calender_icon.png 7 December, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_41101336.webp
శ్రీ చైతన్య జోనల్ స్థాయి క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభం

06-12-2025

హన్మకొండ (విజయక్రాంతి): తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల(వరంగల్ జోన్) జోనల్ స్థాయి క్రీడలు, హన్మకొండ కాజీపేటలోని శ్రీ చైతన్య సీబీఎస్ఈ పాఠశాల ప్రాంగణంలో శనివారం శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మడి కొండ ఎస్సై రాజ్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. పోటీల్లో వరంగల్ జోన్ లోని శ్రీ చైతన్య అన్ని బ్రాంచీల నుండి సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లంపాటి శ్రీధర్ మాట్లాడుతూ నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను క్రీడలు అనేవి పరిష్కరించే మార్గాన్ని సూచిస్తాయన్నారు.

article_58807511.webp
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

06-12-2025

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం హసన్ పర్తి లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కాదు, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, సమాన అవకాశాలు రావడానికి జీవితాంతం పోరాడిన మహానుభావుడు. సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత, సమానత్వం ఈ నాలుగు స్తంభాల మీద ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గం ఆయన ఆలోచనల్లోనే ఉంది.

article_29853770.webp
సాయి ఈశ్వర చారికి నివాళులు అర్పించిన బీసీ జేఏసీ నాయకులు

06-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీసీల ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి ప్రాణ త్యాగంతో సాధించుకున్న తెలంగాణలో రెడ్లు, వెలమలు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కబ్జా చేసి, రాష్ట్రంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలను రాజకీయంగా అణిచివేస్తున్నారని, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్, దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీలు బీసీలకు రిజర్వేషన్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారనే ఆవేదనతో మనస్థాపం చెందిన బీసీల ముద్దుబిడ్డ సాయి ఈశ్వరచారి నేడు ఆత్మ బలిదానం చేసుకున్నాడని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేసారు.

article_40110131.webp
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు

06-12-2025

హనుమకొండ (విజయక్రాంతి): నూతనంగా ఎన్నికైన ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యులు, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా సత్కరించారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇటీవల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్టులు గడ్డం రాజిరెడ్డి, వల్లాల వెంకటరమణ,తోట సుధాకర్,సంగోజు రవి, టి యు డబ్ల్యూ జే-ఐజేయు వరంగల్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులుగా ఎన్నికైన శ్రీరాం రాంచందర్,మట్ట దుర్గాప్రసాద్ లను శాలువాలతో సత్కరించి మెమోంటో లు అందించి సన్మానించారు. యూనియన్ కు విశేష సేవలందించి నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా పదవీకాలం పూర్తి చేసుకున్న నల్లాల బుచ్చిరెడ్డిని ప్రత్యేకంగా సన్మానించారు.

article_85569441.webp
ఆరు గ్యారంటీలలో కాంగ్రెస్ విఫలం

06-12-2025

హన్మకొండ/వరంగల్,(విజయక్రాంతి): పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుడికాల శ్రీధర్ కి మద్దతుగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్ శనివారం గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడుతూ అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ విమర్శించారు.రెండేళ్లు గడిచినా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు.