ఘనంగా ముగిసిన మర్రిగూడ క్రికెట్ టోర్నమెంట్
19-01-2026
మర్రిగూడ,(విజయక్రాంతి): యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేస్తే విజయం తప్పకుండా దరిచేరుతుందని మర్రిగూడ గ్రామ సర్పంచ్ వీరమళ్ళ శిరీష-లోకేష్ గౌడ్ అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గత నాలుగు రోజుల నుంచి MPL క్రికెట్ టోర్నమెంట్ సీజన్ లో గ్రామంలోని 10 టీంలు పోటీపడగ ఈరోజు సాయంత్రం ఫైనల్ మ్యాచ్ ముగియడంతో సర్పంచ్ వీరమళ్ళ శిరీష-లోకేష్ గౌడ్ గారు మొదటి బహుమతి స్పాన్సర్ గా గెలిచిన టీం ఎడ్ల విజయటీమ్ కి 15116/- నగదు తో పాటు ట్రోఫీలను అందజేశారు ద్వితీయ బహుమతి స్పాన్సర్ ఉపసర్పంచ్ మహేశ్వరం రమేష్ గారు 10116/-నగదుతో పాటు ట్రోఫీ బహుమతి గౌస్ టీంకి అందించడం జరిగింది .ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ,నాయకులు ,వార్డ్ మెంబర్స్, ఆర్గనైజర్ లు , యువకులు పాల్గొన్నారు.