విద్యార్థి శక్తి - పర్యావరణ శక్తి
బెజ్జూరు,జూలై 8, (విజయక్రాంతి): జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మండల శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా,మండల నాయకులు, కార్యకర్తలు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొని సుమారు 100 మొక్కలు నాటారు. వేప, మర్రి, రావి, నిమ్మ, వంటి పర్యావరణానికి మేలు చేసే మొక్కలను పాఠశాల ఆవరణ, బస్టాండ్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నాటారు.ఈ సందర్భంగా ఏబీవీపీ మండల ఇన్చార్జి విశ్వాత్ గౌడ్ మాట్లాడుతూ,"స్వామి వివేకానంద స్ఫూర్తితో ఏర్పడిన ఏబీవీపీ 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. విద్యార్థి దినోత్సవం రోజున కేవలం వేడుకలు చేసుకోవడం కాదు, సమాజానికి ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతో మొక్కలు నాటాం. ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి, దానిని పెంచే బాధ్యత తీసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడడమే దేశభక్తి" అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కంబాల అనేవేష్,గర్లపల్లి చరణ్, మద్దూరి బన్నీ,కేశెట్టి కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
08-07-2026