1 August, 2026 | 11:23 AM

Districts - Kumarambheem Asifabad

article_14327070.webp
వైద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్సీ దండే విఠల్

కాగజ్‌నగర్ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోటలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన అదనపు ఐదు డయాలసిస్ బెడ్లను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

31-07-2026