calender_icon.png 11 January, 2026 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_69478824.webp
ఓపీయం విక్రయిస్తున్న నిందితుడి అరెస్టు

11-01-2026

చిట్యాల, జనవరి 10 (విజయక్రాంతి): అక్రమంగా ఓపీయం పాపి హస్క్ అనే మాదకద్రవ్యాన్ని లారీ డ్రైవర్లకు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ కే శివరాం రెడ్డి తెలిపారు. శనివారం చిట్యాల పట్టణ కేంద్రంలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులో జాతీయ రహదారి 65పై ఉన్న డూన్ పంజాబీ దాబాలో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన దాబా యజమాని గుర్నిత్ సింగ్ కొంతకాలంగా నిషేధిత మాదక ద్రవ్యమైన ఓపీయం పాపి హస్క్‌ని దాబాలోని కస్టమర్లకు విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి దాబాపై దాడిచేసి గుర్నిత్ సింగ్‌ను విచారించారు.