రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్ధం
13-12-2025
హనుమకొండ (విజయక్రాంతి): రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో ఆదివారం రోజున జరగనున్న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం తెలిపారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, హసన్ పర్తి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో, ఐనవోలు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్, వేలేరు, పరకాల మండల కేంద్రాలలోని ఎంపీడీవో కార్యాలయాల్లో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రితో ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది బయలుదేరి వెళ్లారు.