ప్రణాళికాబద్ధంగా యువతకు ఉపాధి కల్పన చర్యలు..
25-05-2025
యువతకు ఉపాధి కల్పనకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం.భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Bhatti Vikramarka Mallu) అన్నారు. 5 వేలకు పైగా మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వైరా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర డిప్యూటీ సిఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉద్యోగ మేళాలో 80 కు పైగా కంపెనీలు పాల్గొని, 5 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీ ప్రతినిధులు ముందుకు వచ్చారని , యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.