calender_icon.png 19 September, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_15583133.webp
వరంగల్ లో సుష్మ స్వరాజ్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి

18-09-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన దివంగత కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ కాంస్య విగ్రహాన్ని వరంగల్లో ఏర్పాటు చేయాలని మాజీ మేయర్ డాక్టర్ టి. రాజేశ్వరరావు, గొర్రెల, మేకల పెంపకం దారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిజెపి సీనియర్ నేత కన్నబోయిన రాజయ్య యాదవ్ అన్నారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు పార్లమెంట్లో సంపూర్ణ మద్దతు సుష్మా స్వరాజ్ ప్రకటించారని అన్నారు. సుష్మా స్వరాజ్ విగ్రహాన్ని వరంగల్ తో పాటు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించి సముచిత గౌరవాన్ని ఇమిడింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

article_19918901.webp
కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు

18-09-2025

హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి రెండు రోజుల పాటు కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ నాట్య గురు, అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజాల తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధ్యురాలు చాకలి ఐలమ్మ కూచిపూడి నృత్య రూపకం, ఓరుగల్లు చరిత్ర కాకతీయ వైభవం గుర్తు చేస్తూ రాణి రుద్రమ చారిత్రక నాటకం, ప్రజా సాహిత్య కళారూపాలు ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు గురువారం ఆమె ఒక ప్రకటనలో ఆయా విశేషాలు వివరించారు. 21వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు డాక్టర్ అలేఖ్య పుంజాల నృత్య దర్శకత్వంలో 30 మంది కళాకారులు చాకలి ఐలమ్మ కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శిస్తారు.

article_83694400.webp
ప్రతి విద్యార్థి లక్ష్యం కోసం పట్టుదలతో చదవాలి

18-09-2025

హనుమకొండ (విజయక్రాంతి): ప్రతి విద్యార్థి తాము ఎంచుకున్న లక్ష్యం కోసం పట్టుదలతో చదివి సాధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అన్నారు. గురువారం పరకాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ లో తరగతి గదులు, కిచెన్, డార్మేట్రి, పరిసరాలను పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. కలెక్టర్ విద్యార్థినులను పాఠ్యాంశాలకు సంబంధించి తరగతి గదిలోని బోర్డుపై రాయించారు. విద్యార్థినులకు వండిన భోజన పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదులను సందర్శించి విద్యార్థినులచేత పాఠ్యాంశాలను చదివించారు.

article_65249421.webp
మహిళ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం

17-09-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య(MP Dr. Kadiyam Kavya) అని అన్నారు. స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా బుధవారం హనుమకొండ జిల్లాలోని లష్కర్ సింగారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పెషలిస్టు వైద్య నిపుణులు, గైనకాలజిస్టులు, పిల్లల వైద్యనీపుణులు, ఫిజీషియన్లు, ఈఎన్ టి, దంత, ఇతర స్పెషలిస్ట్ వైద్యులచే ఏర్పాటుచేసిన ఈ వైద్య శిబిరములను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు. ముఖ్యంగా మహిళలు క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు.