13 August, 2026 | 12:29 PM

Districts - Kumarambheem Asifabad

article_76366323.webp
విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే బస

బెజ్జూర్‌,(విజయక్రాంతి): ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే బస చేస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ అంబాజీ తెలిపారు.బెజ్జూర్‌ మండలంలోని సోమిని గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.పాఠశాలలోని తరగతి గదులు, స్టోర్‌రూమ్‌, వసతి గదులు, భోజనశాలను పరిశీలించిన డీడీ.. ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులకు బూట్లు, బ్యాగులు, బెడ్‌షీట్లు అందజేశారు. పాఠశాలలో వర్కర్ల కొరత సమస్యను వారం రోజుల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏఎన్‌ఎంకు సూచించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్న ప్రధానోపాధ్యాయుడు బిక్షమయ్యను డీడీ అభినందించారు. అనంతరం డీడీని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. తిరుగు ప్రయాణంలో భారీ వర్షం కారణంగా సుస్మీర్‌, కుశ్నెపల్లి సమీపంలోని ఒర్రెలు ఉప్పొంగడంతో సుమారు గంటపాటు వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో వర్షాకాలంలో గిరిజన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డీడీ గమనించారు. ఆయన వెంట ఎస్‌ఆర్‌పీ నందరాం, ఉపాధ్యాయులు ఉన్నారు.

13-08-2026

article_51385248.webp
కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ నాయకులు

ఆసిఫాబాద్ ( విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన కేసు నేపథ్యంలో బుధవారం బిఆర్ఎస్ నాయకులు కోర్టుకు హాజరు అయ్యారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి నిబంధనలు ఉల్లగించారని బి ఆర్ ఎస్ అభ్యర్థి మద్దతుదారులు, నాయకులు మూకుమ్మడిగా కలెక్టరేట్ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. నిబంధనల ప్రకారం బిఆర్ఎస్ నాయకులు అనుసరించలేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అప్పటి కలెక్టర్ ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రే కు ఫిర్యాదు చేయడంతో బిఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. దీంతో కేసు పేసికి నాయకులు హాజరయ్యారు.

12-08-2026

article_76349369.webp
ఉప్పొంగిన ఒర్రెలు 12 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

బెజ్జూర్ ఆగస్టు 12 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని సుస్మిర్ ఒర్రెలు రెండు ఉప్పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వర్షం కురిస్తే చాలు గిరిజన గ్రామాల పరిస్థితి అయోమయంగా మారుతుందని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు సైతం వెళ్ళలేని దుస్థితిగా ఉందని ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన గిరిజన పల్లెల పరిస్థితి మాత్రం మారడం లేదని ప్రజలు తెలుపుతున్నారు. ఇకనైనా అధికారుల స్పందించి గిరిజన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను చూసైనా పాలకులు,ప్రభుత్వం స్పందించి ఒర్రెలపై వంతెనలు మంజూరు చేసి ప్రజల కష్టాలను తీర్చాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

12-08-2026

article_42755059.webp
ప్రభుత్వ స్థలం కోసం వ్యాపారుల జగడం!

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో(Bejjur Mandal Headquarters) ప్రభుత్వ స్థలం కోసం వ్యాపారుల మధ్య మంగళవారం వాగ్వాదం చోటుచేసుకుంది. ‘జాగ నాది.. నాది’ అంటూ ఒకరిపై ఒకరు వాదించుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు ఇతర వ్యాపారులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.బెజ్జూర్ ప్రధాన రహదారి పక్కన కొమురం భీం విగ్రహం ఎదుట ప్రభుత్వ స్థలంలో కూరగాయల వ్యాపారులు కొవిడ్‌ సమయం నుంచి తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమురం భీం విగ్రహం ఎదుట ఉన్న దుకాణాలను తొలగించాలని ఆదివాసీ నాయకులు కోరడంతో వ్యాపారులు దుకాణాలను తొలగించారు.మంగళవారం తిరిగి దుకాణాలు ఏర్పాటు చేసుకునే సమయంలో స్థలం విషయంలో వ్యాపారుల మధ్య వివాదం తలెత్తింది. అందరికీ సమానంగా స్థలం కేటాయించుకోవాలని కొందరు సూచించగా, ఒకరి స్థలాన్ని మరొకరు ఆక్రమిస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో కొందరు వ్యాపారులు రోడ్డుపైనే దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం ఇతర వ్యాపారులు జోక్యం చేసుకుని పరస్పరం నచ్చజెప్పడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.

12-08-2026

article_32248034.webp
బెజ్జుర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నితికా పంత్

బెజ్జూర్,విజయక్రాంతి: బెజ్జూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ, పోలీస్ సిబ్బంది పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.తదుపరి పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులు, కార్యాలయ నిర్వహణను పరిశీలించారు. స్టేషన్‌ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, పెండింగ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి, సీడీ ఫైళ్లు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్ కేసుల వివరాలను ఎస్సై సార్తజ్ పాషాను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేసి, నాణ్యమైన దర్యాప్తు ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

12-08-2026