25 July, 2026 | 11:55 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

Districts - Kumarambheem Asifabad

article_67532757.webp
పకడ్బందీగా రీ సర్వే చేపట్టాలి

బెజ్జూర్, జూలై 25 (విజయక్రాంతి): జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగ తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు భూ వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా భూ సర్వే నిర్వహించాలని సూచించారు.అనంతరం మండల కేంద్రంలోని పౌర సరఫరాల శాఖ గోదామును పరిశీలించి బియ్యం నిల్వలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామ్మోహన్ రావు, డిప్యూటీ తహసీల్దార్ భీమ్లా నాయక్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు తిరుపతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

25-07-2026

article_79453696.webp
సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన డీఆర్ఎం

కాగజ్‌నగర్(విజయ క్రాంతి): దక్షిణ మధ్య రైల్వే (SCR) డీఆర్ఎం గోపాలకృష్ణన్, సీనియర్ డీఓఈ ఎం. మహేంద్ర వర్మ శుక్రవారం సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను సందర్శించి విస్తృతంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, ప్రయాణికుల వేచి ఉండే హాళ్లు, తాగునీటి సౌకర్యం, వాహనాల పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ భద్రత, టికెట్ కౌంటర్లు తదితర సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించడంతో పాటు స్టేషన్‌లో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను నిరంతరం పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

24-07-2026