calender_icon.png 14 December, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_56916574.webp
ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష

13-12-2025

గజ్వేల్: సిద్దిపేట జిల్లా వర్గల్ లోని జవహర్ నవోదయ విద్యాలయం ఆరవ తరగతిలో 80 సీట్ల కై 2026 - 27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికై నిర్వహింపబడిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ ఎంపిక పరీక్ష 2026 శనివారం నాడు ప్రశాంతంగా జరిగిందని విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీ దాసి రాజేందర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మొత్తము 4,754 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, అందులో 3,976 మంది హాజరయ్యారు. 778 మంది గైర్హాజరయ్యారు. మెదక్ జిల్లాలో ఆరు కేంద్రాల్లో 1,002 అభ్యర్థులు, సిద్దిపేట జిల్లాలో ఏడు కేంద్రాలలో 1,453 మంది, సంగారెడ్డి జిల్లాలో 1512 మంది అభ్యర్థులు పరీక్షలు రాసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

article_31057356.webp
రెండవ పోలింగ్ కు వేళాయే!

13-12-2025

నంగునూరు: నంగునూరు మండలంలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు.మండలంలోని మొత్తం 25 గ్రామ పంచాయతీలకు గాను,రెండు స్థానాలు ఏకగ్రీవం కాగా, 23 గ్రామ పంచాయతీ స్థానాలకు 84 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.మొత్తం 220 వార్డు స్థానాలకు గాను 40 స్థానాలు ఏకగ్రీవం కాగా 180 వార్డు స్థానాలలో 443 మంది పోటీలో నిలిచారు.మండలంలో ఏర్పాటు చేసిన 180 పోలింగ్ బూతులకు గాను, మొత్తం 476 మంది పీఓ, ఓపీఓ లు విధులు నిర్వర్తించనున్నారు.శనివారండిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద అధికారులు పీఓ, ఏపీఓ లకు బ్యాలెట్ బాక్సులు, ఓటరు జాబితాలు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రతా నడుమ అందజేశారు.ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుంది.మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమై, ఫలితాలను వెంటనే ప్రకటించనున్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 100 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.