రిపబ్లిక్ డే రోజు 4 పథకాలు
18-01-2025
ఖమ్మం, జనవరి 17 (విజయక్రాంతి): ఇచ్చిన మాట ప్రకారం రిపబ్లిడే నుంచి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్కార్డుల జారీ పథకాలను ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం నగరంలోని బల్లేపల్లి, జయనగర్కాలనీ ప్రాంతాల్లో పర్యటించి, సీసీ రోడ్లకు, సైడ్ డ్రైన్లకు శంకుస్థాపన చేశారు.