calender_icon.png 28 January, 2026 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_37097119.webp
డ్రైనేజీ నిండి ఇండ్ల ముందుకు చేరిన మురికి నీరు

28-01-2026

బెజ్జూర్ జనవరి 28 (విజయ క్రాంతి): కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని బాలాజీ నగర్ లో డ్రైనేజీ నుండి ఇండ్ల ముందుకు మురికి నీరు చేరిందని కాలనీ ప్రజలు వాపోతున్నారు. డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారంతో నిండిపోయి మురికి నీరు ఇండ్ల ముందుకు చేరడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల ముందుకు మురికి నీరు చేరడంతో కాలనీవాసులు రోడ్డుమీద నిరసన తెలిపారు.గత కొన్ని రోజుల నుండి డ్రెయినేజీ నిండి ఇండ్ల లోకి మురుగు నీరు వస్తుందని మునిసిపల్ అధికారుల చెప్పిన పట్టించుకోవడం లేదని దీనితో కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తమ సమస్య పరిష్కరించాలని నిరసనకు దిగినట్లు తారని ప్రజలు తెలిపారు.

article_56831610.webp
కాంగ్రెస్‌కు షాక్...!

28-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పట్టణంలోని బజార్‌వాడికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ ఆధ్వర్యంలో 50 మందికి పైగా కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కోవ లక్ష్మి వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ, ప్రజల పక్షాన పోరాడే ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ గడప ఎల్లప్పుడూ తెరిచే ఉందని భరోసా ఇచ్చారు. కోవ లక్ష్మి నాయకత్వంలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.అనంతరం తమ ప్రాంతంలో నెలకొన్న రోడ్లు, నీటి సరఫరా, కాలనీలలోని పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్, మాజీ సర్పంచ్ మర్సకోల సరస్వతి, మాజీ వైస్ ఎంపీపీ కలాం,నాయకులు షాకీర్, నిస్సార్ ,అన్సార్, పొన్నాల నారాయణ, సయ్యద్ జావీద్, హకీం అన్సారి, షకీల్, సాజిద్, ఎం.డి. తాజ్, అఖిల్, సబిల్, ఐఫాన్, ఫర్జిన్ తదితరులు పాల్గొన్నారు.

article_66585429.webp
విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి

28-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): విద్యార్థులకు అర్థమయ్యే రీతి లో నాణ్యమైన బోధన అందించడంతోపాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ మండలంలోని పాడిబండ గ్రామం లో గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పరిస్థితు లను పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులు, బోధనా విధానం, విద్యార్థుల అభ్యా స స్థాయిని పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అవగాహనను పరీక్షించా రు. ఈ సందర్భంగా రాగి జావాను స్వయంగా రుచి చూశారు.

article_15063292.webp
అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించం

28-01-2026

బెజ్జూర్, జనవరి 27 (విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను పక్కదారి పట్టిస్తే ఎంతటి వారైనా ఉపే క్షించేది లేదని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు స్పష్టం చేశారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆయన పా ల్గొని అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై చర్య లు ప్రకటించారు. మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 7.25 కోట్ల వ్యయంతో చేపట్టిన 828 పనులపై ఎస్‌ఆర్పీ రవి నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఓ హెచ్చరించా రు.

article_72064868.webp
సంపూర్ణత అభియాన్ కార్యాచరణ రూపొందించాలి

28-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): సంపూర్ణత అభియాన్2.0 కార్యక్రమంలో భాగంగా ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్‌లో చేపట్టాల్సిన అంశాలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. తిర్యాణి మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయం లో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి పాల్గొన్నారు. ఈ సం దర్భంగా విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా చేపట్టే పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సమర్థంగా సన్నద్ధం చేయాలని విద్యార్థినుల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.