కాంగ్రెస్ నాయకుడి మృతికి నివాళి
09-01-2026
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి 8: జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బొల్లెపల్లి అంజయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. గురువారం కాంగ్రెస్ నాయకులు అంజయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.