8 August, 2026 | 9:36 PM

Districts - Kumarambheem Asifabad

article_79887095.webp
కమ్యూనిటీ షెడ్‌కు భూమిపూజ

వాంకిడి, (విజయక్రాంతి): గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వాంకిడి మండలంలోని జంబుల్ ధరి గ్రామంలో కమ్యూనిటీ షెడ్ నిర్మాణానికి సర్పంచ్ కుమ్రం పవన్, ఉప సర్పంచ్ విఠల్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారి ఆధ్వర్యంలో శనివారం షెడ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గ్రామంలో ప్రత్యేకంగా స్థలం అందుబాటులో లేకపోవడంతో శిథిలావస్థకు చేరిన పాత టిడబ్ల్యూపీఎస్ పాఠశాల భవనాన్ని తొలగించి, అదే స్థలంలో కమ్యూనిటీ షెడ్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామానికి మధ్యలో షెడ్ నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజలందరికీ అందుబాటులో ఉండటంతో పాటు సంప్రదాయ, సామాజిక కార్యక్రమాలు, గ్రామస్థాయి సమావేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సర్పంచ్ కుమ్రం పవన్, ఉప సర్పంచ్ విటల్ తెలిపారు.గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్ సమన్వయంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పటేల్ పండు, బాలకిషన్, మధుకర్, వాసుదేవ్, తదితరులు పాల్గొన్నారు.

08-08-2026

article_85254721.webp
ఆగస్టు 10న జరిగే "జైల్ భరో" కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

బెజ్జూర్ ఆగస్టు 7 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలం లోని గ్రామపంచాయతీ ఆవరణలో కరపత్రాలు విడుదల చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో 2026 ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న "జైల్ భరో" కార్యక్రమాన్ని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సంయుక్త కార్యదర్శి వెలిశాల క్రిష్ణమాచారి పిలుపునిచ్చారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల, కార్మిక–రైతు–ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తూ దేశ సంపదను ప్రైవేటీకరణ చేస్తున్నదని ఆయన విమర్శించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా సాధించిన దేశ స్వాతంత్ర్య స్ఫూర్తిని కాపాడుకోవాలంటే నేటి పరిస్థితుల్లో ప్రజలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

08-08-2026

article_87083681.webp
నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు చేపట్టిన నాలుగు దశల ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో ఉపాధ్యాయులు శుక్రవారం పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా యూఎస్‌పీసీ జిల్లా నాయకురాలు శాంతి కుమారి మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేసి, పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన విద్య పేరుతో పాఠశాలల కుదింపును నిలిపివేయాలని, ప్రాథమిక విద్యకు సంబంధించిన జీవో–25ను వెంటనే సవరించాలని కోరారు.

07-08-2026