రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలి
31-12-2025
జిల్లాలో రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జనవరి 1, 2026 నుండి 31వ తేదీ వరకు జిల్లాలో రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణపై జిల్లా ఎస్.పి. నితిక పంత్ తో కలిసి పోలీస్, రెవెన్యూ, జాతీయ రహదారులు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, రహదారులు భవనాలు, విద్య, వైద్య, కార్మిక, రవాణా, విద్యుత్, మున్సిపల్, ఆర్. టి. సి. శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.