calender_icon.png 25 June, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_51474436.webp
వర్క్ ఫ్రం హోం అంటూ అమాయకులకు బురిడీ..

23-06-2025

వర్క్ ఫ్రం హోం ఉద్యోగలంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్న సైబర్ నెరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతిరోజు కోట్లలో సైబర్ నేరాలు చేస్తూ డబ్బులు దండుకుంటు, సైబర్ నేరాలకు పాల్పడుతూన్న నిందితులను పట్టుకోవడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఇద్దరు సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(District SP Akhil Mahajan) తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ప్రధానంగా పట్టుకున్న A1 సౌరభ్ రాయక్వార్, A2 రితిక్ సేన్ ఇద్దరు నిందితులు మధ్యప్రదేశ్ లోని తికమ్‌గఢ్ జిల్లాకు సంబంధించిన నిందితులను కమిషన్ ఏజెంట్లుగా వాడుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉంటారని తెలిపారు.

article_16575814.webp
ఫారెస్టు భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించిన బీజేపీ నేత అరెస్టు..

21-06-2025

ఫారెస్ట్ భూమిని తనదంటూ లేఔట్ చేసి ప్లాట్లుగా విక్రయించిన బీజేపీ నేత వకుళభరణం అదినాథ్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు మావల పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి(DSP Jeevan Reddy) వివరాలు వెల్లడించారు. వకుళభరణం అదినాథ్ అతని భార్య రజినిలు 2010 సంవత్సరంలో ఖానాపూర్ శివారులోని ఫారెస్ట్ భూమిని తన పేరుతో ఉందంటూ నమ్మించి ప్లాట్లు చేసి విక్రయించగా అందులో నాలుగు ప్లాట్లు లను ఒక్కొక్కటి 3 లక్షల 30 వేలకు విక్రయించారన్నారు. కాగా నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు అమ్మారని తెలుసుకున్న బాధితులు పోలీసులనాశ్రయించారు.