సిపిఆర్ పై అవగాహన సదస్సు
16-10-2025
నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్, మండల పరిషత్ కార్యాలయంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఓగోడు ఆధ్వర్యంలో గురువారం సిపిఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైష్ణవి, హరిశ్రీ, నాగలక్ష్మిలు మాట్లాడుతూ ప్రతి 4,000 మందిలో ఒకరు కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారని వారు తెలిపారు. ప్రతి ఒక్కరికి సి.పి.ఆర్ పై అవగాహన ఉన్నట్లయితే గుండెపోటుకు గురైనప్పుడు చనిపోకుండా రక్షించవచ్చున్నారు.