ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం
హనుమకొండ టౌన్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): హనుమకొండ 58వ డివిజన్ పరిధి ఎన్జీవోస్ కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్రగా నియోజకవర్గంలో తిరిగినప్పుడు నా దృష్టికి వచ్చిన సమస్యలను, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు.
06-04-2026