సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే
15-09-2025
మునుగోడు, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చెయ్యకపోతే హైదరాబాద్ మరో పాకిస్తాన్ల మారేదని, సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే అని సిపిఐ జిల్లా కార్యదర్శి, మ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. 77 వ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పలివెల, కొరటికల్ గ్రామంలో సాయుధ పోరా ట యోధులు కొండవీటి గురునాథరెడ్డి, కొండవీటి బచ్చిరెడ్డి, కొండవీటి జగన్మోహన్ రెడ్డి విగ్రహాలకు మిరియాల లింగయ్య , నువ్వు ఓటి అంజయ్య అమరవీరుల కుటుం బ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సిపిఐ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.