calender_icon.png 19 November, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_40712691.webp
అమావాస్యకి చెర్వుగట్టు దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు

18-11-2025

నకిరేకల్ (విజయక్రాంతి): ​రాబోయే అమావాస్య సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దేవస్థానం ఈఓ మోహన్ బాబు తెలిపారు.​ ఈ సందర్భంగా ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ​భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రత్యేకించి శానిటేషన్ (పరిశుభ్రత), డ్రింకింగ్‌ వాటర్ (తాగునీరు), క్యూలైన్‌ నిర్వహణ వంటి అత్యవసర సేవలను మరింతగా మెరుగుపరుస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

article_59831780.webp
స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలి

18-11-2025

నకిరేకల్ (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేసి విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్‌ఎస్‌వి రాష్ట్ర నాయకుడు నోముల శంకర్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలుకాలేదని తీవ్రంగా విమర్శించారు. రెండు అకాడమిక్ సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

article_86231145.webp
జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలకు గ్రీన్ గ్రోవ్ విద్యార్థుల ఎంపిక

18-11-2025

చిట్యాల (విజయక్రాంతి): హైదరాబాద్ లోని అయ్యప్ప సొసైటీ మాదాపూర్ సి.జి.ర్ ఇంటర్నేషనల్ స్కూల్ లో నవంబర్ 16 ఆదివారం రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలు నిర్వహించారు. పోటీలలో చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాలకు చెందిన రాధారపు భవ్య శ్రీ, స్టాండ్ బై లో పోకల ప్రీతి జెస్సి, రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ పోటీలలో ఎంపికైన విద్యార్థులు డిసెంబర్ 5 నుంచి 7 వరకు మహారాష్ట్ర లోని బాద్లాపూర్ లో జరిగే 35 వ జూనియర్ జాతీయస్థాయి త్రోబాల్ పోటీలలో పాల్గొననున్నారు.

article_65665191.webp
రూ.6 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

18-11-2025

నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ మున్సిపాలిటీలో రూ.6 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మంగళవారం పట్టణంలోని 6, 15, 16 వార్డుల పరిధిలో రూ. 1. 12 కోట్లతో నిర్మించే సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో దశలవారీగా డ్రైనేజీ వ్యవస్థ సమస్యను పరిష్కారం చేస్తానన్నారు. గత పాలకులు నకిరేకల్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. వారి పాలనలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధ్వంసమైన రాష్ట్రాన్ని రెండేళ్ల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు.

article_52200312.webp
మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

18-11-2025

నకిరేకల్ (విజయక్రాంతి): రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిలిచిపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి లారీల కొరతను నివారించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా లారీలు రాక 1400 బస్తాల దాన్యం నిలిచిపోవడంతో రైతు సంఘం -సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన చేసి ఆయన రైతులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకుని అనంతరం ఆయన మాట్లాడుతూ గత నెల 15 రోజులుగా రైతులు మార్కెట్లో ధాన్యం పోసి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.