calender_icon.png 22 November, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_62387367.webp
యువత రాజకీయాల్లోకి రావాలి

19-11-2025

హనుమకొండ (విజయక్రాంతి): యువశక్తి కలిగిన మన దేశంలో అత్యధికంగా యువత రాజకీయాల్లో రాణించడం చాలా ముఖ్యమని, వారు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయగలరని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. సర్దార్ 150 జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో హనుమకొండ అంబేద్కర్ విగ్రహం నుండి హంటర్ రోడ్ సత్యం కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం హంటర్ రోడ్ సత్యం కన్వెన్షన్ హాల్ లో వరంగల్ పార్లమెంట్ బీజేవైఎం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బీజేవైఎం వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రగొల్ల భరత్ వీర్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు.