7 August, 2026 | 11:44 PM

Districts - Kumarambheem Asifabad

article_87083681.webp
నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు చేపట్టిన నాలుగు దశల ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో ఉపాధ్యాయులు శుక్రవారం పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా యూఎస్‌పీసీ జిల్లా నాయకురాలు శాంతి కుమారి మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేసి, పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన విద్య పేరుతో పాఠశాలల కుదింపును నిలిపివేయాలని, ప్రాథమిక విద్యకు సంబంధించిన జీవో–25ను వెంటనే సవరించాలని కోరారు.

07-08-2026