calender_icon.png 1 May, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_88740879.webp
నాగారం మండలం ప్రభుత్వ పాఠశాలలో మెరిసిన ఆణిముత్యాలు

01-05-2025

నాగారం ఏప్రిల్ 30: ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన నాణ్యమైన విద్యా విధానాన్ని అమలవుతుందని మండల విద్యావనరుల అధికారి వాసం ప్రభాకర్ అని అన్నారు. ఆయన మాట్లాడుతూ మార్చి 2025 పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నాగారం మండలం మహాత్మా రావ్ జ్యోతిబాపూలే పాఠశాల నుండి 568 బి నందకుమార్ , 551 ఎస్ హర్షవర్ధన్ 549 బి నిశ్వంత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుండి ఫణిగిరిలో పి పూజ 545 పసునూరి ఆదర్శ పాఠశాల జె శివ గణేష్ 545 జడ్పీహెచ్‌ఎస్ ఈటూరు మేడబోయిన ప్రశాంత్ 541 .ప్రైవేట్ పాఠశాల మేరీ మదర్ నుండి 559 మార్కులతో సాయిశ్రీ 554 లక్ష్మీ ప్రసన్న 553 బండ గొర్ల శ్రావణి మూడవ ర్యాంకులో ఉన్నారు.

article_80665562.webp
అక్రమాలకు చోటు లేకుండా భూ సమస్యలు పరిష్కారం

30-04-2025

మోతే, చివ్వేంల, ఏప్రిల్ 30:- అక్రమాలకు చోటు లేకుండా భూ భారతి చట్టం తో భూ సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం మోతే, చివ్వేంల మండల కేంద్రంలో స్వస్తిక్ పంక్షన్ హల్‌లో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం రైతులకు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టంను ప్రజలకు అంకితం చేయడం జరిగిందని తెలిపారు. ప్రముఖ మేధావుల పరిశీలనలో ఈ చట్టం రూపొందించారన్నారు. సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేయా లని తెలిపారు. మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ చట్టంతో అధికార వికేంద్రీకరణ చేయడం జరిగిందని తెలిపారు.

article_75925251.webp
భూభారతి చట్టం సామాన్యులకు ఆయుధం

30-04-2025

మోతే, ఏప్రిల్28:- భూభారతి చట్టం సామాన్య రైతులకు ఆయుధం లాంటిదని తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో స్వస్తిక్ పంక్షన్ హల్ లో ఇన్చార్జి తహసీల్దార్ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన భూభారతి చట్టం రైతులకు అవగాహన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాజాత ప్రదర్శనతో చట్టం పై అవగాహనతో పాటు లోపాలను సవరించుకోవడం వంటి అంశాలను అధ్యయనం చేసుకోవాలని కోరారు. ప్రతి రైతు ఏసమస్యలు అన్న స్థానిక తహసీల్దార్ కు మరియు డివిజనల్ అధికారికి పిర్యాదు చేసుకోవాలని తెలిపారు.

article_40688688.webp
ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి

30-04-2025

పెన్ పహాడ్, ఏప్రిల్ 29 : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కమిటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, సంపన్న కుటుంబాలను అర్హులుగా గుర్తించి ఎంపీడీఓకు జాబితా పంపుతున్నట్లు ఆజాబితానే తుది జాబితాగా గుర్తిస్తున్నట్లు వెంటనే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాను పునః పరిశీలన చేసి అక్రమ వసూలు.. అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ జిల్లా పరిషత్ సీఈఓ వీవీ అప్పారావుకు మంగళవారం పీఏసీఎస్ వైస్ చైర్మన్ వావిళ్ల రమేష్ గౌడ్ మండల యువతతో కలసి వినతి పత్రం అందజేశారు.

article_90235490.webp
ఘనంగా ఆదిరెడ్డి 28వ వర్ధంతి

30-04-2025

మునగాల, ఏప్రిల్ 29: సూర్యాపేట జిల్లా మునగాల సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నరసింహులగూడెం మాజీ సర్పంచ్ కామ్రేడ్ ముదిరెడ్డి ఆది రెడ్డి 28వ వర్ధంతి సందర్చిబంగా త్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించినారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ..ఆదిరెడ్డి కేవలం పదవుల కోసం ఉద్యమం చేయలేదు. ఆయనకు ప్రజల హక్కులు ముఖ్యం. ప్రతీ పేదవాడి గుడిసెలో వెలుగును నింపడం ఆయన లక్ష్యం. నర్సింహులగూడెం, జగన్నాథపురం, రేపాల, కలువ వంటి గ్రామాల్లో ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహించి, ప్రజల్లో చైతన్యాన్ని నింపారు.