పీసీసీ చీఫ్కు మున్నూరుకాపు కులస్తుల వినతి
నిజామాబాద్, ఫిబ్రవరి ౨౩ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలని మున్నూరు కాపు కులానికి చెందిన ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున సోమవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ కు తరలి వెళ్లారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులో లేకపోవడంతో గాంధీభవన్ ఇంచార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావుకు వినతి పత్రం అందజేశారు.
24-02-2026