calender_icon.png 21 January, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_58279399.webp
లిక్కర్ మీద ఉన్న ఇంట్రస్ట్ కవితకు పసుపు రైతుల మీద లేదు

20-01-2025

ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ మీద ఉన్న శ్రద్ధ పసుపు రైతుల మీద లేదని, నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... పసుపు రైతుల కోసం అలుపెరుగని పోరాటం చేశానన్న కవిత మాట్లాడిన మాటలు వింటుంటే ప్రజలు, పాత్రికేయలే కాకుండా బిఆర్ఎస్ నాయకుల సైతం నవ్వుకుంటున్నారన్నారు. ఆమె తీహార్ జైలుకు సైతం పసుపు బోర్డు సాధన కొరకే వెళ్లినట్టు చెప్పుకుందన్నారు. కవిత త్రిముఖ వ్యూహం గురించి మాట్లాడుతుందని, వాళ్ల కుటుంబ త్రిముఖ వ్యూహం ఏందో ప్రజలందరికీ తెలుసన్నారు.

article_39006649.webp
గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

20-01-2025

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

article_55389184.webp
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు..

15-01-2025

తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తున్ని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ రఘుపతి తెలిపారు. దొంగతనాలు చేసి జైలుకి వెళ్లినా.. తన ప్రవర్తన మార్చుకోకుండా మళ్ళీ హైదరాబాద్, నవీపేట్, బోధన్, నిజామాబాద్ లలో మోటార్ సైకిల్స్ దొంగతనాలు చేస్తున్న జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కు చెందిన షేక్ ఆదిల్ అనే వ్యక్తిని బుధవారం నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అదుపులోకి తీసుకొని విచారించగా అతను చేసిన దొంగతనాలు ఒప్పుకొని, దొంగతనం చేసిన మోటార్ సైకిల్స్ ని చూపించగా, (9) బైక్ లను రికవరీ చేసి నేరస్తున్ని కోర్టులో హాజరు పరిచినట్లు వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ రఘుపతి తెలిపారు.