సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నం
18-11-2025
నల్లగొండ, నవంబర్ 17 (విజయక్రాంతి) : మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నీటిపారుదల, పౌ రసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం అయన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి, నల్లగొండ ఎంపీ కుం దూరు రఘువీర్రెడ్డితో కలిసి మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.171.5 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.