16 August, 2026 | 8:54 PM

Districts - Kumarambheem Asifabad

article_31913788.webp
అంగరంగ వైభవంగా నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన

బెజ్జూర్ ఆగస్టు 16 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఎలుక పెళ్లి, బెజ్జూర్ గ్రామాల సమీపంలోని నాగుల చెరువు సమీపంలో నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి కాగజ్నగర్ త్రినేత్ర ఆలయ ప్రధాన అర్చకులు సాయిరాం శాస్త్రి వేద పండితుల సమక్షంలో విగ్రహ పుణ: ప్రతిష్టాపన,ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సహకరించిన దాతలు అందరికీ ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయ అధ్యక్షులు తంగేడి పల్లి మహేష్, ఎలుక పెళ్లి హనుమాన్ ఆలయ అధ్యక్షుడు శ్రీనివాస్, కుడ్రంగి రామకృష్ణ, సిద్దాపూర్ సర్పంచ్ చెండే పద్మ శంకర్ విలేకరుల బృందం గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

16-08-2026

article_25848740.webp
బెజ్జూరు ఉత్తమ ఆశా వర్కర్ గా పార్వతి

బెజ్జూర్ ఆగస్ట్ 15 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలం ఉత్తమ ఆశ వర్కర్ గా ఆయిల్ల పార్వతికి ఆసిఫాబాద్ డిఎంహెచ్వో నాగేందర్, ప్రశంస పత్రాన్ని అందజేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మండల ఉత్తమ ఆశా వర్కర్ గా ఆయిల్లో పార్వతికి ప్రశంస పత్రం అందించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఇలా మూడుసార్లుగా ఉత్తమ ఆశా వర్కర్ గా ప్రశంస పత్రం అందుకోవడం అభినందనీయమని డి ఎం హెచ్ ఓ నాగేంద్ర అభినందించారు. పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఆశా వర్కర్ పార్వతి కృషి అభినందనీయమని అన్నారు. ఆశ పార్వతిని అందరూ ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

15-08-2026

article_82031875.webp
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర మహిళా సదస్సును విజయవంతం చేయాలి

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 16న నిర్వహించనున్న టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర మహిళా సదస్సుకు అన్ని యాజమాన్యాల మహిళా ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతి కుమారి కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సమానత్వం, మహిళా సాధికారత లక్ష్యంగా రాష్ట్ర మహిళా సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు కేవలం నాయకత్వ స్థానాల్లో నామమాత్రంగా కాకుండా సామాజిక స్పృహతో సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తాలని పిలుపునిచ్చారు.

14-08-2026

article_24166205.webp
ప్రధాన రహదారి ఇలా.. ప్రయాణం చేసేది ఎలా..?

బెజ్జూర్,ఆగస్టు14(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ ప్రధాన రహదారి అంతా బురదమయంగా కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నామని తెలుపుతున్నారు. మండలంలోని ఏటి గూడ ప్రధాన రహదారి అంత బురదమయంగా ఉండడంతో ప్రతినిత్యం వాహనదారులు బాటసారులు ఇబ్బందులు పడుతున్నామని తెలుపుతున్నారు. రహదారి ఇలా ఉంటే ప్రయాణం చేసేది ఎలా అని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాణ్యతతో రోడ్డు పనులు చేపట్టకపోవడంతో రోడ్డు పూర్తిగా పాడైపోయిందని ప్రజలు తెలుపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టర్ స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేసేలా చూడాలని ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు.

14-08-2026

article_23009807.webp
సామాజిక ఆసుపత్రిలో నే ప్రసవాలు జరిగేలా చూడాలి

బెజ్జూర్ ఆగస్టు 13 (విజయక్రాంతి): సామాజిక ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలి సూపర్డెంట్ అవినాష్ వైద్య సిబ్బందికి ఆదేశించారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వివరాలు, పలు రికార్డులు, మందుల నిల్వలు పరిశీలించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. గతంలో ప్రసవాల సంఖ్య మెరుగుగా ఉందని, ప్రస్తుతం ప్రసవాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక ఆసుపత్రిలోనే ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. క్రిటికల్ కేసులను మాత్రమే రెఫర్ చేయాలని, ఆరోగ్యవంతంగా ఉన్న గర్భిణీలను సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సంబంధిత వైద్య సిబ్బందికి సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలనతో హాజరుకావాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట వైద్యాధికారి శ్రావణ్ కుమార్, ఫార్మసిస్ట్ ఆయేషా వైద్య సిబ్బంది ఉన్నారు.

14-08-2026

article_82544138.webp
శివాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు

బెజ్జూర్ ఆగస్టు 13 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని శివాలయం లో శ్రావణమాసం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని శివాలయం శ్రీ రంగనాయక స్వామి హనుమాన్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకం నిర్వహించారు. శ్రావణమాసం ప్రారంభోత్సవం సందర్భంగా శివాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు గురుదత్ భక్తులతో అభిషేకం, బిల్వర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు నాగభూషణ్ గౌడ్, దంపతులు, భక్తులు పాల్గొన్నారు.

14-08-2026