రైతులకు న్యాయం చేయాలి
కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన రైతులతో కలిసి ఎమ్మెల్యే కోవలక్ష్మి సోమవారం హైదరాబాద్లోని ఫారెస్ట్ భవన్లో ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డా. సి.సువర్ణను కలిసి రైతుల సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయా మండలాలకు చెందిన వందలాది కుటుంబాలు గత 50 సంవత్సరాలుగా అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు.
22-06-2026