గణేష్ ఉత్సవాలకు పటిష్ట భద్రతా చర్యలు
జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధమవుతోందని జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. మంగళవారం ఆసిఫాబాద్, కాగజ్నగర్లోని ప్రధాన గణేష్ నిమజ్జన కేంద్రం పెద్దవాగును ఆమె పరిశీలించారు.మండపాల నుంచి నిమజ్జన కేంద్రాల వరకు గణేష్ విగ్రహాల ఊరేగింపు మార్గాలను పరిశీలించిన ఎస్పీ.. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, బారికేడింగ్, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.నిమజ్జన కేంద్రాల వద్ద బారికేడింగ్, రోప్ బ్యారియర్లు, తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
08-09-2026 | 10:13pm