calender_icon.png 1 May, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_10107687.webp
బాలుడిపై వీధి కుక్క దాడి

30-04-2025

హుజురాబాద్,విజయక్రాంతి: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం(Ellanthakunta Mandal) కనగర్తి గ్రామంలో బుధవారం ఉదయం బాలుడు పై వీధి కుక్క దాడి చేయగా తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామంచ. అయాన్ అనే రెండు సంవత్సరాల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా వీదికుక్క ఒక్క సారిగా దాడి చేసింది. దీంతో బాలుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రధమ చికిత్స అనంతరం వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు. గ్రామ ఫరిధిలో ఇటీవల కూడా ఇద్దరు పిల్లలపై వీధి కుక్కలు దాడి చేయడం జరిగిందని, అధికారులు చొరవ తీసుకొని వీధి కుక్కల సమస్యకి పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

article_83803441.webp
కాంగ్రెస్‌లో భగ్గుమంటున్న విబేధాలు

30-04-2025

కరీంనగర్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ లో గ్రూపు విభేదాలు బహిర్గత మవుతుండడంతో హైకమాండ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాపై సీరియస్ గా దృష్టిసారించింది. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో సోమవారం జరిగిన పార్టీ సమావేశం తోపులాటకు దారితీసిన సంఘటన మరువకముందే మంగళవారం సిరిసిల్లలో రసాభాసా చోటు చేసుకుంది. సిరిసిల్లలో ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ర్ట ఇంచార్జి విశ్వనాథన్ ఎదుటే గొడవకు దిగారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అల్లుడైన ఉమేష్ రావు సమావేశంలో మాట్లాడుతూ ఓడిపోతున్న వారికే టికెట్ ఇస్తున్నారన అనడంతో ఉమేష్ రావు సమావేశం నుండి వెళ్లిపోవాలంటూ ఆందోళనకు దిగిన కేకే మహేందర్రెడ్డి అనుచర వర్గం గందరగోళంగా మారింది.

article_46106128.webp
పకడ్బందీగా భూభారతి చట్టం అమలు

30-04-2025

కరీంనగర్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): భూ భారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేస్తామని, రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదని, గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని రాష్ర్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం సైదాపూర్ మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘం కళ్యాణమండపంలో, చిగురుమామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులకు మంత్రి హాజరయ్యారు. మొదట పెర్కపల్లి-వెంకేపల్లి, పెర్కపల్లి-దుద్దనపల్లి రోడ్డుపై ఏడు కోట్ల రూపాయలతో హై లెవెల్ వంతెనల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. సైదాపూర్ మండల కేంద్రంలో విశాల సహకార పరపతి సంఘం నూతన భవనాన్ని, కళ్యాణమంటపాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.