calender_icon.png 21 November, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_22570911.webp
నకిలీ బంగారంతో అమాయకులకు గాలం

20-11-2025

మిర్యాలగూడ (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖరరాజు పర్యవేక్షణలో సీసీఎస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ బంగారం తో మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితుడి అరెస్టు చేసిన మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ లు.ప్రధాన నిందితుడు అరెస్టు,ముగ్గురు నిందితులు పరారీ.మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను టార్గెట్ చేస్తున్న ప్రధాన నిందితుడు గోవిందప్ప తండ్రి నాగప్ప, వయస్సు 40, కోరచరహళ్లి, హురులికలు, కుడ్లిగి, బళ్ళారి జిల్లా, కర్ణాటక స్టేట్ గా పేర్కొన్నారు.

article_20259328.webp
టీజీఎస్ ఆర్టీసీ కొత్త సర్వీస్ ప్రారంభం

20-11-2025

నకిరేకల్ (విజయక్రాంతి): టీజీఎస్ ఆర్టీసీ సూర్యపేట డిపో నుండి కొత్త సర్వీస్ ను ప్రారంభించినట్లు సూర్యపేట డిపో మేనేజర్ జి. లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం నకిరేకల్ పట్టణంలో కొత్త సర్వీస్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్ ప్రెస్ సర్వీస్ తుంగతుర్తి నుండి అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం, మాధవరం కలాన్ మీదుగా నకిరేకల్ పట్టణానికి చేరుకొని అక్కడినుండి ఆరు గంటలకు హైదరాబాదు వెళ్తుందని, తిరిగి ఉదయం 5:50 కి హైదరాబాదు నుండి బస్సు బయలుదేరి నకిరేకల్ కు వచ్చి అర్వపల్లి మీదుగా తుంగతుర్తి, సూర్యాపేటకు వెళ్తుందని తెలిపారు.