వినూత్నంగా విలేజ్ క్యాబినెట్
29-01-2026
హనుమకొండ టౌన్, జనవరి 28 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో సర్పంచి గుంటి రేణుక వెంకట్ విలేజ్ క్యాబినెట్ ఏర్పాటు చేశారు. గ్రామ సమస్యలు, అభివృద్ధి పరిష్కరించేందుకు, సేవలు అందిం చేందుకు అవసరానికి అనుగుణంగా పలు శాఖలు 12 మంది వార్డు సభ్యులకు కేటాయించారు. విద్యుత్, పాఠశాల విద్యా, వైద్యరోగ్యం, పంచాయతీరాజ్, రోడ్లు, పౌరసరఫరాలు, మహిళా సంక్షేమం, శిశు సంక్షే మం, అంగన్వాడీ, నీటిపారుదల, మత్స్య సంపద, కార్మిక ఇతర శాఖలను ఏర్పాటు చేశారు.