26 June, 2026 | 10:30 PM

Districts - Kumarambheem Asifabad

article_40398503.webp
ఆదివాసీ ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేసిన రేంజ్ అధికారిపై చర్యలు తీసుకోవాలి

జైనూర్, జూన్ 25 (విజయ క్రాంతి) : ఆదివాసీ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అటవీ శాఖ రేంజ్ అధికారి రమేశ్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఎన్నో ఏళ్లుగా పోడు రైతులు సాగు చేసుకుంటున్నారని, విత్తనాలు వేసే సమయంలో అటవీ శాఖ అధికారులు ఇబ్బంది పెట్టడం సరికాదని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాల్ పేర్కొన్నారు.

25-06-2026

article_63621954.webp
చిర్రకుంటలో ఘనంగా వనమహోత్సవం

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వనమహోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట గ్రామంలో బుధవారం ఘనంగా మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వరరావు పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు వనమహోత్సవం వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అరిగెల మల్లికార్జున్, బీజేపీ నాయకుడు బొమ్మెన శివప్రసాద్ గౌడ్, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

24-06-2026

article_16389691.webp
మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి):ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావుతో కలిసి ఆయన మనుమడు అరిగెల జుహీత్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని చిరకుంట గ్రామంలో "ఏక్ పెడ్ మాకే నామ్" కార్యక్రమం నిర్వహించి 500కు పైగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు గ్రామంలో మొక్కలు నాటినట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి బతికేలా చర్యలు తీసుకోవడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్వతి, ఉపసర్పంచ్ మల్లేష్, వార్డు సభ్యులు, బీజేపీ నాయకులు ప్రసాద్ గౌడ్, సంతోష్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

24-06-2026

article_16748924.webp
బెజ్జూర్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) కార్యక్రమానికి శ్రీకారం

బెజ్జూర్ జున్ 24 (విజయ క్రాంతి): భారత ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలను బెజ్జూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దుర్గం సరోజ-తిరుపతి విడుదల చేసి ప్రజలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా,ఖచ్చితంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రజలందరూ చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వైకుంఠం,వార్డు సభ్యులు గుమ్ముల శ్రీనివాస్,కోట రాజన్న,ఐకేపీ సిబ్బంది మంచెర్ల సురేష్,గ్రామ పంచాయతీ సిబ్బంది గోరెంట్ల వసంత్,అజీష్,సలీమ్ తదితరులు పాల్గొన్నారు.

24-06-2026

article_59236279.webp
బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా సందీప్ కుమార్

జైనూర్, జూన్ 24 (విజయక్రాంతి): బీజేపీ ఎస్టీ మోర్చా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జైనూర్ మండలం శివనూర్ గ్రామానికి చెందిన రాథోడ్ సందీప్ కుమార్ నియమితులయ్యారు.బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్‌లు సందీప్ కుమార్‌కు నియామక పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ పార్టీలో తాను చేసిన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు ఎస్టీ మోర్చాను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

24-06-2026

article_17023963.webp
ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి

జైనూర్, జూన్ 24 (విజయక్రాంతి) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు.బుధవారం జైనూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, సిబ్బంది హాజరు, సవరణ ప్రక్రియ తీరును పరిశీలించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.సర్వే పత్రాలను పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా పంపిణీ చేయాలని, ఓటర్ల నూతన పాస్‌పోర్ట్ ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్లతో మాట్లాడి గ్రామాల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంచాలని తహసీల్దార్‌కు కలెక్టర్ సూచించారు.బూత్ స్థాయి అధికారులు ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం అందజేసి, పూర్తి చేసిన ఫారాలను తిరిగి సేకరించి యాప్‌లో వివరాలు నమోదు చేస్తారని ఆమె తెలిపారు. తహసీల్దార్లు, సూపర్‌వైజర్లు, జిల్లా యంత్రాంగం ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆడ బిర్షావ్, ఆర్ఐ మోహన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

24-06-2026