calender_icon.png 8 January, 2026 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_51797569.webp
ఎస్.ఐ.ఆర్ అమలులో స్పష్టమైన పురోగతి సాధించాలి

07-01-2026

నిజామాబాద్, జనవరి 6 (విజయ క్రాంతి): ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్.ఐ.ఆర్ అమలు తీరు, ముసాయిదా ఓటరు జాబితాపై కలెక్టర్ మంగళవారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో ఏ.ఈ.ఆర్.ఓలు, బీ.ఎల్.ఓ సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు.

article_50258033.webp
ఆర్టీసీ బస్ డిపో సాధన కమిటీ ఆధ్వర్యంలో నందిపేట్ మండల బంద్‌తో నిరసన

07-01-2026

నందిపేట్, జనవరి 6 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు కు ఐక్యచరణ కమిటీ సభ్యుల పిలుపు మేరకు మంగళవారం నందిపేట్ ప్రజలు తమ నిరసనను తెలుపుతూ మండలం బంద్ పాటించారు. ఈ బంద్ కార్యక్రమం లో స్వచ్ఛందంగా స్థానిక దుకాణదారులు తమ వ్యాపారాలను మూసివేసి నిరసన తెలుపుతూ బంద్ నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి మండలంలో ని దుకాణా దారులు, స్కూల్స్, కాలేజీలు కూడా బంద్ పాటించి తమ నిరసనను తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నందిపేట్ మండల ప్రజల కోరిక మేరకు ప్రజల రవాణా సౌకర్యార్థం బస్ డిపో ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

article_52340708.webp
జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలి

07-01-2026

నిజామాబాద్, జనవరి 26 (విజయ క్రాంతి): నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి పై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం సమగ్ర సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సమావేశంలో అన్ని డివిజన్ల ఏసీపీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సి.ఎం. ఆర్ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని సాక్ష్యాల సేకరణలో నిర్లక్ష్యం లేకుండా చూడాలని కోర్టుల్లో కేసుల ప్రాసిక్యూషన్ బలోపేతం చేయాలని ఆదేశించారు.