17 July, 2026 | 11:44 PM

Districts - Nalgonda

article_77373019.webp
ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా మాస శ్రీనివాస్ నియామకం

చిట్యాల, జులై 17 (విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంత్ రవిదాస్ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా చిట్యాలకు చెందిన మాస శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కాంతి కిరణ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా ఇన్‌చార్జి, కొల్లూర్ పార్లమెంట్ సభ్యుడు మునిస్వామి చేతుల మీదుగా మాస శ్రీనివాస్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.

17-07-2026