12 April, 2026 | 6:45 AM

Districts - Hanumakonda

article_18425131.webp
వేయి స్తంభాల గుడి అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులవి ప్రగల్భాలే..!

హనుమకొండ,(విజయక్రాంతి): చారిత్రాత్మక దేవాలయమైన వెయ్యిస్తంభాల గుడి (రుద్రేశ్వరాలయం) పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం విడత చేసిన భారీ నిధుల పట్ల బిజెపి రాష్ట్ర నాయకురాలు రావు పద్మ హర్షం వ్యక్తం చేశారు. వేయి స్తంభాల గుడిలో గురువారం బీజేపీ జిల్లా నాయకులతో కలిసి పునరుద్ధరణ పనులను పరిశీలించిన అనంతరం రావు పద్మా మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి అసంపూర్తిగా ఉన్న వెయ్యిస్తంభాల గుడి కళ్యాణ మండప పునర్నిర్మాణ పనులను పూర్తి చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారని,గతంలో పురావస్తు శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూపాయలు 17 కోట్లు కేటాయించి, పనులను పూర్తి చేయించి జాతికి అంకితం ఇచ్చారన్నారు.

09-04-2026