అభివృద్ధి సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
16-12-2025
హనుమకొండ టౌన్/వరంగల్ (విజయక్రాంతి): అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గల 27, 32, 35, 37, 38, 41వ డివిజన్లలో మంత్రి కొండా సురేఖ విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రకటించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించి, కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.