రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యం
22-11-2025
దేవరకొండ, నవంబర్ 21, (విజయక్రాంతి): కొండ మల్లెపల్లి మండలం గాజీనగర్ తండాలో 3 కోట్లు 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యవసాయ రంగం సుస్థిరంగా అభివృద్ధి చెందేందుకు స్థిరమైన విద్యుత్ సరఫరా అత్యంత కీలకం అని, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.