30 June, 2026 | 2:25 PM

Districts - Kumarambheem Asifabad

article_57775194.webp
బెజ్జూర్ లో బిఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసన

బెజ్జూర్ జూన్ 30 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధాన చౌరస్తాపై నిరసన తెలిపి రాస్తారోకో నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత తొలగించడంతోపాటు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సైతం తొలగించడంతో పార్టీ ఆదేశాల మేరకు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భూస సారయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు వారికి భద్రత కల్పించడంతోపాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తిరిగి అప్పగించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖాజా మైనుద్దీన్, తిరుపతి, నరేంద్ర గౌడ్, అమీరుద్దీన్, జావిద్ అలీ, దుర్గం తిరుపతి, నీకాడి మోహన్, గుమ్మల శ్రీనివాస్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

30-06-2026

article_50353636.webp
ఆశ్రమ పాఠశాలలో 'లేట్ ఫీజు' వసూళ్ల కలకలం

బెజ్జూర్, జూన్ 30 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో(Ashram Schools for Tribal Girls) విద్యార్థుల నుంచి 'లేట్ ఫీజు' పేరుతో నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువడడంతో వివాదం నెలకొంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నట్లు పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.విద్యార్థి తండ్రి సుధాకర్ తన కుమార్తె వద్ద రూ.200 లేకపోవడంతో డబ్బులు ఎందుకు చెల్లించాలని వార్డెన్‌ను ప్రశ్నించినట్లు తెలిపారు. దీనికి స్పందించిన వార్డెన్ శ్రీనివాస్, విద్యార్థులు సమయానికి పాఠశాలకు రావాలనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని తీసుకుంటున్నామని, ఆశ్రమ పాఠశాల అవసరాలకే వినియోగిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు.

30-06-2026