1 June, 2026 | 10:53 PM

Districts - Kumarambheem Asifabad

article_89268152.webp
పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని కౌటగూడ గ్రామంలో నిన్న పిడుగుపాటుకు మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.కుటుంబానికి జరిగిన తీరని నష్టంపై విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

01-06-2026

article_84517828.webp
అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క

అసిఫాబాద్ (విజయక్రాంతి): చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని అంగన్వాడి కేంద్రం-4లో సోమవారం నిర్వహించిన ‘అమ్మ మాట – అంగన్వాడి బాట’ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao),జిల్లా కలెక్టర్ కె. హరిత, సబ్ కలెక్టర్ శ్వేత శుక్లా, గ్రంథాలయ చైర్మన్ అనిల్ తో కలిసి పాల్గొన్నారు.

01-06-2026

article_63176593.webp
BRS నేతల ముందస్తు అరెస్టులు.. అప్రజాస్వామికం

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు చేపట్టిన ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు అప్రజాస్వామిక చర్యలని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు, గుండి గ్రామ సర్పంచ్ జబరి రవీందర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్న సందర్భంగా ప్రజలు తమ సమస్యలను వినిపించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం నిరాకరిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

01-06-2026

article_61334049.webp
సీఎం జనజాతర సభకు మార్లవాయి గ్రామస్తుల భారీ తరలింపు

జైనూర్, మే 31, (విజయ క్రాంతి) : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ వార్షికోత్సవం సందర్భంగా కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్, ఆసిఫాబాద్‌లో నిర్వహించనున్న సీఎం జనజాతర సభకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, జైనూర్ మండలం, మార్లవాయి గ్రామ ప్రజలు భారీగా తరలివెళ్తున్నారు.గ్రామ సర్పంచ్ కనక ప్రతిభ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, పెద్దలు ఉత్సాహంగా బయలుదేరారు. ఉప సర్పంచ్ ఆత్రం రాజేశ్వర్, VO అధ్యక్షులు కనక రూపబాయి, వార్డు సభ్యులు సర్జబాయి, కనక భరత్, కొడప పుల్లబాయి, VAO తొడసం సీత తదితరులు సభలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామ ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఈ తరలింపు స్పష్టంగా చాటుతోంది.

01-06-2026

article_24001912.webp
హైదరాబాద్‌లో అవార్డు అందుకున్న ఆదివాసి బిడ్డ

బెజ్జూర్, జూన్ 01 (విజయక్రాంతి): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలానికి చెందిన ఆదివాసీ యువతి కుడుమేత చెంచులక్ష్మి హైదరాబాదులో అవార్డు అందుకుంది.శంకర్,రాజుబాయి దంపతుల కుమార్తె కె. చెంచులక్ష్మి హైదరాబాద్‌లో జరిగిన ఏఐ అచ్చివర్స్ నేషనల్ లెవెల్ ప్రోగ్రాం లో ప్రతిభ కనబర్చి ఏఐ బిజినెస్ అచ్చివర్ అవార్డు ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఏఐ రంగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న చెంచులక్ష్మి, ప్రస్తుతం 100 మందికి పైగా విద్యార్థులు, యువతకు ఏఐ శిక్షణ అందిస్తూ ముందుకు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ పై అవగాహన కల్పిస్తూ అనేక మందికి మార్గదర్శకురాలిగా నిలుస్తోంది.హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన నేషనల్ లెవెల్ కార్యక్రమంలో పాల్గొని ఏఐ బిజినెస్ విభాగంలో అచ్చివర్ గా ఎంపికైన ఆమెకు ప్రముఖ ఏఐ ఫౌండర్ & కోచ్ నికీల్ శాలువాతో ఘనంగా సన్మానించి అవార్డు, సర్టిఫికెట్ ను అందజేశారు.

01-06-2026

article_37957131.webp
ప్రజాసంఘాల నాయకుల ముందస్తు అరెస్టులను ఖండించిన సీపీఎం

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా సమస్యలపై వినతిపత్రాలు అందజేయడానికి సిద్ధమవుతున్న ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని సీపీఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్ తెలిపారు.సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. వినతిపత్రాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్న నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. ప్రజల సమస్యలను వినాల్సిన ప్రభుత్వం, వాటిని ప్రస్తావించే నాయకులను అడ్డుకోవడం సరైన విధానం కాదన్నారు. అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, నిర్బంధ చర్యలను విరమించాలని దుర్గం దినకర్ కోరారు.

01-06-2026