calender_icon.png 6 February, 2026 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_16347444.webp
ఘనంగా ఎల్లారం పోచమ్మ బోనాలు

06-02-2026

బెజ్జూర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మండలంలోని మత్తడి స్ప్రింగ్ గానకట్ట సమీపంలో ఎల్లారం పోచమ్మ బోనాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. రెబ్బన మండలంలోని ఇందిరానగర్ శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థాన ప్రధాన అర్చకుడు దేవర వినోద్‌స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జిల్లాల సుధాకర్ గౌడ్, జాతర నిర్వాహకులు కొండవీటి భాస్కర్ రాజ్, సర్పంచ్ చెండే పద్మ శంకర్, కృష్ణ పల్లి సర్పంచ్ లావణ్య, కొట్రంగి రామకృష్ణ, కేశెట్టి శ్రీనివాస్, గోపాల్, వెంకటి, సామల తిరుపతి, విట్టయ్య భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

article_20442773.webp
కలెక్టరేట్‌లో బినామీ ఉద్యోగి బట్టబయలు

06-02-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో గల వివిధ శాఖల కార్యాలయాలను గురువారం జిల్లా కలెక్టర్ కె. హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లో ఫీల్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి తన స్థానం లో ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించి విధులు చేయిస్తున్న విషయం కలెక్టర్ సాక్షిగా బయటపడింది. ఈ ఘటనపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.మరో కార్యాలయం వద్ద పట్టపగలు విద్యుత్ దీపాలు వెలుగుతుండటాన్ని గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. లైట్లు స్విచ్ ఆఫ్ చేయడానికి సమయం లేకపోతే తనకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే తానే వచ్చి ఆఫ్ చేస్తానని వ్యాఖ్యానించారు.

article_82489843.webp
అవార్డులు బాధ్యతను పెంచుతాయి

06-02-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): అవార్డులు బాధ్యతను మరింత పెంచుతాయని ప్రముఖ సినీ, టీవీ నిర్మాత, దర్శకుడు, రచయిత దండనాయకుల సురేష్ కుమార్ అన్నారు.గురువారం ఆసిఫాబాద్ కవుల సంఘం (ఆకసం) ఆధ్వర్యంలో నిర్వహించిన 102వ నెలపొడుపు కవి సమ్మేళన కార్యక్రమం ఆయన స్వగృహంలో జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల ధర్మపురి పుణ్యక్షేత్రంలోని శేషప్ప కళావేదికలో అష్టావధానం నిర్వహించి ప్రశంసలు పొందిన ప్రముఖ అష్టావధాని మాడుగుల నారాయణ మూర్తిని, తెలుగు వెలుగు సాహితీ వేదిక వారి మహానంది పురస్కారం పొందిన చిలుకూరి రాధాకృష్ణ చారిని, శ్రీశ్రీ కళావేదిక జాతీయ పురస్కారం పొందిన దర్ని శ్రీలతను ఆకసం, నవజ్యోతి సభ్యులు శాలువాలు, పూలమాలల తో ఘనంగా సత్కరించారు.

article_51729388.webp
పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

05-02-2026

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత పేర్కొన్నారు.గురువారం జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు ఆలోక్ కుమార్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, శిక్షణ ఐఏఎస్ అధికారి భార్గవ్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.