యువత జాతీయ సమైక్యతను బలోపేతం చేస్తూ ముందుకు సాగాలి
10-02-2026
యువత దేశభక్తి భావంతో జాతీయ సమైక్యతను బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బజ్జ్పాయ్ అన్నారు. మేరా యువ భారత్ వరంగల్, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు రోజుల అంతర్రాష్ట్ర యువజన సమ్మేళన కార్యక్రమం ఈ నెల 5 నుంచి 9 వరకు హనుమకొండ బాలసముద్రంలోని యూత్ హాస్టల్లో విజయవంతంగా నిర్వహించారు.