calender_icon.png 21 December, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_77460550.webp
ప్రజల భాగస్వామ్యంతో ప్రతి కాలనీని అభివృద్ధి చేస్తాం

20-12-2025

హనుమకొండ టౌన్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ లో ఇందిరమ్మ కాలనీ పేస్ వన్, పండ్ల మార్కెట్ రోడ్డు, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్ కాలనీలలో అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీలా నిర్మాణ పనులకు సుమారు 2 కోట్ల 70 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు డివిజన్లో ప్ర జలతో స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకుని మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వె నుకబడిన ప్రతి కాలనీని అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.

article_12583362.webp
టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచిత న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

20-12-2025

హనుమకొండ టౌన్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): హనుమకొండ సుబేదారి లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా పాలకవర్గం సమావేశం శుక్రవారం రెడ్ క్రాస్ భవన్లో నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 23 మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న సర్వసభ్య సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను కార్యక్రమ నిర్వహణ విధానంపై విస్తృతంగా చర్చించారు. అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు స్నేహ శబరీష్ ని కలెక్టర్ కార్యాలయంలో హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సర్వసభ్య సమావేశానికి సంబంధించిన బుక్ లేట్ ను కలెక్టర్ కు అందజేశారు.

article_20338742.webp
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలి

20-12-2025

హనుమకొండ,డిసెంబర్ 19 (విజయ క్రాంతి): శాస్త్ర, సాంకేతిక రంగాలలో మరింత అభివృద్ధి చెందాలని,అప్పుడే విశ్వ గురువు గా భారత్ కీర్తించబడుతుందని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. హనుమకొం డ లోని సెయింట్ పీటర్స్ ఎడ్యు స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా వి ద్యాశాఖ అధికారి ఎల్. వి. గిరిరాజ్ గౌడ్ అ ధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే శాస్త్ర, సాంకేతిక రం గాలలో మరింత పురోభివృద్ధి అవసరమన్నారు.