టీజీఎండిసి ఆధ్వర్యంలో సాండ్ బజార్ ప్రారంభం
19-08-2025
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండిసి ఆధ్వర్యంలో సాండ్ బజార్ ను ఏర్పాటు చేసిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండిసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కే.ఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, టిజిఎండిసి అధికారులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.