calender_icon.png 25 June, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_28593628.webp
ఐఎఫ్టియు నాయకుడు రాజసింగ్ కి నివాళి

24-06-2025

భారత కార్మిక సంఘాల సమాఖ్య(Indian Federation of Trade Unions) జాతీయ సీనియర్ నాయకులు మంగళవారం పంజాబ్ రాష్ట్రంలో అతని నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణం పంజాబ్ రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గానికి, ఐఎఫ్టియు కి తీరనిలోటని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి.రాసుద్దిన్, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు తోడేటి నాగేశ్వరరావు అన్నారు. ఇల్లందు ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో రాజాసింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశంలో బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గంపై దాడి చేస్తున్న క్రమంలో విప్లవ కార్మిక సంఘం ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

article_17638384.webp
గ్రామీణ వైద్యులు మితిమీరిన వైద్యం చేయవద్దు: డీఎస్పీ

24-06-2025

గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయవద్దని ఇల్లందు డీఎస్పీ ఎన్. చంద్రభాను(DSP Chandrababu) సూచించారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో గ్రామీణ వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యులు రెండు రోజులు కంటే వైద్యం చేయవద్దన్నారు. గ్రామీణ వైద్యులు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోమతెరలు వాడే విధంగా చైతన్య పరచాలని కోరారు. జ్వరం, కడుపు నొప్పితో గ్రామీణ వైద్యుల వద్దకు వైద్యం కోసం వస్తే వైద్యం చేసిన అదుపులోకి రాకపోతే కాలం వెళ్లబుచ్చి పేషెంట్ కు సీరియస్ అయ్యేంతవరకు చూడవద్దని, తక్షణమే మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు గానీ, ఆర్థిక స్తోమత ఉన్న వారైతే ప్రైవేటు వైద్యశాలలకు పంపాలని పేర్కొన్నారు.

article_74345017.webp
జిల్లాలో 305.09 కోట్ల రైతు భరోసా

24-06-2025

రైతు భరోసా-విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం అశ్వారావుపేట రైతు వేదికలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో అశ్వారావుపేట నియోయకవర్గ శాసన సభ్యులు జారే ఆదినారాయణ(MLA Jare Adinarayana), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil), ట్రైనీ కలెక్టర్ సౌరబ్, జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబూరావు. అశ్వారావుపేట రైతు వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఇప్పటి వరకు 1,76,236 మంది రైతులకు రూ 305.09 కోట్లు, అశ్వారావుపేట నియోజకవర్గ రైతులకు 45,058 రైతులకు రూ 81.39 కోట్లు జమ చేయటం జరిగిందన్నారు.

article_86178165.webp
బీళ్లకు మళ్లని సీతారామ జలాలు..

24-06-2025

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా గిరిజన ప్రాంత రైతాంగానికి అడుగు అడుగున అన్యాయం జరుగుతుందని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(BRS District President Rega Kantha Rao) విమర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి చుక్క నీరు అందించకుండా మంత్రులు తమ నియోజకవర్గాలకు గోదావరి జలాలను తరలించడానికి పోటీపడుతున్నారని మండిపడ్డారు. భద్రాద్రి జిల్లా రైతుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతమ్మ సాగర్ బహులార్ధక ప్రాజెక్టును నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వం సంకల్పిస్తే నేడు కాంగ్రెస్ పాలనలో చెంతనే గోదావరి ఉన్న భద్రాద్రి జిల్లాలోని పంట పొలాలకు చుక్క సాగునీరు అందించకుండా గోదావరి జలాలను తమ ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తూ గిరిజన రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.