ఎఆర్ఎస్ఐ శ్రీనివాస్కు ఘన సన్మానం
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎ.ఆర్.ఎస్.ఐ. శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా శనివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాస్ను శాలువాతో సత్కరించి, పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన రూ.1,57,146 విలువైన చెక్ను అందజేశారు.
28-02-2026