calender_icon.png 2 December, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_78248346.webp
గ్రామానికి దూరంగా వైన్‌షాపు ఏర్పాటు చేయాలి

01-12-2025

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని ఇస్‌గాం–నజ్రుల్ నగర్ పరిధిలో ప్రతిపాదించిన వైన్‌షాపును గ్రామానికి కనీసం 500 మీటర్లు దూరంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు జిల్లా అదనపు కలెక్టర్‌ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వినోద, నాయకులు షాహినీ, సుచిత్ర మాట్లాడుతూ.. నజ్రుల్ నగర్ గ్రామపంచాయతీకి కేటాయించిన వైన్‌షాపును గతంలో పెంచికలపేట మెయిన్ రోడ్డులోని పంచశీల నగర్ వద్ద ఏర్పాటు చేశారని, అయితే ఈ సంవత్సరం ఆ దుకాణాన్ని మరింత ముందుకు జరిపి ఇండ్ల మధ్యలో ఏర్పాటు చేయడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

article_53908587.webp
కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలి..

01-12-2025

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ₹26,000 చెల్లించడంతో పాటు నూతన టెండర్లను తక్షణమే పిలవాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ IHFMS టెండర్ల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం కొత్త టెండర్ల ప్రక్రియ చేపట్టి, కార్మికులకు న్యాయమైన కనీస వేతనం ₹26,000 అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

article_50326258.webp
విద్యార్థులకు నిపుణులతో ప్రత్యేక తరగతులు

01-12-2025

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు నిపుణుల ద్వారా తరగతులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దీపక్ తివారి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ప్రధానమంత్రి శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చే కార్యక్రమాలు పాఠశాలలలో ఏర్పాటు చేయాలని తెలిపారు.