సీపీఐ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి
01-05-2025
చిలుకూరు, ఏప్రిల్ 30: చిలుకూరు మండల కేంద్రంలోని బుధవారం. దొడ్డ నరసయ్య భవన్లో వడ్డేపల్లి కోటేష్,అధ్యక్షతన సిపిఐ చిలుకూరు మండల కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, పాల్గొని వారు మాట్లాడుతూ, ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా గ్రామ గ్రామాన వీధి వీధినా ఎర్రజెండా ఎగురవేసి మే డే ను ఘనంగా నిర్వహించాలని కార్మికులకు కర్షకులకు పిలుపునిచ్చారు.