calender_icon.png 5 December, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_56848430.webp
ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ఇల్లు దగ్ధం

05-12-2025

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని పెద్ద సిద్దాపూర్ గ్రామానికి చెందిన సిడం రవి ఇంటికి ప్రమాద వసత్తు నిప్పు అంటుకొని ఇల్లు దగ్ధం అయినట్లు బాధితులు తెలిపారు. ఇంట్లో పెట్టుకున్న దీపం గాలికి మంటలు చెలరేగడంతో ఇంటికి మంటలు అంటుకోవడంతో ఇంట్లోని బీరువాలో దాచుకున్న 50వేల నగదు, బంగారం, వరి ధాన్యం,ఇంట్లోని సామాగ్రి సైతం కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు. ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ పోర్తేట్టి రవి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇట్టి విషయమై అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. రెండు లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు.

article_90531856.webp
బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం

04-12-2025

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా బాల్య వివాహ ముక్త్ భారత్ - 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ భాస్కర్ తెలిపారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం, షూస్ స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో రూపొందించిన వాల్ పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ, బాల్య వివాహం సమాజానికి మచ్చ వంటిదని, ఇది బాలల శారీరక, మానసిక, విద్యా భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

article_43962465.webp
ఘనంగా దత్తాత్రేయ జయంతి

04-12-2025

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి బాబా ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకుడు ఇందారపు మధుకర్ శర్మ,అర్చకుడు ప్రశాంత్ శర్మ ఆధ్వర్యంలో సాయి బాబా,దత్తాత్రేయ,గణపతి విగ్రహాలకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు అనంతరం గీతా పారాయణం,సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపట్టారు.సాయిబాబా పల్లకి సేవ నిర్వహించి బాబాకు ప్రత్యేక హారతులు ఇచ్చారు.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.మండలంలోని నలుమూల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు చెల్లించారు.

article_27426593.webp
గిరిజన పాఠశాల.. పశువుల పాకలో చదువు సాగేది ఎలా...

04-12-2025

బెజ్జూర్, (విజయక్రాంతి): కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలంలోని పాత సోమినిలో పాఠశాల లేక పశువుల పాక ముందు చెట్టుకింద చదువులు సాగుతున్నాయి. గిరిజన ఆదివాసి నాయకుడు నైతం రాజు విద్యార్థులు చెట్టు కింద కూర్చుని విద్యనభ్యసిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు స్వాంతంత్రం వచ్చిన ఆదివాసీల తలరాతలు మారలేదని నేటికీ గిరిజన ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. విద్యా, వైద్యం, రోడ్లు, తదితరఅనేక సౌకర్యాలు లేవు అని అన్నారు. వర్షాకాలంలో ఓర్రెలు ఉప్పొంగినట్లయితే ఉపాధ్యాయులు పాఠశాలకు రాలేని పరిస్థితిగా మారుతుందని అన్నారు.

article_87994529.webp
మృతుడి కుటుంబానికి బీమా చెక్కు అందజేత

03-12-2025

బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూరు మండలంలో రంగయ్య అనారోగ్యంతో మృతిచెందడంతో అతని భార్యకు మంజూరైన భీమా చెక్కును అందజేశారు. మోగవెల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ బిపిఎం రాచకొండ చంద్రశేఖర్ వద్ద ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా PMJJBY పాలసీ చేసుకోవడం తీసుకున్నారు. ఇందుకుగాను నామిని అయినా తారాబాయి(మృతుని భార్య)కి రెండు లక్షల రూపాయల చెక్కుని ఆదిలాబాద్ సూపరిండెంట్ గుంప స్వామి బుధవారం కాగజ్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో అందించడం జరిగింది. సూపర్డెంట్ మాట్లాడుతూ PMJJBY పాలసీ ఇతర పోస్టల్ పథకాలని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

article_16742218.webp
ఆదివాసి పొరు గర్జన సభ వాయిదా..

02-12-2025

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఈ నెల 9న ఆదివాసి పోరు గర్జన సభ వాయిదా వేస్తున్నట్లు తుడుం దెబ్బ నాయకులు ప్రకటించారు. సభ అనుమతిని కోరుతూ వారం రోజుల క్రితమే ఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశారు. పంచాయితీ ఎన్నికల కోడ్ దృష్ట్యా సభ వాయిదా వేయమని సంబంధిత అధికారుల కోరిక మేరకు తుడుందేబ్బ నాయకత్వము చర్చించి ఆదివాసి పోరు గర్జన భారీ బహిరంగ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతీ ఎస్పీ నితికా పంత్ కు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు తీర్మానాన్ని అందజేశారు. త్వరలోనే ఆదివాసి పోరు గర్జన భారీ బహిరంగ సభ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

article_89980614.webp
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించాలి

02-12-2025

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్ల నిర్మాణాలను 100 శాతం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రకాష్ రావులతో కలిసి కాగజ్ నగర్, ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో చేపట్టవలసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై మున్సిపల్, గృహ నిర్మాణ, మున్సిపల్ వార్డు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.