30 May, 2026 | 7:20 PM

Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆనందం   •   బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి   •   ఉపాధ్యాయుని సేవలు ప్రజలు మరిచిపోలేరు: ఎమ్మెల్యే   •   వెల్నెస్ హాస్పిటల్ 8వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని   •   అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుంది   •   మహిళా శక్తి సూపర్ మార్కెట్లు ఏర్పాట్లు చేస్తాం   •   మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి   •   విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు ఎంపీడీవో   •   వరి కొయ్యలకు నిప్పు పర్యావరణానికి ముప్పు   •   బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి: కలెక్టర్ అంకిత్   •  

Districts - Kumarambheem Asifabad

article_10206079.webp
భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు

జైనూర్, మే 30 (విజయక్రాంతి): వేసవి తీవ్రతతో జంగం గ్రామపంచాయతీ పరిధిలోని సడక్ గూడలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో బోర్లు, కుళాయిల్లో నీరు రాకపోవడంతో గ్రామ ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ పెందూర్ అనుసయా అర్జున్, ఉప సర్పంచ్ సయ్యద్ సజ్జద్ అలీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. ప్రతి వీధికి ట్యాంకర్ పంపించి ప్రజలకు నీటిని అందించారు.ట్యాంకర్ నీటితో తాత్కాలిక ఉపశమనం లభించిందని గ్రామస్థులు తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం అదనపు బోర్లు, పైపులైన్ మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ అనుసయా అర్జున్ తెలిపారు.

30-05-2026

article_54874697.webp
క్షయవ్యాధిగ్రస్తులను అధికారులు దత్తత తీసుకోవాలి

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లాలో ఉన్న క్షయవ్యాధిగ్రస్తులను అధికారులు దత్తత తీసుకుని వారికి అవసరమైన మందులు, పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లాలో ప్రస్తుతం 464 మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారని పేర్కొంటూ, వారికి నెలవారీగా అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. చాలామంది దగ్గు, బరువు తగ్గడం వంటి లక్షణాలను బయటపెట్టకుండా మౌనంగా బాధపడుతున్నారని, సమాజంలో చిన్నచూపు భయంతో చికిత్సకు దూరమవుతున్నారని అన్నారు.అలాంటి వారిని గుర్తించి అవగాహన కల్పించి సరైన వైద్య సేవలు అందించాలని సూచించా

29-05-2026

article_73905532.webp
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): యువత మాదకద్రవ్యాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.“నషా ముక్త్ భారత్” లక్ష్యంగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకోవాలని సూచించారు.సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు మౌనంగా ఉండకూడదని, ప్రజా వ్యతిరేక చర్యలను అరికట్టేందుకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

29-05-2026

article_57410335.webp
ప్రజారోగ్య సేవలు మరింత మెరుగుపర్చాలి

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేసి ఆకాంక్షిత జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ కె. హరిత శాఖల వారీగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎస్పీ నితికా పంత్ జిల్లాలో శాంతిభద్రతలు, మాదకద్రవ్యాల నియంత్రణ చర్యలపై వివరించారు.

29-05-2026