. 5,53, 668 కోట్లుగా ఉంది. ఇందులో పెన్షన్లకు రూ. 1,71,338 కోట్లు ఉన్నాయి. ఇక దేశ భద్రత దృష్ట్యా ఈసారి సాయుధ దళాల ఆధునీకరణకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు.

article_84967953.webp
పుష్కరకాలంగా వివక్షే..

02-02-2026

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కవలసిన నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీల అమలు విషయంలో కేంద్రం పుష్కరకాలంగా వివక్షపూ రిత వైఖరి కొనసాగిస్తోందని ఆరోపించారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటికీ తెలంగాణకు ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదని, ఆయన ఢిల్లీలోని బీజేపీ పెద్దల చుట్టూ చేసిన ప్రదక్షణల వల్ల కలిగిన ప్రయోజనంపైన రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.