calender_icon.png 25 January, 2026 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_63329386.webp
బాలికలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి

23-01-2026

నిజామాబాద్, జనవరి 22 : కస్తుర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్‌లో చదువుకుంటున్న ప్రతి బాలికను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతూ, వారి బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేయాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి నిర్వాహకులకు హితవు పలికారు. విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్ళను సాధికారతతో దీటుగా ఎదుర్కోవడం, బాలికల్లో మానసిక స్థైర్యం పెంపొందించడం, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండడం తదితర అంశాలపై కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, మోడల్ స్కూల్స్ కేర్ టేకర్లు, వార్డెన్లకు విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కపిల హోటల్ లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు.

article_80395164.webp
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

21-01-2026

నిజామాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, పనుల ప్రగతిపై సమావేశంలో చర్చించారు.

article_52774503.webp
ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలి

20-01-2026

నిజామాబాద్, జనవరి 19(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహోన్నత సంకల్పంతో మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. బోధన్ పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు సోమవారం బోధన్ లోని రోటరీ భవన్ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి రూ. కోటీ 99 లక్షల విలువ చేసే వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు.