calender_icon.png 7 January, 2026 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_10326398.webp
ఆంగ్లభాషపై పట్టు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి

07-01-2026

హనుమకొండ టౌన్, జనవరి 6 (విజయక్రాంతి): ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రతి విద్యార్థి ఆంగ్లభాషపై పట్టు సాధించేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ సేబరీష్ ఆదేశించారు. మంగళవారం హనుమకొండ వడ్డేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న ఇంగ్లీష్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాం గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్, ఎంఈఓ నెహ్రు, ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

article_77950073.webp
పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాలలో రంగోలి పోటీలు

07-01-2026

హనుమకొండ టౌన్, జనవరి 6 (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి లోని పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాలలో రంగోలి పోటీలు సంస్కృతిక విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్, లెఫ్ట్నెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులకు రంగోలి పోటీలను నిర్వహించామని, ఇవి వారి నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయని, విద్యార్థులు సంక్రాంతి పండుగను, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రంగు రంగుల ముగ్గులు వేసి రంగోలి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు.

article_88324750.webp
కాకతీయ యూనివర్సిటీ క్యాలెండర్ ఆవిష్కరణ

07-01-2026

కాకతీయ యూనివర్సిటీ, జనవరి 6 (విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయ 2026 డైరి, క్యా లెండర్‌ను వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యు. జి.సి. కోఆర్డినేటర్ ఆచార్య ఆర్. మల్లికార్జున రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్, ఇంచార్జ్ ఫైనాన్సు ఆఫీసర్ లు డాక్టర్ మహమ్మద్ హబీబుద్దిన్, డిప్యూటీ రిజిస్ట్రార్ అండ్ పబ్లికేషన్ సెల్ సంచాలకులు డాక్టర్ ఎం. నరసింహ రావు, డిప్యూ టీ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్, ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ పృథ్వీరాజు వల్ల్లాల పాల్గొన్నారు.

article_87176989.webp
దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి

05-01-2026

హనుమకొండ,(విజయక్రాంతి): తమపై దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ గుండ్ల సింగారం గ్రామానికి చెందిన బౌతు అన్నపూర్ణ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అన్నపూర్ణ తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ గుండ్ల సింగారం సర్వే నెంబర్ 175 లోని ప్లాట్ నెంబర్ 22ను తమ 2017లో కటకం కవిత దగ్గర కొనుగోలు చేసి దానిలో ఇల్లు నిర్మించుకున్నామని దాని పక్కనే ఉన్న ఫ్లాట్ నెంబర్ 26 ఖాళీగా ఉండేది దానిని ధార సీత కొనుగోలు చేసి అప్పటి నుండి తన కొనుగోలు చేసిన స్థలంలోని కొంత భాగం తమ ఇంటి లోపల ఉంది అని దౌర్జన్యం చేస్తూ గొడవకు దిగుతుందని ఆరోపించారు.