15 July, 2026 | 7:08 PM

Districts - Kumarambheem Asifabad

article_52987222.webp
ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలి

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కాగజ్‌నగర్ మండలంలోని ఈజీగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీలో భాగంగా సిబ్బంది హాజరు రిజిస్టర్, విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలను పరిశీలించిన కలెక్టర్, ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మందుల నిల్వ గది, స్టాక్ రిజిస్టర్లను నిశితంగా పరిశీలించారు.వైద్యం కోసం వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, వారికి సరైన చికిత్స అందుతుందా, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.

15-07-2026

article_65928535.webp
చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్

వాంకిడి, (విజయక్రాంతి): విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న చలో సచివాలయం కార్యక్రమానికి వెళ్లకుండా వాంకిడి పోలీసులు సోమవారం రాత్రి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుర్గం దినకర్‌, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిరే ప్రకాష్ లతోపాటు పలువురు పార్టీ నాయకులు కార్తీక్,తిరుపతి, రాకేష్, తిరుపతిలను ముందస్తు అరెస్ట్ చేసి వాంకిడి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా సీపీఎం, సిపిఐ నాయకులు మాట్లాడుతూ... విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల్లో భాగంగా నిర్వహిస్తున్న శాంతియుత నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడం సరైన చర్య కాదని పేర్కొన్నారు. అరెస్టులతో ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదని, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.

14-07-2026