3 July, 2026 | 10:00 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

Districts - Kumarambheem Asifabad

article_73977615.webp
యూరియా అధిక ధరలపై చర్యలు తీసుకోవాలి

అసిఫాబాద్(విజయక్రాంతి): రైతులకు యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండల వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఏ. చిరంజీవికి సీపీఐ ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి మాట్లాడుతూ వానాకాలం సాగు సీజన్‌లో యూరియా కొరత, ఆన్లైన్ బుకింగ్ సమస్యలు, కొంతమంది వ్యాపారులు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్ని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని, రైతులపై ఇతర ఉత్పత్తులు బలవంతంగా మోపే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు పిడుగు శంకర్, తాళ్లపల్లి దివాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

03-07-2026

article_10567757.webp
ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): తిర్యాణి మండల కేంద్రంలో ఓటరు ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హరిత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి సేకరించి, వెంటనే డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మాట్లాడి ఫారాలను పూర్తిగా నింపించుకోవాలని, నింపిన ఫారాలను వెంటనే సేకరించి సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) డిజిటలైజేషన్‌కు పంపించాలని చెప్పారు.

03-07-2026

article_57834992.webp
ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి

ఆసిఫాబాద్(విజయ క్రాంతి):జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యుల విధుల నిర్లక్ష్యం, నకిలీ హాజరు నమోదు, పర్యవేక్షణ లోపాలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విధులకు హాజరు కాకుండానే హాజరు నమోదు చేసిన వైద్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బయోమెట్రిక్ హాజరు విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బోయిరే ప్రకాష్, పిడుగు శంకర్, కొదురుపాక మహేష్, వర్కోల్ రాకేష్, పిప్పిరి వెంకటేష్, శ్రీరామ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

02-07-2026

article_55596315.webp
జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): జిల్లాలోని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ భవన సముదాయంలోని తన ఛాంబర్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. గర్భిణీలకు, చిన్నారులకు, రోగులకు అవసరమైన చికిత్స, మందులు, పరీక్షలు సమయానికి అందేలా చూడాలని ఆదేశించారు.ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాలు, మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోగులను అత్యవసర పరిస్థితుల్లో తరలించేందుకు అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉండాలని, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ, వైద్య విద్యా బోధన, మెరుగైన వసతుల కల్పనపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

02-07-2026