జరిగిన అభివృద్ధే సీపీఐ అభ్యర్థులకు బలం
12-12-2025
పాల్వంచ, డిసెంబర్ 11, (విజయక్రాంతి): కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో గత రెండు సంవత్సరాలుగా జరిగిన అభివృద్దే సిపిఐ అభ్యర్థులకు బలం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని చంద్రలగూడెం, రేగులగుడెం, బంజారా, లక్ష్మీదేవిపల్లీ(U), ఉల్వనూర్, మందర్కలపాడు, సత్యనారాయణపురం, కారెగట్టు, ప్రభాతీ నగర్, యానంబెలు, కిన్నెరసాని, కోడిపుం జులవాగు, పునుగుల గ్రామపంచాయతీల్లో విస్తృతంగా పర్యటించి అభ్యర్థులకు, పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.