calender_icon.png 15 September, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_71073509.webp
సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే

15-09-2025

మునుగోడు, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చెయ్యకపోతే హైదరాబాద్ మరో పాకిస్తాన్ల మారేదని, సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే అని సిపిఐ జిల్లా కార్యదర్శి, మ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. 77 వ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పలివెల, కొరటికల్ గ్రామంలో సాయుధ పోరా ట యోధులు కొండవీటి గురునాథరెడ్డి, కొండవీటి బచ్చిరెడ్డి, కొండవీటి జగన్మోహన్ రెడ్డి విగ్రహాలకు మిరియాల లింగయ్య , నువ్వు ఓటి అంజయ్య అమరవీరుల కుటుం బ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సిపిఐ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

article_88509326.webp
ఐసీఏఆర్ పీజీ ఎంట్రన్స్ ఫలితాలలో సత్తా చాటిన పావని

15-09-2025

గరిడేపల్లి, సెప్టెంబర్ 14 : మండలంలోని వెలిదండ గ్రామానికి చెందిన వెలుగూరి పావని జాతీయస్థాయిలో ప్రతిభను చాటింది. ఆదివారం ప్రకటించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పీజీ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాల్లో ఆమె ఆల్ ఇండియా ర్యాంక్ 88, బీసీ కేటగిరీలో 52వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను చాటుకుంది. ప్రస్తుతం పావని అరుణాచల్ ప్రదేశ్లో అగ్రికల్చర్ చదువుతోంది. పీజీ ప్రవేశ పరీక్షలో జాతీయ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు వెంకట నర్సింహారావు, కవితతో. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.