13 July, 2026 | 8:34 PM

Districts - Kumarambheem Asifabad

article_60260029.webp
ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో మండల రిసోర్స్ పర్సన్ ల మూడు రోజుల జిల్లా స్థాయి సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ కె. హరిత ప్రారంభించి శిక్షణ మాడ్యూళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఉపాధ్యాయులే విద్యా వ్యవస్థకు మూలస్తంభాలని, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ప్రాథమిక విద్య ద్వారానే ఏర్పడుతుందని అన్నారు. ప్రతి చిన్నారిలో చదవడం, రాయడం, గణించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.శిక్షణలో నేర్చుకున్న ఆధునిక బోధనా విధానాలు, విద్యార్థి కేంద్రిత అభ్యాస పద్ధతులు, సమగ్ర బోధన విధానాలను ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, నాణ్యమైన విద్య అందించేందుకు నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలిపారు.

13-07-2026

article_61894426.webp
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణులతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సిర్పూర్ - టి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన మంగెన భూదేవి తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

13-07-2026