17 June, 2026 | 8:44 PM

Breaking News

బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •  

Districts - Kumarambheem Asifabad

article_72092271.webp
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి

​వాంకిడి, (విజయక్రాంతి): విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జైత్‌పూర్ సర్పంచ్ కోలే జ్యోతి పిలుపునిచ్చారు. బుధవారం వాంకి మండలం జైత్‌పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నుండి ఉచితంగా అందించిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులను విద్యార్థులకు ఆమె పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధనతో పాటు ఉచితంగా దుస్తులు, భోజనం, పుస్తకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరినీ తల్లిదండ్రులు క్రమం తప్పకుండా తమ పిల్లలను బడికి పంపాలని, ఇంట్లోనూ చదివించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీ దుర్గం సందీప్, హెచ్‌ఎం రాధ, గ్రామ నాయకులు పత్రు, తిరుపతి, సదాశివ తదితరులు పాల్గొన్నారు.

17-06-2026

article_76984339.webp
పోస్టాఫీస్ బీమా పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ కల్పించే పోస్టాఫీస్ అనుబంధ బీమా పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత పిలుపునిచ్చారు. బుధవారం బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామానికి చెందిన సీహెచ్ లక్ష్మి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా రూ.436 వార్షిక ప్రీమియంతో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పాలసీ తీసుకున్నారు. ఇటీవల ఆమె అనారోగ్యంతో మృతి చెందగా, పాలసీ నిబంధనల ప్రకారం నామినీ అయిన ఆమె సోదరి కే. పేంటుబాయికి రూ.2 లక్షల బీమా చెక్కును కలెక్టర్ హరిత అందజేశారు.

17-06-2026

article_14510727.webp
ఇంధన పొదుపుకు జడ్జి వినూత్న సందేశం

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జక్కుల అనంతలక్ష్మి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం ఆమె అధికారిక వాహనాన్ని ఉపయోగించకుండా కాలినడకన కోర్టుకు చేరుకుని ఆదర్శంగా నిలిచారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం, ఇంధన వినియోగం వంటి సమస్యలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న చిన్న మార్పులతోనే పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం యాంత్రిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోతున్న నేపథ్యంలో నిత్యం కొంత దూరం కాలినడకన నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సూచించారు. ఇంధన పొదుపుతో పాటు ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కాపాడిన వాళ్ళం అవుతామని తెలిపారు.పర్యావరణ హిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆమె ఇచ్చిన సందేశం అందరికీ ఆదర్శంగా నిలిచింది.

17-06-2026

article_73640503.webp
బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

బెజ్జూర్ జూన్ 17 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా నిర్వాహకులు జనగామ లక్ష్మణ్, బొజ్జ కళావతి యోగ చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. యోగా చేయడంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని బిపి,షుగర్, రక్తపోటు, ఊపిరితిత్తుల సమస్యలు, టెన్షన్ నుండి ప్రశాంతత లభిస్తుంది. బిపి,షుగర్ అదుపులో ఉంటుంది. కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నరాల బలహీనత తదితర సమస్యలు సైతం కుదిరితపడతాయని తెలిపారు. ప్రతిరోజు ఆయుష్మాన్ భారత్ యోగ కేంద్రంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు యోగ నిర్వహించడం జరుగుతుందని యోగ శిబిరాన్ని ఆసక్తి గలవారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. యోగ కేంద్రంలో ఉచితంగా యోగ పై శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.

17-06-2026