క్రీడల వల్ల స్నేహబంధాలు బలపడతాయి
12-01-2026
తుంగతుర్తి, జనవరి 11 : క్రీడల వల్ల యువతలో ఐకమత్యంతో పాటు స్నేహబంధాలు బలపడతాయని, క్రీడా స్ఫూర్తి పెరుగుతుందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దీప్లా నాయక్ ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసిక, శారీరిక ధారుడ్యానికి తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు నర్సయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కోరుకొప్పుల నరేష్ గౌడ్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ రామడుగు నవీన్ చారి, సర్పంచ్ గుగులోతు రాజశేఖర్, వార్డు మెంబర్లు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.