సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్, సెప్టెంబరు 16(విజయ క్రాంతి): సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ గోదాంలో హమాలీల సమావేశం నిర్వహించారు. పెరిగిన వేతనాలను అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని కోరారు.
16-09-2026 | 01:21pm