11 August, 2026 | 2:14 AM

Districts - Kumarambheem Asifabad

article_12489989.webp
ఘనంగా త్రివర్ణ పతాక ప్రదర్శన

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం త్రివర్ణ పతాక ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.మీడియా ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు మురుమురం రాజు, ప్రధాన కార్యదర్శి సదాశివ్, ప్రింట్ మీడియా అధ్యక్షుడు వేణుగోపాల్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ను బీజేపీ నాయకులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట్నాక్ విజయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షేర్ల మురళీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్, త్రివర్ణ యాత్ర జిల్లా కన్వీనర్ కాంద్రే విశాల్, కో-కన్వీనర్ సప్త శ్రీనివాస్, నవీన్ గౌడ్, బాలకృష్ణతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

10-08-2026

article_64871926.webp
విద్యుత్‌ షాక్‌తో కాంట్రాక్టు కార్మికుడు మృతి

పెంచికల్‌పేట్‌(విజయ క్రాంతి): విద్యుత్‌ పనులు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన పెంచికల్‌పేట్‌ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని గొంట్లపేట–మొట్లగూడ బస్టాండ్‌ సమీపంలో విద్యుత్‌ పనులు చేస్తుండగా బొంబాయిగూడ గ్రామానికి చెందిన నాగపురి చందు విద్యుత్‌ షాక్‌ తగిలి కిందపడిపోయాడు.తీవ్రంగా గాయపడిన చందును స్థానికులు వెంటనే ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.విషయం తెలుసుకున్న సిర్పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి కుటుంబానికి అందాల్సిన ప్రయోజనాలను త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

10-08-2026

article_79887095.webp
కమ్యూనిటీ షెడ్‌కు భూమిపూజ

వాంకిడి, (విజయక్రాంతి): గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వాంకిడి మండలంలోని జంబుల్ ధరి గ్రామంలో కమ్యూనిటీ షెడ్ నిర్మాణానికి సర్పంచ్ కుమ్రం పవన్, ఉప సర్పంచ్ విఠల్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారి ఆధ్వర్యంలో శనివారం షెడ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గ్రామంలో ప్రత్యేకంగా స్థలం అందుబాటులో లేకపోవడంతో శిథిలావస్థకు చేరిన పాత టిడబ్ల్యూపీఎస్ పాఠశాల భవనాన్ని తొలగించి, అదే స్థలంలో కమ్యూనిటీ షెడ్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామానికి మధ్యలో షెడ్ నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజలందరికీ అందుబాటులో ఉండటంతో పాటు సంప్రదాయ, సామాజిక కార్యక్రమాలు, గ్రామస్థాయి సమావేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సర్పంచ్ కుమ్రం పవన్, ఉప సర్పంచ్ విటల్ తెలిపారు.గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్ సమన్వయంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పటేల్ పండు, బాలకిషన్, మధుకర్, వాసుదేవ్, తదితరులు పాల్గొన్నారు.

08-08-2026