calender_icon.png 25 May, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_66995201.webp
కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆలోచనలో నుంచి మరో మార్గదర్శకం

24-05-2025

తక్కువ ఆక్సిజన్ (గాలి) తో ఎండిపోయిన మొక్కలు, పనికిరాని చెట్ల కొమ్మలను కాల్చడం ద్వారా ఏర్పడే శాశ్వత కార్బన్ నిల్వతో కూడిన బొగ్గే బయోచార్" అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్(Collector Jitesh V. Patil) తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా బయోచార్ తయారీకి కలెక్టర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ దిశగా ఆయన కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం పక్కనే స్వయంగా మొట్టమొదటి ప్రయోగాత్మక ప్రదర్శనను నిర్వహించారు. ముందుగా ఒక ఖాళీ డ్రమ్ తీసుకొని దాని కింద భాగంలో గాలి ప్రవేశించేలా రంధ్రాలు చేశారు. ఆ డ్రమ్‌ను మూడు సిమెంట్ రింగుల మధ్య ఉంచి, అడుగులో ఎండిన ఆకులు వేసి మంట వెలిగించారు.

article_33355665.webp
సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలి

24-05-2025

ములకలపల్లి కేజీబీవీ పాఠశాలలో శనివారం జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్తాంతర శిక్షణ కార్యక్రమంలో సైబర్ నేరాల గురించి షి టీం రమాదేవి(She Team SI Ramadevi), స్థానిక ఎస్సై కిన్నెర రాజశేఖర్ పాల్గొని సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై రమాదేవి మాట్లాడుతూ... తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నా రు. బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి క్రెడిట్ కార్డు నెంబరు సి వి వి అడుగుతూ మోసం చేస్తారని, ఐటి డిపార్టుమెంటు నుండి ఫోన్ చేస్తున్నామని డిజిటల్ అరెస్ట్ అని భయపెట్టి మన దగ్గర అకౌంట్లో ఉన్న డబ్బు కొల్ల గొడుతున్నారని అటువంటి వారి ఉచ్చులో పడకూడదని, ఏమైనా అనుమానాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేయాలని తెలిపారు.

article_39436468.webp
కమ్యూనిస్టు ఉద్యమ ధ్రువతార "గిరిప్రసాద్"

24-05-2025

కార్మిక, కర్షక, పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నల్లమల గిరిప్రసాద్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని, భూపోరాటాలకు నాయకత్వం వహించి లక్షలాది ఎకరాలను పేదలకు పంచిన ఘనత గిరిప్రసాదుకు దక్కుతుందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా(CPI Secretary SK Sabir Pasha) అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సిపిఐ మాజీ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు నల్లమల గిరిప్రసాద్ 29వ వర్ధంతి శనివారం శేషగిరిభవన్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో సాబీర్ పాషా మాట్లాడుతూ... అప్పటి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ దృవతారగా వెలుగొందిన గిరిప్రసాద్ జీవితం, ఆయన చేసిన త్యాగం నేటి తరం కార్యకర్తలకు, నాయకులకు స్పూర్తిదాయకమని అన్నారు.

article_54245319.webp
రాష్ట్రస్థాయిలో జరుగుతున్న వృత్యంతర శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలి

24-05-2025

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వృత్యాంతర శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పరిశీలకులు సైట్ డైరెక్టర్ విజయలక్ష్మి(State observers Site Director Vijayalakshmi) అన్నారు. శనివారం పాల్వంచ పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొమ్ముగూడెంలో జరుగుతున్న భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా, జూన్ 12 నుంచి మొదలవుతున్న నూతన విద్యా సంవత్సరంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని కూడా విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలన్నారు.

article_49494166.webp
కొత్త తహశీల్దార్ కు శుభాకాంక్షలు తెలిపిన టిబిజికెయస్ నాయకులు

24-05-2025

మణుగూరు,(విజయక్రాంతి): మణుగూరు మండల రెవిన్యూ అధికారిగా కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అద్దంకి నరేష్ ను శుక్రవారం మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు మర్యాద పూర్వకంగా కలిశారు.. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియచేశారు. మణుగూరు ఏరియా కు గుండెకాయ రానున్న రోజుల్లో కార్మిక మనుగడలో అత్యంత కీలక భూమిక పోషించే మణుగూరు ఓ సి ప్రాజెక్ట్ ఎక్స్ టెన్షన్ అంశంలో ప్రత్యేక చొరవ చూపించి త్వరితగతిన అనుమతులు రాబట్టి ఏరియా ప్రగతికి దోహద పడాలని ఈ సందర్భంగా కోరారు.. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు