12 June, 2026 | 2:08 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

Districts - Kumarambheem Asifabad

article_11912295.webp
మురికి కాలువలను శుభ్రంగా ఉంచాలి

వాంకిడి,(విజయక్రాంతి): గ్రామంలో పారిశుద్ధ్యాన్ని కాపాడుకోవాలంటే గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మురికి కాలువల్లో చెత్త వేయకుండా శుభ్రత పాటించాలని ఖమాన సర్పంచ్ సునీత గ్రామస్తులకు సూచించారు. గురువారం గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లగూడలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను గ్రామపంచాయతీ కార్యదర్శి విలాస్ తో కలిసి సర్పంచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడం వల్ల మురుగు నీరు సరిగా ప్రవహించక ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించారు. వెంటనే గ్రామపంచాయతీ సఫాయి కార్మికులతో కాలువల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించి శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.

11-06-2026