calender_icon.png 14 October, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_24726715.webp
స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్తు

09-10-2025

ఖమ్మం, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఎన్నికల నియామవళి అనుసరించిస్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు, పకడ్భందీ బందోబస్తు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కళాశాల, మధిర పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, తల్లాడ మండలం రెడ్డిగూడెం లోని జ్యోతి జూనియర్ కాలేజ్ లలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ ల ఏర్పాట్లను బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి పరిశీలించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబందించిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు కలెక్టర్ సూచించారు.