calender_icon.png 3 December, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_84030001.webp
రైస్ మిల్లర్లు ధాన్యంలో తరుగును తీయొద్దు

03-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): రైతులు విక్రయించిన ధాన్యంలో తరుగు తీయకుండా రైస్ మిల్లర్లు ధాన్యాన్ని దింపుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో కస్టమ్ మిల్లింగ్ రైస్, ధాన్యం కొనుగోలు అంశాలు, జిల్లాలోని ధాన్యం కోనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించినప్పుడు రైస్ మిల్లర్లు ధాన్యపు బస్తాలలో ఎక్కువగా తరుగు తీస్తున్నారని, తరుగు తీస్తుండడంతో నష్టపోతున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన అంశంపై పౌరసరఫరాలు శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు.

article_85821473.webp
హైదరాబాద్ కు బయలుదేరిన జర్నలిస్టు నేతలు

03-12-2025

హనుమకొండ,(విజయక్రాంతి): జర్నలిస్ట్ ల సమస్యల సాధనకు టీయుడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన మహా ధర్నాకు బుధవారం హనుమకొండ జిల్లా నుండి భారీగా జర్నలిస్టులు తరలి వెళ్లారు. ఉదయం 7 గంటలకు హనుమకొండ హరిత కాకతీయ హోటల్ నుండి బయలుదేరి హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల కార్యాలయంకు తరలి వెళ్లి ధర్నా లో పాల్గొననున్నారు. జిల్లా నుండి తరలి వెళ్లిన వారిలో టీయుడబ్ల్యూజె (ఐజేయూ) రాష్ట్ర హౌసింగ్,వెల్ఫేర్ కన్వీనర్ వల్లాల వెంకటరమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. వేణుమాధవ్,కంకనాల సంతోష్, జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గడ్డం కేశవ మూర్తి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య,కోశాధికారి బోళ్ల అమర్, యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు నల్లాల బుచ్చిరెడ్డి,నార్లగిరి యాదగిరి డాక్టర్ పొడిశెట్టి విష్ణు వర్ధన్,సిహెచ్ సోమనర్సయ్య, ఎం. రాజేంద్ర ప్రసాద్, సాయిరాం,వలిశెట్టి సుధాకర్,కె.దుర్గా ప్రసాద్, ఎండి నయీం పాషా,శ్రీహరి రాజు, బి. విజయ్ రాజ్,యుగేందర్,ఉస్మాన్ పాషా,సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

article_73212961.webp
సర్పంచ్ బరిలో జవాన్ భార్య

02-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో ఓ జవాను భార్య సర్పంచ్ గా పోటీ చేయడం సంచలనంగా మారింది. గ్రామాల్లో గ్రూపు రాజకీయాలతో ఇబ్బందులు పడుతున్న బాధితులలో తాము కూడా బాధితులమేనని, సమస్య పరిష్కారం కొరకు గ్రామ పెద్దలను చెప్పుకునే కొంతమంది నాయకుల దగ్గరికి వెళితే ఆ సమస్యను మరింత జటిలం చేసి తమ పబ్బం గడుపుకున్నారే తప్ప, తమకు న్యాయం జరగలేదని, మా వీధి సిసి రోడ్డు కొరకు వీధివాసులమంతా సంబంధిత వార్డ్ మెంబర్ దగ్గరికి వెళితే అవహేళనగా మాట్లాడరని, అందుకే మన పని మనమే చేసుకుందామనే ఉద్దేశంతో సర్పంచ్ బరిలో నిలిచినట్లు అభ్యర్థి కాసురి మమత తెలిపారు.

article_55704857.webp
టీబీ నియంత్రణకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి

02-12-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో పట్టణ పరిధిలోని బోడగుట్ట, సోమిడి, వడ్డేపల్లి, లష్కర్ సింగారం, పెద్దమ్మ గడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, హసన్ పర్తి, కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బందితో ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1,98,000 ప్రభావిత గ్రూపులకు చెందిన వారిని పరీక్షించి అవసరమైన పరీక్షలు నిర్వహించవలసి ఉండగా 1,30,049 మందికి స్క్రీనింగ్ నిర్వహించడం జరిగింది.

article_53423339.webp
వడ్డేపల్లిని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ఉంచుతా

01-12-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి ప్రతికాలనీలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వడ్డేపల్లి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం 60వ డివిజన్ వడ్డేపల్లి ముదిరాజ్ కాలనీ, ముస్లిం కాలనీ, మిడిదొడ్డి వాడ అలాగే ఎస్బిహెచ్ బ్యాంక్ కాలనీలో సుమారు 1.65 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు, సీసీ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, పూర్తి అయినా సీసీ రోడ్లను ప్రారంభించారు. ఆయా కాలనీలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే నాయిని, స్థానిక ప్రజలను, కాలనీ పెద్దలను మమేకం చేస్తూ పర్యటన చేశారు.

article_84321583.webp
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి

30-11-2025

హనుమకొండ (విజయక్రాంతి): రెండో విడత మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం మొదలైంది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని సీతంపేట, నాగారం క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో చేసిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. క్లస్టర్ నామినేషన్ల స్వీకరణ కేంద్రమైన సీతంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏయే గ్రామాల పరిధిలో సర్పంచ్ వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.