calender_icon.png 26 July, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_87781988.webp
షాద్‌నగర్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

26-07-2025

షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్(Shadnagar) పట్టణ చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్‌నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి బైక్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో పట్టణానికి చెందిన మచ్చేందర్ అతని కూతురు మైత్రి మృతి చెందారు. రోడ్డు ప్రమాదం జరగగానే మైత్రి తన ఫోన్ ను అక్కడే ఉంటున్న తయబ్ అనే వ్యక్తికి ఇచ్చి తన వాళ్లకు ఫోన్ చేయాలని ప్రాధేయపడడం చూసి అందరిని కన్నీరు పెట్టించింది. మైత్రికి వస్తున్న తన స్నేహితురాల ఫోన్లో ఇతరుల ఫోన్లకు తయ్యబ్ అనే వ్యక్తి సమాచారం తెలియజేశారు.