అర్బన్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ అభివృద్ధి చేయడమే లక్ష్యం
21-01-2026
నిజామాబాద్ జనవరి 20 (విజయక్రాంతి): నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 16, 17, 37, 38, 39, 21, 44, 46 వ డివిజన్లో పరిధిలో నీ పలు ప్రాంతల్లో టి యు ఎఫ్ ఐ డి నిధుల కింద డివిజన్ కు కోటి రూపాయలు చొప్పున అభివృద్ధి పనులకు అర్బన్ ఎమ్మెల్యే భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.