calender_icon.png 26 January, 2026 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_29019852.webp
తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026

వాంకిడి, జనవరి 26(విజయ క్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కవిత ఆధ్వర్యం లో జాతీయ జెండాను ఆవిష్క రించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయ డంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచే యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతి నిధులు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, మండల అధికారులు, కార్యాలయ సిబ్బంది , గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్థిని, విద్యార్థు లు తదితరులు పాల్గొని గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్య తను గుర్తు చేసుకున్నారు. దేశ భక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది.

article_48042183.webp
పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హరిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి , ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా ఎస్పీ నితిక పంత్, జాయింట్ కలెక్టర్ డేవిడ్, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, డీఎఫ్‌ఓ నిరజ్ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

article_13596235.webp
బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

26-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్ తో కలసి జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి, దేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని గుర్తు చేశారు.1949 నవంబరు 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటికీ, 1930లో కాంగ్రెస్ ప్రకటించిన ‘పూర్ణ స్వరాజ్’ దినోత్సవాన్ని స్మరించుకుంటూ జనవరి 26న అమలు చేసినట్లు వివరించారు. అలాగే 1930 జనవరి 26న లాహోర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో సంపూర్ణ స్వాతంత్ర్య ప్రతిజ్ఞ జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు సైనిక పరేడ్ నిర్వహించటం జరుగుతుందని,దేశవ్యాప్తంగా పాఠశాలలు, కార్యాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగ విలువలు, సమానత్వం, స్వేచ్ఛలను గుర్తుచేసే గొప్ప దినమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్నాక విజయ్, విశాల్ ఖండ్రే, సెర్ల మురళి, కోవ విజయ్, కొలిపాక కిరణ్, గోలెం తిరుపతి, మౌనిక, కోట గొల్లయ్య, మెరుగు శంకర్‌,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

article_71539509.webp
డీసీసీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డీసీసీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం దేశ ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. రాజ్యాంగ ఆశయాలను కాపాడుకుంటూ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. దేశ ఐక్యత, సమానత్వం, సామాజిక న్యాయం అనే విలువలే కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకాలని అన్నారు.

article_46800515.webp
రాజ్యాంగ విలువలకు కట్టుబడి బాధ్యతాయుత పౌరులుగా జీవించాలి

26-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాతృభూమి కోసం ఎందరో మహానీయులు ప్రాణత్యాగాలు చేసిన ఫలితంగా మనకు రాజ్యాంగం లభించిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం దేశానికి అమూల్యమైన మార్గదర్శకమని, ఈ రోజున ఆ మహానీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.రాజ్యాంగ విలువలు, ఆశయాలకు లోబడి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు.