ఫీల్డ్ వెరిఫికేషన్ వివరాలు తనిఖీ చేసిన కలెక్టర్
20-01-2025
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, రూపొందించిన వివరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. చందూర్, అక్బర్ నగర్, రుద్రూర్ గ్రామాలను కలెక్టర్ సోమవారం సందర్శించారు. స్థానిక అధికారులతో భేటీ అయ్యి, ఆహార భద్రత (రేషన్) కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా సేకరించిన వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు.