దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తింపజేయాలి
అంబేద్కర్ చూపిన మార్గంలో దళితులందరంకలిసి హక్కులను కాపాడుకుందామని, దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
14-04-2026