18 June, 2026 | 10:10 PM

Districts - Kumarambheem Asifabad

article_38892610.webp
అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార వస్తువుల పంపిణీ

​వాంకిడి, (విజయక్రాంతి):వాంకిడి మండలంలోని బంబార గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో గురువారం చిన్నారులకు, గర్భిణీలకు, బాలింత మహిళలకు ప్రభుత్వం అందజేస్తున్న పోషకాహార వస్తువులను గ్రామ సర్పంచ్ బెండారే కృష్ణాజీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఉక్కుమారవ్వ, మురుకులు, బియ్యం, గుడ్లు, పల్లి పట్టీలు వంటి తదితర వస్తువులను అందజేశారు.​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి పోషకాహారం ఎంతో అవసరమని, ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు గ్రామ ప్రజలకు ఎంతో ఉప యోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాడే సంతోష్, పంచాయతీ కార్యదర్శి దుర్గం ధర్మయ్య, అంగన్వాడి టీచర్లు సువర్ణ, సరిత, అంగన్వాడి ఆయా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

18-06-2026

article_33238518.webp
అక్రిడేషన్‌తో పాటు సంక్షేమ భరోసా

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పాత్రికేయుల సంక్షేమానికి మరింత భరోసా కల్పించే దిశగా జిల్లాలో నూతన అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి వై. సంపత్ కుమార్ తెలిపారు. 2026–2028 సంవత్సరాలకు సంబంధించిన అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ అక్రిడేషన్ కార్డుల పంపిణీతో పాటు రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు చేపట్టడం విశేషమన్నారు.

18-06-2026

article_72092271.webp
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి

​వాంకిడి, (విజయక్రాంతి): విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జైత్‌పూర్ సర్పంచ్ కోలే జ్యోతి పిలుపునిచ్చారు. బుధవారం వాంకి మండలం జైత్‌పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నుండి ఉచితంగా అందించిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులను విద్యార్థులకు ఆమె పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధనతో పాటు ఉచితంగా దుస్తులు, భోజనం, పుస్తకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరినీ తల్లిదండ్రులు క్రమం తప్పకుండా తమ పిల్లలను బడికి పంపాలని, ఇంట్లోనూ చదివించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీ దుర్గం సందీప్, హెచ్‌ఎం రాధ, గ్రామ నాయకులు పత్రు, తిరుపతి, సదాశివ తదితరులు పాల్గొన్నారు.

17-06-2026