21 August, 2026 | 11:25 PM

Districts - Kumarambheem Asifabad

article_27829213.webp
కాంగ్రెస్‌లో చేరింది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాదు

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలంలోని గోయేగావ్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై వాంకిడి మండల బీఆర్‌ఎస్‌ పార్టీ స్పందించింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ వాంకిడి మాజీ జెడ్పిటిసి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తులకు బీఆర్‌ఎస్‌ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వారిని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా పేర్కొంటూ ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని, ఆయనతో పాటు మండల బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం ఖండించారు. బీఆర్‌ఎస్‌కు సంబంధం లేని వ్యక్తులను పార్టీ కార్యకర్తలుగా చిత్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వాస్తవాలను ప్రజలు గమనించాలని, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని మండల బీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు.

21-08-2026

article_77070411.webp
ఫోటోగ్రాఫర్లకు ఘన సన్మానం

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆసిఫాబాద్ ఆధ్వర్యంలో స్థానిక ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. ఫోటోగ్రఫీ రంగంలో విశేష సేవలందిస్తున్న వారిని శాలువాలు కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను చిత్రాల రూపంలో ప్రజలకు చేరవేయడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ల సేవలను కొనియాడుతూ వారికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్ అబ్దుల్ ఫయాజ్ (క్యాబినెట్ మెంబర్), లయన్ శంకర్ (క్లబ్ అడ్మినిస్ట్రేటర్), లయన్ బోయిరే ప్రకాష్ (సెక్రటరీ) పాల్గొన్నారు.

19-08-2026

article_87862067.webp
పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి

బెజ్జర్:(విజయక్రాంతి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జర్ మండల ఎంపీడీవో కు వినతి పత్రం అందించారు. గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్షులు గోరంట్ల వసంత్ మాట్లాడుతూ గ్రామపంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, 2వ పీఆర్సీలో గుర్తించి కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని కోరారు.

19-08-2026