calender_icon.png 31 January, 2026 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_38756050.webp
భక్తజన సంద్రమైన ముల్కనూర్ సమ్మక్క

31-01-2026

భీమదేవరపల్లి ,జనవరి 30 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని సమ్మక్క సారలమ్మ జాతరకు శుక్రవారం సాయంత్రం వరకు సుమారు నాలుగు లక్షల పైగా భక్తులు హాజరై అమ్మవార్లను దర్శించినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం రాత్రి సమ్మక్క గద్దెకు చేరుకోగా పోలీస్ శాఖ వారు ప్రభుత్వ లాంచనాలతో గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క గద్దెకు చేరుకోగానే భక్తులు లక్షలాదిగా అమ్మవారిని దర్శించారు శుక్రవారం సమ్మక్క సారలమ్మ ను మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, వృక్ష ప్రసాద దాత బిజెపి నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి దర్శించుకున్నారు.

article_43933503.webp
డీసీసీ భవన్‌లో గాంధీ చిత్రపటానికి ఘన నివాళులు

31-01-2026

హనుమకొండ టౌన్, జనవరి 30 (విజయక్రాంతి): హనుమకొండ డిసిసి భవన్ లో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనా క్షి నటరాజన్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అయ్యూబ్ లు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తొలుత హనుమకొండ జిల్లా కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

article_25711947.webp
కాంగ్రెస్ కక్షపూరిత దోరణికి నిదర్శనం సిట్ నోటీసులు

30-01-2026

హనుమకొండ,జనవరి 29 (విజయ క్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసుల నేపథ్యంలో దాస్యం వినయ్ భాస్కర్ కార్యకర్తలతో కలిసి గురువారం సాయంత్రం బాలసముద్రం లోని రహదారి పై కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని,తెలంగాణను కొట్లాడి సాధించిన నేతపై కుట్రపూరితంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు.14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, 10 ఏండ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ ను దేశంలోనే అగ్రభాగన నిలిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

article_79522769.webp
పరకాల మున్సిపల్ ఎన్నికల ఫామ్ -ఏ కలెక్టర్‌కు అందజేత

30-01-2026

హనుమకొండ టౌన్, జనవరి 29 (విజయక్రాంతి): పరకాల మున్సిపాలిటీ వార్డుల సభ్యుల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఫామ్- బీ నోటీసులు జారీ చేసే అధికార ప్రతినిధిగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డినీ నియమించి నట్లు, జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కి అధికారికంగా సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రాంరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ.వి శ్రీనివాస్ రావు లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి స్నేహ శబరిస్‌ని కలిసి సంబంధిత ఫామ్- ఏ వివరాలను అందజేశారు . ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.

article_37035556.webp
పుర పాలక ఎన్నికల పరిశీలకులుగా కిల్లు శివ కుమార్ నాయుడు

30-01-2026

హనుమకొండ, జనవరి 29 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలోని పరకాల పుర పాలక ఎన్నికల సాధారణ పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారి కిల్లు శి వకుమార్ నాయుడును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన ఎన్నికల పరిశీలకులు కిల్లు శివకుమార్ నాయుడుకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మొక్కను అందించి స్వాగతం పలికారు. కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో జిల్లా ఎన్నికల పరిశీలకులు కిల్లు శివకుమార్ నాయు డు సమావేశమై పరకాల పురపాలక సంస్థకు సంబంధించిన అంశాలను గురించి ఈ సం దర్భంగా చర్చించారు. శివకుమార్ నాయు డు గతంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు హానుమకొండ జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా పనిచేశారు.

article_71134451.webp
ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి

30-01-2026

హనుమకొండ, జనవరి 29 (విజయక్రాంతి): నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పాటించాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.గురువారం హనుమకొండ జిల్లా పరకాల పురపాలక సంస్థలో 22 వార్డులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పురపాలక సంస్థ కార్యాలయంలో కొనసాగుతుండగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పరిశీలించారు. 11 వార్డులకు ఒకటి చొప్పున మొత్తం 22 వార్డులకు గాను నామినేషన్ల స్వీకరణకు రెండు కౌంటర్లను ఏర్పాటు చేసి అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరిస్తుండగా వాటి వివరాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పురపాలక కమిషనర్ అంజయ్య, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు.