పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
05-02-2026
కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత పేర్కొన్నారు.గురువారం జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు ఆలోక్ కుమార్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, శిక్షణ ఐఏఎస్ అధికారి భార్గవ్ కుమార్తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.