calender_icon.png 22 January, 2026 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_44260514.webp
బడ్జెట్‌లో ప్రతి అంశం ఉండేలా చూస్తున్నాం

22-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): బడ్జెట్ రూపొందించే సమయంలో తాను పాదయాత్రలో చూసిన, విన్న ప్రజల కష్టాలు తీరేలా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం సాయంత్రం ఆసిఫాబాద్ జిల్లా మోడీ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.పాదయాత్ర సందర్భంగా మోడీ జూరి గ్రామానికి వచ్చిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆరోజు ఉగాది పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు గ్రామంలోనే ఉన్నానని తెలిపారు. ఏరువాక సందర్భంగా వెంకట్రావు పొలంలో అరక దున్ని, ఎద్దులకు బెల్లం–కొబ్బరి తినిపించానన్నారు.అనంతరం లక్ష్మణరావు పటేల్ ఇంట్లో గ్రామస్తులంతా కలిసి గుగ్గిల్లి తిని, భోజనం చేసిన సంఘటనలను గుర్తు చేశారు.తాను పాదయాత్ర చేసిన గ్రామాలు, అక్కడి మనుషులు, వారి సమస్యలను ఏ ఒక్కటినీ మర్చిపోలేదని స్పష్టం చేశారు.

article_19925501.webp
మురికి కాలువలను శుభ్రంగా ఉంచాలి

22-01-2026

వాంకిడి,(విజయక్రాంతి): గ్రామంలో పారిశుద్ధ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మురికి కాలువల్లో చెత్త వేయకుండా శుభ్రత పాటించాలని వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చునార్క సతీష్ గ్రామస్తులకు సూచించారు. గురువారం గ్రామపంచాయతీ పరిధిలోని మాండోకర్‌వాడలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను గ్రామపంచాయతీ కార్యదర్శి శివకుమార్‌తో కలిసి సర్పంచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడం వల్ల మురుగు నీరు సరిగా ప్రవహించక ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించారు. వెంటనే గ్రామపంచాయతీ సఫాయి కార్మికులతో కాలువల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించి శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.

article_57090700.webp
సందీర్ కీ రామ్ రామ్

22-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): సందీర్ కీ రామ్ రామ్ ఆదివాసీలను ఆప్యాయంగా జిల్లా కలెక్టర్ కె. హరిత పలకరించారు. గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా పర్యటనలో భాగంగా జైనూరు మండలం జామ్ గాంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ గోండి భాషలో మాట్లాడడంతో అక్కడున్న ఆదివాసీలు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతం భావోద్వేగంతో ముడిపడి ఉందని తెలిపారు. కుమ్రంభీం జిల్లాకు కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు.200 శాతం జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.

article_72150348.webp
కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చా

22-01-2026

కుమ్రం భీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రావాలని అది వచ్చేవరకు విశ్రమించమని పీపుల్స్ మార్చ్ లో తనతో పాటు అనేకమంది నడిచారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి రాగానే మళ్లీ రావాలని మీరంతా దీవించి పంపారు, మీరంతా చెప్పినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ సమస్యలు తీరుస్తుంది, మీరు కోరుకున్నట్టే కృతజ్ఞతలు తెలవడానికి తాను వచ్చానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండలం జాంగాం క్రమంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెచ్చుకున్న రాష్ట్రంలో స్వేచ్ఛ పోయింది, ఈ ప్రాంత సంపద ఇక్కడి ప్రజలకు చెందాలని ఆనాడు మీరు కోరారు .మీరు కోరిన విధంగానే ప్రజా ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం, అభివృద్ధి సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పీపుల్ స్పార్ట్స్ పాదయాత్ర లో భాగంగా ఆనాడు ప్రతిరోజు నన్ను కలిసిన వారిని, వారు విజ్ఞప్తి చేసిన సమస్యలను వివరంగా రాసుకున్నాను. బడ్జెట్లో ఆయా అంశాల పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నానని తెలిపారు.

article_58520189.webp
భక్తి శ్రద్దలతో రుద్ర సహిత గురు దక్షిణమూర్తి హోమం

22-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీ పార్వతి సమేత బాలేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ( రథోత్సవ)సహిత కాంతియాగ నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని పెద్దవాగు సమీపంలో గల బాలేశ్వర స్వామి ఆలయంలో వేత పండితులు రవిచంద్ర చందావార్, ఈదులవాడ శ్రావణ్, బాలేశ్వర్ల ఆధ్వర్యంలో రుద్ర సహిత గురు దక్షిణమూర్తి హోమం, పార్వతీ సమేత బాలేశ్వరస్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజోపచారములు, మంగళహారతి, మహామంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుండి మహా అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

article_19987098.webp
మున్సిపల్ ఎన్నికల్లో కాగజ్‌నగర్‌ను బీఎస్పీ కైవసం చేసుకోవాలి

22-01-2026

బెజ్జూర్,(విజయక్రాంతి): బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బెజ్జూర్ మాజీ సర్పంచ్ అన్సార్ హుస్సేన్,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ హకీమ్‌,పార్టీలో చేరడం సిర్పూర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని పార్టీ చీఫ్ సెక్టార్ కోఆర్డినేటర్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ అతర్ సింగ్ రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ లు అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో నీలి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాగజ్‌నగర్ మున్సిపాలిటీపై బీఎస్పీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.