calender_icon.png 3 July, 2025 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_75828996.webp
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి

02-07-2025

బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) మాట్లాడుతూ... వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, పట్టణ, గ్రామాలలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించాలని ఎంఈఓ, మండల ప్రత్యేక అధికారులకు సూచించారు. అంతేకాకుండా గ్రామపంచాయతీలలో ఆయిల్ బాల్స్ అందుబాటులో ఉంచాలన్నారు. వర్షాకాల దృష్ట్యా ప్రజలకు చికెన్ గున్యా, డెంగ్యూ ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

article_12016717.webp
వైద్యులు నిస్వార్థ సేవకు, అంకిత భావానికి ప్రతీకలు

01-07-2025

బి ఎస్‌ రాయ్‌ వైద్యరంగంలో చేసిన సేవలకు గుర్తుగా జులై 1న భారతదేశంలో డాక్టర్స్‌డే(National Doctors Day) నిర్వహించుకోవడం జరుగుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అని అన్నారు. కలెక్టరేట్ లో డాక్టర్స్‌ డే పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్‌ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ... జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా వైద్య అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పేదవాడికి వైద్యం అందాలని, ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, తాను కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయ్యానని తెలియజేశారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు వినియోగించుకోవాలని, ప్రతి వైద్యుడు అంకితభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

article_87315830.webp
ప్రజావాణి వినతుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలి

30-06-2025

ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతులను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ప్రజలు అందించిన వినతులను వెంటనే సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారానికి చర్యలు చేపట్టడంపై కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు 176 వినతులను అందజేశారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ... ప్రజావాణిలో వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలన్నారు. వచ్చిన పలు వినతులపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లాలోని పలువురు తహసిల్దార్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆదేశించారు.

article_50425053.webp
మెడికల్ డీ-కోడింగ్ వర్క్ షాప్ ప్రారంభం

29-06-2025

హన్మకొండ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన మెడికల్ డీ-కోడింగ్ వర్క్ షాప్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) ముఖ్య అతిదిగా హజరై ప్రారంభించారు. ఈ సందర్బంగ అయన మాట్లాడుతూ... వరంగల్ నగరంలో ఇలా ఒక గొప్ప మెగా వర్క్‌షాప్ జరుగుతుండటం గర్వంగా ఉందని మెడికల్ డీ-కోడింగ్అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా పెద్ద కెరీర్ మార్గం అవుతోంది. మీరు ఇండియా నుంచే యూకే, యూఎస్ఏ లాంటి దేశాలకు కోడ్ చేసే అవకాశం పొందుతున్నారని, ఇదే డిజిటల్ ఇండియా శక్తి అని అన్నారు. తాట్ ఫ్లోస్ వంటి అకాడమీ ఇప్పటి వరకు 30,000 మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తును నిర్మించింది. ఇది గర్వించదగిన విషయం. ఈ రోజు మీరు తీసుకున్న ఈ ఒక అడుగు, రేపటి గొప్ప కెరీర్‌కు మొదటి మెట్టు అవుతుందని అన్నారు.