calender_icon.png 21 January, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_63481049.webp
సాధ్యం కానీ హామీలిచ్చి ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్

20-01-2025

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నేతలను ఎక్కడిక్కడ నిలదీయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ శాసనసభ్యురాలు బానోత్ హరి ప్రియ ప్రజలకు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని వెంకట్యతండా సమీపంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు, బేతంపూడి సొసైటీ అధ్యక్షుడు లక్కినేని సురేందర్రావు ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ మండల విస్తృతస్థాయి సమావేశానికి వారు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గంలోని 138 పంచాయితీల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని వారన్నారు.

article_59652104.webp
ఏరియా హాస్పిటల్ శానిటేషన్ కార్మికుల వేతనాలు విడుదల చేయాలి

20-01-2025

భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్ సెక్యూరిటీ ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు సుమారు 100 మంది కార్మికుల కు గత ఐదు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సోమవారం ఐటిడిఏ ప్రజా దర్బార్ లో పీవో రాహుల్ కి సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ... ఏరియా హాస్పిటల్ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతూ అనేకమార్లు సూపర్నెంట్, డిసిహెచ్, పిఓ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

article_16063441.webp
పథకాల అర్హుల ఎంపికలో ప్రజలు భాగస్వామ్యం కావాలి..

20-01-2025

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేసే పథకాల అర్హులైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu) కోరారు. సోమవారం స్థానిక ప్రజా భవన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోజుతో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ప్రభుత్వ పథకాలపై సర్వే పూర్తయిందని, మంగళవారం నుంచి లబ్ధిదారుల ఎంపిక నిర్వహించేందుకు ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ గ్రామసభల్లో స్థానిక ప్రజలు భాగస్వాములై అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో సహకరించాలని కోరారు.