calender_icon.png 20 November, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_20259328.webp
టీజీఎస్ ఆర్టీసీ కొత్త సర్వీస్ ప్రారంభం

20-11-2025

నకిరేకల్ (విజయక్రాంతి): టీజీఎస్ ఆర్టీసీ సూర్యపేట డిపో నుండి కొత్త సర్వీస్ ను ప్రారంభించినట్లు సూర్యపేట డిపో మేనేజర్ జి. లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం నకిరేకల్ పట్టణంలో కొత్త సర్వీస్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్ ప్రెస్ సర్వీస్ తుంగతుర్తి నుండి అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం, మాధవరం కలాన్ మీదుగా నకిరేకల్ పట్టణానికి చేరుకొని అక్కడినుండి ఆరు గంటలకు హైదరాబాదు వెళ్తుందని, తిరిగి ఉదయం 5:50 కి హైదరాబాదు నుండి బస్సు బయలుదేరి నకిరేకల్ కు వచ్చి అర్వపల్లి మీదుగా తుంగతుర్తి, సూర్యాపేటకు వెళ్తుందని తెలిపారు.

article_34531076.webp
చెర్వుగట్టు ఆలయంలో కార్తీకమాస పూర్ణాహుతి

20-11-2025

నకిరేకల్ (విజయక్రాంతి): కార్తీకమాసం ముగింపు సందర్భంగా శ్రీ పార్వతీజడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిత్య రుద్రహోమాల భాగంగా గురువారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. అమావాస్యను పురస్కరించుకుని ప్రసాద తయారీశాలను విక్రయ కౌంటర్లను ఈఓ స్వయంగా పరిశీలించారు. లడ్డు పులిహోర పరిమాణాన్ని పరిశీలించారు. స్వామి వారి దర్శనార్థం భక్తులు వేలాదిగా తరలివచ్చిన నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ తెలిపారు.

article_60035350.webp
ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం

20-11-2025

నకిరేకల్ (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని శాలిగౌరారం తహసిల్దార్ బిట్ల వరప్రసాద్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ, లయన్స్ క్లబ్ ఆఫ్ శాలిగౌరారం సంయుక్తంగా యశోద హాస్పిటల్ మలక్ పేట వారి సౌజన్యంతో మండలంలోని ఊట్కూర్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన తహసీల్దార్ వరప్రసాద్ ప్రారంభించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయాలు లేక సామాన్య ప్రజలు బాధపడుతుంటారని,ఉచిత శిబిరాలు పేదలు, మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. లయన్స్ క్లబ్ సేవే పరమావధిగా అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమన్నారు.

article_17591255.webp
గుత్తా అమిత్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

20-11-2025

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర డయిరి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి సమక్షంలోగురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారిలో సాగర్ల వెంకన్న, పెండ్యాల ప్రభు, కొత్త పెంటయ్య, ఉయ్యాల లక్ష్మయ్య, రూపని రమణ, రూపని అశోక్ , రూపని వెంకటయ్య, పాకాల పెద్ద పెద్దలు, గుండెగోని గోపాల్. ఈ కార్యక్రమమం లో మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సైదులు, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, సీనియర్ నాయకుడు పల్లపు బుద్ధుడు, మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, జనపాల శ్రీను, సాగర్ల భిక్షం, కురుపటి లింగయ్య, పాకాల దినేష్, బొడ్డు శ్రీను, గుత్తా రవీందర్ రెడ్డి, ఉయ్యాల నరేష్, మేడబోయున శ్రీను, రూపని భిక్షం, రూపని యాదయ్య తదితరులు పాల్గొన్నారు.