డీసీసీ భవన్లో గాంధీ చిత్రపటానికి ఘన నివాళులు
31-01-2026
హనుమకొండ టౌన్, జనవరి 30 (విజయక్రాంతి): హనుమకొండ డిసిసి భవన్ లో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనా క్షి నటరాజన్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అయ్యూబ్ లు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తొలుత హనుమకొండ జిల్లా కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.