ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలి
25-06-2025
అనంతగిరి జూన్ 24: ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని వ్యవసాయ సామాజిక కార్యకర్త డాక్టర్ మొలుగూరి గోపయ్య కోరారు. మంగళవారం అనంతగిరి మండల కేంద్రం తో పాటు చనుపల్లి, త్రిపురవరం, పాలారం, కిష్టాపురం, ఖానాపురం, అమీనాబాద్ గ్రామాలలో స్వచ్చందంగా నిర్వహించిన ప్రకృతి వ్యవ సాయంపై రైతు చైతన్య యాత్రలో మాట్లా డారు.