మార్లవాయిలో సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
09-01-2026
జైనూర్, జనవరి 8(విజయక్రాంతి): జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.91 లక్షల నిధులకు కృతజ్ఞతగా సర్పంచ్ కనక ప్రతిభ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీకి గ్రామస్తులతో కలసి క్షీరాభిషేకం చేశారు.