19 March, 2025 | 1:54 AM
19-03-2025
పెన్ పహాడ్, మార్చి 18: రైతులకు సాగునీరు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రేస్ ప్రభుత్వమని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దుబ్బతండా, మెగ్య నాయక్ తండాలల్లో పర్యటించిన ఆయన ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.
హుజూర్ నగర్,మార్చి 18: రాజీవ్ యువ వికాస పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు మీసేవ సెంటర్లకు వెళ్లిన నిరుద్యోగ యువతకు రేషన్ కార్డు రూపంలో బ్రేక్ పడుతుంది. వెబ్ సైట్ లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడంతో రేషన్కార్డు నెంబర్ అడుగుతుంది.
కోదాడ, మార్చి 18: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తానని వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ ఉపాద్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు.
నల్లగొండ, మార్చి 18 (విజయక్రాంతి) : యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేయాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ ఏర్పాట్లపై కలెక్టరేట్లో పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ, ఇతరశాఖ అధికారులతో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు.
మునగాల, మార్చి 18: సూర్యాపేట జిల్లా మునగాల క్షయ వ్యాధితో బాధపడుతున్న వారి ఫుడ్ బాస్కెట్ అందజేసిన జిల్లా పిఓడిటి ఆఫీసర్ డాక్టర్ శ్రీశైలం యాదవ్. మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టిబి ముక్తుభారత అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పిఓడిటి ఆఫీసర్ డాక్టర్ శ్రీశైలం యాదవ్.
మిర్యాలగూడ, మార్చి8 (విజయక్రాంతి): వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందగా డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్నగర్ శివారులోని సాంబశివ రైస్మిల్లు సమీపం మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.
18-03-2025
నల్లగొండ, మార్చి 17 (విజయక్రాంతి) : జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనందున ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి కోరారు.
పెన్ పహాడ్, మార్చి 17: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని 11 ఉన్నత పాఠశాల లోని పదో తరగతి చదువుతున్న 320 మంది విద్యార్థులకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఎంపీహెచ్ఈఓ చంద్రశేఖర్ రాజు తన స్వంత ఖర్చులు వెచ్చించి పరీక్ష సామాగ్రిని అందజేశారు.
కోదాడ మార్చి 17: కోదాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి విశ్రాంత ఉద్యోగుల క్రీడా సాహిత్య సంస్కృతిక పోటీలు ఆత్మీయతకు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు.
హుజూర్ నగర్, మార్చి 17: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే పేదవాళ్లకు నిజమైన స్వాతంత్రం లభించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నరసింహులు అన్నారు.
నల్లగొండ, మార్చి17 (విజయక్రాంతి) : పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయాధికారులను ఆదేశించారు. అవసరమైతే అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.
తుంగతుర్తి మార్చి 17: రాజకీయ కక్షల నేపథ్యంలో మాజీ సర్పంచ్ మెంచ్ చక్రయ గౌడ్ పై ప్రత్యర్ధులు దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.