16 June, 2026 | 4:20 AM

Districts - Kumarambheem Asifabad

article_34853307.webp
కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు ప్రధాన గేటు వద్ద ఎస్పీఎం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారంకి 27వ రోజుకు చేరుకున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నోరు మెదపడం లేదని కార్మిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్పీఎం కార్మికులపై నిజంగా ప్రేమ ఉంటే స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు, ఎమ్మెల్సీ విఠల్ లు రిలే నిరాహార దీక్షా శిబిరానికి వచ్చి కార్మికులతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొనాలని డిమాండ్ చేశారు.

15-06-2026

article_40647999.webp
పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలోని పెండింగ్ వంతెనల పనులు పూర్తి చేయాలని మంచిర్యాల్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును శనివారం ఆయన నివాసంలో జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కెరమెరి మండలంలోని ఆనార్పల్లి, లక్మాపూర్ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్‌ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఉమ్రి క్రాస్ రోడ్ నుండి పరండోలి తండా వరకు బీటీ రహదారి నిర్మాణానికి అటవీ శాఖ నుంచి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించి పనులు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు రమేష్ తెలిపారు.

13-06-2026