పోడు రైతులకు న్యాయం చేయాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల రైతుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డా. సి. సువర్ణను కోరారు. సోమవారం హైదరాబాద్లోని ఫారెస్ట్ భవన్లో రైతులతో కలిసి ఆమె డా. సి. సువర్ణను కలిసి వినతిపత్రం అందజేశారు.
23-06-2026