అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్
హనుమకొండ,(విజయక్రాంతి): ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హన్మకొండలో బుధవారం పర్యటించారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తన వీరాభిమాని నిరంజన్(Niranjan Residence)ను పరామర్శించి, అతని కోరికను నెరవేర్చడానికి ఆయన స్వయంగా హనుమకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్లారు. హనుమకొండలోని హనుమాన్ నగర్ కు చెందిన 17 ఏళ్ల నిరంజన్, “డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ"(Duchenne Muscular Dystrophy) అనే అరుదైన జన్యుపరమైన నరాల వ్యాధితో బాధపడుతున్నాడు.
17-06-2026