calender_icon.png 25 June, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_20459657.webp
వెలుగుపల్లిలో రైతు భరోసా సంబరాలు

24-06-2025

నల్గొండ మండలం వెలుగు పల్లి గ్రామంలో రైతు భరోసా సంబురాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భంగా మంగళవారం హైదరాబాదులోని సెక్రటేరియట్ వద్ద నిర్వహించిన రైతు విజయోత్సవ సంబరాలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ప్రయోజనార్ధం ప్రత్యేక ప్రసారం చేయగా నల్లగొండ మండలం వెలుగుపల్లి రైతు వేదికలో జిల్లా రెవిన్యూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్(District Revenue Joint Collector Srinivas)తో పాటు పలువురు జిల్లా అధికారులు, రైతులు హాజరయ్యారు.

article_84452330.webp
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి..

24-06-2025

మండలంలో ప్రైవేటు విద్యాసంస్థలు ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి(DYFI District Assistant Secretary Katta Lingaswamy) అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా చేసుకొని అమాయకమైనటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. పాఠశాలల్లో చేరేంతవరకు వాళ్లకు కల్లబొల్లి మాటలు చెప్పి, పాఠశాలలో చేరిన తర్వాత ఫీజుల పేరుతోటి, బుక్స్, యూనిఫార్మ్స్ పేరుతోటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రక్తాన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తాగుతున్నాయని మండిపడ్డారు.

article_12109537.webp
నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమాణాలు విధిస్తాం...

24-06-2025

నిబంధనలను ఉల్లంఘించి ప్లాస్టిక్ కవర్లు ఇతర ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తే జరిమానాలు విధిస్తామని మునుగోడు ఇన్చార్జ్ ఎంపీడీవో భాస్కర్(incharge MPDO Bhaskar) అన్నారు. మండలంలోని మునుగోడు మేజర్ గ్రామపంచాయతీ కిరాణా షాపులు, కూరగాయ దుకాణాల ఆకస్మిక తనిఖీ చేశారు. సింగల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం ఉన్నందున దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లు లేదా ఇతరత్రా ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు విక్రయిస్తున్నారని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మిన దుకాణ యజమానులకు 13 వేల రూపాయల జరిమానా విధించారు. షాపుల నందు ఉన్న ప్లాస్టిక్ను, ప్లాస్టిక్ కవర్లను గ్రామపంచాయతీ జప్తు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్లాస్టిక్ ని అమ్మినట్లయితే, వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.