పదవీ విరమణ పొందనున్న జీఎం బత్తుల శ్రీనివాసరావుకి ఘన సన్మానం
కొత్తగూడెం మే 29 విజయక్రాంతి: మే 31వ తేదీన పదవీ విరమణ పొందనున్న జీఎం (సీఎంసీ) శ్రీ బత్తుల శ్రీనివాసరావు కు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలెమ్ రాజు కార్యలయం లో ,సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ షాలెమ్ రాజు మాట్లాడుతూ, బత్తుల శ్రీనివాసరావు , సింగరేణి సంస్థలో 33 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ, సంస్థ అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు. తన విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో సహచరులకు ఆదర్శంగా నిలిచారని , సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, సంస్థకు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు.
29-05-2026