calender_icon.png 13 January, 2026 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_46783142.webp
సంక్రాంతి తర్వాత రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయం

13-01-2026

మునుగోడు, జనవరి 12 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ అనంతరం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం ఖాయమని, కరోనా కష్టకాలాల్లో కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఘనత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది అని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని 90 మంది లబ్ధిదారులకు 2,45,2000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.

article_37791511.webp
ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల పరిశీలన

13-01-2026

చిట్యాల, జనవరి 12 (విజయ క్రాంతి): చిట్యాల మున్సిపాలిటీలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్లతో మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను ప్రారంభించామని, కానీ నేటి అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నేడు ఈ నిర్మాణ పనులను నిలిపివేసిందని అన్నారు.

article_36538147.webp
ఎన్‌హెచ్ 65పై డ్రోన్‌లు

12-01-2026

చిట్యాల, జనవరి 11 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా చిట్యాల మండల పరిధిలో జాతీయ రహదారి 65 మీదుగా హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను డ్రోన్‌లతో పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఆదివారం నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సూచనల మేరకు అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్‌ను పక్యవేక్షిస్తూ కింది స్థాయి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా రాకపోకలు జరుగుతున్నాయి. ఆదివారం ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలు జరిగాయని చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు.

article_82730079.webp
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పోలీసుల రాజ్యం నడుస్తోంది

12-01-2026

నేరేడుచర్ల, జనవరి 11: నేరేడుచర్ల గతంలో బిఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రస్తుతం అరాచకాలు కనిపిస్తున్నాయని, అడుగడుగునా హుజూర్నగర్ నియోజకవర్గంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. నేరేడుచర్లలో మున్సిపల్ పరిధిలో బిఆర్‌ఎస్ నాయకుల సమావేశం ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి హాజరైనారు. అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గ్రామపంచాయతీ ఓటమితో భయం పట్టుకుందని, బిఆర్‌ఎస్ శ్రేణులపై కేసులు పెడుతూ, బిఆర్‌ఎస్ పార్టీని ఇంకా బలంగా చేస్తున్నారు.

article_34363771.webp
క్రీడల వల్ల స్నేహబంధాలు బలపడతాయి

12-01-2026

తుంగతుర్తి, జనవరి 11 : క్రీడల వల్ల యువతలో ఐకమత్యంతో పాటు స్నేహబంధాలు బలపడతాయని, క్రీడా స్ఫూర్తి పెరుగుతుందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దీప్లా నాయక్ ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసిక, శారీరిక ధారుడ్యానికి తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు నర్సయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కోరుకొప్పుల నరేష్ గౌడ్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ రామడుగు నవీన్ చారి, సర్పంచ్ గుగులోతు రాజశేఖర్, వార్డు మెంబర్లు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.