ప్రైవేట్ పాఠశాల ఉద్యోగులకు పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి
09-12-2025
హనుమకొండ (విజయక్రాంతి): వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హనంకొండ జిల్లా కేంద్రంలో ఉన్న రీజినల్ పెన్షన్ ఆఫీసులో అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ ని కలిసి ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్న అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి, పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షురాలు అనుష మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఉన్న అనేక ప్రైవేట్ పాఠశాలలు వారి దగ్గర పని చేస్తున్న ఉద్యోగులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం లేదని, పది, పదిహేను సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నాయన్నారు.