పిల్లలకు ఆధార్ నమోదు చేయించాలి
14-06-2025
కుమ్రం భీం ఆసిఫాబాద్,జూన్ 13(విజయ క్రాంతి): జిల్లాలో -5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల ఆధార్ నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో విద్య, గిరిజన సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, బ్యాంకు, తపాలా, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.