ప్రజాకవి కాళోజీ జీవితం ఆదర్శనీయం
హనుమకొండ, సెప్టెంబర్ 09(విజయ క్రాంతి):ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన కలం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా నక్కలగుట్టలోని ఆయన విగ్రహానికి ఎంపీ, కలెక్టర్ చాహత్ బాజ్పాయి, పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ సాహిత్యం, ఆలోచనా విధానాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీ కోరారు.
09-09-2026 | 01:07pm