calender_icon.png 13 November, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_30112629.webp
ప్రకృతి ప్రసాదించిన వరం ఆయిల్ పామ్

12-11-2025

చిట్యాల (విజయక్రాంతి): ప్రకృతి ప్రసాదించిన వరం ఆయిల్ ఫాం అని, ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు మరింత ఆదాయం చేకూరుతుందని నల్లగొండ జిల్లా పతంజలి సీనియర్ మేనేజర్ నర్రా రవీందర్ రెడ్డి బుధవారం తెలిపారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో అల్పం పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను, ఉద్యాన శాఖ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ వారితో భాగస్వామి అవ్వాలని ఆదేశించిందని, వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆదేశాలతో జిల్లా ఉద్యాన శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల భాగస్వామ్యంతో నల్లగొండ జిల్లాలో లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు దిశగా ప్రణాళికలు రచించబోతున్నామని ఆయన తెలిపారు.

article_39851365.webp
దేవాలయ భూములకు త్వరలో హద్దురాళ్ల ఏర్పాటు

12-11-2025

చిట్యాల (విజయక్రాంతి): దేవాలయ భూములకు సంబంధించి త్వరలో నివేదిక సమర్పించి, హద్దురాలను ఏర్పాటు చేస్తామని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే పవన్ కుమార్ తెలిపారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 201లో 102 ఎకరాలలో శ్రీ తిరుమలనాద స్వామి దేవాలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఈ భూములను పరిరక్షించాలని గత సంవత్సర కాలంగా గ్రామానికి చెందిన ప్రముఖులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయగా బుధవారం దేవాలయ భూములకు సంబంధించి నాలుగు వైపులా ఉన్నటువంటి బౌండరీలను నల్గొండ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

article_18966965.webp
కలల సందుక కవిత్వ సంపుటి ఆవిష్కరణ

12-11-2025

చిట్యాల (విజయక్రాంతి): హైదరాబాదులోని రవీంద్రభారతిలో చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన దివంగత కవి డాక్టర్ మండల స్వామి రచించిన కలల సందుక కవిత్వ సంపుటిని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బలమైన అభివ్యక్తి, చక్కని శిల్పంతో డాక్టర్ మండల స్వామి సమ సమాజాన్ని కాంక్షించే కవిత్వం రాశారని అన్నారు. డాక్టర్ మండల స్వామి కవిగా, రచయితగా, కథకుడిగా, పరిశోధకుడిగా బహుముఖీనమైన కృషి చేసిన మండల స్వామి మరికొంత కాలం బతికి ఉంటే తెలుగు సాహిత్యం సుసంపన్నం అయ్యేది అని అన్నారు.