calender_icon.png 2 July, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_83799233.webp
బెల్ట్ షాపుల నియంత్రణతో క్రైమ్ రేట్ తగ్గింది: చండూరు సీఐ ఆదిరెడ్డి

01-07-2025

గ్రామాల్లో ఒకప్పుడు కిరాణా షాపుల్లో కూల్‌డ్రింక్‌ల మాదిరిగా మద్యం ఎప్పుడైనా అందుబాటులో ఉండేది. "బెల్ట్ షాపులు" పేరుతో నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఈ అక్రమ విక్రయాలపై ఇప్పుడు గట్టిగా కట్టడి ఏర్పడిందని చండూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆదిరెడ్డి(Circle Inspector Adireddy) తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, బెల్ట్ షాపుల నిర్మూలన తరువాత చండూరు సర్కిల్ పరిధిలో కొట్లాట కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. ఈ ప్రాంతం సాధారణంగా శాంతియుతంగా ఉండే మండలమని, జిల్లాలో ఇతర మండలాలతో పోలిస్తే ఇక్కడ నేరాల సంఖ్య తక్కువగా ఉండటం సంతృప్తికరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖలతో సమన్వయంతో బెల్ట్ షాపుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

article_21697249.webp
5న జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల సర్వేలు జయప్రదం చేయండి

01-07-2025

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, మందుల కొరత డాక్టర్ల కొరత తీర్చాలని పిహెచ్‌సి స్థాయిలో ఉన్న సమస్యలను వెలికి తీయడానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఒకరోజు సమగ్ర సర్వేలు నిర్వహించనున్నట్లు, ఈ సర్వేలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఐద్వా జిల్లా కార్యదర్శి ప్రభావతి(Aidwa District Secretary Prabhavati) పిలుపునిచ్చారు. మంగళవారం రోజున మర్రిగూడ మండల కేంద్రం రాజుపేట తండాలో ఐద్వా ఆధ్వర్యంలో ఐద్వా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో సరియైన వసతులు కల్పించాలని, ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆమె అన్నారు. డాక్టర్లు సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆమె అన్నారు.

article_43838970.webp
గడ్డి మందు ఇంజక్షన్ ఇచ్చి మహిళపై అత్యాచారం చేసి చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

01-07-2025

గుర్రంపోడు మండలం జూనూతల గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళపై అత్యంత దారుణంగా ఆర్ఎంపీ మహేష్ గడ్డి మందు ఇంజక్షన్ ఇచ్చి అత్యాచారం చేసి చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి(Paladugu Prabhavathi) ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇటీవల కాలంలో మహిళలను మాయ మాటలు చెప్పి లొంగదీసుకుని అలుసుగా భావించి అత్యంత దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎంపి తన అత్తకు వైద్యం చేస్తానని పేరుతో తోడుగా వచ్చిన మహిళలను కారులో ఎక్కించుకొని చంపి సాక్ష్యం లేకుండా ఎక్కడో పడేయాలని క్రిమినల్ మైండ్ తో వ్యవహరించిన మహేష్ ను అత్యంత కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మూడు నెలలలోపే నిందితునికి కఠిన కారాగార శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

article_71312502.webp
1500 కేసులను పరిశీలించాం..

01-07-2025

గడచిన రెండున్నర నెలల్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(State Human Rights Commission) 1500 కేసులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్(Dr. Justice Shameem Akhtar) తెలిపారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు వచ్చిన ఫిర్యాదులను మానవ హక్కుల కమిషన్ వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ 2025 ఏప్రిల్ 17న చార్జి తీసుకున్నదని, తనతో పాటు, మరో ఇద్దరు సభ్యులు కమిషన్లో ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడైనా మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ఆన్లైన్ ద్వారా లేదా రాతపూర్వకంగా దరఖాస్తు ఇస్తే వాటిని పరిశీలించి వాటిపై పూర్తి విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

article_32923428.webp
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

01-07-2025

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, కార్మికుల హక్కులను కాలరాస్తున్న సర్కార్ పై జూలై 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(MLC Nellikanti Satyam) కోరారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసం ఆపరేషన్ కగార్(Operation Kagar) పేరుతో మోడీ ప్రభుత్వం మావోయిస్టులను, ఆదివాసీలను, బూటకపు ఎన్ కౌంటర్లు చేయడం సరైనది కాదు అని, నక్సలైట్లు కూడా ఈ దేశ పౌరులేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో సంపద అంతా కొద్దిమంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమైందన్నారు.

article_35423002.webp
కీలకమైన వృత్తి వైద్య వృత్తి

01-07-2025

సమాజంలో అత్యంత పవిత్రమైన, కీలకమైన వృత్తి వైద్య వృత్తి అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) అన్నారు. ఆపద సమయంలో ప్రజలందరికీ ఆపద్బాంధవుడిలా కనిపించే వైద్యులను ప్రజలు ఎంతగానో గౌరవిస్తారని, ఆరోగ్యమే మహా భాగ్యమని మనిషికి ఎంత సంపద ఉన్నా దాన్ని అనుభవించే ఆరోగ్యం లేకపోతే అదంతా వృధా అని, అనారోగ్యంతో బాధపడే వారిని ప్రమాద స్థితి నుంచి కాపాడే శక్తి కేవలం వైద్యునికే ఉందని అన్నారు. డాక్టర్ వృత్తిని ఇతర వృత్తులతో పోల్చుకోలేమని తెలిపారు. జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో ఉత్తమ సేవలందించిన డాక్టర్లను శాలువా జ్ఞాపికలతో సన్మానించారు. డాక్టర్లు సమాజానికి ఎంతో విలువైన సేవలు అందిస్తారని, మానవతా దృక్పథంతో చేసే పవిత్రమైన వృత్తిలో డాక్టర్లు ఉండడం వారి అదృష్టమని తెలిపారు.