సీఎం జనజాతర సభకు మార్లవాయి గ్రామస్తుల భారీ తరలింపు
జైనూర్, మే 31, (విజయ క్రాంతి) : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ వార్షికోత్సవం సందర్భంగా కాగజ్నగర్ ఎక్స్రోడ్, ఆసిఫాబాద్లో నిర్వహించనున్న సీఎం జనజాతర సభకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, జైనూర్ మండలం, మార్లవాయి గ్రామ ప్రజలు భారీగా తరలివెళ్తున్నారు.గ్రామ సర్పంచ్ కనక ప్రతిభ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, పెద్దలు ఉత్సాహంగా బయలుదేరారు. ఉప సర్పంచ్ ఆత్రం రాజేశ్వర్, VO అధ్యక్షులు కనక రూపబాయి, వార్డు సభ్యులు సర్జబాయి, కనక భరత్, కొడప పుల్లబాయి, VAO తొడసం సీత తదితరులు సభలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామ ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఈ తరలింపు స్పష్టంగా చాటుతోంది.
01-06-2026