బసవేశ్వరుడి అడుగుజాడల్లో నడవాలి
01-05-2025
ఆదిలాబాద్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): కుల వివక్షతను రూపుమాపడం కోసం కృషి చేసిన మహానీయుడు మహాత్మ బసవేశ్వరుడని, ఆ మహనీయుని బాటలో ప్రతి ఒక్కరు నడవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. విశ్వ గురువు, సంఘ సంస్కర్త, మహాత్మ బసవేశ్వర మహారాజ్ 892వ జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు.