25 July, 2026 | 5:17 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

Districts - Kumarambheem Asifabad

article_67532757.webp
పకడ్బందీగా రీ సర్వే చేపట్టాలి

బెజ్జూర్, జూలై 25 (విజయక్రాంతి): జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగ తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు భూ వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా భూ సర్వే నిర్వహించాలని సూచించారు.అనంతరం మండల కేంద్రంలోని పౌర సరఫరాల శాఖ గోదామును పరిశీలించి బియ్యం నిల్వలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామ్మోహన్ రావు, డిప్యూటీ తహసీల్దార్ భీమ్లా నాయక్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు తిరుపతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

25-07-2026

article_79453696.webp
సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన డీఆర్ఎం

కాగజ్‌నగర్(విజయ క్రాంతి): దక్షిణ మధ్య రైల్వే (SCR) డీఆర్ఎం గోపాలకృష్ణన్, సీనియర్ డీఓఈ ఎం. మహేంద్ర వర్మ శుక్రవారం సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను సందర్శించి విస్తృతంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, ప్రయాణికుల వేచి ఉండే హాళ్లు, తాగునీటి సౌకర్యం, వాహనాల పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ భద్రత, టికెట్ కౌంటర్లు తదితర సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించడంతో పాటు స్టేషన్‌లో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను నిరంతరం పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

24-07-2026

article_49212606.webp
గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ కె. హరిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం వంటశాలను తనిఖీ చేసి ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ దత్తారావు, ఎంపీడీవో శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శ్వేత, ఉపాధ్యాయులు, వసతి గృహ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

24-07-2026