calender_icon.png 11 December, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_51780106.webp
బీసీలు సంఘటితం కావాలి

10-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): రాష్ట్రంలో గ్రామ పంచాయితీలకు జరుగుతున్న ఎన్నికలలో జనరల్ స్థానాలలో పోటీ చేసిన బీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి బీసీల సత్తా చాటాలని ఓబీసీ చైర్మన్, వరంగల్ కూడా మాజీ చైర్మన్ సంఘం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ పిలుపునిచ్చారు. బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీని తుంగలోతొక్కిన ముఖ్యమంత్రి గతంలో ఉన్న 23 శాతాన్ని కూడ 17 శాతానికి తగ్గించి, ఎన్నికలు నిర్వహిస్తుండడం బీసీ సమాజానికి ద్రోహం చేయడమేనన్నారు. శాసనసభలో చేసిన బిల్లులను పార్లమెంట్లో చర్చకు పెట్టించి పాస్ చేయించండంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు.

article_45021204.webp
ప్రభుత్వాలు చట్టాలను నీతివంతంగా, జాప్యం లేకుండా అమలు చేయాలి

10-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): ధనిక, బీదల మధ్యన తారతమ్య భేదం లేకుండా చూడాలని, చట్టాలు సక్రమంగా నీతివంతంగా, జాప్యం లేకుండా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. బుధవారం జాతీయ మానవ హక్కుల సమైక్య ఎన్జీవో అంతర్జాతీయ దినోత్సవం కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్లో జాతీయ ఎన్ హెచ్ ఆర్ సి చైర్మన్ అలినేని శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలియజేయాలని, ప్రశ్నించే మనస్తత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు.

article_72715667.webp
అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించాలి

09-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): సమాజాన్ని క్యాన్సర్ లాగా పట్టి పీడిస్తున్న అవినీతికి వ్యతిరేకంగా అన్ని స్థాయిలలో ఉద్యమించాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు అన్నారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన సందర్భంగా డాక్టర్ శేషు మాట్లాడుతూ అన్ని వ్యవస్థలలో అవినీతి పెచ్చురిల్లి పోవడం వలన సామాన్య ప్రజలు బాధితులుగా మారిపోతున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, సివిల్ సప్లై, మున్సిపల్ శాఖలలో అవినీతి తాండవిస్తుంది.

article_65673954.webp
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

09-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని గ్రామ పంచాయతీ ఎన్నికల హనుమకొండ జిల్లా సాధారణ పరిశీలకులు శివకుమార్ నాయుడు అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మొదటి విడత మండలాల్లో మూడో ర్యాండమైజేషన్ పూర్తి చేసిన అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్, అధికారులతో కలసి ఎన్నికల పరిశీలకులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ ఈనెల 11న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహించే భీమదేవరపల్లి ఎల్కతుర్తి కమలాపూర్ మండలాల్లో పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పూర్తి చేసామని తెలిపారు.

article_68153289.webp
అవినీతి అధికారుల కన్నా అడుక్కునే బిచ్చగాడు మిన్న

09-12-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ చౌరస్తాలో తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కొంగర ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు అవినీతిలో కూరుకుపోయి ప్రజల సొమ్మును దోచుకొని, దాచుకోవడాన్ని నిరసిస్తూ లోక్ సత్తా, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ల వంటి స్వచంద సంస్థలతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ కొంగర ప్రభాకర్ మాట్లాడుతూ ఇటీవల ఏసీబీ అధికారులు జాయింట్ కలెక్టర్, డీఈవోగా ఇంచార్జ్ పనిచేస్తున్న వెంకట రెడ్డిని అరెస్ట్ చెయ్యడం అభినందించతగిన విషయం అని ఏసీబీ అధికారులను కొనియాడారు.

article_37775722.webp
ప్రైవేట్ పాఠశాల ఉద్యోగులకు పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి

09-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హనంకొండ జిల్లా కేంద్రంలో ఉన్న రీజినల్ పెన్షన్ ఆఫీసులో అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ ని కలిసి ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్న అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి, పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షురాలు అనుష మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఉన్న అనేక ప్రైవేట్ పాఠశాలలు వారి దగ్గర పని చేస్తున్న ఉద్యోగులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం లేదని, పది, పదిహేను సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నాయన్నారు.