కమ్యూనిస్టు ఉద్యమ ధ్రువతార "గిరిప్రసాద్"
24-05-2025
కార్మిక, కర్షక, పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నల్లమల గిరిప్రసాద్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని, భూపోరాటాలకు నాయకత్వం వహించి లక్షలాది ఎకరాలను పేదలకు పంచిన ఘనత గిరిప్రసాదుకు దక్కుతుందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా(CPI Secretary SK Sabir Pasha) అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సిపిఐ మాజీ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు నల్లమల గిరిప్రసాద్ 29వ వర్ధంతి శనివారం శేషగిరిభవన్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో సాబీర్ పాషా మాట్లాడుతూ... అప్పటి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ దృవతారగా వెలుగొందిన గిరిప్రసాద్ జీవితం, ఆయన చేసిన త్యాగం నేటి తరం కార్యకర్తలకు, నాయకులకు స్పూర్తిదాయకమని అన్నారు.