బాలికలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి
23-01-2026
నిజామాబాద్, జనవరి 22 : కస్తుర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్లో చదువుకుంటున్న ప్రతి బాలికను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతూ, వారి బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేయాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి నిర్వాహకులకు హితవు పలికారు. విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్ళను సాధికారతతో దీటుగా ఎదుర్కోవడం, బాలికల్లో మానసిక స్థైర్యం పెంపొందించడం, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండడం తదితర అంశాలపై కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, మోడల్ స్కూల్స్ కేర్ టేకర్లు, వార్డెన్లకు విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కపిల హోటల్ లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు.