కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వాలీడేషన్ చట్టాన్ని ఉప సహరించుకోవాలి
23-12-2025
హనుమకొండ టౌన్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా శాఖ నూతన మీటింగ్ హాల్ ప్రారంభోత్సవం, 2026 డైరీ ఆవిష్కరణ జిల్లా అధ్యక్షులు ఈ. నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆల్ ఇండియా పెన్షన్ ఫెడరేషన్ జాతీయ చైర్మన్ ఆర్. ఎస్. శర్మ, సెక్రటరీ జనరల్ డి సుధాకర్, రాష్ట్ర అధ్యక్షులు ఏ. రాజేంద్ర బాబు లు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి 2025లో పార్లమెంట్లో ఆ మోదింప చేసుకున్న పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని ఉపసరించుకోవాలని డిమాండ్ చేశారు.