calender_icon.png 16 June, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_89162985.webp
ప్రైవేట్ కళాశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలి

16-06-2025

నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు జూనియర్ కళాశాలలో 50 శాతం ఫీజు రాయితీని కల్పించాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం(Telangana State Union of Working Journalists Association) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో డీఐఈఓ కళ్యాణిను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... పేద మధ్యతరగతి వర్గాల వారే ఎక్కువమంది జర్నలిస్టులు ఉన్నారని చెప్పారు. సంగారెడ్డిలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం రాయితీ కల్పిస్తున్నారని తెలిపారు.