28 August, 2026 | 5:20 AM

Districts - Kumarambheem Asifabad

article_35925927.webp
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనిలో రాహుల్ గాంధీ

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మన్ కీ బాత్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఎలగతి సుచిత్ విమర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌లో సమస్యలపై చర్చించాల్సిన రాహుల్ గాంధీ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీని అపరాధిగా చూపించే రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నీట్‌ పరీక్ష అంశంపై ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చకు సిద్ధంగా ఉందని తెలిపారు.

27-08-2026

article_77684589.webp
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా అంకుసాపూర్, తుంపల్లి, గోవింద్‌పూర్ గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇంచార్జి శ్యాంనాయక్, సర్ కోఆర్డినేటర్ రాంభోపాల్ హాజరు అయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ శ్రేణులు పరిశీలించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా , మండల అధ్యక్షుడు రాపర్తి మురళి, డీసీసీ ఉపాధ్యక్షుడు తరిఖ్, సర్పంచులు టెకం గంగారాం, టెకం ఈశ్వరిబాయి, లక్ష్మి చరణ్, బీఎల్‌ఏలు ప్రభాకర్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

27-08-2026