చుక్క నీటిని వదులుకోం
24-01-2026
హుజూర్నగర్/మఠంపల్లి, జనవరి 23: కృష్ణ, గోదావరి జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోమని, కృష్ణ, గోదావరి జ లాల హక్కులు కాపాడుకునేందుకు ఏ పోరాటానికైనా సిద్ధమని నీటిపారుదల శాఖ మం త్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మం డలంలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వా మిని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ దంపతులతో కలిసి మంత్రి ఉత్తమ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ఆవరణ లో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ని సందర్శించారు.