టీఎస్ టి డబ్ల్యూటియు డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం (TS-TWTU) జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ , నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగులు-ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే TS-TWTU యొక్క ప్రధాన ఎజెండాగా కొనసాగాలని సూచించారు. గిరిజన మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తున్న గిరిజన ఉద్యోగుల సంక్షేమం కోసం TS-TWTU స్థాపనతో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.అనంతరం TS-TWTU పీజీ హెడ్మాస్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పూర్కా ఉద్దవ్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేలా సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా CRT ఉపాధ్యాయుల సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో TS-TWTU జిల్లా అధ్యక్షులు రాథోడ్ రవీందర్, జిల్లా కోశాధికారి కూడ్మేత అనంత్, రాష్ట్ర నాయకులు కోవ సోనేరావ్, మహిళా కార్యదర్శి కొట్నాక్ శకుంతల, కార్యదర్శులు కూడ్మేత జంగు, లింబారావ్, శ్యాంరావ్ తదితరులు పాల్గొన్నారు.
26-02-2026