క్యాన్సర్ అంటే భయం వద్దు
17-04-2025
సిద్దిపేట, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం ద్వారా సరైన చికిత్సలు అందించి పూర్తిగా నయం చేయవచ్చునని సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు అన్నారు. ఈ నెల 19నాడు సిద్దిపేటలోని విపంచి కళ భవనంలో కిమ్స్ ఆస్పత్రి ఆంకాలజిస్ట్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైద్యులు డాక్టర్ మధు, డాక్టర్ శ్రవణ్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాల సాయిరాంలు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. మాజీమం త్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో సిద్దిపేటలో కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.