రోడ్డుపై జాగ్రత్తే ప్రజల జీవన భద్రత
21-01-2026
మణుగూరు, జనవరి 20 (విజయక్రాంతి): రోడ్డుపై జాగ్రత్తే ప్రజల జీవన భద్రత అని డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి అన్నారు. ఆలైవ్, అరైవ్, పది రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రత ట్రాఫిక్ నియమాలపై మంగళవారం స్థానిక పూలమార్కెట్ ఏరియాలోని ప్రధాన రహదారి పై ఆటో డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.