calender_icon.png 13 November, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_25260319.webp
హనుమకొండ జేఎన్ఎస్ లో కొనసాగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్

12-11-2025

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో డిడిజి(స్టేట్స్), జోనల్ రిక్రూటింగ్ ఆఫీస్ చెన్నై, డైరెక్టర్ రిక్రూటింగ్ ఏఆర్ఓ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా ఆర్మీ పరీక్షలో ఇంతకుముందే ఉత్తీర్ణత సాధించిన మూడు జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఆర్మీ అధికారులు ఆర్మీలో ఎంపికకు వివిధ పరీక్షలను బుధవారం నిర్వహించారు. కోమురంభీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు 794 ఆర్మీ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులు కాగా జేఎన్ఎస్ లో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఎంపిక పరీక్షకు 623 హాజరయ్యారు.

article_77536818.webp
అందెశ్రీ ఆశయాలను కొనసాగించాలి

12-11-2025

హనుమకొండ,(విజయక్రాంతి): పీడిత ప్రజల విముక్తి, మానవీయ విలువల సమాజ నిర్మాణం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం రచనలు, పాటలు రచించి పాడిన మహా కవి అందె శ్రీ ఆశయాలను కొనసాగించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. వివిధ ప్రజా సంఘాల ఆద్వర్యంలో మంగళవారం హనుమకొండ అంబేద్కర్ సెంటర్ లో జరిగిన ప్రజా కవి అందెశ్రీ నివాళి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాటల ద్వారా కీలకపాత్ర పోషించిన పాఠశాలకు వెళ్లని అందెశ్రీ కి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించిందని,అలాంటి మహా కవి అందెశ్రీ బాటలో అందరూ పయనించాలని అన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, బీసీ మహాసేన రాష్ట్ర కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్, టీజేజెఎస్ జిల్లాఅధ్యక్షుడు చిల్ల రాజేంద్రప్రసాద్, రాజ్ మహ్మద్, కొంగ వీరాస్వామి, నే దునూరి రాజ మౌళి, చుంచు రాజేందర్, సంఘాని మ ల్లేశ్వర్, నలిగింటి చంద్రమౌళి, జల్లెల కృష్ణ మూర్తి యాదవ్, డేవిడ్, బక్కీ యాదగిరి, మంద వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

article_66617068.webp
పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలి

11-11-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరంగల్ లోని ఖిల్లా వరంగల్, తూర్పు కోట, నూతనంగా నిర్మిస్తున్న రింగ్ రోడ్ ప్రాంతంలో నిత్యం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్ కి తూర్పుకోట అఖిల పక్ష నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ ఆకాతాయిలు, యువకులు, మద్యం ప్రియులు, తదితరులు కాలి ప్రదేశం అయిన రింగ్ రోడ్ పైన మద్యం సేవించి అటు అవైపుగా వెళ్లే వారికి ఇబ్బంది కలిగిస్తున్నారని, అలాగే వ్యవసాయం చేసుకునే రైతులకు ఇబ్బందులు కలిగిస్తూ బావుల దగ్గర కరెంట్ వైర్లు, స్టాటర్స్, మోటార్స్ వంటివి దొంగలిస్తున్నారని ఇటీవల వనపర్తి కర్ణాకర్ అనే రైతు వ్యవసాయ భూమిలో ఉన్న సుమారు లక్ష రూపాయల విలువ గలది రోటివేటర్ ను దొంగలు ఎత్తుకెళ్లారని అన్నారు. నిర్మానుష ప్రాంతం కావున మధ్యం సేవించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

article_49291118.webp
న్యాయవాదిగా పట్టా పొందిన దైనంపెల్లి కవిత

11-11-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): పేద కుటుంబంలో పుట్టి ఎన్నో ఒడిదుడుకులు ఛేదించుకుంటూ హనుమకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఉన్నతమైన న్యాయస్థానంలో అడుగుపెట్టి ఎం.ఏ (ఎమ్.హెచ్.ఆర్.ఎం) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎల్.ఎల్.బి కోర్సులో పట్టా సాధించి మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని నిరూపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాయంపేట గ్రామస్తురాలైన దైనంపెళ్లి కవిత. ఆమె తల్లిదండ్రులైన సారయ్య రాజమ్మలకు ఆరుగురు సంతానం కాగా చివరి కూతురైన కవిత చిన్నతనంలోనే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, పేదవారికి సహాయం చేయాలని ఆలోచనతో చిన్ననాటి నుండి న్యాయవాది వృత్తిపై ఆసక్తితో కష్టపడి చదివి తెలంగాణ హైకోర్టు నుండి న్యాయవాది పట్టా సాధించడం పట్ల శాయంపేట మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

article_41314139.webp
బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్పించాల్సిందే

11-11-2025

హనుమకొండ, నవంబర్ 10 (విజయ క్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పురుడు పోసుకున్న కాకతీయ యూనివ ర్సిటీ గడ్డ మీద మళ్లీ బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభు త్వం 9వ షెడ్యూల్లో చేర్పించి, బీసీలకు సత్వర న్యాయం చేయాలని, మేమేంతో మా కంతా వాటా అంటూ ధర్మంగా పోరాడుతున్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జి ల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు.