calender_icon.png 16 December, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_58115902.webp
జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను సమీక్షించిన డీఈఓ

15-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): ఈనెల 18 నుండి 20 వరకు హనుమకొండ విద్యానగర్ లోని సెయింట్ పీటర్స్ ఎడ్యు స్కూల్లో (టీవీ టవర్ దగ్గర) నిర్వహిస్తున్న హనుమకొండ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్ సమీక్షించారు. సైన్స్ ఫెయిర్ ను విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాటు చేసిన వివిధ కమిటీల కన్వీనర్లు, కో- కన్వీనర్లు, మెంబర్ల ను ఉద్దేశించి సైన్స్ ఫెయిర్ జరిగే సెయింట్ పీటర్స్ ఎడ్యు స్కూల్లో జిల్లా సైన్స్ అధికారి ఎన్.శ్రీనివాస స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ నిర్వహణకు సమయం తక్కువగా ఉన్నా, ఎన్నికల విధుల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తలమునకలై ఉన్నా కూడా వివిధ కమిటీల ఆధ్వర్యంలో తమకు కేటాయించిన విధులు నిర్వహించి సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలన్నారు.

article_54665324.webp
అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ కు రెండు కళ్ళలాంటివి

14-12-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీకి రెండు కన్నులాంటివని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే న్యాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ 57వ డివిజన్ వాజ్ పాయ్ కాలనీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి జిల్లా మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.

article_74957199.webp
రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్ధం

13-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో ఆదివారం రోజున జరగనున్న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం తెలిపారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, హసన్ పర్తి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో, ఐనవోలు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్, వేలేరు, పరకాల మండల కేంద్రాలలోని ఎంపీడీవో కార్యాలయాల్లో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రితో ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది బయలుదేరి వెళ్లారు.