calender_icon.png 5 December, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_65652216.webp
వృత్తి విద్య విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

04-12-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బ్యూటీ, వెల్నెస్, మీడియా ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఇంటర్నెట్ షిప్ పూర్తిచేసిన విద్యార్థినీ, విద్యార్థులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రతిభాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యతో పాటు ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రభుత్వం కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని, విద్యార్థులు విద్యతో పాటు మారుతున్న కాలానుగుణంగా తమను తాము అభివృద్ధి చేసుకుంటూ సామాజిక అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు.

article_34614182.webp
ప్రజల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

04-12-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో పార్టీలకు అతీతంగా చరిత్రలో నిలిచే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గురువారం 4వ డివిజన్ అక్షర కాలనీ, యాదవ నగర్, 9వ డివిజన్ గణేష్ నగర్ లలో సూమరు రూ.1.20 కోట్లతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ లు, పైపులైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా వార్డులలో స్థానిక ప్రజలతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించిన సందర్బంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

article_32853202.webp
రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించండి

04-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యములో గురువారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని కలసి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి బకాయిలు చెల్లించుటకు ఒత్తిడి చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మార్చి 2024 నుండి అక్టోబర్ 2025 వరకు రిటైర్మెంట్ బకాయిలు 20 నెలలు గడిచినా చెల్లించకపోవడం వల్ల పెన్షనర్లు మానసికంగా కృంగిపోయి, తీవ్ర అనారోగ్యానికి గురియై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 28 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు చనిపోయినారని, ఆవేదన వ్యక్తం చేశారు.

article_84030001.webp
రైస్ మిల్లర్లు ధాన్యంలో తరుగును తీయొద్దు

03-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): రైతులు విక్రయించిన ధాన్యంలో తరుగు తీయకుండా రైస్ మిల్లర్లు ధాన్యాన్ని దింపుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో కస్టమ్ మిల్లింగ్ రైస్, ధాన్యం కొనుగోలు అంశాలు, జిల్లాలోని ధాన్యం కోనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించినప్పుడు రైస్ మిల్లర్లు ధాన్యపు బస్తాలలో ఎక్కువగా తరుగు తీస్తున్నారని, తరుగు తీస్తుండడంతో నష్టపోతున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన అంశంపై పౌరసరఫరాలు శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు.

article_85821473.webp
హైదరాబాద్ కు బయలుదేరిన జర్నలిస్టు నేతలు

03-12-2025

హనుమకొండ,(విజయక్రాంతి): జర్నలిస్ట్ ల సమస్యల సాధనకు టీయుడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన మహా ధర్నాకు బుధవారం హనుమకొండ జిల్లా నుండి భారీగా జర్నలిస్టులు తరలి వెళ్లారు. ఉదయం 7 గంటలకు హనుమకొండ హరిత కాకతీయ హోటల్ నుండి బయలుదేరి హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల కార్యాలయంకు తరలి వెళ్లి ధర్నా లో పాల్గొననున్నారు. జిల్లా నుండి తరలి వెళ్లిన వారిలో టీయుడబ్ల్యూజె (ఐజేయూ) రాష్ట్ర హౌసింగ్,వెల్ఫేర్ కన్వీనర్ వల్లాల వెంకటరమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. వేణుమాధవ్,కంకనాల సంతోష్, జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గడ్డం కేశవ మూర్తి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య,కోశాధికారి బోళ్ల అమర్, యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు నల్లాల బుచ్చిరెడ్డి,నార్లగిరి యాదగిరి డాక్టర్ పొడిశెట్టి విష్ణు వర్ధన్,సిహెచ్ సోమనర్సయ్య, ఎం. రాజేంద్ర ప్రసాద్, సాయిరాం,వలిశెట్టి సుధాకర్,కె.దుర్గా ప్రసాద్, ఎండి నయీం పాషా,శ్రీహరి రాజు, బి. విజయ్ రాజ్,యుగేందర్,ఉస్మాన్ పాషా,సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

article_73212961.webp
సర్పంచ్ బరిలో జవాన్ భార్య

02-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో ఓ జవాను భార్య సర్పంచ్ గా పోటీ చేయడం సంచలనంగా మారింది. గ్రామాల్లో గ్రూపు రాజకీయాలతో ఇబ్బందులు పడుతున్న బాధితులలో తాము కూడా బాధితులమేనని, సమస్య పరిష్కారం కొరకు గ్రామ పెద్దలను చెప్పుకునే కొంతమంది నాయకుల దగ్గరికి వెళితే ఆ సమస్యను మరింత జటిలం చేసి తమ పబ్బం గడుపుకున్నారే తప్ప, తమకు న్యాయం జరగలేదని, మా వీధి సిసి రోడ్డు కొరకు వీధివాసులమంతా సంబంధిత వార్డ్ మెంబర్ దగ్గరికి వెళితే అవహేళనగా మాట్లాడరని, అందుకే మన పని మనమే చేసుకుందామనే ఉద్దేశంతో సర్పంచ్ బరిలో నిలిచినట్లు అభ్యర్థి కాసురి మమత తెలిపారు.