సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): సింగరేణి సంస్థలో రిటైర్మెంట్ పొందిన కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సింగరేణి వాలంటరీ రిటైర్డ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (Reg.No:4148/97) ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి అభివృద్ధికి జీవితాంతం కష్టపడ్డ కార్మికులు రిటైర్మెంట్ అనంతరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ కార్మికులకు కనీసం రూ.10 వేల పెన్షన్ ఇవ్వడంతో పాటు ప్రతి మూడు నెలలకు పెరిగే డీఏను పెన్షన్లో కలపాలని డిమాండ్ చేశారు. ప్రతి రిటైర్డ్ కార్మికుడికి 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, సొంత స్థలాలు ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని రిటైర్డ్ కార్మికులకు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
18-05-2026