ప్రభుత్వ భూమిలో వెంచర్లు?
21-01-2025
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 20 (విజయక్రాంతి): పాల్వంచలోని అసైన్ట్, ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వెలిసినా, పామాయిల్ సాగు చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. పాల్వంచ పట్టణ పరిధిలో ని వెంగళరావు కాలనీ, ప్రశాంతి కాలనీల మధ్య సర్వే నం 727 లో కాంపెల్లి జనార్ధన్కు 4 ఎకరాల అసైన్డ్ భూమితో పాటు ఎకరా ప్రభుత్వ భూమి ఉన్నది.