యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
హనుమకొండ, (విజయ క్రాంతి): శ్రీకృష్ణ జన్మాష్టమి నీ పురస్కరించుకొని సెప్టెంబర్ 4న హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
29-08-2026