విద్యార్థులు లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలి
18-01-2025
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని సాధించే దిశగా అడుగులు వేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి శనివారం కెరమేరీ మండలం గోయగాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, మధ్యాహ్న భోజన నాణ్యత, వంటశాల, రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించి మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.