calender_icon.png 5 January, 2026 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_34590780.webp
పోగొట్టుకున్న సెల్‌ఫోన్ అందజేత

05-01-2026

వాంకిడి(విజయ క్రాంతి): పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా ఆచూకీ కనుగొని సోమవారం బాధితుడికి అందజేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. వాంకిడి మండలం గోయగాం గ్రామపంచాయతీ, మహాగాంకి గ్రామానికి చెందిన ఎస్.కె. లతీఫ్ వాంకిడి మార్కెట్ ప్రాంతంలో తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. అదే రోజు స్థానిక వాంకిడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి, సెల్‌ఫోన్ ఆచూకీని గుర్తించి స్వాధీనం చేసుకొని బాధితుడికి అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. సెల్‌ఫోన్ పోయిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

article_72195280.webp
మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

05-01-2026

కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి ౪ (విజయక్రాంతి): జిల్లాలోని మున్సిపాలిటీ లలో వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. ఆదివారం జిల్లాలోని ఎం. సి. గఫి ఆంగ్ల మాద్యమ పాఠశాల, డి. ఎ. వి. లక్ష్మీ పత్ సింఘానియా పాఠశాలలను సందర్శించి కాయ పోలింగ్ కేంద్రాల పరిధిలో కల్పిస్తున్న సౌకర్యాలు, సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, మున్సిపల్ కమిషనర్ లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలోని వార్డులలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.

article_36993442.webp
ఉత్తమ ఫలితాల సాధన దిశగా చర్యలు

05-01-2026

కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 4(విజయక్రాంతి): 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలె క్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి రికార్డులు, విద్యా బోధన తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని తెలిపారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించి, మెనూ ప్రకారం పౌష్టిక ఆహా రం, శుద్ధమైన త్రాగునీటిని అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని తెలిపారు.

article_90077114.webp
కార్మికుల సమ్మెకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు

04-01-2026

బెజ్జూర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సమ్మెలో భాగంగా కార్మికులు వెంటనే జీతాలు చెల్లించాలని నిరసన తెలుపుతూ మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిద్రిస్తుండగా కార్మికులతో కలిసి బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిద్రించి నిరసన తెలిపారు. ప్రభుత్వ మొండివైఖరి నశించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు .కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి మున్సిపల్ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.