అధికారులు సమన్వయంతో పనిచేయాలి
వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలంలోని గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని వాంకిడి ఏఎంసీ చైర్మన్ జె. పెంటు సూచించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ సమావేశం మందిరంలో మండల ప్రత్యేక అధికారి హౌసింగ్ డీఈ ప్రకాష్ రావు అధ్యక్షతన మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామ సర్పంచులు విద్యుత్, మంచినీటి సరఫరా, తదితర సమస్యలను వివరించారు. జలసిరి పథకం పురోగతి, మెటీరియల్ కాంపోనెంట్, మంజూరైన పనుల పురోగతి, గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్లు, మంచినీటి సరఫరా, విద్య వైద్యం వంటి తదితరాంశాలపై చర్చించారు. సమస్యలపై అధికారులు వెంటనే స్పందిస్తూ పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోత్న్న, తాహసీల్దార్ కవిత, ఎంపీవో ఖాజా అజీస్ జొద్దిన్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
06-08-2026