calender_icon.png 6 July, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_17406511.webp
ఆదిలాబాదులో మళ్లీ పోడు రగడ...

05-07-2025

ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పోడు రగడ మొదలైంది. పోడు సాగుచేసే రైతులను అడ్డుకునేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన దిగడంతో వారికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) మద్దతు పలికారు. ఇచ్చోడ మండలంలోని కేశవ్ పట్నం, బాబ్జి పెట్ పోడు రైతులను అటవీ అధికారులు గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని రైతులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శనివారం బాబ్జి పెట్ వద్ద ఎమ్మెల్యే స్వయంగా రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తమ కోసం రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యేపై పోడు రైతులు హర్షం వ్యక్తం చేశారు.

article_85649890.webp
పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయండి..

05-07-2025

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పీవీటీజీలు కోలాం, తోటిలు, చెంచులు, కొండరెడ్లు ఐటీడీఏ సీసీడీపీ ద్వారా నిర్మించుకున్న ఇండ్ల నిర్మాణ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ. 16,43,87000 త్వరగా విడుదల చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లో రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పివిటీజీ లు అప్పులు చేసి ఇండ్లను నిర్మించారని, త్వరగా నిధులను విడుదల చేయాలని కోరారు. దీంతో నెల రోజుల్లోగా నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని వారు తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

article_89270102.webp
పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా కళ్యాణ లక్ష్మి

05-07-2025

నేరడిగొండ,(విజయక్రాంతి): పేద ఆడ బిడ్డల పెళ్ళిళ్లకు అండగా నిలిచేలా మాజీ సీఎం కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలు తీసుకొచ్చారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రైతు వేదికలో శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... లబ్ధిదారులు పథకాల లబ్ధి పొందేందుకు మధ్య దళారులను నమ్మవద్దన్నారు. నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బొడ్డు గంగారెడ్డి, బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, డైరెక్టర్లు, పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.