calender_icon.png 14 November, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_31789480.webp
స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: దైద రవీందర్

14-11-2025

యువత ఉద్యోగ అన్వేషణ చేస్తూనే తమకు నచ్చిన రంగంలో స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పేర్కొన్నారు. శుక్రవారం నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో కొల్లు నాగరాజు, కొల్లు నరేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కింగ్ టీ స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు స్వయం ఉపాధిలో అగ్రగామి గా రాణించవచ్చన్నారు. స్వయం ఉపాధి ఏర్పరచుకొని సమాజంలో గౌరవ మర్యాదలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

article_78480197.webp
అవమానించిన ఉపాధ్యాయునిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి

13-11-2025

మునుగోడు (విజయక్రాంతి): హనుమాన్ దీక్ష తీసుకున్న విద్యార్థికి ప్రభుత్వ పాఠశాలలో అవమాన పరిచిన ఉపాధ్యాయునిపై విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు అన్నారు. గురువారం భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. మునుగోడు మండలం పలివెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కొండేటి శివ శంకర్ అనే విద్యార్థి ఇటీవల హనుమాన్ మాలాధారణ వేసుకుని పాఠశాలకు వెళ్లిన విద్యార్థి పట్ల తెలుగు ఉపాధ్యాయుడు నరసింహ దురుసుగా, ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశాడని అన్నారు.

article_60058616.webp
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి

13-11-2025

నకిరేకల్ (విజయక్రాంతి): పోరాటాల పురిటి గడ్డ సూర్యాపేట పట్టణంలో ఈనెల 28, 29, 30 తేదీలలో జరిగే కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దండేంపల్లి శ్రీనివాస్ కోరారు గురువారం కట్టంగూర్ మండలంలోని నారేగూడెం గ్రామంలో పాల్గొని మహాసభల పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 28వ తేదీన మహాసభలు సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన, గొప్ప బహిరంగ సభ జరుగుతున్నదని, దీనికీ జిల్లా నలుమూల నుండి గీత కార్మికులు వేలాదిగా తరలిరావాలని ఆయన కోరారు.

article_16197236.webp
క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించాలి

13-11-2025

నకిరేకల్ (విజయక్రాంతి): పాలకుల అసమర్థ విధానాలతో గ్రామీణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వాటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన చేసి పరిష్కారం చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లల పెంటయ్య, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం కోరారు. గురువారం సిపిఎం జిల్లా కమిటీ పిలుపుమేరకు రామన్నపేట మండలంలో కొమ్మాయిగూడెం, మునిపంపుల, దుబ్బాక, బొగారం గ్రామాల్లో వేరువేరుగా ఇంటింటి కుటుంబ గ్రామీణ సర్వే నిర్వహించి ప్రజలను నేరుగా కలిసి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందని వారు తెలిపారు.