18 August, 2026 | 9:18 PM

Districts - Kumarambheem Asifabad

article_38849275.webp
బహుజన ఆత్మగౌరవానికి తొలి పతాకం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

బహుజన ఆత్మగౌరవానికి తొలి పతాకం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, వారి జీవిత చరిత్ర నేటి తరాలకు ఆదర్శనీయమని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అన్నారు. మంగళవారం సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలలో భాగంగా కలెక్టరేట్ లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, గౌడ సంఘాల నాయకులు, బి.సి. సంఘాల నాయకులతో కలిసి హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

18-08-2026

article_55660614.webp
30 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

పెంచికల్పేట్ (విజయక్రాంతి): దహేగాం మండలంలోని చిన్నరాసపల్లి పరిసర గ్రామాల కార్డుదారుల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన 30 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పెంచికల్పేట్ వద్ద అధికారులు పట్టుకున్నారు. సోమవారం విశ్వసనీయ సమాచారం మేరకు డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాజ్‌కుమార్, పెంచికల్పేట్ ఎస్సై అనిల్‌కుమార్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. టాటా పికప్ వాహనం (AP 01 Y 4233)లో 60 బస్తాల్లో తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. కాగజ్‌నగర్‌కు చెందిన ఖాజా, అస్లాం హుస్సేన్‌లను నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై అనిల్‌కుమార్ హెచ్చరించారు. తనిఖీల్లో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

17-08-2026