చండీయాగంలో బాన్సువాడ ఉద్యమకారులు
16-06-2025
బాన్సువాడ, జూన్ 15,(విజయక్రాంతి): ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఛైర్మన్ చీమ శ్రీనివాసరావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్లో మహా చండీయాగం నిర్వహించారు. ఇందులో బాన్సువాడ నుంచి టీయూఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో ఉద్యమకారులు పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మండల ప్రధాన కార్యదర్శి చందు, భాస్కర్, బాబాగౌడ్, కృష్ణ, శ్యామ్, భీమనాయక్, సాయికుమార్, గంగారాం, యోగేష్, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.