స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయాలి
13-11-2025
ఆదిలాబాద్, నవంబర్ 12 (విజయక్రాం తి): స్థానిక సంస్థలు ఆర్థిక స్థితి బలోపేతం కావడం ద్వారానే గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. ఇందుకుగాను విడుదలైన నిధుల్లో ప్రతి రూపాయిని ప్రజా ప్రయోజనాలకు వినియోగించుకోవాలని సూచించారు. ఫైనాన్స్ కమిషన్ బృందం సభ్యుల జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం కమిషన్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో కమిషన్ సభ్యుడు రమేష్, కార్యదర్శి కాత్యాయిని దేవి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్, కుమార్ దీపక్, వెంకటేష్ దోత్రే, స్థానిక సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.