ఉద్యమకారులను గౌరవించాల్సిన బాధ్యత మనందరిదీ
మిర్యాలగూడ మే 28: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పా త్ర పోషించిన ఉద్యమకారులందరినీ గౌరవించి సన్మానించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమకారుడు, జేఏసీ నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జాడి రాజు అన్నారు. గురువారం స్థానిక బీసీ భవన్ లో జరిగిన ఉద్యమకారుల సమావేశానికి జేఏసీ నా యకులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేత మాలోత్ దశరథ్ నాయక్ అధ్యక్షత వహించారు.
29-05-2026