calender_icon.png 18 December, 2025 | 1:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_37469248.webp
ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్

17-12-2025

అర్మూర్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా అర్మూర్ డివిజన్ లోని గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా ముగిసింది. మూడు విడతలలోనూ ఎన్నికలు సజావుగా కొనసాగాయని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మూడవ విడత పోలింగ్ బుధవారం ఉదయం 7.00 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఉదయం తొమ్మిది గంటల వరకు సగటున 23.35 శాతం పోలింగ్ నమోదయ్యింది. 11 గంటలకు 54.69 శాతం ఓటింగ్ పూర్తయ్యిందని అధికారులు ప్రకటించారు.