వడ్డేపల్లిని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ఉంచుతా
01-12-2025
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి ప్రతికాలనీలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వడ్డేపల్లి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం 60వ డివిజన్ వడ్డేపల్లి ముదిరాజ్ కాలనీ, ముస్లిం కాలనీ, మిడిదొడ్డి వాడ అలాగే ఎస్బిహెచ్ బ్యాంక్ కాలనీలో సుమారు 1.65 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు, సీసీ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, పూర్తి అయినా సీసీ రోడ్లను ప్రారంభించారు. ఆయా కాలనీలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే నాయిని, స్థానిక ప్రజలను, కాలనీ పెద్దలను మమేకం చేస్తూ పర్యటన చేశారు.