సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి
10-01-2026
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి 9: సీనియర్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)నుంచి మినహాయింపు ఇవ్వాలని,ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల ఐకాసా పిలుపుమేరకు శుక్రవారం మండల పరిధిలోని తిమ్మాపురం ప్రాథమిక,ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.