ప్రీ-ప్రైమరీ పాఠశాలల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో సుందరీకరణ, పెయింటింగ్ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు.గురువారం ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆసిఫాబాద్ మండలం బుర్గుడ, రెబ్బెన మండలం తల్లాలపల్లి గ్రామాల్లోని పూర్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, పాఠశాల ఆవరణలో చేపడుతున్న సుందరీకరణ, రంగుల పనులను పరిశీలించారు.
10-09-2026 | 07:33pm