calender_icon.png 22 January, 2026 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_65344012.webp
ఏజెన్సీ హక్కులు కల్పించాలి

22-01-2026

జైనూర్, (విజయక్రాంతి):ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో పాటు తాతలు–ముత్తాతల కాలం నుంచి నివసిస్తున్న ఏజెన్సీ దళితులకు ప్రభుత్వ పరంగా పథకాలు, హక్కులు కల్పించాలని, రైతులకు పట్టాలు, పహాణీలు మంజూరు చేయాలని కోరుతూ గురువారం మండలంలోని జంగాం గ్రామంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జేఏసీ జిల్లా నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జేఏసీ జిల్లా నాయకులు కాంబ్లే బాబాసాహెబ్, మావలే దత్త మాంగ్, కాంబ్లే అన్నారావు, ఘాటే రామారావులు మాట్లాడుతూ ఏజెన్సీ ఎస్సీల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అదేవిధంగా తలసేమియా, సికిల్ సెల్ జిల్లా కోఆర్డినేటర్ ఆడ వెంకటేష్‌తో పాటు పలువురు నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేశారు.

article_67398139.webp
తపస్ జిల్లా అధ్యక్షుడిగా ఆడే శ్రావణ్ కుమార్

22-01-2026

కుమరం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, తపస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు బండి రమేష్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తపస్ జిల్లా అధ్యక్షుడిగా ఆడే శ్రావణ్ కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాచర్ల మధు వర్మను అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు ఆడే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని, తపస్‌ను జిల్లాలో మరింత విస్తరించే దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో తపస్ సభ్యులు వినయ్, సతీష్, సంతోష్, నగేష్, వెంకటేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

article_44260514.webp
బడ్జెట్‌లో ప్రతి అంశం ఉండేలా చూస్తున్నాం

22-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): బడ్జెట్ రూపొందించే సమయంలో తాను పాదయాత్రలో చూసిన, విన్న ప్రజల కష్టాలు తీరేలా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం సాయంత్రం ఆసిఫాబాద్ జిల్లా మోడీ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.పాదయాత్ర సందర్భంగా మోడీ జూరి గ్రామానికి వచ్చిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆరోజు ఉగాది పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు గ్రామంలోనే ఉన్నానని తెలిపారు. ఏరువాక సందర్భంగా వెంకట్రావు పొలంలో అరక దున్ని, ఎద్దులకు బెల్లం–కొబ్బరి తినిపించానన్నారు.అనంతరం లక్ష్మణరావు పటేల్ ఇంట్లో గ్రామస్తులంతా కలిసి గుగ్గిల్లి తిని, భోజనం చేసిన సంఘటనలను గుర్తు చేశారు.తాను పాదయాత్ర చేసిన గ్రామాలు, అక్కడి మనుషులు, వారి సమస్యలను ఏ ఒక్కటినీ మర్చిపోలేదని స్పష్టం చేశారు.

article_19925501.webp
మురికి కాలువలను శుభ్రంగా ఉంచాలి

22-01-2026

వాంకిడి,(విజయక్రాంతి): గ్రామంలో పారిశుద్ధ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మురికి కాలువల్లో చెత్త వేయకుండా శుభ్రత పాటించాలని వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చునార్క సతీష్ గ్రామస్తులకు సూచించారు. గురువారం గ్రామపంచాయతీ పరిధిలోని మాండోకర్‌వాడలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను గ్రామపంచాయతీ కార్యదర్శి శివకుమార్‌తో కలిసి సర్పంచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడం వల్ల మురుగు నీరు సరిగా ప్రవహించక ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించారు. వెంటనే గ్రామపంచాయతీ సఫాయి కార్మికులతో కాలువల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించి శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.

article_57090700.webp
సందీర్ కీ రామ్ రామ్

22-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): సందీర్ కీ రామ్ రామ్ ఆదివాసీలను ఆప్యాయంగా జిల్లా కలెక్టర్ కె. హరిత పలకరించారు. గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా పర్యటనలో భాగంగా జైనూరు మండలం జామ్ గాంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ గోండి భాషలో మాట్లాడడంతో అక్కడున్న ఆదివాసీలు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతం భావోద్వేగంతో ముడిపడి ఉందని తెలిపారు. కుమ్రంభీం జిల్లాకు కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు.200 శాతం జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.

article_72150348.webp
కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చా

22-01-2026

కుమ్రం భీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రావాలని అది వచ్చేవరకు విశ్రమించమని పీపుల్స్ మార్చ్ లో తనతో పాటు అనేకమంది నడిచారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి రాగానే మళ్లీ రావాలని మీరంతా దీవించి పంపారు, మీరంతా చెప్పినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ సమస్యలు తీరుస్తుంది, మీరు కోరుకున్నట్టే కృతజ్ఞతలు తెలవడానికి తాను వచ్చానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండలం జాంగాం క్రమంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెచ్చుకున్న రాష్ట్రంలో స్వేచ్ఛ పోయింది, ఈ ప్రాంత సంపద ఇక్కడి ప్రజలకు చెందాలని ఆనాడు మీరు కోరారు .మీరు కోరిన విధంగానే ప్రజా ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం, అభివృద్ధి సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పీపుల్ స్పార్ట్స్ పాదయాత్ర లో భాగంగా ఆనాడు ప్రతిరోజు నన్ను కలిసిన వారిని, వారు విజ్ఞప్తి చేసిన సమస్యలను వివరంగా రాసుకున్నాను. బడ్జెట్లో ఆయా అంశాల పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నానని తెలిపారు.