రాష్ట్ర స్థాయి క్రీడలకు డీఏవీ విద్యార్థుల ఎంపిక
హైదరాబాద్లోని డీఏవీ మిధానీ పాఠశాలలో ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించిన డీఏవీ క్లస్టర్ లెవల్ స్పోర్ట్స్ మీట్ లో సిర్పూర్ కాగజ్నగర్కు చెందిన డీఏవీ లక్ష్మీపత్ సింఘానియా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పాఠశాల నుంచి మొత్తం 34 మంది విద్యార్థులు ఆరు క్రీడా విభాగాల్లో పాల్గొనగా, 12 స్వర్ణ, ఒక రజత, ఒక కాంస్య పతకాలు సాధించారు. 15 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
29-07-2026