23 February, 2026 | 5:22 PM
23-02-2026
పట్టణంలోని 17వ వార్డులో వాటర్ మోటర్ చెడిపోవడం వల్ల కాలనీవాసులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ తన స్వంత నిధులతో నూతన వాటర్ మోటర్ ఏర్పాటు చేయడంతో కాలనీవాసుల నీటి సమస్య పరిష్కారమైంది.
మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో సోమవారం సంత్ గాడ్గే బాబా 149వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిం చారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిం చారు.అనంతరం ఈ కార్యక్ర మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా బౌద్ద మతం గురు బంతే భరద్వాజ్,
దేశవ్యాప్తంగా అమలవుతున్న టీబి ముక్త్ భారత్ అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా సమగ్ర సర్వే నిర్వహణపై వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కె. హరితకు వినతిపత్రం సమర్పించారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
హిరపూర్ గ్రామ ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. రేషన్ సరుకుల కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, వచ్చే మార్చి నెల నుండి గ్రామంలోనే రేషన్ పంపిణీ చేసేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (TDSA) సిర్పూర్ కాగజ్నగర్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని రాస్పల్లి, పెద్దబండ, ఎల్కపల్లి, బారెగూడ గ్రామాలను దత్తత తీసుకున్నారు.
22-02-2026
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్ప ర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికల సందర్భం గా విప్ను ధిక్కరించి ఓటింగ్ చేసినందుకు 13వ వార్డు కౌన్సిలర్ (కాంగ్రెస్ పార్టీ) గుండా స్నేహను కౌన్సిలర్ పదవికి అనర్హురాలిగా ప్రకటించారు.
21-02-2026
“ప్రకృతిని రక్షించుకుందాం – వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందిద్దాం – రాజ్యాంగాన్ని కాపాడుకుందాం” అనే నినాదంతో బయలుదేరిన ప్రకృతి–వైజ్ఞానిక యాత్ర బృందం జిల్లాకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో నిర్వహించిన సభలో పలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ సభకు విజ్ఞాన దర్శిని రాష్ట్ర కార్యదర్శి అలీ అధ్యక్షత వహించారు.
వాంకిడి మండలం బనార్ కొసరా గ్రామానికి చెందిన నాగోశే రవీందర్ (31) ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వాంకిడి ఎస్సై డి. మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం, రవీందర్ మద్యం అలవాటుకులోనై పనులు చేయకుండా ఇంటిని పట్టించుకోకుండా తిరుగుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
సిర్పూర్ నియోజకవర్గంలో పత్తి కొనుగోలు గడువును వెంటనే పొడిగించాలని కోరుతూ రైతులు, బిఆర్ ఎస్ నాయకులు శనివారం కాగజ్నగర్ తహసిల్దార్ మధుకర్కు వినతిపత్రం సమర్పించారు.
కాగజ్ నగర్ మండలంలోని భట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో భామనిచేనులో గతవారం రోజులుగా జరుగుతున్న ట్రై విలేజ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి. గెలుపొందిన జట్లకు సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు బహుమతులను ప్రధానం చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం చోర్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ కమ్మరి బాయక్క (75) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ప్రస్తుత చోర్పల్లి గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్మరి పెంటయ్య తల్లి బాయక్క కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.బాయక్క కుటుంబం గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ గ్రామాభివృద్ధి, పార్టీ బలోపేతానికి సేవలందిస్తోంది.