4 July, 2026 | 5:22 AM

Districts - Kumarambheem Asifabad

article_73977615.webp
యూరియా అధిక ధరలపై చర్యలు తీసుకోవాలి

అసిఫాబాద్(విజయక్రాంతి): రైతులకు యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండల వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఏ. చిరంజీవికి సీపీఐ ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి మాట్లాడుతూ వానాకాలం సాగు సీజన్‌లో యూరియా కొరత, ఆన్లైన్ బుకింగ్ సమస్యలు, కొంతమంది వ్యాపారులు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్ని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని, రైతులపై ఇతర ఉత్పత్తులు బలవంతంగా మోపే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు పిడుగు శంకర్, తాళ్లపల్లి దివాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

03-07-2026

article_10567757.webp
ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): తిర్యాణి మండల కేంద్రంలో ఓటరు ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హరిత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి సేకరించి, వెంటనే డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మాట్లాడి ఫారాలను పూర్తిగా నింపించుకోవాలని, నింపిన ఫారాలను వెంటనే సేకరించి సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) డిజిటలైజేషన్‌కు పంపించాలని చెప్పారు.

03-07-2026