24 June, 2026 | 4:38 PM

Districts - Kumarambheem Asifabad

article_38851780.webp
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని రవిచంద్ర కాలనీ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో బుధవారం నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్య ప్రాముఖ్యత, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం గురించి అవగాహన కల్పించారు.విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరవుతూ పాఠాలను శ్రద్ధగా అభ్యసించాలని, ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. చదువుతో పాటు మంచి నడవడి, క్రమశిక్షణ అలవర్చుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు.పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

24-06-2026

article_17331879.webp
గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ మండలంలోని పర్ధన్‌గూడా గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలలో ఏజెన్సీ డిప్యూటీ డీఈఓ గోడం చందన్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాలు, బోధనా విధానం, హాజరు శాతం, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పరిశీలించారు.విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఆయన పలు అంశాలపై ప్రశ్నలు అడిగి వారి ప్రతిభను పరీక్షించారు. విద్యార్థులు చక్కగా సమాధానాలు ఇవ్వడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, బోధన పద్ధతులు, విద్యార్థుల నేర్చుకునే స్థాయిని పరిశీలించి ఉపాధ్యాయుల పనితీరును అభినందించారు.

24-06-2026

article_11268818.webp
రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

జైనూర్(విజయ క్రాంతి): జైనూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1.25 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మా భోజ్జు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ బుధవారం ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మూడు మండలాలకు చెందిన రైతులు మార్కెట్ కార్యకలాపాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

24-06-2026

article_81345671.webp
అర్హులైన పేదలందరికీ ఇళ్లు

వాంకిడి, (విజయక్రాంతి): అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరీ చేయిస్తామని కాంగ్రెస్ పార్టీ వాంకిడి మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణ పేర్కొన్నారు. బుధవారం వాంకిడి మండలంలోని బంబార గ్రామానికి చెందిన బోయిరే సుజాత నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును స్థానిక సర్పంచ్ బెండరే కృష్ణాజీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే మంజూరీ చేసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాడే సంతోష్, మాజీ ఉపసర్పంచ్ బోయిరే ప్రకాష్, పార్టీ నాయకులు, ఇందిరమ్మ రప్పిదారులు తదితరులు పాల్గొన్నారు.

24-06-2026

article_78887565.webp
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడలో సుమారు రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ కాపువాడ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా రహదారి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసింది. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరేలా పనిచేస్తున్నామని తెలిపారు .రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, 6వ వార్డు కౌన్సిలర్ ఎమ్మాజీ శారద సంతోష్ , అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

24-06-2026

article_72779807.webp
పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది

కుమ్రం భీం అసిఫాబాద్(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఏఐసిసి మహిళ జాతీయ కార్యదర్శి అదిత విమర్శించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.పేపర్ మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తీసుకున్న చొరవతో కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

24-06-2026