ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
17-09-2025
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను హనుమకొండ జిల్లాలో బుధవారం ఘనంగా నిర్వహించారు. హనుమకొండ అదాలత్ కూడలి లో తెలంగాణ అమరవీరులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, తదితరులు అమరవీరుల స్థూపం వద్ద పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.