ప్రజల భాగస్వామ్యంతో ప్రతి కాలనీని అభివృద్ధి చేస్తాం
20-12-2025
హనుమకొండ టౌన్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ లో ఇందిరమ్మ కాలనీ పేస్ వన్, పండ్ల మార్కెట్ రోడ్డు, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్ కాలనీలలో అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీలా నిర్మాణ పనులకు సుమారు 2 కోట్ల 70 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు డివిజన్లో ప్ర జలతో స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకుని మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వె నుకబడిన ప్రతి కాలనీని అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.