calender_icon.png 13 November, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_38808854.webp
ములుగు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ రైడ్

11-11-2025

గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 50వేల లంచం తీసుకుంటుండగా నులుగు ఎస్సై విజయ్ కుమార్ ను పట్టుకున్నారు. ములుగు మండల పరిధిలోని క్షీరసాగర్ గ్రామంలో భూ వివాదం విషయంలో ఎస్సై ఓ వర్గం నుండి ఎస్సై విజయ్ కుమార్ రూ. 50వేల లంచం డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుందగా ములుగు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఎస్సైని పట్టుకున్నారు. ఎస్ఐతో పాటు ఎఆర్ కానిస్టేబుల్ రాజు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగిస్తున్నారు.

article_28145116.webp
అర్ధరాత్రి అనుచిత ప్రవర్తన... యువకుడి అరెస్ట్

11-11-2025

సిద్దిపేట క్రైమ్: ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంటి ముందు సోమవారం అర్ధరాత్రి అనుచితంగా ప్రవర్తించిన యువకుడిపై కేసు నమోదు చేసినట్టు సిద్దిపేట టూ టౌన్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన బొల్లమైన రాకేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటి నుంచి బయటకు రాకుండా గడియ పెట్టాడు. కరెంటు సరఫరాను తొలగించాడు. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు. ఈ విషయమై సదరు మహిళ మంగళవారం స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు.

article_35796903.webp
విద్యార్థినిలకు ఉచిత సైకిళ్లు

11-11-2025

సిద్దిపేట (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలకు బుధవారం ఉచిత సైకిళ్ల పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ ఉపాధ్యాయుడు నీలం శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలోని అక్బర్‌పేట భూంపల్లి మండల పరిధిలోని రామేశ్వరంపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలోని 44 మంది విద్యార్థినిలకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రోటరీ క్లబ్‌ మొయినాబాద్, సికింద్రాబాద్‌ లేడిస్‌ సర్కిల్‌ 17, టిబ్రివాలా ఎలక్ట్రానిక్స్‌ స్వంచ్చంద సంస్థల సహాకారంతో పాఠశాలలో చదువుతున్న 44 మంది విద్యార్థినిలందరికీ ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.