ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఎన్నికలు
17-12-2025
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరగనున్న 3వ విడత ఎన్నికల కొరకు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం మోతుగూడ, కాగజ్నగర్ మండలం కోసిని, రెబ్బెన మండలం ఇందిరానగర్, రెబ్బెన, తిర్యాణి మండలం కన్నెపల్లి, తిర్యాణి గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు.