జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి
ఆసిఫాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): బీసీల సమగ్ర కులగణన చేపట్టి, జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో న్యాయమైన రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూపునార్ రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ కు సంఘం నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.
25-08-2026