15 June, 2026 | 9:15 PM

Breaking News

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •   విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ   •   ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •  

Districts - Kumarambheem Asifabad

article_34853307.webp
కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు ప్రధాన గేటు వద్ద ఎస్పీఎం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారంకి 27వ రోజుకు చేరుకున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నోరు మెదపడం లేదని కార్మిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్పీఎం కార్మికులపై నిజంగా ప్రేమ ఉంటే స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు, ఎమ్మెల్సీ విఠల్ లు రిలే నిరాహార దీక్షా శిబిరానికి వచ్చి కార్మికులతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొనాలని డిమాండ్ చేశారు.

15-06-2026

article_40647999.webp
పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలోని పెండింగ్ వంతెనల పనులు పూర్తి చేయాలని మంచిర్యాల్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును శనివారం ఆయన నివాసంలో జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కెరమెరి మండలంలోని ఆనార్పల్లి, లక్మాపూర్ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్‌ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఉమ్రి క్రాస్ రోడ్ నుండి పరండోలి తండా వరకు బీటీ రహదారి నిర్మాణానికి అటవీ శాఖ నుంచి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించి పనులు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు రమేష్ తెలిపారు.

13-06-2026

article_77732817.webp
పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలం బంబార గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా దోమల నివారణ మందును పిచికారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి హెచ్‌ఈఓ రవిదాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఆవరణలో ఏసీఎం (5%) మందును పిచికారీ చేసి దోమల వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టారు. గ్రామ సర్పంచ్ బెండారే కృష్ణాజీ హాజరై పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెచ్‌ఈఓ రవిదాస్ మాట్లాడుతూ... డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ఈ చర్యలు ఉపయోగ పడతాయని అన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం సునంద, ఆశ వర్కర్ లక్ష్మీతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

13-06-2026