నేర రహిత సమాజం దిశగా చర్యలు
30-12-2025
కుమ్రం భీం ఆసిఫాబాద్,డిసెంబర్ 29(విజయక్రాంతి): జిల్లాలో పోలీసుల తనిఖీలు పెద్ద ఎత్తున పెరగడంతో 2024తో పోలిస్తే 2025లో నేరాల సంఖ్య పెరిగిందని జిల్లా ఎస్పీ నీతిక పంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ని డీపీఓ కార్యాలయంలో కాగజ్నగర్ డీఎస్పీ వహీబుద్దీన్తో కలిసి ఆమె వార్షిక నేర నివేదిక ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2024లో జిల్లాలో 1,207 సాధారణ నేరాలు నమోదుకాగా, 2025లో అవి 1,934కు పెరిగాయని, ఇది 60.23 శాతం వృద్ధిగా పేర్కొన్నారు. నేరాల సంఖ్య పెరగడానికి పోలీసుల విస్తృత తనిఖీలు, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, వరకట్న వేధింపులు, గృహ హింస వంటి అంశాలే కారణాలని విశ్లేషించారు.