calender_icon.png 13 November, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_16744980.webp
రైతుల పాలిట శాపం.. కిసాన్ కపాస్ యాప్

13-11-2025

ఆదిలాబాద్, నవంబర్ 12 (విజయక్రాం తి) : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన కాపాస్ కిసాన్ యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రైతులకు కిసాన్ కాపాస్ యాప్ పై కనీసం అవగాహన కల్పించలేదన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పోచ్చర గ్రామంలోనీ కౌలు రైతు ఎగిడే సురే ష్ ఆరు కాలం కష్టపడి పండించిన పత్తి పంట ను ఇంట్లో నిల్వ ఉంచగా, ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్దం అయింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న బుధవారం దగ్దం అయిన పత్తిని పరిశీలించి, రైతుని పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని రైతుకు భరోసా ఇచ్చారు.

article_50428844.webp
స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయాలి

13-11-2025

ఆదిలాబాద్, నవంబర్ 12 (విజయక్రాం తి): స్థానిక సంస్థలు ఆర్థిక స్థితి బలోపేతం కావడం ద్వారానే గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. ఇందుకుగాను విడుదలైన నిధుల్లో ప్రతి రూపాయిని ప్రజా ప్రయోజనాలకు వినియోగించుకోవాలని సూచించారు. ఫైనాన్స్ కమిషన్ బృందం సభ్యుల జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం కమిషన్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో కమిషన్ సభ్యుడు రమేష్, కార్యదర్శి కాత్యాయిని దేవి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్, కుమార్ దీపక్, వెంకటేష్ దోత్రే, స్థానిక సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

article_37028907.webp
దేశ ఐక్యతకు పటేల్ కృషి అభినందనీయం

13-11-2025

ఆదిలాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): దేశ ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అభినందనీయమన ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌లు పేర్కొన్నారు. మై భారత్ ఆధ్వర్యంలో పటేల్ 150వ జయంతి సందర్భంగా బుధవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ముందుగా పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యూనిటీ మార్చ్‌ను ఎంపీ, ఎమ్మెల్యేలు జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

article_30627807.webp
రోడ్డు కోసం.. రోడ్డెక్కిన గిరిజన గ్రామస్థులు

13-11-2025

బేల, నవంబర్ 12 (విజయక్రాంతి) : తమ మారుమూల గ్రామాలకు వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తున్నామని పలు గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. గ్రామాలకు వెళ్లాలంటే రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. బేల మండలంలోని భాది, బెల్లూరి, జామిని గిరిజన గ్రామాల ప్రజలు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ భాది గ్రామం నుండి సిర్సన్న వరకు ప్రజలు పాదయాత్ర చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవాడంతో కాసేపు ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రఘునాథ్ రావ్ ఘటన స్థలానికి చేరుకొని వినతిపత్రం స్వీకరించారు. రోడ్డు విషయం గురించి కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పిఓ దృష్టి కి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

article_32808462.webp
నష్టపరిహారం త్వరగా అందేలా చూడండి..

11-11-2025

బోథ్ (విజయక్రాంతి): వన్యప్రాణుల కారణంగా పంట నష్టపోయిన బాధిత రైతులకు తక్షణమే ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూడాలని బోథ్ నేచర్ కన్జర్వేషన్ వెల్పేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ అలీ కోరారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులకు సొసైటీ సభ్యులతో కలిసి వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు షేక్ అలీ మాట్లాడుతూ వన్యప్రాణుల దాడులలో పంట నష్టపోయిన బాధిత రైతులు నష్ట పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే అటవీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి బాధిత రైతులకు నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలని అన్నారు.