8 May, 2026 | 7:10 AM

Districts - Kumarambheem Asifabad

article_34119199.webp
రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలం సామెల గ్రామంలో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రొఫెసర్ అనురాధ, సౌజన్య పాల్గొని రైతులకు పంటల సాగులో మెలకులవల పై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. పంట సాగులో యూరియా వాడకం, పెట్టుబడులు తగ్గించడం, మట్టి పరీక్షలు, నేల ఆరోగ్యాన్ని కాపాడు కోవడం వంటి విషయాలపై వివరించారు. ఈ సందర్భం గా వాంకిడి మండల వ్యవ సాయ అధికారి గోపికాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మండల రైతులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవో అరవింద్, గ్రామ సర్పంచ్ సంతోష్‌తో, రైతులు తదితరులు పాల్గొన్నారు.

07-05-2026

article_38000779.webp
వంతెన పై రక్షణ కరువు..!

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రం నుంచి లంజన్ వీర గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గ్రామ సమీపంలో వాగుపై నిర్మించిన,వంతెన (బ్రిడ్జి) సైడ్ వాల్స్ పడిపోయి ప్రమాదకరంగా మారి వాహనదారులకు రక్షణ కరువైంది. ఇదే రహదారి మీదుగా లంజన్ వీర,ఖైరీట్ తో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు ఆటో, ట్రాక్టర్, ద్విచక్ర వాహనాల ద్వారా వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. ద్విచక్ర వాహన చోదకులు రాత్రిళ్లు ఏ మాత్రం అంద మరచిన వాగులో పడడం ఖాయం. సంబంధిత అధి కారులు వాగు పై నిర్మించి ఉన్న వంతెనకు సైడ్ వాల్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని, వాహన చోదకులు, ప్రజలు కోరుతు న్నారు.

06-05-2026

article_69075758.webp
పీఏసిఎస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జాబోరే పెంటయ్య

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం వాంకిడి పీఏసీఎస్ చైర్మన్ గా జాబోరే పెంటయ్య బుధవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు (DCO) జిల్లా కో-ఆపరేటివ్ పర్సనల్ ఇంచార్జ్ బి.మోహన్ గౌడ్ చేతుల మీదు గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జాబోరే పెంటయ్య మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామ న్నారు. ఈ సంద‌ర్భంగా వాంకిడి సర్పంచ్ చునర్కర్ సతీష్,పీఏసీఎస్ వైస్ చైర్మన్ నేపాజి, బంబార సర్పంచ్ బెండరే క్రిష్టాజీ, సారండీ మాజీ సర్పంచ్ దుర్గం కమలాకర్, డైరెక్టర్లు గొల్ల, దిగంబర్, చప్లే సీతారాం, సిఈఓ ఒమాజీ, సుధాకర్, మండల బీఆర్ఎస్ నాయకు లు మండల బీఆర్ఎస్ కార్య కర్తలు, పీఏసీఎస్ సిబ్బంది పీఏసీఎస్ చైర్మన్ జాబోరే పెంటయ్యకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాం క్షలు తెలిపారు.

06-05-2026