calender_icon.png 30 January, 2026 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_67570047.webp
మేడారం ప్రమాద బాధితులను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

29-01-2026

కౌటాల (విజయ క్రాంతి): మేడారం జాతరలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేట్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని కస్తూరి సునీత, కస్తూరి అక్షిత మృతి చెందడం తీవ్ర విషాదం కలిగించిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు.సమాచారం అందుకున్న వెంటనే ఆయన ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పోచం, కార్తీక్, నవీన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

article_21243453.webp
సీఎం కప్ మండల క్రీడా పోటీలు ప్రారంభం

29-01-2026

జైనుర్ జనవరి 29 (విజయ క్రాంతి): జైనూర్ మండల కేంద్రంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కే.విశ్వనాథ్ ప్రారంభించగా,సీఐ రమేష్,తహసీల్దార్ అడా బిర్సావ్,స్థానిక సర్పంచ్ కొడప ప్రకాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు.గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో ప్రతిభను వెలికితీసుకుని రాష్ట్ర,జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.పోటీలను క్రమబద్ధంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.క్రీడల ద్వారా స్నేహభావం,క్రమశిక్షణ పెరుగుతుందని అన్నారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.క్రీడాకారులకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు,అధికారులు,యువకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

article_34507307.webp
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

29-01-2026

వాంకిడి, (విజయ క్రాంతి): వాంకిడి మండలం లేనిగూడకి చెందిన వాడై నివృతి (28) పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నట్లు వాంకిడి ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివ రాల ప్రకారం వాడే నివృతి రెం డు సంవత్సరాలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడు తూ, హైదరాబాద్, చంద్రపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందా డు. మంగళవారం రాత్రి కడు పు నొప్పి తీవ్రం కావడంతో నొప్పి భరించలేక పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపు యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ తెలి పారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నట్లు ఎస్సై పేర్కొన్నారు.

article_17783180.webp
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు

29-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్ ,జనవరి 28 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా పూర్తి స్థాయిలో ఏర్పా ట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమా వేశ మందిరంలో ఎస్.పి. నితికా పంత్, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

article_37097119.webp
డ్రైనేజీ నిండి ఇండ్ల ముందుకు చేరిన మురికి నీరు

28-01-2026

బెజ్జూర్ జనవరి 28 (విజయ క్రాంతి): కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని బాలాజీ నగర్ లో డ్రైనేజీ నుండి ఇండ్ల ముందుకు మురికి నీరు చేరిందని కాలనీ ప్రజలు వాపోతున్నారు. డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారంతో నిండిపోయి మురికి నీరు ఇండ్ల ముందుకు చేరడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల ముందుకు మురికి నీరు చేరడంతో కాలనీవాసులు రోడ్డుమీద నిరసన తెలిపారు.గత కొన్ని రోజుల నుండి డ్రెయినేజీ నిండి ఇండ్ల లోకి మురుగు నీరు వస్తుందని మునిసిపల్ అధికారుల చెప్పిన పట్టించుకోవడం లేదని దీనితో కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తమ సమస్య పరిష్కరించాలని నిరసనకు దిగినట్లు తారని ప్రజలు తెలిపారు.

article_56831610.webp
కాంగ్రెస్‌కు షాక్...!

28-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పట్టణంలోని బజార్‌వాడికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ ఆధ్వర్యంలో 50 మందికి పైగా కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కోవ లక్ష్మి వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ, ప్రజల పక్షాన పోరాడే ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ గడప ఎల్లప్పుడూ తెరిచే ఉందని భరోసా ఇచ్చారు. కోవ లక్ష్మి నాయకత్వంలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.అనంతరం తమ ప్రాంతంలో నెలకొన్న రోడ్లు, నీటి సరఫరా, కాలనీలలోని పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్, మాజీ సర్పంచ్ మర్సకోల సరస్వతి, మాజీ వైస్ ఎంపీపీ కలాం,నాయకులు షాకీర్, నిస్సార్ ,అన్సార్, పొన్నాల నారాయణ, సయ్యద్ జావీద్, హకీం అన్సారి, షకీల్, సాజిద్, ఎం.డి. తాజ్, అఖిల్, సబిల్, ఐఫాన్, ఫర్జిన్ తదితరులు పాల్గొన్నారు.