8 July, 2026 | 7:39 PM

Districts - Kumarambheem Asifabad

article_58882262.webp
విద్యార్థి శక్తి - పర్యావరణ శక్తి

బెజ్జూరు,జూలై 8, (విజయక్రాంతి): జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మండల శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా,మండల నాయకులు, కార్యకర్తలు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొని సుమారు 100 మొక్కలు నాటారు. వేప, మర్రి, రావి, నిమ్మ, వంటి పర్యావరణానికి మేలు చేసే మొక్కలను పాఠశాల ఆవరణ, బస్టాండ్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నాటారు.ఈ సందర్భంగా ఏబీవీపీ మండల ఇన్చార్జి విశ్వాత్ గౌడ్ మాట్లాడుతూ,"స్వామి వివేకానంద స్ఫూర్తితో ఏర్పడిన ఏబీవీపీ 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. విద్యార్థి దినోత్సవం రోజున కేవలం వేడుకలు చేసుకోవడం కాదు, సమాజానికి ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతో మొక్కలు నాటాం. ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి, దానిని పెంచే బాధ్యత తీసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడడమే దేశభక్తి" అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కంబాల అనేవేష్,గర్లపల్లి చరణ్, మద్దూరి బన్నీ,కేశెట్టి కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

08-07-2026

article_27151780.webp
గ్యాస్ సిలిండర్ పెలి ఇల్లు పూర్తిగా దగ్ధం

బెజ్జూర్:(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి(Gas cylinder exploded) ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఎస్సై సర్తాజ్ పాషా, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్రం మహేష్,ప్రశాంత్ కుటుంబ సభ్యులు గ్యాస్ స్టవ్ పై ఇంట్లో వంట చేసుకుని భోజనం చేసిన అనంతరం పొలం పనులకు వెళ్లారు. వెళ్లిన కొద్దిసేపటికి ఇంట్లో నుండి ఒక్కసారిగా పెద్ద శబ్దం, మంటలు చెలరేగి కనిపించాయి ఇది చూసిన స్థానికులు వెంటనే ఎస్సై సర్తాజ్ పాషా కు సమాచారం అందించడంతో వెంటనే సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు.

08-07-2026

article_84961976.webp
బాధిత కుటుంబానికి అండగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామానికి చెందిన ఆత్రం మహేష్ నివాసంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై, కుటుంబ సభ్యులు తమ నిత్యావసర వస్తువులు, దుస్తులు, ఇతర సామగ్రిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.ఈ ఘటన గురించి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వెంటనే స్పందించి బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకుని, తక్షణ సహాయంగా నిత్యావసర వస్తువులు, కొత్త దుస్తులు, ఒక క్వింటాల్ బియ్యం, ఇతర అవసరమైన దాదాపు 20,000 వేల విలువచేసే సామగ్రిని అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బాదితులు అధైర్య పడొద్దని ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,సర్పంచ్ లు మరియు కోనేరు అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

08-07-2026