30 May, 2026 | 9:29 AM

Districts - Bhadradri Kothagude

article_12161826.webp
పదవీ విరమణ పొందనున్న జీఎం బత్తుల శ్రీనివాసరావుకి ఘన సన్మానం

కొత్తగూడెం మే 29 విజయక్రాంతి: మే 31వ తేదీన పదవీ విరమణ పొందనున్న జీఎం (సీఎంసీ) శ్రీ బత్తుల శ్రీనివాసరావు కు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలెమ్ రాజు కార్యలయం లో ,సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ షాలెమ్ రాజు మాట్లాడుతూ, బత్తుల శ్రీనివాసరావు , సింగరేణి సంస్థలో 33 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ, సంస్థ అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు. తన విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో సహచరులకు ఆదర్శంగా నిలిచారని , సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, సంస్థకు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు.

29-05-2026

article_75932179.webp
NTR 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే జారె

దమ్మపేట, మే 28(విజయక్రాంతి): మండల పరిధిలోని గండుగులపల్లిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక అయినటువంటి నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, సినీరంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుని తెలుగు ప్రజల ఆరాధ్యుడిగా నిలిచారని కొనియాడారు. పేదప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజా నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. తెలుగువారి గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావని, ఆయన ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే జారే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

28-05-2026

article_27236512.webp
30 నిమిషాలపాటు చిగురుటాకుల వణికిన దమ్మపేట

దమ్మపేట, మే 28(విజయ క్రాంతి): మండల కేంద్రంలో గురువారం ఉదయం గాలి వాన బీభత్సానికి దమ్మపేట చిగురుటాకుల వణికి పోయింది. భారీగా వీచిన గాలులతో పోలీస్ స్టేషన్ సమీపంలో చెట్టు, కరెంటు స్తంభం విరిగి రోడ్డుపై పడ్డాయి. కొత్తపేటలో పెద్ద మామిడి చెట్టు కూలిపోయి కరెంట్ స్తంభంపై పడటంతో స్తంభం విరిగిపోయి, వైర్లు తెగిపోయాయి. రేకుల షెడ్లు, పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న వారు అర గంట సేపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ గడిపారు. మాడు పగిలే ఎండలతో సతమవుతున్న ప్రజలకు కొంత ఉపశమనంగా ఉన్నప్పటికీ, చెట్లు విరిగి, కరెంట్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సిబ్బంది అధిక శ్రమతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టవలసిన అవసరం ఏర్పడింది.

28-05-2026