అంబేద్కర్ ఆశయ సాధనలో అందరం భాగస్వాములు కావాలి
మిర్యాలగూడ, ఏప్రిల్ 14: అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి( బిఎల్ఆర్) అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, డిసిసి అధ్యక్షులు పున్నా కైలాస్ నేత, అన్ని రాజకీయ పార్టీల కుల, ప్రజా, దళిత,అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి రాజీవ్ చౌక్ నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
15-04-2026