30 July, 2026 | 8:53 AM

Districts - Kumarambheem Asifabad

article_13811641.webp
ఉప్పొంగిన ఒర్రెలు 12 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

బెజ్జూర్ జూలై 30 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని కృష్ణ పల్లి,సుస్మిర్ సమీపంలోని రెండు ఒర్రెలు ఉప్పొంగడంతో 12 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు గిరిజన గ్రామాల ప్రజలకు మండల కేంద్రానికి సంబంధాలు తెగిపోతాయి.భారీగా వర్షాలు కురిస్తే ఈ రెండు గొర్రెలు భారీగా ప్రవహిస్తాయి. అటవీశాఖ అనుమతులు లేక ఒర్రెల పై వంతెనలు మంజూరు కాకపోవడంతో గిరిజన గ్రామాల ప్రజలు నానా తంటాలు పడుతూ గడుపుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో బాధపడేవారు ఆసుపత్రులకు వెళ్లాలంటే వెళ్లలేని దుస్థితిగా మారిందని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గిరిజన గ్రామాల ప్రజలు పడుతున్న తిప్పలను చూసైనా ప్రభుత్వం స్పందించి ఒర్రెల పై వంతెనలు మంజూరు చేసి ప్రజల తిప్పలను తీర్చాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

30-07-2026

article_38199462.webp
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి

రెబ్బెన మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క బుధవారం ప్రారంభించారు. అనంతరం నూతన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కిషన్ గౌడ్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంలో మండల కార్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు కృషి చేయాలని సూచించారు.

29-07-2026