calender_icon.png 18 November, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_56165993.webp
మునిపంపుల- పల్లివాడ గ్రామాలకు జిపిఓను కేటాయించాలి

17-11-2025

నకిరేకల్ (విజయక్రాంతి): రామన్నపేట మండలంలోని మునిపంపుల, పల్లివాడ గ్రామాలకు గ్రామ పాలనాధికారి(జిపిఓ)ను కేటాయించి ప్రజల సమస్యను పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, ప్రభుత్వ యంత్రాంగన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ లాల్ బహదూర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలు నెలకొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పరిపాలన అందించేందుకు ఇటీవల ప్రభుత్వం నియమించిన గ్రామ పాలనాధికారులు(జిపివో) ను మండలంలో అన్ని గ్రామాలకు కేటాయించి ఈ రెండు గ్రామాలకు కేటాయించకపోవడం‌ ఏమిటని ప్రశ్నించారు.