20 July, 2026 | 2:36 PM

Districts - Karimnagar

article_80035221.webp
ఘనంగా ప్రారంభమైన లక్ష్ ఫౌండేషన్ హాస్పిటల్

కరీంనగర్, క్రైమ్ జూలై 20 (విజయక్రాంతి): ప్రస్తుత కాలంలో వైద్య చికిత్సలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రిలో ఔట్‌పేషెంట్ (ఓపి) ఫీజు కేవలం ₹50 మాత్రమేగా నిర్ణయించారు. ఈ సందర్భంగా డా. మొహమ్మద్ ముస్తాక్ అలీ మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి లాభాపేక్షతో కాకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రారంభించబడిందని తెలిపారు. సమాజానికి సేవ చేయడమే నిజమైన విజయమని, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

20-07-2026