30 March, 2026 | 12:59 AM

Districts

article_13929393.webp
బీసీల సమస్యలు పరిష్కరించాలి

హనుమకొండ టౌన్, మార్చి 26 (విజయక్రాంతి): బీసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు బీసీ సంఘాల వినతి పత్రం అందించారు. గురువారం ఎన్పీడీసీఎల్ గెస్ట్ హౌస్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుట్టి శ్యామ్ యాదవ్, బీసీ జాక్ చైర్మన్ తిరునహరి శేషు, ధారబోయిన సతీష్ ముదిరాజ్ ల బృందం తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యుల బృందమును మర్యాదపూర్వకంగా కలిసి, బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

26-03-2026