నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళలు, బాలికల భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కాళేశ్వరం జోన్-1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా, పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం ఆసిఫాబాద్ పట్టణ పోలీస్స్టేషన్, వాంకిడి సీఐ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు.
19-09-2026 | 08:52pm