పార్టీలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యం
ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధి విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా ముందుకు సాగుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని 52, 6వ డివిజన్లలో సుమారు రూ.2.30 కోట్ల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, వర్షపు నీటి పారుదల సదుపాయాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
25-02-2026