21 April, 2026 | 10:03 AM

Districts - Hanumakonda

article_61702202.webp
దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి

హనుమకొండ,(విజయక్రాంతి): దళిత క్రిస్టియన్స్ కు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన తెలిపాలనీ, కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని మాల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల సంఘాల జాక్ గౌరవ సలహాదారుడు, రిటైర్డు డీఎస్పీ దామెర నర్సయ్య మాట్లాడుతూ ఆగస్టు ఒకటిన ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పూర్తి స్థాయిలో వెలువడక ముందే సీఎం రేవంత్ రెడ్డి అత్యుత్సాహంతో నిండు శాసన సభలో ప్రకటించి, సుప్రీంకోర్టు సూచనలకు వ్యతిరేకంగా,అశాస్త్రీయమైన ఎస్సీ వర్గీకరణ చేశారని గుర్తు చేశారు.

18-04-2026