calender_icon.png 12 January, 2026 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_36538147.webp
ఎన్‌హెచ్ 65పై డ్రోన్‌లు

12-01-2026

చిట్యాల, జనవరి 11 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా చిట్యాల మండల పరిధిలో జాతీయ రహదారి 65 మీదుగా హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను డ్రోన్‌లతో పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఆదివారం నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సూచనల మేరకు అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్‌ను పక్యవేక్షిస్తూ కింది స్థాయి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా రాకపోకలు జరుగుతున్నాయి. ఆదివారం ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలు జరిగాయని చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు.

article_82730079.webp
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పోలీసుల రాజ్యం నడుస్తోంది

12-01-2026

నేరేడుచర్ల, జనవరి 11: నేరేడుచర్ల గతంలో బిఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రస్తుతం అరాచకాలు కనిపిస్తున్నాయని, అడుగడుగునా హుజూర్నగర్ నియోజకవర్గంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. నేరేడుచర్లలో మున్సిపల్ పరిధిలో బిఆర్‌ఎస్ నాయకుల సమావేశం ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి హాజరైనారు. అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గ్రామపంచాయతీ ఓటమితో భయం పట్టుకుందని, బిఆర్‌ఎస్ శ్రేణులపై కేసులు పెడుతూ, బిఆర్‌ఎస్ పార్టీని ఇంకా బలంగా చేస్తున్నారు.

article_34363771.webp
క్రీడల వల్ల స్నేహబంధాలు బలపడతాయి

12-01-2026

తుంగతుర్తి, జనవరి 11 : క్రీడల వల్ల యువతలో ఐకమత్యంతో పాటు స్నేహబంధాలు బలపడతాయని, క్రీడా స్ఫూర్తి పెరుగుతుందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దీప్లా నాయక్ ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసిక, శారీరిక ధారుడ్యానికి తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు నర్సయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కోరుకొప్పుల నరేష్ గౌడ్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ రామడుగు నవీన్ చారి, సర్పంచ్ గుగులోతు రాజశేఖర్, వార్డు మెంబర్లు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.

article_45822562.webp
లిఖిత హోమ్స్ ఆర్కేడ్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు

12-01-2026

కోదాడ జనవరి 11: కోదాడ పట్టణంలోని కట్టకొమ్ము గూడెం రోడ్డు లిఖిత హోమ్స్ ఆర్కేడ్ ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, బాలికలు పెద్ద ఎత్తున పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. రం గురంగుల ముగ్గులతో పరిసర ప్రాంతం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సంప్రదాయ సంస్కృతి పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. మొదటి ప్రైస్ అమల, రెండవ ప్రైజ్ ఉష, మూడవ ప్రైస్ స్వాతి లకు బహుమతులను అందించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

article_69478824.webp
ఓపీయం విక్రయిస్తున్న నిందితుడి అరెస్టు

11-01-2026

చిట్యాల, జనవరి 10 (విజయక్రాంతి): అక్రమంగా ఓపీయం పాపి హస్క్ అనే మాదకద్రవ్యాన్ని లారీ డ్రైవర్లకు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ కే శివరాం రెడ్డి తెలిపారు. శనివారం చిట్యాల పట్టణ కేంద్రంలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులో జాతీయ రహదారి 65పై ఉన్న డూన్ పంజాబీ దాబాలో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన దాబా యజమాని గుర్నిత్ సింగ్ కొంతకాలంగా నిషేధిత మాదక ద్రవ్యమైన ఓపీయం పాపి హస్క్‌ని దాబాలోని కస్టమర్లకు విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి దాబాపై దాడిచేసి గుర్నిత్ సింగ్‌ను విచారించారు.