calender_icon.png 19 February, 2026 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_64208025.webp
సమస్యలపై కౌన్సిలర్ స్వప్న రాణి క్షేత్రస్థాయి పరిశీలన

19-02-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయ క్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని5వ వార్డులో సమస్యలను తెలుసుకునేందుకు కౌన్సిలర్ స్వప్న రాణి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటన్నింటినీ నమోదు చేసుకున్నారు.వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్వప్న రాణి తెలిపారు. నమోదు చేసిన సమస్యలన్నింటినీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయి కృష్ణ ,అసద్, తాజ్ తదితరులున్నారు.

article_23135770.webp
గుండి పాఠశాలలో సైన్స్ ఫెయిర్

19-02-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి):మండలంలోని గుండి జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి రాథోడ్ సుభాష్ ఆధ్వర్యంలో, డ్రీమ్ సొసైటీ సహకారంతో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు వివిధ శాస్త్రీయ ప్రయోగాలు చేసి తమ ప్రతిభను ప్రదర్శించారు. డ్రీమ్ సొసైటీ జిల్లాలోని పాఠశాలలకు సైన్స్ కిట్లు అందించి, శాస్త్రంపై ఆసక్తి పెంచేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ తెలిపారు. “కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి” అనే ఏ.పీ.జే. అబ్దుల్ కలాం మాటలకు ఇది నిదర్శనమని అన్నారు.పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, ప్రథమ–ద్వితీయ బహుమతులను ఎంఈఓ రాథోడ్ సుభాష్, డ్రీమ్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణా రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, డ్రీమ్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

article_53326238.webp
రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడా పాఠశాల విద్యార్థినిలు

19-02-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థినిలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్–2025 రెండవ ఎడిషన్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు క్రీడాకారులు గురువారం ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. ఈ పోటీల్లో మొత్తం 42 మంది విద్యార్థినులు అథ్లెటిక్స్ (9 మంది), హ్యాండ్‌బాల్ (20 మంది), ఖో ఖో (13 మంది) విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.విద్యార్థినులు క్రమశిక్షణతో శిక్షణ పొంది పోటీలకు పూర్తిగా సిద్ధమయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబ రావు, శారీరక విద్య ఉపాధ్యాయురాలు మీనా రెడ్డి తెలిపారు. సీఎం కప్ వంటి ప్రతిష్టాత్మక వేదికలో పాల్గొనడం పాఠశాలకు గర్వకారణమని వారు పేర్కొన్నారు.

article_21228641.webp
మార్లవాయి రాయిసెంటర్ సార్మడి జుగ్నాక దేవ్ రావు మృతి

19-02-2026

జైనూర్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన రాయిసెంటర్ సార్మడి జుగ్నాక దేవ్ రావు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు.దేవ్ రావు ఆదివాసీ సమాజంలో రాయిసెంటర్ సార్మేడిగా అనేక సంవత్సరాలు సేవలందించారు. సంప్రదాయ న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ గ్రామంలో పలు సామాజిక కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందారు.మార్లవాయి గ్రామపంచాయతీలో ఎంపీటీసీగా కూడా పనిచేసిన ఆయన, గొండ్వా పంచాయతీ రాయిసెంటర్ సార్మేడిగా ప్రజలకు న్యాయం చేయడంలో విశేష కృషి చేశారు. అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.ఆయన మృతితో మార్లవాయి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులకు, ఆదివాసీ సమాజానికి ఈ లోటు తీరనిదిగా భావిస్తున్నారు.

article_81010159.webp
రైతులు యాంత్రీకరణను వినియోగించుకోవాలి

19-02-2026

కాగజ్ నగర్(విజయ క్రాంతి): పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సబ్మిషన్ ఫర్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం కింద రూ.1 కోటి 30 లక్షల విలువ గల వ్యవసాయ పనిముట్లను సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రైతులు విస్తృతంగా వినియోగించుకొని పంట దిగుబడులను పెంచుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఎటువంటి వడ్ల కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం ద్వారా రైతులకు మేలు చేకూర్చినట్లు పేర్కొన్నారు. అనంతరం ప్యాడి బైలరు, పవర్ రొటోవేటర్, పవర్ ప్లవు, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్ తదితర ఆధునిక వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సిద్ధల దేవయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ, ఏఈవోలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

article_77237340.webp
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి

19-02-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్ భవనంలోని తన చాంబర్లో వేసవిలో తాగునీటి సరఫరా పై మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సిర్పూర్ యు, లింగాపూర్, తిర్యాణి మండలాలలోని మారుమూల గిరిజన గ్రామాలకు నీటి సరఫరాను సక్రమంగా అందించేందుకు పైపులైన్లు,పంప్ హౌస్ లకు మరమ్మత్తులు చేయాల్సి ఉంటే నెలలోగా పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.