calender_icon.png 15 December, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_15054097.webp
ప్రశాంత వాతావరణంలో రెండో విడత పోలింగ్

14-12-2025

కరీంనగర్ (విజయక్రాంతి): రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఆదివారం తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్ పంచాయతీ పరిధిలోని జోగయ్యపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, రామకృష్ణ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, గన్నేరువరం మండలం గుండ్లపల్లిలోని శ్రీ రామకృష్ణ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.

article_81448616.webp
ఓటు హక్కు మన బాధ్యత

14-12-2025

మానకొండూర్,(విజయక్రాంతి): ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరులుగా మన బాధ్యతని తెలంగాణ ప్రింట్ మీడియా సర్క్యులేషన్ అసోసియేషన్(Telangana Print Media Circulation Association) కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మంచాల రాజు పేర్కొన్నారు. ఆదివారం మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు మన ఓటు, మన ధైర్యం, మన భవిత అని ఓటర్లకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించి ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలన్నారు18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కును పొంది బాధ్యతగా ఓటు హక్కును నియమించుకోవాలన్నారు ప్రతి ఎన్నికల్లో కూడా అమూల్యమైన విలువైన ఓటు హక్కును సద్వినించుకొని ప్రజాస్వామ్య దేశంలో పటిష్టమైన నాయకులను ఎన్నుకున్న వారవుతారని ఆయన సందేశం ఇచ్చారు

article_72053745.webp
ప్రశాంతంగా రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు

14-12-2025

కరీంనగర్,(విజయక్రాంతి): రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 05 మండలాల్లోని మానకొండూరు, కేశవపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం మరియు చిగురుమామిడి లోని పలు పోలింగ్ కేంద్రాలను సీపీ సందర్శించారు. డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్, బందోబస్తు తీరును పర్యవేక్షించారు. ​ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది పనితీరును, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులకు, సిబ్బందికి సీపీ సూచించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ​రెండవదశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పర్యవేక్షించడంలో కరీంనగర్ పోలీస్ యంత్రాంగం నిమగ్నమై ఉందని సీపీ ఈ సందర్బంగా తెలిపారు.

article_51256798.webp
బీజేపీ నాయకుల, కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్..

13-12-2025

మానకొండూరు (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్యపై శుక్రవారం రాత్రి దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్యపై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన నేపథ్యంలో శనివారం రోజున బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్టీ జిల్లా మండల నాయకులు కొమురయ్యను పరామర్శించి, దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.