calender_icon.png 6 February, 2026 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_87291988.webp
సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

05-02-2026

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ప్రతి సామాజిక వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమారంలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహం( ధర్మసాగర్ )లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహించగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, విద్యా సంస్థలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

article_26077001.webp
బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు

05-02-2026

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్లకు బుధవారం ఎన్నికల సూపరిడెంట్ జగత్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు హనుమకొండ జిల్లాలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 244 బూత్ ఏజెంట్లు, 26 డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బూతులు ఏజెంట్లు, బూతు లెవల్ అధికారులతో (బిఎల్‌ఓ) కలిసి తాజా ఓటర్ లిస్ట్ ఆధారంగా ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయాల్సిందిగా సూచించారు.

article_67749225.webp
శ్రీ భద్రకాళి అమ్మవారికి కుడ చైర్మన్ దంపతులు ప్రత్యేక పూజలు

05-02-2026

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): వరంగల్ లోని శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని బుధవారం ఉదయం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి దంపతులు తమ వివాహ వార్షికోత్సవ సందర్భం గా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వెంకట్రాంరెడ్డి దంపతులకు ఆలయ ధర్మకర్తలు, అధికారు లు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శనం అనంతరం ఆలయ మహా మండపంలో భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు మహాదాశిర్వచనం నిర్వహించి, అమ్మవారి శేష వస్త్ర ములు బహుకరించి, ప్రసాదములు అందజేశారు.

article_24638374.webp
హైర్ బస్సు డ్రైవర్లు, క్లీనర్లకు వేతనాలు పెంచాలి

05-02-2026

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): టిజిఎస్‌ఆర్టిసి హైర్ బస్సు డ్రై వర్ల సంఘం అధ్యక్షులు బుర్ర హరికృష్ణ ఆ ధ్వర్యంలో బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల స మావేశంలో డ్రైవర్లు, క్లీనర్ల సమస్యలపై స మావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ టిజీఆర్టీసీ సంస్థలో అద్దె బ స్సులు ప్రవేశపెట్టిన నాటి నుండి మేమంతా డ్రైవర్లుగా, క్లీనర్లుగా పనిచేస్తున్నామని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం అద్దె బస్సు యజమాలతో చేసుకోవడం జరుగుతుందని అన్నారు. కానీ య జమానులు ఈసారి వేతన ఒప్పందాలకు విరుద్ధంగా వేతన సవరణ చేయడం లేదని వాపోయారు.

article_90616444.webp
క్రీడల బలోపేతమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

05-02-2026

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): హనుమకొండలోని జేఎన్‌ఎస్ స్టేడియంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి సీఎం కప్ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా, వైద్యం, వ్యవసాయ తర్వాత అత్యధిక ప్రాధాన్యత క్రీడలకే కేటాయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ నైనా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తే అక్కడికి క్రీడల శాఖ మంత్రి సార్క్ చైర్మన్ లను పంపిస్తూ క్రీడలను మరింత ఉత్సాహపరుస్తున్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒక క్రీడాకారుడు కావడం వలన క్రీడలను బలోపేతం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు.