పునరావాస కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని
23-12-2025
హనుమకొండ,(విజయక్రాంతి): ఎన్జీవోస్ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆరోగ్య సంరక్ష ,మద్యపాన- మాదకద్రవ్య వ్యసన విముక్తి చికిత్స మరియు పునరావాస కేంద్రాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మద్యపానం ఆరోగ్యానికి హానికరమని,యువత చెడు అలవాట్లకు,తాగుడుకు దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా మద్యపానానికి బానిస అయినట్లయితే విముక్తి కోసం యువకుడు రాకేష్ ఏర్పాటు చేసిన మద్యపాన విముక్తి కేంద్రం ఉపయోగపడుతుందని అన్నారు.అనంతరం ఎమ్మెల్యేను రాకేష్ దంపతులు శాలువాతో ఘనంగా సన్మానించారు.