29 June, 2026 | 1:26 PM

Districts - Kumarambheem Asifabad

article_40398503.webp
ఆదివాసీ ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేసిన రేంజ్ అధికారిపై చర్యలు తీసుకోవాలి

జైనూర్, జూన్ 25 (విజయ క్రాంతి) : ఆదివాసీ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అటవీ శాఖ రేంజ్ అధికారి రమేశ్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఎన్నో ఏళ్లుగా పోడు రైతులు సాగు చేసుకుంటున్నారని, విత్తనాలు వేసే సమయంలో అటవీ శాఖ అధికారులు ఇబ్బంది పెట్టడం సరికాదని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాల్ పేర్కొన్నారు.

25-06-2026