30 July, 2026 | 2:38 AM

Districts - Kumarambheem Asifabad

article_38199462.webp
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి

రెబ్బెన మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క బుధవారం ప్రారంభించారు. అనంతరం నూతన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కిషన్ గౌడ్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంలో మండల కార్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు కృషి చేయాలని సూచించారు.

29-07-2026