calender_icon.png 8 December, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_68707261.webp
విద్యార్థులకు నాసా కిట్లు అందజేత

08-12-2025

కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): స్థానిక బోయవాడ శ్రీ చైతన్య పాఠశాలలో నాసా ప్రాజెక్టులలో పాల్గొన్న విద్యార్థులందరికీ ముఖ్యఅతిథి ఎస్ఆర్ఆర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి చేతులమీదుగా నాసా కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి, పిల్లలు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండేలా ప్రోత్సహించిన శ్రీ చైతన్య యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ ప్రవీణ్ మాట్లాడుతూ, ఈ యొక్క కరీంనగర్ జోన్ లోనే 200 మంది పిల్లలు నాసా ప్రాజెక్టులలో పాల్గొంటున్నారని, అన్ని జోన్లలో కూడా చాలా ఉత్సాహంగా నాసాలో పాల్గొంటున్నారని, ఇలాంటి విద్యార్థులకు శ్రీ చైతన్య యాజమాన్యం ఎప్పటికీ తోడు ఉంటుందని తెలిపారు.