పశ్చిమ అభివృద్ధే ప్రధాన లక్ష్యం
హనుమకొండ టౌన్, మార్చి 2 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం 48, 49 డివిజన్ల పరిధిలో సుమారు రూ.9.37 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కుసుర్ పాషా, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.7.50 కోట్ల వ్యయంతో ఎన్ఐటి నుంచి లోటస్ కాలనీ వరకు ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.
03-03-2026