3 June, 2026 | 9:10 PM

Districts - Kumarambheem Asifabad

article_86625466.webp
పిల్లలందరినీ బడికి పంపించాలి

వాంకిడి, (విజయక్రాంతి) : పిల్లలందరినీ బడికి పంపించాలని బంబార సర్పంచ్ బెండరే కృష్ణాజి అన్నారు. బుధవారం బడిబాట కార్యక్రమాన్ని ఉపసర్పంచ్ జాడే సంతోష్, ప్రధానోపాధ్యాయురాలతో కలిసి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల నుండి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల తో కలిసి గ్రామంలో అవ గాహన ర్యాలీ చేపట్టారు. పాఠశాల వయసున్న ప్రతి ఒక్కరినీ బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు,యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను అందిస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ఎస్ఎంసీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

03-06-2026

article_63170027.webp
సీఎం పర్యటనతో జిల్లాకు ప్రయోజనం లేదు

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో నిర్వహించిన పర్యటన పూర్తిగా అబద్ధపు హామీలు, ప్రజలను మభ్యపెట్టే ప్రసంగాలతోనే ముగిసిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అరిగెల మల్లికార్జున్ యాదవ్, కోవ విజయ్ కుమార్ విమర్శించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం ఆదివాసి పీవీటీజీ కుటుంబాల కోసం అమలు చేస్తున్న PM-JANMAN పథకం కింద నిర్మించిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం “ఇందిరమ్మ ఇళ్లు”గా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. “సొమ్ము ఒకనిది... సోకు ఒకనిది” అన్నట్లుగా కేంద్ర నిధులతో చేపట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటోందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, PM-KISAN, ఆయుష్మాన్ భారత్, ఉపాధి హామీ, ఉజ్వల యోజన వంటి పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు అందిస్తోందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటిపై సొంత రంగులు పూసి ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

03-06-2026