calender_icon.png 14 January, 2026 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_11142784.webp
240 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు పేదలకు కేటాయిస్తాం

14-01-2026

చిట్యాల, జనవరి 13(విజయక్రాంతి): స్థానికంగా నిర్మించిన 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు కేటాయిస్తామని చిట్యాల మున్సిపాలిటీలో పర్యటించిన నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం తెలిపారు. మంగళవారం మున్సిపాలిటి పరిధిలోని 01వ వార్డులోని శివనేనిగూడెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటి పరిధిలోని ఒకటో వార్డులో పర్యటన చేశామని, ఈ వార్డులో ఉన్న ప్రజలు డంపింగ్ యార్డుతో ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని జననివాసానికి దూరంగా మార్చటానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

article_90807108.webp
కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

14-01-2026

చౌటుప్పల్, జనవరి 13 (విజయక్రాంతి): మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో వారి ఆదేశాల మేరకు చౌటుప్పల్ వివిధ గ్రామాలకు మరియు మున్సిపాలిటీ చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వ అధికారులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్యాణ లక్ష్మి 49 మరియు సీఎం రిలీఫ్ ఫండ్ 34 చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఎమ్మార్వో వీర బాయ్,మండల అధ్యక్షులు బోయ దేవేందర్, మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నర్సింహగౌడ్, రెవిన్యూ అధికారులు బాణాల రామ్ రెడ్డి, సుధాకర్‌రావు, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు, జిపిఓలు మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

article_25911482.webp
ఇద్దరు దోపిడీ దొంగల అరెస్ట్

14-01-2026

నల్గొండ క్రైం, జనవరి 13: ఇద్దరు దోపిడీ దొంగలను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు వారి నుండి రెండు బైకులు రెండు తులాల బంగారం చైన్ ను స్వాధీనం చేసుకున్నారు నేరస్తుల వివరాలను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమే ష్ వెల్లడించారు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని గోరంట్ల గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ గా పనిచేసే గునిగంటి మహేష్ అలియాస్ నాగరాజు ఇతను స్నేహితుడైన హైదరాబాద్ చంపాపేట్ గాంధీ విగ్రహం సమీప నివాసానికి చెందిన ఆటో డ్రైవర్ గా పని చేసే పాథ్లవత్ వినయ్ లు గత ఏడాది నవంబర్ 28న కేతపల్లి మండలం ఇనుపాఁముల గ్రామానికి చెందిన ఉప్పుల వెంకట రమణిని కత్తి తో గాయపరిచి తన మెడలో ఉన్న బంగారు పూస్తేల తాడు, చెవి దిద్దులు దొంగతనం చేసుకొని పారిపోయినాడు.

article_10714875.webp
మున్సిపల్ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు

14-01-2026

చండూరు, జనవరి 13 (విజయక్రాంతి): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని, ఈ ప్రాంతానికి చేసింది అభివృద్ధి శూన్యమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు.తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు చేతిలో నడుస్తుందని, ఒక నాయకుడు చంద్రబాబు అయితే మరొకడు మోడీ అయ్యాడని, ఇరువురి కనుసన్నలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సాగునీటిపై రోడ్లపై ఎలాంటి అవగాహన లేదని, మంత్రి పదవి పైన ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదన్నారు.

article_46783142.webp
సంక్రాంతి తర్వాత రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయం

13-01-2026

మునుగోడు, జనవరి 12 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ అనంతరం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం ఖాయమని, కరోనా కష్టకాలాల్లో కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఘనత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది అని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని 90 మంది లబ్ధిదారులకు 2,45,2000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.

article_37791511.webp
ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల పరిశీలన

13-01-2026

చిట్యాల, జనవరి 12 (విజయ క్రాంతి): చిట్యాల మున్సిపాలిటీలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్లతో మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను ప్రారంభించామని, కానీ నేటి అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నేడు ఈ నిర్మాణ పనులను నిలిపివేసిందని అన్నారు.