30 May, 2026 | 9:57 AM

Districts - Siddipet

article_20131275.webp
సిద్దిపేట మహిళల భజనలకు ప్రపంచ రికార్డు

సిద్దిపేట రూరల్, (విజయక్రాంతి): కరీంనగర్ కళాభారతి వేదికగా గురువారం నిర్వహించిన ఆధ్యాత్మిక భజన మహోత్సవం ప్రపంచ రికార్డుల్లో చోటు సంపాదించింది. ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చిన సుమారు వెయ్యి మందికి పైగా మహిళలు 53 భజన బృందాలుగా ఏర్పడి 11 గంటల పాటు నిర్విరామంగా భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. మహిళల భజన ప్రదర్శనకు ‘జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్’ గుర్తింపు లభించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దొంగల రామ్‌రెడ్డి జిల్లా నలుమూలల నుంచి 20కు పైగా మహిళా భజన బృందాలను సమన్వయం చేసి కార్యక్రమ విజయానికి కృషి చేశారు. ఆయనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

30-05-2026

article_71268553.webp
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

నంగునూరు,(విజయక్రాంతి): పిల్లల భవిష్యత్తుకు ఉజ్వల పునాది వేసే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని మగ్దుంపూర్ సర్పంచ్ పాకాల శ్రీనివాస్ కోరారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండారు ప్రసాద రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో ముందస్తు బడిబాట నిర్వహించారు.ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను వివరించారు.ప్రభుత్వ బడుల్లో అర్హులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతుందని, దీనివల్ల వేల రూపాయల ఫీజులు ఆదా అవుతాయన్నారు.ఉచితంగా పుస్తకాలు,యూనిఫాంలతో పాటు అల్పాహారం,మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింలు, విజయలక్ష్మి, లీల, కృష్ణవేణి పాల్గొన్నారు.

29-05-2026

article_82840601.webp
జండా గద్దెల ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి

గజ్వేల్, మే 29: తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పటిష్ఠతలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో జెండా గద్దెల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం పార్టీ జెండా పండుగ జిల్లా ఇంచార్జి కొట్టాల యాదగిరి ముదిరాజ్ మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్‌కు దరఖాస్తు అందజేశారు. ఇందిరా పార్క్ చౌరస్తా, కోట మైసమ్మ ఆలయం, ప్రజ్ఞాపూర్ చౌరస్తా, ఆర్ అండ్ ఆర్ నిర్వాసిత కాలనీలో జెండా గద్దెల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గజ్వేల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో జెండా పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకుడు లోక రవిచంద్ర, నాయకులు ఇంద్రాగౌడ్, నరేందర్ రెడ్డి, ఎడ్ల నర్సింలు, శ్రీకాంత్, ప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు.

29-05-2026