గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి
కాగజ్నగర్(విజయ క్రాంతి): సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పేపర్ మిల్లు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 105వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మొగిలి వెంకటేష్, ఏకే సింగ్ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. వారికి మద్దతుగా జేఏసీ కన్వీనర్ గోగర్ల రాములు, కో-కన్వీనర్ మహమ్మద్ షబ్బీర్, ఎం. విజయ్, అంగల శ్రీనివాస్, ముంజం ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.
01-09-2026