calender_icon.png 23 January, 2026 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_51302046.webp
చండూరులో కాంగ్రెస్ కార్యకర్తల హల్ చల్!

23-01-2026

చండూరు, జనవరి 22: చండూరు మున్సిపాలిటీలో మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోటో ఉన్న స్కార్పియో పై మంత్రి రాజన్న అని రాసి మున్సిపాలిటీ వీధుల్లో చక్కర్లు కొడుతూ హల్చల్ చేసినట్లు స్థానికులు తెలిపారు. మూడు రోజులుగా మున్సిపాలిటీలో ఇదే తంతు కొనసాగుతున్నట్లు విమర్శలు చేస్తున్నారు. ఇది మా రాజన్న అడ్డా అంటూ తాము అడిగినప్పుడల్లా మద్యం ఇవ్వాల్సిందే అని భయపెడుతూ బుధవారం స్థానిక యూనియన్ బ్యాంకు ముందు నుండి అతివేగంగా వెళ్లి వెనకాల ఉన్న వైన్స్ గేటును గుద్దుకుంటూ లోపలికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.

article_15845484.webp
ఆపదలో ఉన్న పేద విద్యార్థులకు అండగా ఉంటాం

22-01-2026

మునుగోడు,జనవరి 22 (విజయక్రాంతి): అనారోగ్యం, ఆపదలో ఉన్న పేద విద్యార్థులకు అండగా ఉండటమే విద్య నిర్వీజ్ఞ ఫౌండేషన్ లక్ష్యమని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బోల్గురి ముకేష్ అన్నారు. గురువారం మండలంలోని రత్తిపల్లి గ్రామంలో అనారోగ్యంతో ఉన్న విద్యార్థి కుటుంబానికి ‘విద్యా నిర్వీజ్ఞ ఫౌండేషన్ అండగా నిలిచి భరోసా కల్పించింది. ఫౌండేషన్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇటీవల అనారోగ్యం కారణంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రడం మని కుమార్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వారికి నిత్యావసర సరుకులను ఫౌండేషన్ ప్రతినిధులు అందజేసి మాట్లాడారు.చదువుకునే పిల్లలు ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ సాయం అందించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు రాకేష్, జగదీశ్, గాదె రాజు, బొడ్డుపల్లి రాజు, బోల్గురి ఉపేదర్, మహేందర్ ,గాదె శివరాజ్ ఉన్నారు.

article_35489730.webp
కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

22-01-2026

మునుగోడు,జనవరి 22 (విజయక్రాంతి): కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు కోడ్ లను తక్షణమే విరమించుకోవాలని సిఐటియు మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు అన్నారు. ఫిబ్రవరి 12వ చేపట్టిన దేశవ్యాప్త సమ్మేలో భాగంగా గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి మునుగోడు ఎంపీడీవో గంగుల యుగంధర్ రెడ్డి కి సిఐటియు సమ్మె నోటీసును అందజేసి మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 29 చట్టాలను, వాటి స్థానంలో నాలుగు కోడ్ లను చేసేందుకు గత సంవత్సరం నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని అన్నారు విద్యుత్ సవరణ చట్టం 2025 ను రద్దు చేసి, ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.జాతీయస్థాయిలో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12 న ఒక్కరోజు సమ్మె కు మండలంలోని కార్మికులందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిఐటియు మండల సీనియర్ నాయకులు రెడ్డి మల్ల యాదగిరి, మండల అధ్యక్షులు పెరమళ్ళ రాజీవ్,సైదులు,శ్రీకాంత్ ఉన్నారు.