నలుగురి మృతికి కారణమైన ఒకరికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష
07-01-2026
నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్, జనవరి 6 (విజయ క్రాంతి): మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కొండల్ వాడి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు నీరడి గణేష్, నీరడి ఆదిత్య, మరొక యువకుడు హంకర్ వారి ప్రకాష్,నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన మరొక యువకుడు బలే సాయిరాం లు మోటారు వాహన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడానికి కారకుడైన లారీ డ్రైవర్ వకీల్ జైభగవాన్ కు రెండు సంవత్సరాల కఠిన కారాగార, రెండు వేల రూపాయలు జరిమానా విదిస్తూ నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి జి. వి. ఎన్ భారత లక్ష్మీ మంగళవారం తీర్పు చెప్పారు.