అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 58వ డివిజన్ పరిధిలో రూ.72 లక్షల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, రోడ్డు విస్తరణ పనులకు నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజులతో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
22-04-2026