17 April, 2026 | 9:14 PM

Districts - Kumarambheem Asifabad

article_33904044.webp
మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): మండలంలోని కుమ్రం భీం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా మాణిక్ గూడ గ్రామానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె .హరిత అన్నారు.ఫిబ్రవరి నెలలో మాణిక్ గుడా గ్రామ సందర్శన సమయంలో జిల్లా కలెక్టర్ దృష్టికి గిరిజనులు పలు సమస్యలను తీసుకువెళ్లడంతో పాటు ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా తమ గ్రామానికి ఉందని వివరించారు.స్పందించిన కలెక్టర్ నివేదికలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించడంతో రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు.దాదాపు 46 లక్షల రూపాయలతో రక్షణ గోడకు శుక్రవారం కలెక్టర్ ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి భూమి పూజ చేశారు.

17-04-2026

article_23081530.webp
ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయ క్రాంతి): తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) ఆధ్వర్యంలో ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. TGEJAC రాష్ట్ర కమిటీ ఏప్రిల్ 7న నిర్వహించిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో తీసుకున్న తీర్మానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాలు, సెక్రటేరియట్, హెచ్‌ఓడీ కార్యాలయాలు, మండల , డివిజన్ కార్యాలయాలలో సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

17-04-2026

article_47489995.webp
ధాన్యం సేకరణ ప్రక్రియలో వేసవి దృష్ట్యా రక్షణ చర్యలు

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వడగాలులు, ఉష్ణోగ్రతల దృష్ట్యా వరి ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు, సేకరణ పనులను నిర్వహించే సిబ్బంది రక్షించడానికి నిర్దిష్ట చర్యలను తప్పక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, మంచిర్యాల, గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్ వంటి జిల్లాలలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అత్యవసర హెచ్చరికను జారీ చేసిందని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు నీడ కల్పించేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులు, హమాలీలకు వడదెబ్బ తగలకుండా నివారించడానికి చల్లటి తాగునీరు, మజ్జిగ, ఓ.ఆర్.ఎస్. అందించే "చలివేంద్రాలను" ఏర్పాటు చేయాలని తెలిపారు.

16-04-2026

article_54611942.webp
ప్రజా పాలన మండల స్థాయి సమావేశం

జైనూర్/లింగాపూర్ (విజయ క్రాంతి): లింగాపూర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం లింగాపూర్ రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం. సురేష్ కుమార్ పాల్గొని ప్రజా పాలన అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు అందించాల్సిన సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారుల పనితీరును పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎ. రాంచందర్, తహసీల్దార్, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

16-04-2026