calender_icon.png 31 January, 2026 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_36005449.webp
పదవ తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలి

30-01-2026

కుమ్రం భీం అసిఫాబాద్(విజయ క్రాంతి): పదవ తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు . శుక్రవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా తరగతి గదులను సందర్శించి, బోధనా తీరు, విద్యా ప్రమాణాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం తక్కువ వుండట గల కారణాలను ,ప్రధానోపాధ్యాయుని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు 100 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడికి రప్పించాలని అన్నారు.