11 March, 2026 | 12:38 AM

Districts

article_76672536.webp
తాగునీటి సమస్యకు పరిష్కారం

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణంలోని 7వ వార్డులో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కౌన్సిలర్ తణుకు భార్గవి చర్యలు చేపట్టారు. వార్డు ప్రజలకు తాగునీరు అందించేందుకు ఇటీవల నూతనంగా బోర్‌వెల్ వేయించడంతో పాటు కాలనీలోని కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా తాగునీటి కనెక్షన్లు ఏర్పాటు చేశారు.పనులను ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుమారుడు కోవ సాయినాథ్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎం.డి. అహ్మద్, సాయి శ్రావణ్ తదితరులు పరిశీలించారు. వార్డు ప్రజల సమస్యలను గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న కౌన్సిలర్ తణుకు భార్గవి సేవలకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వారిని కాలనీవాసులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నవీన్, సురేష్, శ్రీపతి, సాయి, డి.సాయి, అమన్, ఎం.సాయి, మోహన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

10-03-2026