18 June, 2026 | 3:04 PM

Breaking News

అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్ లను పంపిణీ చేశాం: ఎంఈఓ   •   ఏబీవీపీ ఆధ్వర్యంలో డిఇఓ కార్యాలయం ముట్టడి   •   పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మద్ది చంద్రకాంత్ రెడ్డి   •   సీఎం క్యాంప్ ఆఫిస్ ముట్టడికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రతి గ్రామంలో డ్వాక్రా భవనాల నిర్మాణం పూర్తి చేయండి: ఎంపీడీవో   •   క్రమశిక్షణతో కృషి చేస్తే లక్ష్యాలు సాధ్యం - గజ్వేల్ సీఐ రవికుమార్   •   అక్రిడేషన్‌తో పాటు సంక్షేమ భరోసా   •   బోరు బావుల వద్ద చినుకులు గుంతల నిర్మాణం తప్పనిసరి: ఎంపీడీవో   •   శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో హుండీ ధ్వంసం   •   కేశంపేట్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్   •  

Districts - Kumarambheem Asifabad

article_33238518.webp
అక్రిడేషన్‌తో పాటు సంక్షేమ భరోసా

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పాత్రికేయుల సంక్షేమానికి మరింత భరోసా కల్పించే దిశగా జిల్లాలో నూతన అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి వై. సంపత్ కుమార్ తెలిపారు. 2026–2028 సంవత్సరాలకు సంబంధించిన అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ అక్రిడేషన్ కార్డుల పంపిణీతో పాటు రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు చేపట్టడం విశేషమన్నారు.

18-06-2026

article_72092271.webp
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి

​వాంకిడి, (విజయక్రాంతి): విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జైత్‌పూర్ సర్పంచ్ కోలే జ్యోతి పిలుపునిచ్చారు. బుధవారం వాంకి మండలం జైత్‌పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నుండి ఉచితంగా అందించిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులను విద్యార్థులకు ఆమె పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధనతో పాటు ఉచితంగా దుస్తులు, భోజనం, పుస్తకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరినీ తల్లిదండ్రులు క్రమం తప్పకుండా తమ పిల్లలను బడికి పంపాలని, ఇంట్లోనూ చదివించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీ దుర్గం సందీప్, హెచ్‌ఎం రాధ, గ్రామ నాయకులు పత్రు, తిరుపతి, సదాశివ తదితరులు పాల్గొన్నారు.

17-06-2026

article_76984339.webp
పోస్టాఫీస్ బీమా పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ కల్పించే పోస్టాఫీస్ అనుబంధ బీమా పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత పిలుపునిచ్చారు. బుధవారం బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామానికి చెందిన సీహెచ్ లక్ష్మి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా రూ.436 వార్షిక ప్రీమియంతో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పాలసీ తీసుకున్నారు. ఇటీవల ఆమె అనారోగ్యంతో మృతి చెందగా, పాలసీ నిబంధనల ప్రకారం నామినీ అయిన ఆమె సోదరి కే. పేంటుబాయికి రూ.2 లక్షల బీమా చెక్కును కలెక్టర్ హరిత అందజేశారు.

17-06-2026