10న విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలి
ఈ నెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని పిడిఎస్యూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఇల్లందు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట బంద్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్యూ జిల్లా నాయకులు గంగాధర్, గణేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అధ్యాపక పోస్టుల ఖాళీలు, మౌలిక వసతుల కొరత, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, హాస్టళ్ల సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
06-07-2026