సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
02-07-2025
బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) మాట్లాడుతూ... వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, పట్టణ, గ్రామాలలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించాలని ఎంఈఓ, మండల ప్రత్యేక అధికారులకు సూచించారు. అంతేకాకుండా గ్రామపంచాయతీలలో ఆయిల్ బాల్స్ అందుబాటులో ఉంచాలన్నారు. వర్షాకాల దృష్ట్యా ప్రజలకు చికెన్ గున్యా, డెంగ్యూ ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.