నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
13-02-2026
బెజ్జూర్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మండలంలోని పాపణపేట్, తలయి, సోమిని గ్రామాల్లో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పర్యటించారు. గ్రామ నర్సరీలను పరిశీలించి ఎర్రమట్టి, నల్లమట్టి, ఇసుక, సూపర్ ఫాస్ఫేట్ను తగిన మోతాదులో కలిపి బ్యాగ్ ఫిల్లింగ్ చేయాలని సూచించారు. ఎర్రమట్టిని జల్లెడ పట్టి కలిపి బ్యాగులు నింపాలని, బెడ్స్ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.