calender_icon.png 19 January, 2026 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_60378899.webp
జిల్లా కేంద్రంలోని చైన్ స్నాచర్ కలకలం

19-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): కేంద్రంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్ళిన ఘటన సంచలనం సృష్టించింది. కులార్కర్ శంకర్ నివాసంలో అద్దెకు ఉంటున్న ఓ మహిళ మెడలోంచి మూడు తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. హెల్మెట్లు ధరించిన ఇద్దరు అగంతకులు బైక్‌పై అక్కడికి వచ్చారు.గుండి రోడ్డులోని సాయినగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న అంజలి ని ఇంట్లో నుంచి పిలిచి వాహనాన్ని పార్క్ చేసుకుంటామని చెప్పి మాటల్లో పెట్టారు.బాధిత మహిళ వెనక్కి తిరిగే క్షణంలో మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని క్షణాల్లోనే బైక్‌పై పరారయ్యారు.ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

article_42964088.webp
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ

18-01-2026

బెజ్జూర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని గాంధీనగర్ వార్డులో 11 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వార్డు సభ్యులతో మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదన ఇండ్లకు ముగ్గు పోసుకొని పనులు మొదలు పెట్టాలని తెలిపారు. వార్డులో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని వార్డు ప్రజలు తెలియజేయడంతో 100 మీటర్ల నూతన డ్రైనేజీని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అదే వార్డులో నివాసం ఉండి ఇటీవల మరణించిన సుద్దమల్ల రాజయ్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని అన్నారు.