30 August, 2026 | 4:54 PM

Districts - Kumarambheem Asifabad

article_15509125.webp
రైతు కూలీ సంఘం మహాసభలను విజయవంతం చేయాలి

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కన్వీనర్ రత్నం పోషన్న పిలుపునిచ్చారు. శనివారం జానకపూర్‌లో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కానాజీ వీరన్న, బాబా, అబ్దుల్లా, బండారి తిరుపతి, జగజంపుల తిరుపతి, సమీర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

30-08-2026

article_89952334.webp
నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్: ఎస్సై మహేంద్ర

వాంకిడి,(విజయక్రాంతి): ప్రజల, పోలీసుల మధ్య సమన్వయం పెంపొందించి నేరాలను అరికట్టడమే పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వాంకిడి ఎస్ఐ మహేందర్ అన్నారు. ఆదివారం వాంకిడి మండలంలోని, నార్లాపూర్ గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అనుమానస్పద ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాలు, మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, ఓటిపీలు , బ్యాంకు వివరాలు ఎవరికి ఇవ్వద్దని గ్రామ ప్రజలకు హెచ్చరించారు. వాహనదారులు అన్ని పత్రాలు కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

30-08-2026

article_16185246.webp
అక్రమంగా పశువులను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తుల అరెస్ట్

బెజ్జూర్ ఆగస్టు 30 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సుస్మీర్ గ్రామ శివారులో అక్రమంగా పశువులందను తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మహారాష్ట్రలో తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి, వాటిని జగిత్యాల స్లాటరింగ్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం బెజ్జూర్ ఎస్సై ఎం.డి. సర్తాజ్ పాషాకు అందింది.వెంటనే బెజ్జూర్ ఎస్సై ఎం.డి. సర్తాజ్ పాషా తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, వారి వద్ద నుండి మొత్తం 41 పశువులను స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న పశువుల్లో 10 ఎద్దులు, 21 ఆవులు మరియు 10 దూడలు ఉన్నాయి.విచారణలో నిందితులు మహారాష్ట్రలో తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి, వాటిని జగిత్యాల స్లాటరింగ్ మార్కెట్‌కు తరలించి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది.ఈ ఘటనపై నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న పశువులు పోలీసుల ఆధీనంలో ఉన్నాయి, ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

30-08-2026

article_17679208.webp
సామాజిక సేవకు అరుదైన గౌరవం

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజా సేవే లక్ష్యంగా, మానవత్వమే మార్గంగా ఎన్నో సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేవార వినోద్ స్వామికి అరుదైన గౌరవం దక్కింది. సామాజిక సేవా రంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించిన యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్‌షిప్ అండ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో “డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్” గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.శనివారం పుదుచ్చేరిలోని కంబన్ కలైయరంగం ఆడిటోరియంలో నిర్వహించిన “సామాజిక నాయకులు–దార్శనికుల సమ్మేళనం–2026” కార్యక్రమంలో దేవార వినోద్ స్వామికి ఈ గౌరవాన్ని అందజేశారు. దేవార వినోద్ స్వామి వేసవి కాలంలో మూడు నెలల పాటు అంబలి, మంచినీటి పంపిణీతో పాటు పేదలు, వృద్ధులకు దుప్పట్లు, యువతకు వాలీబాల్, క్రికెట్ కిట్లు, గర్భిణులకు పౌష్టికాహారం, వస్త్రాలు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు.

29-08-2026

article_85960373.webp
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

కాగజ్‌నగర్(విజయక్రాంతి): అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శుక్రవారం అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ఒత్తిడి తేవాలని కోరారు.రాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి చర్చకు పట్టుబడతామని ఎమ్మెల్యే తెలిపారు.మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో జూనియర్ లెక్చరర్ల అక్రమ టెర్మినేషన్‌ విషయంలో అండగా నిలిచి తిరిగి ఉపాధి కల్పించేందుకు కృషి చేసినందుకు జేఏసీ నాయకులు ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

28-08-2026