శిథిలావస్థలో ఆశ్రమ పాఠశాల.. విద్యార్థుల ఆవేదన
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కాగజ్నగర్లోని ఎస్టీ బాయ్స్ ఆశ్రమ పాఠశాలను మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. యూనిఫాంలు, సాక్సులు, టై, బెల్టులు, ఐడీ కార్డులు అందలేదని విద్యార్థులు తెలిపారు. ఆరు నెలలుగా వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని, తాగునీటి సమస్య ఉందన్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
04-09-2026 | 01:37pm