calender_icon.png 27 December, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_60084853.webp
ప్రజా సమస్యల పోరాటానికి కృషి

26-12-2025

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా కార్యదర్శి బడ్రి సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న స్థాపించబడిన ఈ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తూ ఎన్నో సమరాలు, త్యాగాలు చేసిందన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో పలువురు విప్లవకారులు, దేశభక్తులు కలిసి కాన్పూర్‌లో సమావేశమై భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు సభ నిర్వహించారని, అదే సీపీఐ ఆవిర్భావ దినమని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై పాలకులపై పోరాటాలు నిర్వహించి అగ్రభాగాన నిలిచిన పార్టీ సీపీఐ అని పేర్కొన్నారు.

article_47475497.webp
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

25-12-2025

ఆసిఫాబాద్(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ అన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన కేరమేరి మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ జాదవ్ అమోల్, ఉపసర్పంచ్ రాథోడ్ పూజ, బోలపాటర్ సర్పంచ్ రాథోడ్ పారుబాయి, ముకదాం గూడా గ్రామ సర్పంచ్ జాదవ్ విమలాబాయి , నార్నూర్ మండలం ఉమ్రి గ్రామ సర్పంచ్ జాదవ్ సంతోష్ శ్యామ్ నాయక్ ను కలిశారు.ఈ సందర్భంగా అజ్మీరా శ్యామ్ నాయక్ నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడారు గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించాలన్నారు.అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.డి. నిజాం, రాథోడ్ దేవిదాస్, జాదవ్ ప్రకాష్, ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు.

article_82720265.webp
పండగపూట మున్సిపల్ కార్మికులు పస్తులా...?

25-12-2025

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో నాలుగో రోజు కార్మికులు ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయక కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు గత నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అలాగే బకాయిగా ఉన్న పీఎఫ్, ఈఎస్‌ఐ నిధులు సుమారు కోటి యాభై లక్షల రూపాయలు చెల్లించాలని జిల్లా కలెక్టర్‌, మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు.

article_15909372.webp
కారు ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి

25-12-2025

బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ఒక కుటుంబం మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణానికి వైద్యం నిమిత్తం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దేవాడ సోండో సమీపంలోని బ్రిడ్జి పైనుండి వారు ప్రయాణిస్తున్న కారు కింద పడగా ముగ్గురు మహిళలు ఒక బాలిక ప్రమాద స్థలంలోనే చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతి చెందిన వారు కాగజ్ నగర్ పట్టణానికి చెందిన మహిళలు అని నిజాముద్దీన్ కాలనీకి చెందిన ఆటో నడుపుకొని జీవనం కొనసాగిస్తున్న జాకీర్ యొక్క భార్య,సల్మా బేగం, కూతురు శబ్రీమ్, వార్డ్ 14, నంబర్ వార్డుకు చెందిన వారి బంధువులు ఇద్దరు మహిళలు ఆఫ్జా బేగం, సహార కూడా మృతి చెందినట్లు జాకీర్ తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చంద్రపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.