5 July, 2026 | 4:17 AM

Districts - Kumarambheem Asifabad

article_79274921.webp
ఘనంగా సహకార వారోత్సవాలు

వాంకిడి, (విజయక్రాంతి): అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా వాంకిడి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శనివారం సహకార పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘం (PACS) చైర్మన్ జాబోరే పెంటయ్య సహకార పతాకాన్ని ఎగురవేసి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలు రైతుల అభివృద్ధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కీలకంగా నిలుస్తున్నాయని అన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించడంలో సహకార సంఘం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గోపీకాంత్, ఏఈఓ తాండవ కృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు దమ్మదాన్, స్వాతి, సంఘం కార్యదర్శి ఓమాజీ, డైరెక్టర్లు, సంఘం సిబ్బంది, సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

04-07-2026

article_19476948.webp
పోడు భూములపై ఉద్రిక్తత

ఆసిఫాబాద్(విజయక్రాంతి): కెరమెరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవుడుపల్లి బీట్‌లో, సూర్ధపూర్ గ్రామ శివారులో ఉన్న సుమారు 150 హెక్టార్ల భూమిని అటవీశాఖ అధికారులు(Forest Department) స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములు పోడు సాగు చేస్తున్న రైతుల ఆధీనంలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఇటీవల అటవీశాఖ అధికారులు ట్రెంచ్ తవ్వకాలకు వెళ్లగా, స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ముందస్తు చర్యలో భాగంగా వందమందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, జేసీబీల సహాయంతో అటవీశాఖ అధికారులు కందకాల తవ్వకాలు చేపట్టారు.రైతులు భూముల వద్దకు చేరకుండా ముందస్తుగానే పోలీసులు గ్రామ పరిసరాల్లో, వ్యవసాయ భూముల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. తమ పోడు భూములను రక్షించాలని, తమకు న్యాయం చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

04-07-2026

article_73977615.webp
యూరియా అధిక ధరలపై చర్యలు తీసుకోవాలి

అసిఫాబాద్(విజయక్రాంతి): రైతులకు యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండల వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఏ. చిరంజీవికి సీపీఐ ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి మాట్లాడుతూ వానాకాలం సాగు సీజన్‌లో యూరియా కొరత, ఆన్లైన్ బుకింగ్ సమస్యలు, కొంతమంది వ్యాపారులు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్ని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని, రైతులపై ఇతర ఉత్పత్తులు బలవంతంగా మోపే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు పిడుగు శంకర్, తాళ్లపల్లి దివాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

03-07-2026