గణేష్ మండపాల నిర్వాహకులు నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి
19-08-2025
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 18, (విజయక్రాంతి):జిల్లాలో గణేష్ మండపాల ని ర్వహణకు ఉత్సవ కమిటీ సభ్యులు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్https://policeportal.tspolice.gov.in/నందు ధరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపాల నిర్వహణ, మండపానికి సంబంధించిన స మాచారం కొరకు మాత్రమేనని, ఈ సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా భద్రత , పోలీస్ బందోబ స్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులభంగా ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.