18 August, 2026 | 12:55 AM

Districts - Kumarambheem Asifabad

article_55660614.webp
30 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

పెంచికల్పేట్ (విజయక్రాంతి): దహేగాం మండలంలోని చిన్నరాసపల్లి పరిసర గ్రామాల కార్డుదారుల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన 30 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పెంచికల్పేట్ వద్ద అధికారులు పట్టుకున్నారు. సోమవారం విశ్వసనీయ సమాచారం మేరకు డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాజ్‌కుమార్, పెంచికల్పేట్ ఎస్సై అనిల్‌కుమార్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. టాటా పికప్ వాహనం (AP 01 Y 4233)లో 60 బస్తాల్లో తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. కాగజ్‌నగర్‌కు చెందిన ఖాజా, అస్లాం హుస్సేన్‌లను నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై అనిల్‌కుమార్ హెచ్చరించారు. తనిఖీల్లో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

17-08-2026

article_72580893.webp
రోడ్డెక్కిన రైతులు.. మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు(Vattivagu Project) ఆయకట్టు కింద సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బూరుగుడా సమీపంలో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కెనాల్ ద్వారా సాగునీరు అందించేందుకు వెంటనే ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళనకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Lakshmi) మద్దతు తెలిపారు. ధర్నాలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ సాగునీరు అందకపోతే రైతులు పంటలు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. అధికారులు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

17-08-2026