23 May, 2026 | 9:04 PM

Districts - Kumarambheem Asifabad

article_86281730.webp
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు

జైనూర్, మే 23 (విజయక్రాంతి): ప్రభుత్వం కొలువుదీరి 30 నెలలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, వెంటనే జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ నాయకుడు సందీప్ రాథోడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా 'నిరుద్యోగ గర్జన' పేరుతో ఉధృత పోరాటాలు చేపడతామని శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆయన విమర్శించారు.

23-05-2026

article_41160229.webp
జైనూర్‌లో విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ నేత ఆగ్రహం

జైనూర్,(విజయక్రాంతి): జైనూర్‌లో చిన్న చినుకు పడినా, కాస్త ఈదురు గాలులు వీచినా విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు ఆరోపించారు. జైనూర్‌లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, కుమ్రం భీం జిల్లాలో విద్యుత్ అధికారులు ఉన్నారా లేదా, అసలు విధులు నిర్వహిస్తున్నారా లేదా అనే అనుమానం కలుగుతోందని ఆయన విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ చీకటి రోజులు వస్తాయి అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని, ప్రజలు వినకుండా ఆశపడి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఓటు వేసి నాటి ఆంధ్రప్రదేశ్‌లోని చీకటి రోజులను తిరిగి తెచ్చుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

23-05-2026