calender_icon.png 7 November, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_83811921.webp
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

07-11-2025

నల్గొండ క్రైమ్, నవంబర్ 6:సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు.సైబర్ జాగరుకత దివాస్ దినోత్సవం సందర్భంగా గురువారం నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు సైబర్ నేరాల పట్ల అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రోజు దేశ వ్యాప్తంగా అనేక మంది సైబర్ నేరగాళ్లు బారిన పడి మోసాలకు గురవుతున్నారనీ,వారి బారిన పడకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్గిఉండమే ఉత్తమ మార్గం అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎక్కువగా సులభంగా మోసపోయేది సైబర్ నేరగాళ్ల ద్వారానే అని అన్నారు.