పది ఫలితాలలో భగవతి, ఆర్విన్ ట్రీ విద్యార్థుల ప్రతిభ
01-05-2025
కరీంనగర్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నగరంలోని భగవతి , ఆర్విన్ ట్రీ పాఠశాలల విద్యార్థులు రాష్ర్ట స్థాయి మార్కులతో ప్రతిభ చాటారు. హె. మనస్విత శ్రీ 578 , వి. సుశ్రుత్ 577 , కె. వైష్ణవి 575 , ఎం. సాయి అక్షయ రెడ్డి 574 , జి. రవి చంద్ర 573 , ఎ. చరణ్ 572 మార్కులు సాధించారని పాఠశాలల ఛైర్మన్ బి. రమణ రావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ తో పాటు డైరెక్టర్ బి. విజయలక్ష్మి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.