దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
01-07-2025
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, కార్మికుల హక్కులను కాలరాస్తున్న సర్కార్ పై జూలై 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(MLC Nellikanti Satyam) కోరారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసం ఆపరేషన్ కగార్(Operation Kagar) పేరుతో మోడీ ప్రభుత్వం మావోయిస్టులను, ఆదివాసీలను, బూటకపు ఎన్ కౌంటర్లు చేయడం సరైనది కాదు అని, నక్సలైట్లు కూడా ఈ దేశ పౌరులేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో సంపద అంతా కొద్దిమంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమైందన్నారు.