15 August, 2026 | 1:53 AM

Districts - Kumarambheem Asifabad

article_82031875.webp
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర మహిళా సదస్సును విజయవంతం చేయాలి

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 16న నిర్వహించనున్న టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర మహిళా సదస్సుకు అన్ని యాజమాన్యాల మహిళా ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతి కుమారి కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సమానత్వం, మహిళా సాధికారత లక్ష్యంగా రాష్ట్ర మహిళా సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు కేవలం నాయకత్వ స్థానాల్లో నామమాత్రంగా కాకుండా సామాజిక స్పృహతో సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తాలని పిలుపునిచ్చారు.

14-08-2026

article_24166205.webp
ప్రధాన రహదారి ఇలా.. ప్రయాణం చేసేది ఎలా..?

బెజ్జూర్,ఆగస్టు14(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ ప్రధాన రహదారి అంతా బురదమయంగా కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నామని తెలుపుతున్నారు. మండలంలోని ఏటి గూడ ప్రధాన రహదారి అంత బురదమయంగా ఉండడంతో ప్రతినిత్యం వాహనదారులు బాటసారులు ఇబ్బందులు పడుతున్నామని తెలుపుతున్నారు. రహదారి ఇలా ఉంటే ప్రయాణం చేసేది ఎలా అని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాణ్యతతో రోడ్డు పనులు చేపట్టకపోవడంతో రోడ్డు పూర్తిగా పాడైపోయిందని ప్రజలు తెలుపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టర్ స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేసేలా చూడాలని ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు.

14-08-2026

article_23009807.webp
సామాజిక ఆసుపత్రిలో నే ప్రసవాలు జరిగేలా చూడాలి

బెజ్జూర్ ఆగస్టు 13 (విజయక్రాంతి): సామాజిక ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలి సూపర్డెంట్ అవినాష్ వైద్య సిబ్బందికి ఆదేశించారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వివరాలు, పలు రికార్డులు, మందుల నిల్వలు పరిశీలించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. గతంలో ప్రసవాల సంఖ్య మెరుగుగా ఉందని, ప్రస్తుతం ప్రసవాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక ఆసుపత్రిలోనే ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. క్రిటికల్ కేసులను మాత్రమే రెఫర్ చేయాలని, ఆరోగ్యవంతంగా ఉన్న గర్భిణీలను సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సంబంధిత వైద్య సిబ్బందికి సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలనతో హాజరుకావాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట వైద్యాధికారి శ్రావణ్ కుమార్, ఫార్మసిస్ట్ ఆయేషా వైద్య సిబ్బంది ఉన్నారు.

14-08-2026

article_82544138.webp
శివాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు

బెజ్జూర్ ఆగస్టు 13 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని శివాలయం లో శ్రావణమాసం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని శివాలయం శ్రీ రంగనాయక స్వామి హనుమాన్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకం నిర్వహించారు. శ్రావణమాసం ప్రారంభోత్సవం సందర్భంగా శివాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు గురుదత్ భక్తులతో అభిషేకం, బిల్వర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు నాగభూషణ్ గౌడ్, దంపతులు, భక్తులు పాల్గొన్నారు.

14-08-2026

article_76366323.webp
విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే బస

బెజ్జూర్‌,(విజయక్రాంతి): ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే బస చేస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ అంబాజీ తెలిపారు.బెజ్జూర్‌ మండలంలోని సోమిని గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.పాఠశాలలోని తరగతి గదులు, స్టోర్‌రూమ్‌, వసతి గదులు, భోజనశాలను పరిశీలించిన డీడీ.. ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులకు బూట్లు, బ్యాగులు, బెడ్‌షీట్లు అందజేశారు. పాఠశాలలో వర్కర్ల కొరత సమస్యను వారం రోజుల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏఎన్‌ఎంకు సూచించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్న ప్రధానోపాధ్యాయుడు బిక్షమయ్యను డీడీ అభినందించారు. అనంతరం డీడీని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. తిరుగు ప్రయాణంలో భారీ వర్షం కారణంగా సుస్మీర్‌, కుశ్నెపల్లి సమీపంలోని ఒర్రెలు ఉప్పొంగడంతో సుమారు గంటపాటు వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో వర్షాకాలంలో గిరిజన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డీడీ గమనించారు. ఆయన వెంట ఎస్‌ఆర్‌పీ నందరాం, ఉపాధ్యాయులు ఉన్నారు.

13-08-2026