calender_icon.png 5 January, 2026 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_25582617.webp
సర్పంచ్‌లు ఐక్యతతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

05-01-2026

చిట్యాల, జనవరి 4 (విజయ క్రాంతి): సర్పంచులందరూ ఐక్యతతో ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని నకరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం అన్నారు. ఆదివారం చిట్యాల మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఇటీవల ఎన్నికైన పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ఆయన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం ను శాలువాతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచులందరూ ఐక్యతతో ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే తనకు తెలియజేయాలని, నా వంతుగా పరిష్కరిస్తానని సర్పంచులకు హామీ ఇచ్చారు.

article_39613140.webp
రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు పెడతామంటే అడ్డుకుంటాం

05-01-2026

నల్గొండ టౌన్, జనవరి 4: బీసీ రిజర్వేషన్లు పెంచకుండా బీసీలను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టేది లేదని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ అన్నారు ఆదివారం స్థానిక బీసీ విద్యార్థి సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మున్సిపల్,ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే వేలాది మందితో రాష్ట్ర అసెంబ్లీని ముట్టడిస్తామని, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతనే మున్సిపల్,ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

article_10419777.webp
రాజపేట తండాలో ఉచిత దంత వైద్య శిబిరం

04-01-2026

మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండలం రాజపేట తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉచిత దంత వైద్య శిబిరం మాజీ సర్పంచ్ మారగోని వెంకటయ్య యాదవ్ సమక్షంలో ఆదివారం నిర్వహించారు. నల్లగొండ అద్విక్ దంత వైద్యశాల సౌజన్యంతో డాక్టర్ యామా అజయ్ కుమార్, వైష్ణవి ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరమును నిర్వహించారు. గ్రామంలోని రోగులను పిప్పి, గార, పాచి, ఎత్తు, వంకర పళ్ళు వ్యాధులను పరిశీలించారు. అనంతరం రోగులకు మందులను పంపిణీ కూడా చేశారు. అత్యవసర శస్త్ర చికిత్సల కోసం నల్లగొండ కి రోగులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని వైద్య నిపుణులు, నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితో సహా, చేరుపల్లి ఈశ్వర్, మల్లేష్, నరేష్, రాజు, జయప్రకాష్, భాస్కర్, బుచ్చప్ప, బాబు, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

article_68860547.webp
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలతో గద్దెనెక్కింది

04-01-2026

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డు చంద్రపురి కాలనీలో అధికార కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలతో గద్దెనెక్కిందని, వైఫల్యాల బాకీ కార్డులను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం పంపిణీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బాకీ ఉన్న మొత్తాన్ని క్లుప్తంగా వివరిస్తూ ఆయన వార్డులలో తిరిగారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరిస్తూ, బిఆర్ఎస్ హయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలతో అమలుకాని హామీలతో గద్దేనెక్కిందని, గద్దేనెక్కిన నాటినుండి అదే పంథా కొనసాగిస్తుంది తప్పా అభివృద్ధి మాత్రం శూన్యం అని కాంగ్రెస్ మోసాలను ఎండగట్టడానికే చిట్యాల మున్సిపాలిటీలో పర్యటించాం అని తెలిపారు. చిట్యాల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ హయాంలో కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దాదాపు 30 కోట్లతో పట్టణంలో అనేక సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠదామాలు, కుల సంఘ భవనాలు వంటి అనేక పనులను పూర్తి చేశామని,

article_13567148.webp
సిఐటియు సమన్వయ కమిటీల ఏకగ్రీవ ఎన్నిక

04-01-2026

మర్రిగూడ:(విజయక్రాంతి): మర్రిగూడ మండలం ఇందుర్తి , మేటిచందాపురం గ్రామపంచాయతీలో సిఐటియు గ్రామ సమన్వయ కమిటీనీ ఆదివారం ఎన్నుకోన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, నరేంద్రమోడీ ప్రభుత్వం కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల ఉద్యమాలకు సిఐటియు గ్రామ కమిటీలు ఉద్యమానికి సిద్ధమైనాయి. కార్మికులకు రైతులకు వ్యవసాయ కూలీలకు తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉన్నటువంటి పేరును మార్చి వికసి భారత్ రాంజీ అని కొత్త చట్టం అమలు చేయడం అట్లాగే రైతులకు విద్యుత్ సవరణ చట్టాలు రద్దయ్యే వరకు గ్రామాల నుండి కార్మికులు ఐక్య పోరాటానికి సిద్ధమవుతున్నారు గ్రామాలలో కార్మికుల నూతన కమిటీ ఎన్నుకొన్నారు. కన్వీనర్ గా అనంతలక్ష్మి ,కోకన్వీనర్ గా వారాల శోభను కమిటీ సభ్యులుగా అయితగోని సరిత లపైంగి దుర్గమ్మ ఏర్పుల దుర్గమ్మ, గిరి యాదమ్మ ,ఎండి షబానా, ఊరు పక్క నరసింహ ,ఊరు పక్క బిక్షమయ్య ,ఏరుకొండ రాఘవేంద్ర లతో కమిటీనీ ఎన్నుకొన్నారు.