6 August, 2026 | 10:58 PM

Districts - Kumarambheem Asifabad

article_78981877.webp
గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలి

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. పేపర్ మిల్ ఎదుట కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 79వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నికలు లేకపోవడంతో కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని, పాత కార్మికులందరినీ ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.

06-08-2026

article_55279781.webp
అధికారులు సమన్వయంతో పనిచేయాలి

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలంలోని గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని వాంకిడి ఏఎంసీ చైర్మన్ జె. పెంటు సూచించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ సమావేశం మందిరంలో మండల ప్రత్యేక అధికారి హౌసింగ్ డీఈ ప్రకాష్ రావు అధ్యక్షతన మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామ సర్పంచులు విద్యుత్, మంచినీటి సరఫరా, తదితర సమస్యలను వివరించారు. జలసిరి పథకం పురోగతి, మెటీరియల్ కాంపోనెంట్, మంజూరైన పనుల పురోగతి, గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్లు, మంచినీటి సరఫరా, విద్య వైద్యం వంటి తదితరాంశాలపై చర్చించారు. సమస్యలపై అధికారులు వెంటనే స్పందిస్తూ పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోత్న్న, తాహసీల్దార్ కవిత, ఎంపీవో ఖాజా అజీస్ జొద్దిన్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

06-08-2026