30 July, 2026 | 3:54 PM

Districts - Kumarambheem Asifabad

article_53445201.webp
వంతెన లేక నేటికీ అవస్థలు.

వాంకిడి, జూలై 30 (విజయక్రాంతి): వాంకిడి మండలంలోని కిరిడి గ్రామంలో పాఠశాల సమీపంలో ఉన్న ఒరే నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా నిండిపోవడంతో గ్రామ ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే ఓర్రె ను దాటాల్సిన పరిస్థితి నెలకొన్నదని, వరద ఉధృతి కారణంగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గ్రామానికి రాకపోకలు సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు .గతంలో జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి సమస్యను పరిశీలించినప్పటికీ, నేటి వరకు హై లెవెల్ వంతెన మంజూరు కాలేదని పేర్కొన్నారు. మండల ప్రజాప్రతినిధులు పలుమార్లు హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కిరిడి గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే మంజూరు చేసి, గ్రామ ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని దుర్గం దినకర్ ప్రభుత్వాన్ని కోరారు.

30-07-2026

article_27724487.webp
ఉప్పొంగుతున్న గోదావరి.. తుమ్మిడిహెట్టి వద్ద జలకళ

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తూ జలకళను సంతరించుకుంది.వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.గోదావరి నది ఒడ్డుకు ఎవరూ వెళ్లరాదని, వరద నీటిని చూసేందుకు లేదా సెల్ఫీలు తీసేందుకు ప్రయత్నించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నది సమీపంలోని ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

30-07-2026

article_13740168.webp
ఒర్రే వద్ద అధికారుల బందోబస్తు

బెజ్జూర్ జూలై 30 (విజయక్రాంతి): బెజ్జూరు మండలంలోని కృష్ణ పల్లి, సుస్మిర్ ఒర్రెలు భారీగా ప్రవహిస్తున్నాయి. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గొర్రెలు భారీగా ప్రవహించడంతో ప్రజలు ఎవరు కూడా ఒర్రెల నుండి దాటకూడదని తహసిల్దార్ రామ్మోహన్ రావు, ఎస్సై సర్దాజ్ పాషా , ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు ఒర్రెలను పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా వర్షం కురుస్తున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదని గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి గ్రామాలలో దండోర వేయించారు. పొలం గట్ల పైకి, చెట్ల కింద ఎత్తైన ప్రదేశాల్లో ఎవరు కూడా ఉండకూడదని పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఒర్రెలు, వాగులు భారీగా ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండెలా గ్రామాల ప్రజలకు సర్పంచులు సూచించాలని తెలిపారు. వారి వెంట గ్రామ కార్యదర్శి రోజా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

30-07-2026

article_66079471.webp
వరదలో చిక్కుకున్న బొలెరో

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి–గొల్లగూడెం గ్రామాలను కలిపే ప్రధాన రహదారిపై ఉన్న తాత్కాలిక వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా ఓ బులేరో వాహనం వరదలో చిక్కుకుంది. వంతెన దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో వాహనం ముందుకు కదలక నిలిచిపోయింది.ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ చాకచక్యంగా వాహనం నుంచి బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు.సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు గంటపాటు శ్రమించి జేసీబీ సహాయంతో బులేరో వాహనాన్ని సురక్షితంగా బయటికి తీశారు.భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహం ఉన్న వాగులు, తాత్కాలిక వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

30-07-2026

article_58704118.webp
భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు.విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లలను ఇళ్ల వద్దనే ఉంచాలని సూచించారు. అలాగే అత్యవసర పరిస్థితులు లేకపోతే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 8500844365 నంబర్‌ను సంప్రదించి సహాయం పొందాలని సూచించారు.

30-07-2026

article_13811641.webp
ఉప్పొంగిన ఒర్రెలు 12 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

బెజ్జూర్ జూలై 30 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని కృష్ణ పల్లి,సుస్మిర్ సమీపంలోని రెండు ఒర్రెలు ఉప్పొంగడంతో 12 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు గిరిజన గ్రామాల ప్రజలకు మండల కేంద్రానికి సంబంధాలు తెగిపోతాయి.భారీగా వర్షాలు కురిస్తే ఈ రెండు గొర్రెలు భారీగా ప్రవహిస్తాయి. అటవీశాఖ అనుమతులు లేక ఒర్రెల పై వంతెనలు మంజూరు కాకపోవడంతో గిరిజన గ్రామాల ప్రజలు నానా తంటాలు పడుతూ గడుపుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో బాధపడేవారు ఆసుపత్రులకు వెళ్లాలంటే వెళ్లలేని దుస్థితిగా మారిందని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గిరిజన గ్రామాల ప్రజలు పడుతున్న తిప్పలను చూసైనా ప్రభుత్వం స్పందించి ఒర్రెల పై వంతెనలు మంజూరు చేసి ప్రజల తిప్పలను తీర్చాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

30-07-2026