ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు
06-12-2025
హనుమకొండ (విజయక్రాంతి): నూతనంగా ఎన్నికైన ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యులు, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా సత్కరించారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇటీవల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్టులు గడ్డం రాజిరెడ్డి, వల్లాల వెంకటరమణ,తోట సుధాకర్,సంగోజు రవి, టి యు డబ్ల్యూ జే-ఐజేయు వరంగల్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులుగా ఎన్నికైన శ్రీరాం రాంచందర్,మట్ట దుర్గాప్రసాద్ లను శాలువాలతో సత్కరించి మెమోంటో లు అందించి సన్మానించారు. యూనియన్ కు విశేష సేవలందించి నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా పదవీకాలం పూర్తి చేసుకున్న నల్లాల బుచ్చిరెడ్డిని ప్రత్యేకంగా సన్మానించారు.