calender_icon.png 3 December, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_16742218.webp
ఆదివాసి పొరు గర్జన సభ వాయిదా..

02-12-2025

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఈ నెల 9న ఆదివాసి పోరు గర్జన సభ వాయిదా వేస్తున్నట్లు తుడుం దెబ్బ నాయకులు ప్రకటించారు. సభ అనుమతిని కోరుతూ వారం రోజుల క్రితమే ఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశారు. పంచాయితీ ఎన్నికల కోడ్ దృష్ట్యా సభ వాయిదా వేయమని సంబంధిత అధికారుల కోరిక మేరకు తుడుందేబ్బ నాయకత్వము చర్చించి ఆదివాసి పోరు గర్జన భారీ బహిరంగ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతీ ఎస్పీ నితికా పంత్ కు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు తీర్మానాన్ని అందజేశారు. త్వరలోనే ఆదివాసి పోరు గర్జన భారీ బహిరంగ సభ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

article_89980614.webp
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించాలి

02-12-2025

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్ల నిర్మాణాలను 100 శాతం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రకాష్ రావులతో కలిసి కాగజ్ నగర్, ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో చేపట్టవలసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై మున్సిపల్, గృహ నిర్మాణ, మున్సిపల్ వార్డు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.