calender_icon.png 7 February, 2026 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_72392826.webp
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

06-02-2026

సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 6 : సమాజంలో జరుగుతున్న నేరాలు, సైబర్ మోసాలు, మూఢనమ్మకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిన్నకోడూరు ఎస్ఐ చంద్రమోహన్ సూచించారు. చిన్నకోడూరు మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో 'కనువిప్పు' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. రోడ్డు భద్రత, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మహిళా భద్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ పరశురాం, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

article_46447450.webp
మల్లన్న ఆలయ ఏఈఓగా వీధుల్లో చేరిన సుదర్శన్

06-02-2026

కొమురవెల్లి,(విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారిగా ఆర్ సుదర్శన్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 2019 లో మల్లన్న ఆలయంలో ఏఈఓ గా విధులు నిర్వహిస్తూ, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయానికి డిప్యూటేషన్ పై వెళ్లారు. దేవాదాయ శాఖ కమిషనర్ డిప్యూటేషన్ రద్దు చేస్తూ, తిరిగి కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో శుక్రవారం రోజు సుదర్శన్ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనములు అందించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాణా అధికారి టంకశాల వెంకటేష్, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, చిన్న మల్లికార్జున్, ఆలయ పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ ఆలయ సిబ్బంది, మ శంకర్ శర్మ, మధుకర్, సిద్దయ్య, నర్సింలు తదితరులు ఉన్నారు.

article_63924360.webp
నవోదయ పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్

06-02-2026

సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 6 : ఈ నెల 7న జరిగే జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ తెలిపారు. ప్రజ్ఞాపూర్ లోని సెయింట్ మేరీ విద్యానికేతన్, బాలుర జడ్పీహెచ్ఎస్, గజ్వేల్ లోని ఆర్అండ్ఆర్ కాలనీ జడ్పీహెచ్ఎస్, జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హబ్, తెలంగాణ మోడల్ స్కూల్, ప్రభుత్వ హైస్కూల్, సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హైస్కూల్, వర్గల్ లోని జవహర్ నవోదయ విద్యాలయం పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 163 సెక్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎగ్జామ్ సెంటర్ నుంచి 500 మీటర్లు పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడ వద్దని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం శిక్షార్హులుగా పరిగణించబడతారని సీపీ హెచ్చరించారు.

article_51598477.webp
పంటలు ఎండుతున్నాయి

06-02-2026

సిద్దిపేట రూరల్: మల్లన్న సాగర్ కెనాల్ నుండి వెంటనే నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని చింతమడక సీతారాంపల్లి మాచాపూర్ వెంకట్రావుపల్లి బదనకల్ గ్రామాల రైతులు అన్నారు శుక్రవారం లక్ష్మీదేవి పల్లి చింతమడక గ్రామాల సరిహద్దు వద్ద ముస్తాబాద్ రోడ్డుపై తమకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా, పోలీసులు జోక్యం చేసుకుని రైతులను సముదాయించి అక్కడి నుండి పంపించి వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటిని విడుదల చేయాలని ఎన్నిసార్లు కోరిన అధికారులు పట్టించుకోకపోవడం లేదని అన్నారు.