27 June, 2026 | 3:40 PM

Districts - Kumarambheem Asifabad

article_40398503.webp
ఆదివాసీ ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేసిన రేంజ్ అధికారిపై చర్యలు తీసుకోవాలి

జైనూర్, జూన్ 25 (విజయ క్రాంతి) : ఆదివాసీ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అటవీ శాఖ రేంజ్ అధికారి రమేశ్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఎన్నో ఏళ్లుగా పోడు రైతులు సాగు చేసుకుంటున్నారని, విత్తనాలు వేసే సమయంలో అటవీ శాఖ అధికారులు ఇబ్బంది పెట్టడం సరికాదని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాల్ పేర్కొన్నారు.

25-06-2026

article_63621954.webp
చిర్రకుంటలో ఘనంగా వనమహోత్సవం

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వనమహోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట గ్రామంలో బుధవారం ఘనంగా మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వరరావు పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు వనమహోత్సవం వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అరిగెల మల్లికార్జున్, బీజేపీ నాయకుడు బొమ్మెన శివప్రసాద్ గౌడ్, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

24-06-2026

article_16389691.webp
మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి):ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావుతో కలిసి ఆయన మనుమడు అరిగెల జుహీత్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని చిరకుంట గ్రామంలో "ఏక్ పెడ్ మాకే నామ్" కార్యక్రమం నిర్వహించి 500కు పైగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు గ్రామంలో మొక్కలు నాటినట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి బతికేలా చర్యలు తీసుకోవడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్వతి, ఉపసర్పంచ్ మల్లేష్, వార్డు సభ్యులు, బీజేపీ నాయకులు ప్రసాద్ గౌడ్, సంతోష్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

24-06-2026