ఎఫ్పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం
సహకార వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓ)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఓ, నాగనారాయణ మాట్లాడుతూ సహకార సంఘాలు, ఎఫ్పీఓలు సమన్వయంతో పనిచేస్తే రైతులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘాలు పనిచేయాలని, ఎఫ్పీఓలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
30-06-2026