పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
06-12-2025
హనుమకొండ టౌన్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 54, 6వ డివిజన్ లలో రూ.4.26 కోట్లతో మంచి నీటీ పైప్ లైన్, సీసీ డ్రైన్, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సుమారుగా 4 కోట్ల పై చిలుకు నిధులతో ఆయా డివిజన్ లలో పనులు చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.