Districts - Hanumakonda

ప్రైవేటు ఉపాధ్యాయులకు సర్కార్ అండ: ఎమ్మెల్యే నాయిని
ప్రైవేటు ఉపాధ్యాయులకు సర్కార్ అండ: ఎమ్మెల్యే నాయిని

హనుమకొండ,సెప్టెంబర్ 20(విజయ క్రాంతి):ప్రైవేటు అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ లోని శ్రీహర్ష కన్వెన్షన్‌ లో తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఎమ్మెల్యే నాయిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.విద్యా రంగంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే వారు ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు.

20-09-2026 | 02:01pm

గణపతి నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎంపీ కావ్య
గణపతి నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎంపీ కావ్య

చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో శ్రీ ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్‌ కడియం కావ్య ఆవిష్కరించారు. సెప్టెంబర్‌ 14 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న నవరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో విజయవంతం చేయాలని ఎంపీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆలయంలోని శ్రీ రుద్రేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఎంపీకి వేద ఆశీర్వచనం అందించారు.

09-09-2026 | 07:42pm