calender_icon.png 4 November, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_50139485.webp
నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్

01-11-2025

నిజామాబాద్ (విజయక్రాంతి): ప్రజల విసృత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ నవంబర్ 15న కోర్టు ప్రాంగణాలలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని తన చాంబర్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావులతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. రాజీపడదగిన 1328 క్రిమినల్ కేసులను గుర్తించామని, వాటిని లోక్ అదాలత్ బెంచ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విబేధాలు వచ్చినప్పుడు సర్దుకుని రాజీమార్గంలో వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నారు.

article_36718657.webp
ఐడీఓసీలో కలెక్టర్, సీపీలతో భేటీ అయిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

01-11-2025

నిజామాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులతో భేట్టీ అయ్యారు. పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, వివిధ శాఖల ద్వారా షెడ్యూల్డు కులాలు, తెగల వారి కోసం వెచ్చిస్తున్న నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై బాధితుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు.

article_42724106.webp
భవిత కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

01-11-2025

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని కోటగల్లి శంకర్ భవన్ పాఠశాలలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రంలో చేపట్టిన నిర్మాణ పనులను పరిశీలించారు. అన్ని చోట్ల నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిత కేంద్రాల నిర్మాణాలు, మరమ్మతుల కోసం అవసరమైన పక్షంలో జిల్లా యంత్రాంగం ద్వారా కొంత మేరకు అదనపు నిధులను కూడా సమకూరుస్తామని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అన్నారు.