Districts - Hanumakonda

గణపతి నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎంపీ కావ్య
గణపతి నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎంపీ కావ్య

చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో శ్రీ ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్‌ కడియం కావ్య ఆవిష్కరించారు. సెప్టెంబర్‌ 14 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న నవరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో విజయవంతం చేయాలని ఎంపీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆలయంలోని శ్రీ రుద్రేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఎంపీకి వేద ఆశీర్వచనం అందించారు.

09-09-2026 | 07:42pm

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన గ్రీవెన్స్‌ దరఖాస్తుల పరిష్కారంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై ఫిర్యాదులను కలెక్టర్‌, అదనపు కలెక్టర్ ఎన్. రవి స్వయంగా స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను శాఖల వారీగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

08-09-2026 | 02:00am