జిల్లాలో 305.09 కోట్ల రైతు భరోసా
24-06-2025
రైతు భరోసా-విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం అశ్వారావుపేట రైతు వేదికలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో అశ్వారావుపేట నియోయకవర్గ శాసన సభ్యులు జారే ఆదినారాయణ(MLA Jare Adinarayana), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil), ట్రైనీ కలెక్టర్ సౌరబ్, జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబూరావు. అశ్వారావుపేట రైతు వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఇప్పటి వరకు 1,76,236 మంది రైతులకు రూ 305.09 కోట్లు, అశ్వారావుపేట నియోజకవర్గ రైతులకు 45,058 రైతులకు రూ 81.39 కోట్లు జమ చేయటం జరిగిందన్నారు.