calender_icon.png 8 January, 2026 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_64651507.webp
రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి

08-01-2026

చిట్యాల, జనవరి 7(విజయ క్రాంతి): రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జి.సబిత అన్నారు. రోడ్డు రవాణా భద్రత మాసోత్సవ సందర్భంగా బుధవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా అదేశాలనుసారం, మండల న్యాయ సేవా అధికార సంస్థ రామన్నపేట అధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి జి.సబిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష, సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.సత్తయ్య హాజరయ్యారు.

article_79036794.webp
టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్‌గా చేపూరి మధుసూదన్

08-01-2026

చిట్యాల, జనవరి 7(విజయ క్రాంతి): తెలంగాణ పిసిసి లీగల్ సెల్ పౌర హక్కులు మరియు ఆర్టిఐ రాష్ట్ర కో కన్వీనర్ గా చిట్యాల కు చెందిన ప్రముఖ న్యాయవాది శేపూరి మధుసూదన్ ను నియమిస్తూ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ బుధవారం జారీ చేసిన నియామక పత్రాన్ని నల్గొండ జిల్లా కోర్టు ప్రభుత్వ ప్లీడర్ నాంపల్లి నరసింహ నియామక పత్రాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా చేపూరి మధుసూదన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకుగాను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన నియామకానికి సహకరించిన పొన్నం అశోక్ గౌడ్ కు, ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

article_84495879.webp
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

08-01-2026

చిట్యాల, జనవరి 7 (విజయక్రాంతి): అతివేగంతో అజాగ్రత్తగా బైకు నడిపి రోడ్డు ప్రమాదానికి గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన చిట్యాల మండలం , గుండ్రంపల్లి గ్రామంలో జాతీయ రహదారి 65 పై మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెహబూబాబాద్ జిల్లా, దంతాలపల్లి మండలం, రేపోణి గ్రామానికి చెందిన పగిండ్ల ఉప్పలయ్య (50) టీజి07 ఏసిటీ/ఆర్ 1566 నెంబర్ గల తన సొంత ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ కు వెళుతూ చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామ శివారులో అతివేగంగా అజాగ్రత్తగా బైకు నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ప్రమాద సూచిక బోర్డుకు ఢీకొని అనంతరం చెట్టుకు ఢీకొట్టడంతో మృతిని తలకు బలమైన గాయాలయ్యాయి.