23 April, 2026 | 2:48 AM

Districts - Kumarambheem Asifabad

article_12638241.webp
TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మెతో(TGSRTC Strike) జిల్లాలో బస్సుల రాకపోకలు బుధవారం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సమ్మె కారణంగా చాలా మార్గాల్లో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌తో పాటు పలు మండల కేంద్రాల్లో కూడా బస్సుల రాకపోకలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచే బస్టాండ్‌కు చేరుకున్న విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూసినప్పటికీ చాలా మార్గాల్లో బస్సులు అందుబాటులో లేకపోవడంతో నిరాశ చెందారు.

22-04-2026