calender_icon.png 12 January, 2026 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_90091586.webp
కలెక్టరేట్‌లో ఘనంగా వడ్డె ఓబన్న జయంతి

12-01-2026

నిజామాబాద్, జనవరి 11 (నిజామాబాద్): స్వాతంత్య్ర పోరాటంలో వడ్డె ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని వక్తలు కీర్తించారు. ఆ మహనీయుని జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. వడ్డె ఓబన్న జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్డె ఓబన్న చిత్రపటానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఆయా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

article_12138863.webp
నిజామాబాద్ నగర సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి

12-01-2026

నిజామాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం, ప్రజల సౌకర్యార్ధం అభివృద్ధి పనులను నిరంతర ప్రక్రియగా చేపడుతోందని శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని వివిధ డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారా యణ, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులతో కలిసి అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. నూతనంగా జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ కు వారు అభినందనలు తెలియజేసి, జిల్లా ప్రగతిపై కొద్దిసేపు చర్చించారు.

article_88769592.webp
ఐకమత్యంతో మున్నూరుకాపుల సత్తా చాటుదాం

12-01-2026

నిజామాబాద్ జనవరి 11 (విజయక్రాంతి): ఐకమత్యంతో ఉండి మున్నూరు కాపులా సత్తా చాటుదామని మాజీ మేయర్, మాజీ పిసిసి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీనివాస్ తనయుడు మున్నూరు కాపు జిల్లా సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అన్నారు. స్వర్గీయ డిఎస్ ఆశయాలకు అనుగుణంగా సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని సంజయ్ స్పష్టం చేశారు. ఆదివారం మున్నూరు కాపు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం సంజయ్ అధ్యక్షతన నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శివాజీ నగర్ నుంచి ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.