calender_icon.png 2 January, 2026 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_89262102.webp
ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలి

02-01-2026

కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి ౧ (విజయక్రాంతి): ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా ఎస్.పి. నితిక పంత్, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్‌లతో కలిసి రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా తొలిరో జు అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులతో ట్రాఫిక్ నియమాలపై సమీక్ష సమావేశం నిర్వహించి ఉద్యోగులు, అధికారులతో రోడ్డు భద్రత పై ప్రతిజ్ఞ చేయించి సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు.

article_48019962.webp
కేజీబీవీ ఎస్‌ఓపై తక్షణ చర్యలు తీసుకోవాలి

01-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీ గురుకుల పాఠశాలల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డివైఎఫ్ఐ, కేవీపీఎస్ నాయకులు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేజీబీవీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఎస్‌ఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోందని విమర్శించారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరైన మెనూ అమలు చేయకపోవడం, నాణ్యమైన పౌష్టికాహారం అందించకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతూ ఆస్పత్రుల పాలవుతున్నారని తెలిపారు. కొంతమంది విద్యార్థులు జ్వరాలు వంటి వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్నారని పేర్కొన్నారు.

article_61037224.webp
సులభ్ కాంప్లెక్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి

01-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్ ,డిసెంబర్ 31(విజయ క్రాంతి): సులభ్ కాంప్లెక్స్‌ను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలోని ఆటో స్టాండ్ వద్ద వాల్మీకి సఫాయి కర్మచారి సేవా సంఘ్ ఆధ్వర్యంలో బి. ఓ. టి. పద్ధతిలో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ ను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గజానన్, సిబ్బంది పాల్గొన్నారు.