గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీడీవో బండారి ప్రవీణ్ కుమార్ అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో సర్పంచులు, ఉప సర్పంచ్లు, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అందరు కలిసి సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల, ప్రణాళిక తయారీ, క్రొత్త పెన్షన్స్ మంజూరికి దరఖాస్తులు సమర్పణ, వెరిఫికేషన్, జీపీ ఆదాయవ్యాయాలు, త్రాగునీరు, పారిశుధ్యము అన్ని అంశాలపై చర్చించాలని సూచించారు.
09-09-2026 | 11:39pm