రక్త హీనతతో బాధపడుతున్న వారికి అవగాహన కల్పించాలి..
01-12-2025
ఆదిలాబాద్ (విజయక్రాంతి): రక్త హీనత వ్యాధితో ఉన్నవారిని గుర్తించి, వారికి వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. అదిలాబాద్ రూరల్ మండలంలోని లోహర ప్రాథమిక పాఠశాల ఆవరణలో లోహర, జాముగూడ, ఎస్సి కాలనీ గ్రామాల ప్రజలకు రక్త హీనతపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా వైద్యాధికారిని డా. సాధన, డా. సర్ఫరాజ్ లతో కలిసి రక్తహీనతను తగ్గించే పౌష్టికాహారంకు స్పందించిన పోస్టర్లను విడుదల చేశారు.