తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు
జైనూర్, మే 23 (విజయక్రాంతి): ప్రభుత్వం కొలువుదీరి 30 నెలలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, వెంటనే జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ నాయకుడు సందీప్ రాథోడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా 'నిరుద్యోగ గర్జన' పేరుతో ఉధృత పోరాటాలు చేపడతామని శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆయన విమర్శించారు.
23-05-2026