17 June, 2026 | 1:17 AM

Districts - Kumarambheem Asifabad

article_34853307.webp
కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు ప్రధాన గేటు వద్ద ఎస్పీఎం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారంకి 27వ రోజుకు చేరుకున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నోరు మెదపడం లేదని కార్మిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్పీఎం కార్మికులపై నిజంగా ప్రేమ ఉంటే స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు, ఎమ్మెల్సీ విఠల్ లు రిలే నిరాహార దీక్షా శిబిరానికి వచ్చి కార్మికులతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొనాలని డిమాండ్ చేశారు.

15-06-2026