9 May, 2026 | 8:24 AM

Districts - Kumarambheem Asifabad

article_76258297.webp
రైతులకు పంట సాగు పై అవగాహన

వాంకిడి, (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఖిరీడీ గ్రామములో ' రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు' రైతులకు పంట సాగు పై అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ అనురాధ,సౌజన్య పాల్గొని, వారు మాట్లడుతూ రైతులు యూరియా వినియోగం తగ్గించాలని, పంట మార్పిడి చేయాలనీ, పచ్చిరొట్ట ఎరువులు వినియోగం పెంచాలని, పంట వ్యర్థాలను కాల్చకుండా వేసవి దుక్కులో కలియ దున్నలనీ తెలియచేశారు. నిషేధిత మందులు, నీటి యాజమాన్యం, కూరగాయ పంటలలో కోతల మధ్య పిచికారి విధానం మరియు నేలలో సేంద్రీయ పదార్థాలు పెంచడం వంటి రైతులకు అవగాహ న కల్పించారు.. ఈ కార్యక్రమం లో సి ఈ ఓ ఒమాజీ, AEO శంకర్, అరవింద్, ఖిర్డీ సర్పంచ్ అమృత, ఉప సర్పంచ్ సాగర్, గ్రామ పాటేల్ సంతోష్, రైతులు పాల్గొన్నారు.

08-05-2026

article_39014033.webp
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో ప్రాణహిత జలాలకు వినియోగం: మంత్రి జూపల్లి కృష్ణారావు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 8 (విజయక్రాంతి): ప్రాణహిత నది జలాలను సముద్రంలో వృథా కాకుండా సాగునీటి అవసరాలకు వినియోగించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం అధికారికంగా తొలి అడుగులు వేస్తోందని వెల్లడించారు. శుక్రవారం తుమ్మిడిహెట్టి నిర్మాణ స్థలాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి, తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు కాలువల ద్వారా నీటిని తరలించే అవకాశం ఉందని, దీంతో విద్యుత్ ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు.

08-05-2026

article_34119199.webp
రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలం సామెల గ్రామంలో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రొఫెసర్ అనురాధ, సౌజన్య పాల్గొని రైతులకు పంటల సాగులో మెలకులవల పై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. పంట సాగులో యూరియా వాడకం, పెట్టుబడులు తగ్గించడం, మట్టి పరీక్షలు, నేల ఆరోగ్యాన్ని కాపాడు కోవడం వంటి విషయాలపై వివరించారు. ఈ సందర్భం గా వాంకిడి మండల వ్యవ సాయ అధికారి గోపికాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మండల రైతులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవో అరవింద్, గ్రామ సర్పంచ్ సంతోష్‌తో, రైతులు తదితరులు పాల్గొన్నారు.

07-05-2026