calender_icon.png 18 July, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_48484370.webp
జప్తి నాచారం గ్రామానికి బస్సు రాకతో ప్రజల ఆనందం

17-07-2025

విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వ లక్ష్యం అని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. కొండపాక మండలం జప్తి నాచారం గ్రామానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఉగ్రవుతున్నారని, ఈ పరిస్థితిని ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవీందర్ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి, సిద్దిపేట డిపో మేనేజర్ కు ఫోన్ చేయగా సిద్దిపేట డిపో మేనేజర్ గురువారం జప్తి నాచారం గ్రామానికి బస్సు పంపించినందుకు కొబ్బరికాయలు కోట్టి రిబ్బన్ కటింగ్ చేసి, బస్సును ప్రారంభించారు. జప్తి నాచారం గ్రామానికి బస్సును పంపించినందుకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

article_36672394.webp
వివాహిత అదృశ్యం

17-07-2025

వివాహిత అదృశ్యమైన సంఘటన కొండపాక మండలం సిరిసినగాండ్ల గ్రామంలో చోటుచేసుకుంది. సిరిసినగండ్ల గ్రామానికి చెందిన చెంది సంతోష్ కుమార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మంగళవారం చెంది సంతోష్ కుమార్ భార్య దివ్య(24) ఆస్పత్రిలో చూపించుకుంటానని చెప్పడంతో ఆటోలో రమ్మని చెప్పడంతో కూతురు కోమలి(5)తో ఆటోలో సిద్దిపేటకు వస్తున్నానని చెప్పి రాత్రి వరకు రాకపోవడంతో టీహెచ్ఆర్ నగర్ లో గల తన తల్లి ఇంటి వద్దకు కూడా రాకపోవడంతో తన భార్య దివ్య కోసం బంధువుల వద్దకు చుట్టుపక్కల గ్రామాలలో విచారించిన ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో సంతోష్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపారు.

article_67486359.webp
రైతులు ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి ముందుకు రావాలి

17-07-2025

ప్రభుత్వం ఆయిల్ ఫామ్ తోటలకు అందించే సబ్సిడీలను రైతులు వినియోగించుకోవాలని కొండపాక మండల అగ్రికల్చర్ ఆఫీసర్ శివరామకృష్ణ అన్నారు. కొండపాక మండలం బందారం గ్రామంలో గురువారం నిర్వహించిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో భాగంగా కామిరెడ్డి నరసింహారెడ్డి పొలంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో 285 మొక్కలను నాటమని, తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పంట సాగు మొక్కలకు కేవలం రూ 20, డ్రిప్ పరికరాలు, ఎస్సీ ఎస్టీ రైతులకు 100 శాతం, ఇతర రైతులకు 90 శాతం సబ్సిడీ అందజేస్తుందని, నాలుగు సంవత్సరాల పాటు పంట నిర్వహణ ఖర్చులు, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం లభిస్తాయని అన్నారు.