పెండింగ్లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
బెజ్జూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ బిమ్లా నాయక్ కు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యచరణ కమిటీ నిర్ణయానుసారం తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని వారు కోరారు.
17-04-2026