12 August, 2026 | 10:07 AM

Districts - Kumarambheem Asifabad

article_42755059.webp
ప్రభుత్వ స్థలం కోసం వ్యాపారుల జగడం!

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో(Bejjur Mandal Headquarters) ప్రభుత్వ స్థలం కోసం వ్యాపారుల మధ్య మంగళవారం వాగ్వాదం చోటుచేసుకుంది. ‘జాగ నాది.. నాది’ అంటూ ఒకరిపై ఒకరు వాదించుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు ఇతర వ్యాపారులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.బెజ్జూర్ ప్రధాన రహదారి పక్కన కొమురం భీం విగ్రహం ఎదుట ప్రభుత్వ స్థలంలో కూరగాయల వ్యాపారులు కొవిడ్‌ సమయం నుంచి తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమురం భీం విగ్రహం ఎదుట ఉన్న దుకాణాలను తొలగించాలని ఆదివాసీ నాయకులు కోరడంతో వ్యాపారులు దుకాణాలను తొలగించారు.మంగళవారం తిరిగి దుకాణాలు ఏర్పాటు చేసుకునే సమయంలో స్థలం విషయంలో వ్యాపారుల మధ్య వివాదం తలెత్తింది. అందరికీ సమానంగా స్థలం కేటాయించుకోవాలని కొందరు సూచించగా, ఒకరి స్థలాన్ని మరొకరు ఆక్రమిస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో కొందరు వ్యాపారులు రోడ్డుపైనే దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం ఇతర వ్యాపారులు జోక్యం చేసుకుని పరస్పరం నచ్చజెప్పడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.

12-08-2026

article_32248034.webp
బెజ్జుర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నితికా పంత్

బెజ్జూర్,విజయక్రాంతి: బెజ్జూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ, పోలీస్ సిబ్బంది పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.తదుపరి పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులు, కార్యాలయ నిర్వహణను పరిశీలించారు. స్టేషన్‌ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, పెండింగ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి, సీడీ ఫైళ్లు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్ కేసుల వివరాలను ఎస్సై సార్తజ్ పాషాను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేసి, నాణ్యమైన దర్యాప్తు ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

12-08-2026