calender_icon.png 13 January, 2026 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_37689700.webp
యువశక్తికి స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద

13-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్,జనవరి 12(విజయ క్రాంతి): యువశక్తికి స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా యువజన క్రీడా సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, జిల్లా యువజన క్రీడా సేవల శాఖ అధికారి అశ్వక్ అహ్మద్ లతో కలిసి హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

article_28685365.webp
ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

13-01-2026

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 12(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అంది న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వస్తున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా అధికారుల సమ న్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపా రు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

article_59906342.webp
ఆదివాసీల ఆత్మబంధువులు ప్రొ.హైమన్ డార్ఫ్ జెట్టి ఎలిజిబెత్ దంపతులు

12-01-2026

జైనూర్, జనవరి 11 (విజయక్రాంతి): ఆదివాసీల ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ జెట్టి ఎలిజిబెత్ దంపతులు అని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్ అన్నారు. ఆదివారం ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ - జెట్టి ఎలిజిబెత్ దంపతుల 39వ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్. పి. నితికా పంత్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, గిరిజన సంఘాల నాయకులతో కలిసి ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్- జెట్టి ఎలిజిబెత్, కొమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.