విషపు ఆహారం తిని 150కి పైగా గొర్రెలు మృతి
07-11-2025
వేములపల్లి నవంబర్ 6 (విజయ క్రాంతి): విషపు అహారం తిని 150కు పైగా గొర్రెలు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా వేములపల్లిమండల కేంద్రం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా, పెన్పహాడ్ మండలం, అన్నారం, అనంతరం, ముకుందాపురం,దోసపాడు గ్రామాలకు చెందిన ఉప్పునూతల సైదులు, శ్రీరాముల కోటయ్య, శ్రీరాముల గోపాలు ,ఆవుల కోటయ్య, ఆవుల వెంకన్న లు తమ గొర్రెలను గత కొన్ని రోజులుగా మండల కేంద్రం సమీపంలో మేపుతున్నారు.