ఏనుగు రఘుమారెడ్డి ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్
16-01-2026
చిట్యాల,(విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏనుగు రఘుమా రెడ్డి ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ కార్యక్రమం శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ కార్యక్రమానికి వెలిమినేడు, పిట్టంపల్లి, బొంగోనిచెర్వు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ప్రజా ప్రతినిధులు,యువజన కాంగ్రెస్ నాయకులు, వేముల అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పతంగులను ఎగరవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.