ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
01-05-2025
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): జిల్లావ్యాప్తంగా తాగునీటి సరఫరా లో తలెత్తే సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను అదనపు కలెక్టర్ విద్యా చందన ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తాగునీరు, పారిశుద్ధ్యం అమలు , మరుగుదొడ్ల నిర్మాణం, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపొందించేందుకుగాను జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడి కేంద్రాలు, రైతు వేదికల్లో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు.