ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి
23-04-2024
ఏజెన్సీ జిల్లాల్లో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు ఉండొద్దని డీజీపీ ఆదేశించారు. సోమవారం ఆయన హెలికాఫ్టర్లో హైదరాబాద్ నుంచి భద్రాద్రి జిల్లా చేరకుని చర్ల మండలంలోని చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి భద్రతా బలగాల బేస్ క్యాంప్లను సందర్శించారు. అనంతరం అడిషనల్ డీజీపీ (ఇంటెలిజెన్స్) శివధర్రెడ్డి, అడిషనల్ డీజీ (గ్రేహౌండ్స్) విజయ్కుమార్, సీఆర్పీఎఫ్ సౌత్ సెక్టార్ హైదరాబాద్ జోన్ ఐజీపీ చారూసిన్హా , ఎస్ఐబీ ఐజీపీ సుమతితో కలిసి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశం లో డీజీపీ మాట్లాడారు.