ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి
29-11-2025
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, విధులలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దీపక్ తివారి తెలిపారు. శనివారం జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, త్రాగునీటి సౌకర్యం, ఇతర సదుపాయాలను పరిశీలించారు.