ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాలి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
29-06-2025
ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలలో విశ్వాసం కల్పించాలని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య శాఖ సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రి అంతా కలియతిరిగి, స్కానింగ్ గది, జనరల్ ఓపి, డ్రెస్సింగ్ రూం, ఇంజక్షన్ రూం, ఎక్స్ రే రూం, డెంటల్ విభాగం, ఫార్మసీ, డయాలసిస్ వార్డులను లను పరిశీలించారు. ఏఎన్సి రిజిస్ట్రేషన్, ఎన్సిడి సర్వే గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు గురించి అడిగి, సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.