సామల సదాశివ జయంతి వేడుకలు
కాగజ్నగర్(విజయక్రాంతి): కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహుభాషా కోవిదుడు డాక్టర్ సామల సదాశివ జయంతిని కాగజ్నగర్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్స్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి తెలుగు సాహితీ సదస్సు సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు సామల సదాశివ తెలుగు, ఉర్దూ, పార్శీ, మరాఠీ భాషల్లో విశేష సేవలు అందించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పెండ్యాల కిషన్ శర్మ, కటకం మధూకర్, వాసాల ప్రభాకర్, జైడి దేవాజీ, శాంత కుమారి, కేదారి, మోతీరాం తదితరులు పాల్గొన్నారు.
11-05-2026