ప్రజాప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు
14-01-2026
ఉట్నూర్, జనవరి 13 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో గ్రామాలు అబివృద్ధి దిశగాముందుకు సాగుతున్నాయని, ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పతకాలు, అభివృద్ధిని గుర్తించి సహకరించాలని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మం డలంలోని శ్యాం నాయక్ తండా, తాండ్ర గ్రామాలలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభోత్సవంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ జాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.