పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి.. సీపీఐ రాస్తారోకో
హనుమకొండ,(విజయక్రాంతి): పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను(Petrol and diesel prices hike) పెంచి పేద ప్రజలపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆర్థిక భారం మోపిందని, కేంద్ర సర్కార్ వైఫల్యంతోనే దేశంలో ధరల పెరుగుదల అని సీపీఐ హనుమకొండ(Hanumakonda Junction) జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం హనుమకొండ నగరంలోని డబ్బాలు జంక్షన్ వద్ద సీపీఐ హనుమకొండ మండల సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
16-05-2026