calender_icon.png 17 December, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_35832522.webp
అభివృద్ధి సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

16-12-2025

హనుమకొండ టౌన్/వరంగల్ (విజయక్రాంతి): అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గల 27, 32, 35, 37, 38, 41వ డివిజన్లలో మంత్రి కొండా సురేఖ విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రకటించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించి, కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

article_41141741.webp
మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

16-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలో మూడో విడత ఎన్నికలు బుధవారం జరుగుతుండగా ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని సెయింట్ థెరీసా హైస్కూల్ లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించి మూడో విడత ఎన్నికలలో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతుండగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల విధులకు కేటాయించబడిన పిఓ, ఓపిఓల రిపోర్టింగ్ కౌంటర్ ను కలెక్టర్ సందర్శించి అప్పటివరకు ఎంతమంది రిపోర్ట్ చేశారని అడిగి తెలుసుకున్నారు.

article_81926531.webp
కల్పలత సూపర్ బజార్ తనిఖీలో బయటపడ్డ కుంభకోణం

16-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ది కోపరేటివ్ స్టోర్ లిమిటెడ్ పరిధిలోని కల్పలత సూపర్ బజార్ లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కల్పలత సూపర్ బజార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మితిగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కార్యాలయానికి చేరుకున్న సమయంలో సిబ్బంది లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రిజిస్టర్ లో ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు నమోదు చేసి, కేవలం ముగ్గురు మాత్రమే హాజరవడం, వారిలో ఇద్దరే విధుల్లో ఉండటంపై ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.

article_30011314.webp
ప్రతి కాలనీని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తాను

16-12-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): గడిచిన 10 ఏళ్లలో కంటే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రతి కాలనీనీ అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి 54వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో రెండు కోట్ల రూపాయలతో మంచినీటి పైపులైను పనులుకు అలాగే 9వ డివిజన్ కాకతీయ కాలనీ ఫేస్ టులో 47 లక్షల రూపాయలతో సైడ్ డ్రైన్, సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా 54వ డివిజన్ ప్రత్యేకంగా దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ప్రకారం ఒక్కొక్కటి అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు.

article_58115902.webp
జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను సమీక్షించిన డీఈఓ

15-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): ఈనెల 18 నుండి 20 వరకు హనుమకొండ విద్యానగర్ లోని సెయింట్ పీటర్స్ ఎడ్యు స్కూల్లో (టీవీ టవర్ దగ్గర) నిర్వహిస్తున్న హనుమకొండ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్ సమీక్షించారు. సైన్స్ ఫెయిర్ ను విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాటు చేసిన వివిధ కమిటీల కన్వీనర్లు, కో- కన్వీనర్లు, మెంబర్ల ను ఉద్దేశించి సైన్స్ ఫెయిర్ జరిగే సెయింట్ పీటర్స్ ఎడ్యు స్కూల్లో జిల్లా సైన్స్ అధికారి ఎన్.శ్రీనివాస స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ నిర్వహణకు సమయం తక్కువగా ఉన్నా, ఎన్నికల విధుల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తలమునకలై ఉన్నా కూడా వివిధ కమిటీల ఆధ్వర్యంలో తమకు కేటాయించిన విధులు నిర్వహించి సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలన్నారు.