వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల,జులై 17: చేర్యాల మండలం ఆకునూర్ గ్రామంలో నిర్మించిన ఐదు స్వయం సహా యక బృందాల (వీఓ) భవనాన్ని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజే శ్వర్ రెడ్డి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతుమహిళల ఆర్థిక సాధికారత,స్వయం ఉపాధి,పొదుపు సంస్కృ తిని బలోపేతం చేయడంలో స్వయం సహాయక బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది.గ్రామీణ ప్రాంత మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపిం చడంలో స్వయం సహాయక బృందాల సేవలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. మహిళల ఐక్యత, క్రమశిక్షణ, పొదుపు అలవాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.వీఓ భవనం అందుబాటులోకి రావడంతో స్వయం సహాయక బృందాల సమావేశాలు,శిక్షణా కార్యక్రమాలు,పొదుపు, రుణాల నిర్వహణతో పాటు ఇతర ఆర్థిక కార్యకలాపాలకు ఎంతో ఉపయో గకరంగా ఉంటుందని చెప్పారు.
17-07-2026