16 April, 2026 | 7:09 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

Districts - Kumarambheem Asifabad

article_47489995.webp
ధాన్యం సేకరణ ప్రక్రియలో వేసవి దృష్ట్యా రక్షణ చర్యలు

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వడగాలులు, ఉష్ణోగ్రతల దృష్ట్యా వరి ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు, సేకరణ పనులను నిర్వహించే సిబ్బంది రక్షించడానికి నిర్దిష్ట చర్యలను తప్పక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, మంచిర్యాల, గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్ వంటి జిల్లాలలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అత్యవసర హెచ్చరికను జారీ చేసిందని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు నీడ కల్పించేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులు, హమాలీలకు వడదెబ్బ తగలకుండా నివారించడానికి చల్లటి తాగునీరు, మజ్జిగ, ఓ.ఆర్.ఎస్. అందించే "చలివేంద్రాలను" ఏర్పాటు చేయాలని తెలిపారు.

16-04-2026

article_54611942.webp
ప్రజా పాలన మండల స్థాయి సమావేశం

జైనూర్/లింగాపూర్ (విజయ క్రాంతి): లింగాపూర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం లింగాపూర్ రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం. సురేష్ కుమార్ పాల్గొని ప్రజా పాలన అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు అందించాల్సిన సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారుల పనితీరును పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎ. రాంచందర్, తహసీల్దార్, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

16-04-2026

article_12657262.webp
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): అర్హులందరికీ పథకాలు అందించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో 132 మంది లబ్ధిదారులకు, రెబ్బెన మండలం తహసీల్దార్ కార్యాలయంలో 99 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి చెక్కులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, రెబ్బెన మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

15-04-2026

article_74128195.webp
ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

కాగజ్ నగర్,(విజయక్రాంతి) కాగజ్ నగర్ పట్టణంలో మంగళవారం బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనముగా నిర్వహించారు . పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, దీక్ష భూమిలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మున్సిపల్ కమిషనర్ తిరుపతి,చైర్మన్ షాహిన్ సుల్తానా, వైస్ చైర్మన్ డాక్టర్ అనిత, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఏటుకూరి శ్రీనివాసరావు, సునార్కర్ అనిల్ కుమార్ PRTU TS జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

14-04-2026