calender_icon.png 1 May, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_52428349.webp
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దళారుల దందా

01-05-2025

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 30 (విజయ క్రాంతి) : ఏ ప్రభుత్వం వచ్చినా.... ఏ పథకం ప్రవేశపెట్టిన... దళారుల దందా య ధావిధిగా కొనసాగుతోంది. గత ప్రభుత్వం హయాంలో దళిత బంధు పేరుతో, కల్యాణ లక్ష్మి షాది ముబారక్, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు లోనూ దళారుల హవా కొనసాగింది. నేటి ఇందిరమ్మ ప్రభుత్వంలోనూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో దళారుల దందా కొనసాగుతోంది. గ్రామసభలు ద్వా రా లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ, ఫైనల్ లిస్టులో పేరు ఉండాలంటే పైసలు సమర్పించుకోవాల్సిందేన అంటూ మధ్యవర్తులు లబ్ధిదారుల నుండీ 25 వేల నుంచి 40 వేల వరకు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెలబడుతున్నాయి.

article_15342231.webp
ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి

01-05-2025

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): జిల్లావ్యాప్తంగా తాగునీటి సరఫరా లో తలెత్తే సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను అదనపు కలెక్టర్ విద్యా చందన ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తాగునీరు, పారిశుద్ధ్యం అమలు , మరుగుదొడ్ల నిర్మాణం, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపొందించేందుకుగాను జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడి కేంద్రాలు, రైతు వేదికల్లో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు.

article_41063730.webp
అశ్వరావుపేట నియోజకవర్గంలో మంత్రి తుమ్మల పర్యటన

30-04-2025

అశ్వారావుపేట,(విజయక్రాంతి): గిరిజన ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలో మంగళవారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దమ్మపేట మండలంలోని పూసుకుంట, కట్కూరు గ్రామాలకు వెళ్ళే రహదారిలో రూ 4.16 కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు హై లెవెల్ వంతెనలు స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూసుకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండీ, గిరిజనులను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు.