ఇంద్రవెల్లి అమరవీరులకు అధికారికంగా నివాళులు
ఉట్నూర్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులకు అధికారికం గా ఘన నివాళులు అర్పించారు. సోమవారం ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్మారక స్థూపం వద్దకు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు వేడ్మ బొజ్జ పటేల్, కోవా లక్ష్మీ, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఇన్చార్జి కలెక్టర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదివాసీ నేతలు వచ్చి స్మారక స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు.
21-04-2026