బెజ్జూర్ లో బిఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసన
బెజ్జూర్ జూన్ 30 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధాన చౌరస్తాపై నిరసన తెలిపి రాస్తారోకో నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత తొలగించడంతోపాటు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సైతం తొలగించడంతో పార్టీ ఆదేశాల మేరకు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భూస సారయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు వారికి భద్రత కల్పించడంతోపాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తిరిగి అప్పగించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖాజా మైనుద్దీన్, తిరుపతి, నరేంద్ర గౌడ్, అమీరుద్దీన్, జావిద్ అలీ, దుర్గం తిరుపతి, నీకాడి మోహన్, గుమ్మల శ్రీనివాస్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
30-06-2026