5 April, 2026 | 4:37 PM

Districts - Kumarambheem Asifabad

article_58213559.webp
మహేష్ కుమార్ పర్యటన విజయవంతం చేయాలి

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాపర్యటన నేపథ్యంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ గురువారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ మాట్లాడారు. ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు ఆసిఫాబాద్‌లోని రోజ్ గార్డెన్‌లో జిల్లా స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎఫైర్స్ కమిటీ సభ్యులు, అలాగే పార్టీ అనుబంధ సంఘాలైన యూత్ కాంగ్రెస్, మహిళ కాంగ్రెస్, NSUI, సేవాదళ్, కిసాన్ కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు, సభ్యులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు,ముఖ్య కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలని సుగుణక్క పిలుపునిచ్చారు.పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేయడం లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

02-04-2026

article_67805047.webp
అంజనేయ స్వామికి కలెక్టర్ హరిత పూజలు

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని కేస్లాపూర్ అంజనేయ స్వామి ఆలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ కె. హరిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా స్వామివారికి నిర్వహించిన అభిషేకాలు, అర్చనలు కార్యక్రమాలలో కలెక్టర్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కలెక్టర్ కు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. పండుగ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారం, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

02-04-2026

article_36495127.webp
మండల వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామసభలు

వాంకిడి, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం వాంకిడి మండల వ్యాప్తంగా 28 గ్రామపంచాయతీలో సర్పంచుల అధ్యక్షతన ప్రత్యక గ్రామసభలు చేపట్టారు. గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి, సంక్షేమ ఫలాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి గ్రామ సభ ద్వారా తీర్మానాలు చేశారు. అనంతరం గ్రామ సభకు హాజరైన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని, దరఖాస్తులను గ్రామల సర్పంచ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచ్, వివిధ శాఖల అధికారులు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు హాజరయ్యారు.

02-04-2026