గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ
27-11-2025
చిట్యాల (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించే నామినేషన్ కేంద్రాలను గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కొర్ర లక్ష్మి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆమె నల్గొండ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి జిల్లా కలెక్టర్ తో పాటు, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ లతో కలిసి చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామపంచాయతీ కార్యాలయంలో వెలిమినేడు క్లస్టర్ కు సంబంధించి ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు.