పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
18-11-2025
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక పద్ధతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ, విద్య, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు,, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు పని కల్పించేందుకు అవసరమైన పనులు గుర్తించేందుకు గ్రామ సభలు నిర్వహించి, పనులను ఎంపిక చేయాలని తెలిపారు.