calender_icon.png 27 January, 2026 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_75574248.webp
రాగి జావా రుచిచూసిన కలెక్టర్

27-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నాణ్యమైన బోధనతో పాటు రుచికరమైన, పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ మండలం పాడిబండ గ్రామంలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదుల్లో బోధనా విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి, వంటశాల పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా వండిన రాగి జావాను తాగి రుచి చూశారు. విద్యార్థుల హాజరు వంద శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

article_29019852.webp
తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026

వాంకిడి, జనవరి 26(విజయ క్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కవిత ఆధ్వర్యం లో జాతీయ జెండాను ఆవిష్క రించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయ డంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచే యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతి నిధులు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, మండల అధికారులు, కార్యాలయ సిబ్బంది , గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్థిని, విద్యార్థు లు తదితరులు పాల్గొని గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్య తను గుర్తు చేసుకున్నారు. దేశ భక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది.