calender_icon.png 6 December, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_65652216.webp
వృత్తి విద్య విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

04-12-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బ్యూటీ, వెల్నెస్, మీడియా ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఇంటర్నెట్ షిప్ పూర్తిచేసిన విద్యార్థినీ, విద్యార్థులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రతిభాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యతో పాటు ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రభుత్వం కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని, విద్యార్థులు విద్యతో పాటు మారుతున్న కాలానుగుణంగా తమను తాము అభివృద్ధి చేసుకుంటూ సామాజిక అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు.

article_34614182.webp
ప్రజల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

04-12-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో పార్టీలకు అతీతంగా చరిత్రలో నిలిచే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గురువారం 4వ డివిజన్ అక్షర కాలనీ, యాదవ నగర్, 9వ డివిజన్ గణేష్ నగర్ లలో సూమరు రూ.1.20 కోట్లతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ లు, పైపులైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా వార్డులలో స్థానిక ప్రజలతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించిన సందర్బంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

article_32853202.webp
రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించండి

04-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యములో గురువారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని కలసి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి బకాయిలు చెల్లించుటకు ఒత్తిడి చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మార్చి 2024 నుండి అక్టోబర్ 2025 వరకు రిటైర్మెంట్ బకాయిలు 20 నెలలు గడిచినా చెల్లించకపోవడం వల్ల పెన్షనర్లు మానసికంగా కృంగిపోయి, తీవ్ర అనారోగ్యానికి గురియై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 28 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు చనిపోయినారని, ఆవేదన వ్యక్తం చేశారు.