calender_icon.png 19 February, 2026 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_33658092.webp
శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు

16-02-2026

హనుమకొండ,(విజయక్రాంతి): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శివనామస్మరణతో శివాలయాలు మారుమోగాయి. హనుమకొండలోని చారిత్రక వేయి స్తంబాల గుడిలోని రుద్రేశ్వరుడి దర్శనానికి భక్తులు ఉదయం 3 గంటల నుండి భారీగా తరలి వచ్చారు. ఆదివారం ఉదయం 3:30 గంటలకు సుప్రభాత సేవ మంగళ వాయిద్య సేవ నిర్వర్తించి రుద్రేశ్వరునికి పాశుపత రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి 10 గంటల వరకు జరిగాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్ల దంపతులు ముత్యాల తలంబ్రాలను మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణ వ్రతం నిర్వర్తించారు.