భవిష్యత్తు వ్యవసాయానిదే..
20-08-2025
గజ్వేల్, ఆగస్టు 19 : విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న పంటలన్నీ పండే భూములు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని, భవిష్యత్తు వ్యవసాయనిదేనని తెలం గాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారం, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని తెలంగాణ రాష్ట్ర కొండ లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ లో భోజనశాలను ప్రారంభించడంతోపాటు విద్యారు ్థలతో ప్రత్యేకంగా సంభాషించారు.