12 May, 2026 | 11:08 AM

Breaking News

సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •  

Districts - Kumarambheem Asifabad

article_72690437.webp
కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ

బెజ్జూర్, మే 12 (విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీజీ గురుకుల విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణాలకు సోమవారం బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతిలు భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్య వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం టీజీ డబ్ల్యూ ఐ డి సి కింద కస్తూరిబా అదనపు గదుల నిర్మాణాలకు రూ 18 లక్షల15 వేలు మంజూరు చేసింది. ఇట్టి పనులను భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీ ఓ శ్రీనివాస్, ఎంఈఓ సునీత, కస్తూర్బా ప్రత్యేక అధికారి అరుణ, ఇంజనీర్ గిరీష్ కుమార్, గ్రామ కార్యదర్శి మీసారి వైకుంఠం,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

12-05-2026

article_64379377.webp
రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలం లంజన్ వీర గ్రామంలో సోమవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంబుల్ ధరి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పవన్ కుమార్, వాంకిడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ సౌజన్య మాట్లాడుతూ... రైతులకు పంటల సాగులో మెలకులవల పై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం, భూసార పరీక్షలు, పంటల మార్పిడి, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు తదితర అంశాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జంబులు దారి ఉప సర్పంచ్ గుర్నులే విఠల్,ఏఈవో, రైతులు తదితరులు పాల్గొన్నారు.

11-05-2026

article_25977568.webp
సమస్యల పరిష్కారానికి చర్యలు

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డి ఆర్ ఓ వేణు తో కలిసి ప్రజా వాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.పలువురు భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, ఉపాధి అవకాశాలు కల్పించాలని దరఖాస్తులు అందజేశారు. ఐ కే పి వి ఓ ఏ లు వారి సమస్యలు పరిష్కారం చేయాలని లేక పోతే ఈ నెల 18 నుండి సమ్మె కు దిగుతామని నోటీసు అందజేశారు.వీటితో పాటు పలువురు అటవీ భూముల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

11-05-2026

article_55804791.webp
విద్యార్థినుల భవిష్యత్తుకు మెరుగైన వసతులు కల్పిస్తాం

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రెబ్బన మండలం గంగాపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలసి కలెక్టర్ కె. హరిత సోమవారం భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కేజీబీవీలో విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత బాలికలు ఉన్నత విద్యలో రాణించేలా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

11-05-2026