5 June, 2026 | 10:12 PM

Districts - Kumarambheem Asifabad

article_59354992.webp
పర్యావరణ హితం కోసం మొక్కలు నాటాలి

వాంకిడి, (విజయక్రాంతి): పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సతీష్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకు ని, శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో పంచాయతీ కార్యదర్శి, వార్డ్ మెంబర్లతో కలిసి సర్పంచ్ సతీష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ.. కాలుష్య కారకాల నివారణ కోసం 1972 నుంచి యునైటెడ్ నేషన్ ప్రతి జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివకుమార్,వార్డు సభ్యులు మండోకర్ తూర్సుబాయ్, షేక్ సాహీద్,దుర్గం,సునీత, అల్లఓజు,సంధ్యారాణి, స్నేహజ, దుర్గంసునీత,రాము, వాసకే తాను బాయి,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మండోకర్ అనిల్, అంగన్వాడీ టీచర్ లు రుక్మిణి, ప్రేమల, లక్ష్మి, భగవతి, ఉష, తదితరులు పాల్గొన్నారు

05-06-2026

article_50129601.webp
ఉపాధి హామీ కూలీలకు రూ.800 కూలి ఇవ్వాలి

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ మండలంలోని బోడపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.800 కూలి చెల్లించాలని, రెండు సార్లు ఫోటో తీసే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఫోటో నమోదు సమస్యల వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి కనీస వసతులు కల్పించాలని కోరారు. ఉపాధి హామీ చట్టంలో తీసుకొచ్చిన జీ-రామ్-జీ విధానాన్ని రద్దు చేసి, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజన్న, మాజీ ఎంపీటీసీ, ఉపాధి హామీ కూలీలు, సంఘం నాయకులు పాల్గొన్నారు.

05-06-2026

article_21994397.webp
తెలంగాణ ఆదర్శ కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపిక జాబితా విడుదల

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక జాబితాను విడుదల చేస్తున్నట్లు ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్ తెలిపారు.గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పదో తరగతి మెరిట్‌తో పాటు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.ఎంపిక జాబితాను ఈ నెల 5వ తేదీ శుక్రవారం పాఠశాల నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఒరిజినల్ టీసీ, బోనాఫైడ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, పదో తరగతి ఆన్‌లైన్ మార్కుల జాబితా, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, రెండు సెట్ల జిరాక్స్ ప్రతులతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు నిర్ణీత గడువులోగా ప్రవేశ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని, లేనిపక్షంలో ప్రవేశాలు రద్దు చేయబడతాయని ప్రిన్సిపల్ హెచ్చరించారు.

04-06-2026