19 August, 2026 | 11:50 AM

Districts - Kumarambheem Asifabad

article_87862067.webp
పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి

బెజ్జర్:(విజయక్రాంతి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జర్ మండల ఎంపీడీవో కు వినతి పత్రం అందించారు. గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్షులు గోరంట్ల వసంత్ మాట్లాడుతూ గ్రామపంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, 2వ పీఆర్సీలో గుర్తించి కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని కోరారు.

19-08-2026

article_38849275.webp
బహుజన ఆత్మగౌరవానికి తొలి పతాకం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

బహుజన ఆత్మగౌరవానికి తొలి పతాకం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, వారి జీవిత చరిత్ర నేటి తరాలకు ఆదర్శనీయమని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అన్నారు. మంగళవారం సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలలో భాగంగా కలెక్టరేట్ లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, గౌడ సంఘాల నాయకులు, బి.సి. సంఘాల నాయకులతో కలిసి హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

18-08-2026