అగ్నిప్రమాద బాధితులకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని దస్నాపూర్లో రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రెండు ఇళ్లు దగ్దమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ఘటనలో బాధిత కుటుంబాలు తీవ్ర నష్టపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా బాధితులకు తక్షణ సహాయం కింద సరుకులు, బట్టలు, రూ.20 వేల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయ సహకారాలు త్వరగా అందేలా అధికారులకు సూచనలు చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ భాయ్, మున్సిపల్ కౌన్సిలర్లు సలాం, బాలకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మార్సుకోల సరస్వతి, అధ్యక్షుడు జబోరే రవీందర్, టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా, దూడల అశోక్, సాయి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
04-06-2026