కాంగ్రెస్, బీఆర్ఎస్ తోడుదొంగలు
07-02-2026
ఆమనగల్లు/షాద్నగర్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి): రాష్ట్రంలో గతంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగితే, ఇప్పుడు కాంగ్రెస్ సోనియా కుటుంబ పాలన సాగిస్తోంది. ఈ రెండు పార్టీలు ప్రజలను ముంచే ‘తోడు దొంగలు’ అని కేంద్ర గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్ర వారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్నగర్, ఆమన్గల్లు మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లు, రోడ్షోలలో కిషన్రెడ్డి ప్రసంగించారు. ఆమనగల్లులో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.