18 July, 2026 | 8:31 PM

Breaking News

ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి   •   ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •   పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!   •   కేసుల పరిష్కారానికి కృషి జరగాలి   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి   •   సూర్యాపేట జిల్లా సృష్టికర్త జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •  

Districts - Kumarambheem Asifabad

article_87362922.webp
వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): వట్టివాగు ప్రాజెక్టును ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించిన ఆమె, వట్టివాగు కెనాల్ మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేసి వరి సాగు చేస్తున్న రైతులకు సకాలంలో సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం నమోదవుతున్న వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల సింగిల్ విండో చైర్మన్ సంజీవ్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

18-07-2026