బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
26-01-2026
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్ తో కలసి జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి, దేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని గుర్తు చేశారు.1949 నవంబరు 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటికీ, 1930లో కాంగ్రెస్ ప్రకటించిన ‘పూర్ణ స్వరాజ్’ దినోత్సవాన్ని స్మరించుకుంటూ జనవరి 26న అమలు చేసినట్లు వివరించారు. అలాగే 1930 జనవరి 26న లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో సంపూర్ణ స్వాతంత్ర్య ప్రతిజ్ఞ జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు సైనిక పరేడ్ నిర్వహించటం జరుగుతుందని,దేశవ్యాప్తంగా పాఠశాలలు, కార్యాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగ విలువలు, సమానత్వం, స్వేచ్ఛలను గుర్తుచేసే గొప్ప దినమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్నాక విజయ్, విశాల్ ఖండ్రే, సెర్ల మురళి, కోవ విజయ్, కొలిపాక కిరణ్, గోలెం తిరుపతి, మౌనిక, కోట గొల్లయ్య, మెరుగు శంకర్,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.