27 May, 2026 | 11:21 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

Districts - Kumarambheem Asifabad

article_57237229.webp
ఉత్తమ ప్రధానాచార్యుగా గుండేటి కోటేశ్వరరావుకు సన్మానం

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): శ్రీ సరస్వతీ విద్యా పీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మే 27, 28 తేదీలలో నిర్వహిస్తున్న వర్షారంభ సమావేశాల్లో భాగంగా 10వ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానాచార్యులను ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్‌కు చెందిన శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావును ప్రాంత సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ శాలువా, ప్రశంసా పత్రంతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తక్కళ్ళపల్లి తిరుపతిరావు, ప్రాంత కార్యదర్శి అనఘా వెంకటలక్ష్మి, దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు చామర్తి ఉమా మహేశ్వరరావు, లింగం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

27-05-2026

article_23591447.webp
మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

వాంకిడి, విజయక్రాంతి: వాంకిడి మండలంలోని ఎనోలి, బంబా ర, కోసర గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లను బుధవారం ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ సర్పంచ్, ఉప సర్పంచ్ లతో కలిసి పంపిణీ చేశారు. వాంకిడి ఉప సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు దీపక్ ముండే, బాంబర సర్పంచ్ కృష్ణ, పార్టీ నాయకులతో కలిసి ఆయన ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూలీలకు అందుతున్న త్రాగునీరు, నీడ సదుపాయాలపై ఫీల్డ్ అసిస్టెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల జూన్ 1వ తేదీన కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు మండల ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభ జయప్రదం చేయాలని ఆయన కోరారు.

27-05-2026

article_22911266.webp
బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ప్రజా పాలన ప్రత్యేక ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్ మండలం కౌటగూడ గ్రామపంచాయతీలో నిర్వహించిన “బాల్య వివాహ ముక్త్ భారత్” కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి బూర్ల మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు సమాజం మొత్తం కృషి చేయాలని, బాలికలకు 18, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరపాలని సూచించారు.పిల్లల రక్షణ, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, పిల్లలపై హింస నివారణలో గ్రామస్థాయి బాల సంరక్షణ కమిటీలు కీలకంగా పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లైలా, పంచాయతీ కార్యదర్శి శ్వేత, కౌన్సిలర్ చంద్రశేఖర్, యుక్తవయసు బాలికలు, వారి తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

26-05-2026