calender_icon.png 25 June, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_32183032.webp
డ్రగ్స్‌ నిర్మూలన మనందరి లక్ష్యం

24-06-2025

డ్రగ్స్‌ రహిత వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌గా గుర్తింపు సాధించడమే మనందరి లక్ష్యమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్(Police Commissioner Sunpreet Singh) పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని డ్రగ్స్‌ కు వ్యతిరేకంగా, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్‌ పోస్టర్లను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం అవిష్కరించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. మత్తుపదార్థాలను ఈ సమాజం నుండి తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కపౌరుడు భాగస్వాములు కావడంతో పాటు పోలీసులుకు పూర్తి సహకారం అందించాలని, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడంతో పాటు, వాటి వినియోగించడం ద్వారా ప్రజలకు కలిగే నష్టాలను పోలీసుల వివరించడం జరుగుతోందని, ముఖ్యంగా ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో ఈ డ్రగ్స్‌పై అవగాహన కల్పించడంతో పాటు, ర్యాలీలు, డ్రాయింగ్‌, వ్యాస రచన పోటీలను ఏర్పాటు చేయడం జరుగుతొందని, ఎవరైన మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన తక్షణమే 8712584473 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని, సమచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

article_17388310.webp
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

23-06-2025

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళను రాజకీయాలకు అతీతంగా మంజూరు చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 59వ డివిజన్లోని అలిపురలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆత్మగౌరవానికి బలమైన పునాది వేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లను నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, 59 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేతిడి దీపక్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పూరెల్ల రవి కిరణ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తేల సుగుణ కిషోర్, రజిత, ఎండి మజర్ అహ్మద్, ఎండి నబీన్, అమిత్ కుమార్, దొంగరి శ్రీనివాస్, కోన శ్రీకర్, మదర్ తదితరులు పాల్గొన్నారు.

article_56843631.webp
సివిల్ సర్వీసు పరీక్షకు ఉచిత శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం

23-06-2025

షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అధ్యయ కేంద్రం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(Union Public Service Commission), సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(Civil Service Aptitude Test) 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశానికి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు 33 జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ అర్హులైన నిరుద్యోగులు, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై, వార్షిక ఆదాయం ౩ లక్షలు ఉంచకుండా ఉండాలి. http://tsstudycircle.co.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో మాత్రమే 07.07.2025 వరకు దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరడమైనది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులకు 13.07.2025 రోజున ఎంపిక పరీక్షా నిర్వహించడం జరుగుతుంది.

article_14204054.webp
సామాజిక సేవే లక్ష్యం

22-06-2025

సామాజిక సేవే తమ సంస్థ లక్ష్యమని పద్మాక్షి హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్(Padmakshi Housing Welfare Association) అధ్యక్షుడు పాశికంటి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ప్రాంతంలోని తిరుపతి తిరుమల దేవస్థానం కల్యాణ మండపంలో పద్మాక్షి హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సభను ఆయనతో పాటు సంస్థ లీగల్ సెల్ కమిటీ కన్వీనర్ అనుముల రమేష్, ప్రతినిధులు పాశికంటి జయలక్ష్మి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పద్మాక్షి హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంఘటితం కావాలని కోరారు.

article_86501615.webp
ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా సాబీర్

22-06-2025

తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం(Telangana Government Drivers Association) వరంగల్ ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలను రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా రిటర్నింగ్ అధికారి ఎండి జహంగీర్ అలీ, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే. భాస్కర్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్ష పదవికి ఎండి. సాబీర్ తో పాటు ఏ. ప్రకాష్ పోటీపడ్డారు. పోటీలో ఉన్న ప్రకాష్ విత్ డ్రా చేసుకోగా ఎండి. సాబీర్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

article_11846813.webp
పచ్చని ప్రకృతికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి...

22-06-2025

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు, హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(Hanamkonda Arts and Science College)లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, టీజీ ఎన్‌బీ శాఖ, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి జయంతి(District Welfare Officer Jayanthi) అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ... "పచ్చని ప్రకృతిని కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. అలాగే యువత చెడు వ్యసనాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి" అని పేర్కొన్నారు.

article_55363125.webp
అర్హులందరికీ.. ఇందిరమ్మ ఇండ్లు

19-06-2025

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. 60వ డివిజన్ వడ్డేపల్లి, 58వ డివిజన్ ఎస్సీ కాలనీ, 57వ డివిజన్ సమ్మయ్యనగర్ కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్ల నిర్మాణానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసి, పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, రాష్ట్రంలో చాలా చోట్ల ఇందిర్మ కాలనీలు ఉంటాయని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 3500 ఇళ్లకు గాను ప్రతి ఒక్క ఇల్లు నిజమైన అర్హులకు కేటాయించామని తెలిపారు.