24 April, 2026 | 6:28 AM

Districts - Kumarambheem Asifabad

article_60232088.webp
హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు బట్టబయలు

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): హైకోర్టు తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ కుట్రలు బట్టబయలయ్యాయని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు, గుండి సర్పంచ్ జబరి రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడిందని ఆరోపించారు. ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదని, కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్‌లా ఉందని విమర్శించారు. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తూ సెక్షన్ 8బీ, 8సీ నిబంధనలను పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నించిందని అన్నారు.

23-04-2026

article_12638241.webp
TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మెతో(TGSRTC Strike) జిల్లాలో బస్సుల రాకపోకలు బుధవారం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సమ్మె కారణంగా చాలా మార్గాల్లో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌తో పాటు పలు మండల కేంద్రాల్లో కూడా బస్సుల రాకపోకలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచే బస్టాండ్‌కు చేరుకున్న విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూసినప్పటికీ చాలా మార్గాల్లో బస్సులు అందుబాటులో లేకపోవడంతో నిరాశ చెందారు.

22-04-2026