calender_icon.png 8 November, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_37294199.webp
పంట క్షేత్రాల్లో వేలాదిగా నాటు కోళ్లు..!

08-11-2025

భీమదేవరపల్లి,(విజయక్రాంతి): పంట క్షేత్రాల్లో వేలాదిగా నాటు కోళ్లను(Natukollu) గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన సంఘటన శనివారం ఎల్కతుర్తిలో చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా(Hanumakonda District) ఎలుకతుర్తి మోడల్ స్కూల్ సమీపంలో సుమారు రెండు వేల వరకు నాటు కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం వదిలి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు నాటు కోళ్లను వదిలి వెళ్ళిన సంఘటన ఎల్కతుర్తి గ్రామంలో దావనంల వ్యాపించడంతో అనేకమంది గ్రామస్తులు కోళ్లను పట్టుకునేందుకు పంట పొలాల్లో పరుగులు తీశారు. కొంతమందికి ఒకటి రెండు కోళ్లు దొరకగా మరి కొంత మంది యువకులు ముందు చూపుతో ఇంటివద్ద నుండి తెచ్చుకున్న బ్యాగులో పదుల సంఖ్యలో కోళ్లను పట్టుకు వెళ్లారు. ఏది ఏమైనా ఎలుకతుర్తి గ్రామం మొత్తం నాటుకోడి కూర పులుసుతో గుమగుమ లాడుతున్నాయి. కాగా నాటు కోళ్లకు వైరస్ సోకడంతో గుర్తు తెలియని వ్యక్తులు కోళ్లను వదిలి వెళ్లారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

article_78367112.webp
లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వల్ల తిరిగి జీవం పొందవచ్చు

08-11-2025

హనుమకొండ, నవంబర్ 7 (విజయ క్రాంతి): మందులతో నియంత్రించలేని తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు లంగ్ ట్రాన్స్ప్లాంట్ జీవం తిరిగి ఇచ్చే వైద్య పద్ధతని డాక్టర్ వడ్డేపల్లి చేతన్ రావు అన్నారు.రోగుల దెబ్బతిన్న ఊపిరితిత్తుల ను మార్చి బ్రెయిన్ డెడ్ దాతల ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులను మార్చి రోగులను తిరిగి మామూలు స్థితికి తీసుకురావచ్చు అన్నారు. శుక్రవారం హన్మకొండ బాలసముద్రం యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, భారతదేశంలో ఈ రంగంలో ఇటీవల సంవత్సరాల్లో గణనీయమైన పురోగతి సాధించబడిందన్నారు.