నకిలీ బంగారంతో అమాయకులకు గాలం
20-11-2025
మిర్యాలగూడ (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖరరాజు పర్యవేక్షణలో సీసీఎస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ బంగారం తో మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితుడి అరెస్టు చేసిన మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ లు.ప్రధాన నిందితుడు అరెస్టు,ముగ్గురు నిందితులు పరారీ.మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను టార్గెట్ చేస్తున్న ప్రధాన నిందితుడు గోవిందప్ప తండ్రి నాగప్ప, వయస్సు 40, కోరచరహళ్లి, హురులికలు, కుడ్లిగి, బళ్ళారి జిల్లా, కర్ణాటక స్టేట్ గా పేర్కొన్నారు.