7 August, 2026 | 5:29 PM

Districts - Kumarambheem Asifabad

article_87083681.webp
నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు చేపట్టిన నాలుగు దశల ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో ఉపాధ్యాయులు శుక్రవారం పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా యూఎస్‌పీసీ జిల్లా నాయకురాలు శాంతి కుమారి మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేసి, పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన విద్య పేరుతో పాఠశాలల కుదింపును నిలిపివేయాలని, ప్రాథమిక విద్యకు సంబంధించిన జీవో–25ను వెంటనే సవరించాలని కోరారు.

07-08-2026

article_78981877.webp
గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలి

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. పేపర్ మిల్ ఎదుట కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 79వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నికలు లేకపోవడంతో కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని, పాత కార్మికులందరినీ ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.

06-08-2026