22 August, 2026 | 5:42 PM

Districts - Kumarambheem Asifabad

article_16701021.webp
రైతుల పక్షాన పోరాటం చేస్తాం..

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో రైతుల భూములను హరించే ప్రయత్నం చేస్తోందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(BRS MLA Kova laxmi), మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంలోని 22ఏ కింద అమాయక రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు.

22-08-2026

article_81010369.webp
రేషన్ బియ్యం పట్టివేత..రెండు వాహనాలు సీజ్

బెజ్జూర్ ఆగస్ట్ 22 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని పాపన్ పేట్, మంచిర్యాల నుండి వచ్చిన ఓ వాహనం మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై సర్తాజ్ తెలిపారు. ఉదయం ఐదు గంటలకు విశ్వసనీయ సమాచారం మెరకు పోలీస్ సిబ్బందితో మొగవెల్లి, సోమని మధ్యలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు ఆటోలను ఆపి తనికి చేయగా అందులో ప్రభుత్వ రాహితీ బియ్యం ను అక్రమంగా తర్తిలిస్తున్న రెండు వాహనాలను పెట్టుకోవడం జరిగిందనీ తెలిపారు.వివరాల్లో కి వెళ్తే దొరికిన రెండు వాహనాలలో ఒకటి తూర్పతి దుర్గయ్య మంచిర్యాల కి చెందిన ఫోర్

22-08-2026

article_27829213.webp
కాంగ్రెస్‌లో చేరింది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాదు

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలంలోని గోయేగావ్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై వాంకిడి మండల బీఆర్‌ఎస్‌ పార్టీ స్పందించింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ వాంకిడి మాజీ జెడ్పిటిసి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తులకు బీఆర్‌ఎస్‌ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వారిని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా పేర్కొంటూ ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని, ఆయనతో పాటు మండల బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం ఖండించారు. బీఆర్‌ఎస్‌కు సంబంధం లేని వ్యక్తులను పార్టీ కార్యకర్తలుగా చిత్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వాస్తవాలను ప్రజలు గమనించాలని, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని మండల బీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు.

21-08-2026

article_77070411.webp
ఫోటోగ్రాఫర్లకు ఘన సన్మానం

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆసిఫాబాద్ ఆధ్వర్యంలో స్థానిక ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. ఫోటోగ్రఫీ రంగంలో విశేష సేవలందిస్తున్న వారిని శాలువాలు కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను చిత్రాల రూపంలో ప్రజలకు చేరవేయడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ల సేవలను కొనియాడుతూ వారికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్ అబ్దుల్ ఫయాజ్ (క్యాబినెట్ మెంబర్), లయన్ శంకర్ (క్లబ్ అడ్మినిస్ట్రేటర్), లయన్ బోయిరే ప్రకాష్ (సెక్రటరీ) పాల్గొన్నారు.

19-08-2026