విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గెడం టీకానంద్, జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ డిమాండ్ చేశారు. గత విద్యా సంవత్సరంలో సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
02-06-2026