ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు కృషి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, బోధన–అభ్యాసన ప్రక్రియ బలోపేతానికి ప్యానెల్ ఇన్స్పెక్షన్లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు ప్యానెల్ సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
01-08-2026