ప్రభుత్వ బడిలో ఫుడ్ పాయిజన్
13-12-2025
శేరిలింగంపల్లి, డిసెంబర్ 12 (విజయక్రాంతి): మాదాపూర్ చందునాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం వికటిం చి, 43 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యా రు. మధ్యాహ్నం భోజనం చేసిన గంటలోపే విద్యార్థులు వరసగా కడుపునొప్పి, వాంతు లతో తరగతి గదుల్లోనే అస్వస్థతకు గురి కావడంతో ఇది గమనించిన టీచర్లు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.