అభివృద్ధి ఫలాలు ప్రతి పేద కుటుంబానికి చేరాలి
ఆసిఫాబాద్, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అమలుపస్తున్న ఫలాలు ప్రతి పేద కుటుంబానికి చేరాలని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డా. బండ ప్రకాష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, కలెక్టర్ హరిత ,ఎస్పి నితిక పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మార్మాట్, డేవిడ్, డీఎఫ్ఓ బాలమణి, అదనపు ఎస్పీ చిత్తరంజన్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తో కలిసి ఆయన పాల్గొన్నారు.
02-06-2026