కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చా
22-01-2026
కుమ్రం భీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రావాలని అది వచ్చేవరకు విశ్రమించమని పీపుల్స్ మార్చ్ లో తనతో పాటు అనేకమంది నడిచారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి రాగానే మళ్లీ రావాలని మీరంతా దీవించి పంపారు, మీరంతా చెప్పినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ సమస్యలు తీరుస్తుంది, మీరు కోరుకున్నట్టే కృతజ్ఞతలు తెలవడానికి తాను వచ్చానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండలం జాంగాం క్రమంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెచ్చుకున్న రాష్ట్రంలో స్వేచ్ఛ పోయింది, ఈ ప్రాంత సంపద ఇక్కడి ప్రజలకు చెందాలని ఆనాడు మీరు కోరారు .మీరు కోరిన విధంగానే ప్రజా ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం, అభివృద్ధి సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పీపుల్ స్పార్ట్స్ పాదయాత్ర లో భాగంగా ఆనాడు ప్రతిరోజు నన్ను కలిసిన వారిని, వారు విజ్ఞప్తి చేసిన సమస్యలను వివరంగా రాసుకున్నాను. బడ్జెట్లో ఆయా అంశాల పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నానని తెలిపారు.