31 July, 2026 | 11:27 PM

Districts - Kumarambheem Asifabad

article_14327070.webp
వైద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్సీ దండే విఠల్

కాగజ్‌నగర్ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోటలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన అదనపు ఐదు డయాలసిస్ బెడ్లను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

31-07-2026

article_53445201.webp
వంతెన లేక నేటికీ అవస్థలు.

వాంకిడి, జూలై 30 (విజయక్రాంతి): వాంకిడి మండలంలోని కిరిడి గ్రామంలో పాఠశాల సమీపంలో ఉన్న ఒరే నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా నిండిపోవడంతో గ్రామ ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే ఓర్రె ను దాటాల్సిన పరిస్థితి నెలకొన్నదని, వరద ఉధృతి కారణంగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గ్రామానికి రాకపోకలు సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు .గతంలో జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి సమస్యను పరిశీలించినప్పటికీ, నేటి వరకు హై లెవెల్ వంతెన మంజూరు కాలేదని పేర్కొన్నారు. మండల ప్రజాప్రతినిధులు పలుమార్లు హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కిరిడి గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే మంజూరు చేసి, గ్రామ ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని దుర్గం దినకర్ ప్రభుత్వాన్ని కోరారు.

30-07-2026

article_27724487.webp
ఉప్పొంగుతున్న గోదావరి.. తుమ్మిడిహెట్టి వద్ద జలకళ

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తూ జలకళను సంతరించుకుంది.వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.గోదావరి నది ఒడ్డుకు ఎవరూ వెళ్లరాదని, వరద నీటిని చూసేందుకు లేదా సెల్ఫీలు తీసేందుకు ప్రయత్నించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నది సమీపంలోని ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

30-07-2026