Districts - Kumarambheem Asifabad

చాకలి ఐలమ్మ నివాళులర్పించిన అదనపు కలెక్టర్
చాకలి ఐలమ్మ నివాళులర్పించిన అదనపు కలెక్టర్

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అణగారిన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ డేవిడ్, డిఆర్ఓ వేణు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ అనిల్ మర్మాట్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ తో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి నదీం మాజీద్, బీసీ సంఘం నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

10-09-2026 | 01:24pm

వామ్మో.. గ్రామ సింహాలు!
వామ్మో.. గ్రామ సింహాలు!

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పైకాజీ నగర్‌లో వీధికుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాలనీలో ఎక్కడ చూసినా గుంపులుగా కుక్కలు సంచరిస్తుండటంతో రోడ్డుపై నడవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఏ సమయంలో కుక్కలు దాడి చేస్తాయోనని చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధికుక్కల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు.

09-09-2026 | 03:19pm

చెత్త ఎత్తిన కౌన్సిలర్ బాలకృష్ణ
చెత్త ఎత్తిన కౌన్సిలర్ బాలకృష్ణ

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పైకాజీ నగర్‌లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో పేరుకుపోయిన చెత్తను కౌన్సిలర్ బాలకృష్ణ స్వయంగా తొలగించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బాల గణేష్ మండలి వద్ద పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బంది ఒకచోట చేర్చి వదిలేశారు. అయితే ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలించకపోవడంతో సుమారు పది రోజులుగా అక్కడే చెత్త పేరుకుపోయింది. చెత్తను తొలగించాలని మండలి నిర్వాహకులతో పాటు కౌన్సిలర్ బాలకృష్ణ పలుమార్లు మున్సిపల్ సిబ్బందిని కోరినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు.

09-09-2026 | 12:32pm

గణేష్ ఉత్సవాలకు పటిష్ట భద్రతా చర్యలు
గణేష్ ఉత్సవాలకు పటిష్ట భద్రతా చర్యలు

జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధమవుతోందని జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. మంగళవారం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లోని ప్రధాన గణేష్ నిమజ్జన కేంద్రం పెద్దవాగును ఆమె పరిశీలించారు.మండపాల నుంచి నిమజ్జన కేంద్రాల వరకు గణేష్ విగ్రహాల ఊరేగింపు మార్గాలను పరిశీలించిన ఎస్పీ.. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, బారికేడింగ్, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.నిమజ్జన కేంద్రాల వద్ద బారికేడింగ్, రోప్ బ్యారియర్లు, తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

08-09-2026 | 10:13pm