calender_icon.png 14 December, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_74957199.webp
రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్ధం

13-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో ఆదివారం రోజున జరగనున్న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం తెలిపారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, హసన్ పర్తి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో, ఐనవోలు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్, వేలేరు, పరకాల మండల కేంద్రాలలోని ఎంపీడీవో కార్యాలయాల్లో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రితో ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది బయలుదేరి వెళ్లారు.

article_74502859.webp
పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

13-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): హసన్ పర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించారు. మండల పరిధిలో ఎన్ని గ్రామ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పోలింగ్ కేంద్రాల వారిగా కేటాయించిన పిఓలు, ఓపివోలు వచ్చారా అని, పోలింగ్ సామగ్రి పంపిణీ నిర్వహణకు ఏర్పాట్లు, రూట్ల వారీగా వాహనాల ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బందికి భోజన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను ఎంపీడీవో సుమన వాణి, మండల ప్రత్యేకాధికారి సంజీవరెడ్డిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

article_85388999.webp
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

11-12-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పరిధిలోని బైరంపల్లి, సిద్ధాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు కల్లెబోయిన కుమారస్వామి, మంద రాజు, వార్డు మెంబర్ల గెలుపు కోసం నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజును గ్రామాలలోని మహిళామణులు సాంప్రదాయ కోలాటలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.