calender_icon.png 23 November, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_65050434.webp
కాలువలోకి దూసుకెళ్లిన ఆటో.. వ్యక్తి మృతి

22-11-2025

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం పెద్దకాపర్తి స్టేజి వద్ద జాతీయ రహదారి 65పై శనివారం ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్యాసింజర్ ఆటో కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. చిట్యాల మండలంలోని పేరపల్లి గ్రామానికి చెందిన అంతటి రవి (36) ప్యాసింజర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. చిట్యాలకు కిరాయి కోసం వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు రహదారి పక్కన ఉన్న కాలువలో ఆటో పల్టీ కొట్టి తీవ్రంగా గాయపడిన అతడిని సమయానికి ఎవరు చూడకపోవడం వలన మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న చిట్యాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు కూతురు ఉన్నారు.

article_42776048.webp
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

22-11-2025

చిట్యాల,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Nakrekal MLA Vemula Veeresham) అన్నారు. శనివారం రామన్నపేట మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తుందని అని అన్నారు. వెల్లంకి గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు ను, సిరిపురం గ్రామంలో 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపనను, 15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం భోగారం గ్రామంలో 5లక్షల వ్యయంతో నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనను, నీర్నేముల గ్రామంలో 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పాక్స్ చైర్మన్ నంద్యాల బిక్షంరెడ్డి, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

article_14463195.webp
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

22-11-2025

చిట్యాల,(విజయక్రాంతి): ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి 65 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో రహదారి పక్కన ఉన్న చెట్టును ద్విచక్ర వాహనం ఢీకొనగా నకిరేకంటి కౌశిక్ (20) మిర్యాలగూడ కు చెందిన డిగ్రీ చదువుతున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హైదరాబాదులోని తన అన్న దగ్గర నుండి మిర్యాలగూడ తిరిగి వస్తుండగా తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చిట్యాల పోలీసు వారు చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని అని తెలిపారు.