మహిళలు, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం
12-11-2025
సిద్దిపేట క్రైమ్: మహిళలు, విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ చెప్పారు. బుధవారం స్థానిక శ్రీ వాణి హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ట్రాఫిక్ నియమాలు, టీ సేఫ్ యాప్, షీ టీం గురించి వివరించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే డయల్ 100 లేదా షీ టీమ్ నంబర్ 8712667434 కు ఫోన్ చేయాలని సూచించారు.