ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించిన చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్
హనుమకొండ జిల్లాలోని పలు డివిజన్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం.చైతన్య కుమార్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. కాజీపేట, ఫాతిమా నగర్, మచిలీ బజార్, సుధా నగర్, యాదవ నగర్ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించి లబ్ధిదారులతో చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్ మాట్లాడారు.
28-08-2026