calender_icon.png 24 October, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_60421502.webp
విద్యారంగ అభివృద్ధి దిశగా చర్యలు

22-10-2025

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి తెలిపారు. బుధవారం కెరమరి మండల కగోయగం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇందాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించి రిజిస్టర్లు, వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాధికారి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో త్రాగునీరు, విద్యుత్, మూతశాలలు, ప్రహరీ గోడ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు.

article_14819962.webp
రేపటిలోగా ప్రతి ఉద్యోగి వివరాలు నమోదు చేసుకోవాలి

21-10-2025

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఖజానా శాఖ నుండి వేతనాలు తీసుకుంటున్న జిల్లాలో పనిచేసే ప్రతి ఉద్యోగి పోర్టల్ లోని హెచ్.ఆర్. మాడ్యూల్ లో తమ వివరాలు ఈనెల 22లోగా నమోదు చేసుకోవాలని జిల్లా ఖజానా శాఖ సహాయ సంచాలకులు జి. భానుమతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఉద్యోగి తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు, చరవాణి నెంబర్ నవీకరించుకోవాలని, అన్ని వివరాలు నమోదు చేసుకున్న తర్వాత అక్టోబర్ నెలకు సంబంధించిన వేతన బిల్లులు ప్రాసెస్ చేసుకోవాలని, ఒకవేళ వివరాలు నమోదు చేసుకోనట్లయితే డి.డి.ఓ. లకు అక్టోబర్ నెలకు సంబంధించిన వేతనాల బిల్లులు ఐ.ఎఫ్.ఎం.ఐ.ఎస్. పోర్టల్ లో ఓపెన్ కాదని తెలిపారు.