27 February, 2026 | 12:15 AM

Districts

article_60279896.webp
మోసం గ్రామంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన

బెజ్జూర్,(విజయక్రాంతి): కాగజ్నగర్ మండలంలోని మోసం గ్రామంలో పోచమ్మ అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవత అయిన పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి వేద మంత్రోచ్ఛారణల మధ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురోహితులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు అమ్మవారికి పట్టువస్త్రాలు, సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజల సంక్షేమం, శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు.

26-02-2026

article_25564583.webp
టీఎస్ టి డబ్ల్యూటియు డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం (TS-TWTU) జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ , నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగులు-ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే TS-TWTU యొక్క ప్రధాన ఎజెండాగా కొనసాగాలని సూచించారు. గిరిజన మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తున్న గిరిజన ఉద్యోగుల సంక్షేమం కోసం TS-TWTU స్థాపనతో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.అనంతరం TS-TWTU పీజీ హెడ్‌మాస్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పూర్కా ఉద్దవ్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేలా సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా CRT ఉపాధ్యాయుల సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో TS-TWTU జిల్లా అధ్యక్షులు రాథోడ్ రవీందర్, జిల్లా కోశాధికారి కూడ్మేత అనంత్, రాష్ట్ర నాయకులు కోవ సోనేరావ్, మహిళా కార్యదర్శి కొట్నాక్ శకుంతల, కార్యదర్శులు కూడ్మేత జంగు, లింబారావ్, శ్యాంరావ్ తదితరులు పాల్గొన్నారు.

26-02-2026