13 June, 2026 | 5:24 PM

Districts - Kumarambheem Asifabad

article_40647999.webp
పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలోని పెండింగ్ వంతెనల పనులు పూర్తి చేయాలని మంచిర్యాల్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును శనివారం ఆయన నివాసంలో జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కెరమెరి మండలంలోని ఆనార్పల్లి, లక్మాపూర్ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్‌ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఉమ్రి క్రాస్ రోడ్ నుండి పరండోలి తండా వరకు బీటీ రహదారి నిర్మాణానికి అటవీ శాఖ నుంచి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించి పనులు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు రమేష్ తెలిపారు.

13-06-2026

article_77732817.webp
పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలం బంబార గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా దోమల నివారణ మందును పిచికారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి హెచ్‌ఈఓ రవిదాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఆవరణలో ఏసీఎం (5%) మందును పిచికారీ చేసి దోమల వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టారు. గ్రామ సర్పంచ్ బెండారే కృష్ణాజీ హాజరై పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెచ్‌ఈఓ రవిదాస్ మాట్లాడుతూ... డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ఈ చర్యలు ఉపయోగ పడతాయని అన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం సునంద, ఆశ వర్కర్ లక్ష్మీతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

13-06-2026