calender_icon.png 1 July, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_78898873.webp
ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలి: జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

30-06-2025

ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పకుండ హాజరు కావాలని, వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(District Collector Anudeep Durishetty) అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ... ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులు అత్యంత ప్రాధాన్యతగా భావించి, ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరు కావాలని అన్నారు. ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిష్కరించాలని, జిల్లా అధికారులు తమ పరిధిలోనీ సమస్య పరిష్కారం వెంటనే చేయాలని, సమస్య పరిష్కరించలేని పక్షంలో సంబంధిత కారణాలు తెలుపుతూ, దరఖాస్తుదారునికి తెలపాలని సూచించారు.

article_81096915.webp
ఆర్యవైశ్యులను పార్టీలకతీతంగా గెలిపించండి..

29-06-2025

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్యలు అందరు ఐక్యంగా ఉండి పోటీచేసి మన ఆర్యవైశ్యులు ఏ పార్టీ నుండి పోటీ చేసిన పార్టీలకతీతంగా మన సభ్యుల గెలుపు కోసం కృషి చేయాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. వైరా ఆర్యవైశ్య మండల సభ ఆధ్వర్యంలో వైరా మండల అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్(Mandal President Mittapalli Kiran Kumar) అధ్యక్షతన వైరా లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం నూతన జిల్లా అధ్యక్షులు పసుమర్తి సీతాచందర్‌రావుకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ తక్షణ మాజీ అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు వైరా వర్తక సంఘం అధ్యక్షులు వనమా విశ్వేశ్వరరావు, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

article_75130935.webp
ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాలి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

29-06-2025

ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలలో విశ్వాసం కల్పించాలని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య శాఖ సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రి అంతా కలియతిరిగి, స్కానింగ్ గది, జనరల్ ఓపి, డ్రెస్సింగ్ రూం, ఇంజక్షన్ రూం, ఎక్స్ రే రూం, డెంటల్ విభాగం, ఫార్మసీ, డయాలసిస్ వార్డులను లను పరిశీలించారు. ఏఎన్సి రిజిస్ట్రేషన్, ఎన్సిడి సర్వే గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు గురించి అడిగి, సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.