ఉపాధి హామీ పథకాన్ని యధాతధంగా కొనసాగించాలి
14-01-2026
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీజేజీఈజీఎ)ను ఎలాంటి మార్పులు లేకుండా యధాతధంగా కొనసాగించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, వృత్తి దారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్యలు డిమాండ్ చేశారు. చిట్యాల మండల కేంద్రంలో బుధవారం బోగి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బోగి మంటల్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుక వచ్చిన వీబీజీ రామ్ జీ, నాలుగు లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ ల చట్టం బిల్లు ప్రతులను దగ్దం చేశారు.