14 July, 2026 | 6:21 PM

Breaking News

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •   సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు   •   త్రాగునీటి శుద్ధి కేంద్రాలు ఆకస్మిక తనిఖీ   •   ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చెక్కు పంపిణీ   •  

Districts - Adilabad

article_51582152.webp
పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు

ఉట్నూర్, జులై 14 (విజయక్రాంతి): స్వతంత్రానికి ముందు నుండి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులు సాగు చేస్తున్న భూములపై ప్రభుత్వం హక్కులు కల్పించకపోవడంతో పాటు పహాని పత్రాలు అందజేయకపోవడంతో అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 14038 మంది గిరిజనేతర రైతులు 58 259 ఎకరాల సాగు భూమిని తాత ముత్తాతల నుండి సాగు చేసి జీవనం సాగిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేత రైతుల కుటుంబాల ఓట్లు దండుకునేందుకు రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో కల్లబొల్లి కబుర్లు చెప్పి ఏజెన్సీ ప్రాంతంలోని దళిత,గిరిజనేతర రైతులు సాగు చేస్తున్న భూములకు అక్కు పత్రాలు అందించడంతోపాటు బ్యాంకు నుండి పంట రుణాలు అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఏజెన్సీలోని దళిత, గిరిజనేతర రైతులను విస్మరిస్తున్నారని ఏజెన్సీ ప్రాంత రైతులు వాపోతున్నారు.

14-07-2026

article_83245758.webp
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల

ఉట్నూర్, జులై 14 (విజయక్రాంతి): ప్రైవేట్ పాఠశాల కు దీటుగా... ఐటీడీఏ ఆధ్వర్యంలోని (గిరిజన విద్యా వికాస కేంద్రం ) టీ డబ్ల్యూ పాఠశాల పనిచేస్తున్నది. ఇంద్రవెల్లి మండలంలోని చిత్రుగూడా లోని గిరిజన పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు 34 మంది విద్యార్థులకు ఇద్దరు ఆంగ్లంలో విద్యాబోధన చేస్తున్నారు. గిరిజన పాఠశాలలో విద్యార్థులకు చక్కటి ఇంగ్లీష్ విద్యను అందిస్తున్న ఉపాధ్యాయుల పనితీరును గ్రామస్తులు గుర్తించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా యూనిఫామ్ డ్రెస్ తో పాటు ప్రతి విద్యార్థులకు టైలు గ్రామస్తులు ఏర్పాటు చేశారు.

14-07-2026

article_89793054.webp
17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక

ఆదిలాబాద్, (విజయక్రాంతి): తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన అండర్ 16, 19, సీనియర్స్ ఆదిలాబాద్ జిల్లా జట్లను జిల్లా కేంద్రంలోని VNR క్రికెట్ అకాడమీ మైదానంలో ఎంపిక చేస్తున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ఆదిలాబాద్ జిల్లా సెక్రటరీ నరోత్తం రెడ్డి తెలిపారు. మంగళ వారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన అండర్-16 బాలురు, అండర్-19 బాలురు, సీనియర్స్, అండర్-19 బాలికలు, సీనియర్ మహిళలు ఉదయం 9.30 గంటలకు మైదానంలో హాజరై రిపోర్ట్ చేయాలన్నారు. ఎంపికైన జట్లు త్వరలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే అంతర్ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. మరిన్ని వివరాలకు 95533 33391, 94402 22981లలో సంప్రదించవచ్చన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు యూసుఫ్ ఖాన్, డాక్టర్ కీమ శ్రీనివాస్, అమిత్ దోక్వల్, రమేష్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

14-07-2026

article_75405188.webp
పసిపిల్లల ఆరోగ్య పరిరక్షణకై ప్రభుత్వం దృష్టి

బోథ్. జులై 14 (విజయక్రాంతి): పసి పిల్లల ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పిల్లలు ఆరోగ్యంగా పెరిగితే బంగారు భవిష్యత్తు ఉంటుందని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ సర్పంచ్ కురుమే అన్నపూర్ణాల పేర్కొన్నారు మంగళవారం మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో తొలిముద్దు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం పిల్లలకు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు తొలిముద్దు ఆరోగ్యానికి బాట వేస్తుందని పేర్కొన్నారు ఈ పథకాన్ని సక్రమంగా లోటు పాట్లు లేకుండా అమలు చేయాలని కోరారు సిడిపిఓ నరసమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అంగన్వాడి కేంద్రాలలో సమర్థవంతంగా నిర్వహించే విధంగా చూస్తామన్నారు ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమం నిర్వాణపై నిర్లక్ష్యం వహించవద్దని నిర్లక్ష్యం చేస్తే వేటు పప్పలన్నారు కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు

14-07-2026