26 May, 2026 | 11:32 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

Districts - Adilabad

article_38473038.webp
వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి

ఉట్నూర్, మే 26( విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామం వద్ద గల త్రివేణి సంఘ ప్రాజెక్టు పనులు వర్షాకాలం ప్రారంభంలోగా పూర్తిచేయాలని నేటిపారుదల శాఖ ఈ ఈ విట్టల్ అన్నారు. మంగళవారం రూపాలు 26 లక్షలతో చేపట్టిన మరమ్మతుపరులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వర్షాకాలం భారీ వర్షాలకు త్రివేణి సంగమం మత్తడి పైనుండి వరద నీరు ప్రవహించడంతో ఆర్ అండ్ బి రోడ్డు కూతకు గురైందని గుర్తు చేశారు. ఈసారి వర్షాకాలంలో మత్తడి పై ప్రవహించే నీరు ఆర్ అండ్ బీ రోడ్డు కూతురు గురికాకుండా వాల్ నిర్మాణం పూర్తి చేయాలని ఏఈ ప్రవీణ్ కుమార్ ను ఆదేశించారు. ఆర్ అండ్ బి రోడ్డు కోత గురి అయితే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు.

26-05-2026

article_61678090.webp
వ్యవసాయ వ్యర్థాలను కాల్చకండి: ఏవో

బోథ్,మే 26 (విజయక్రాంతి): రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చవద్దని సోనాల మండల వ్యవసాయ అధికారి గుగులోత్ దేవా నాయక్ పేర్కొన్నారు. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయన్నారు అంతేగాక భూసారం దెబ్బతిని పంటలు దిగుబడి తగ్గిపోతుందన్నారు పర్యావరణానికి హాని కలిగించకుండా వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలిసే విధంగా చూడాలని ఆయన కోరారు. ఇటీవల జరుగుతున్న అగ్ని ప్రమాదాలు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్లనే జరుగుతున్నాయన్నారు. పంట వ్యర్థాలను భూమిలో కలిసే విధంగా చేసినట్లయితే ఎరువుగా మారి రసాయనిక ఎరువులను వాడకుండా దిగుబడి పొందవచ్చు అన్నారు,

26-05-2026