విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
21-01-2025
రంగారెడ్డి, జనవరి 20 (విజయ క్రాంతి): విద్య, వైద్యానికి 80% నిధులు కేటాయిస్తే సమాజంలో అసమానతలను రూపుమాపవచ్చని ప్రతి ఇంట్లో తప్పనిసరిగా గ్రంథాల యాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సంస్కారం లేని జీవితం వ్యర్థమని, గ్రంథాలయాలతో సమాజంలో నూతన మార్పు తీసుకురావచ్చని దానికి విద్య ఎంతో అవసరమని ఆయన గుర్తు చేశారు.