Districts

article_71694285.webp
గెలుపే లక్ష్యంగా పని చేయాలి

02-05-2024

ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పోదం వీరయ్య కాంగ్రెస్ శ్రేణులను కోరారు. బుధవారం భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 13 న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకొనేందుకు జరిగే ఎన్నికలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రవికుమార్, మహిళా సంఘం అధ్యక్షురాలు దేవి ప్రసన్న, మైనార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

article_57172518.webp
ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి

23-04-2024

ఏజెన్సీ జిల్లాల్లో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు ఉండొద్దని డీజీపీ ఆదేశించారు. సోమవారం ఆయన హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ నుంచి భద్రాద్రి జిల్లా చేరకుని చర్ల మండలంలోని చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి భద్రతా బలగాల బేస్ క్యాంప్‌లను సందర్శించారు. అనంతరం అడిషనల్ డీజీపీ (ఇంటెలిజెన్స్) శివధర్‌రెడ్డి, అడిషనల్ డీజీ (గ్రేహౌండ్స్) విజయ్‌కుమార్, సీఆర్పీఎఫ్ సౌత్ సెక్టార్ హైదరాబాద్ జోన్ ఐజీపీ చారూసిన్హా , ఎస్‌ఐబీ ఐజీపీ సుమతితో కలిసి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశం లో డీజీపీ మాట్లాడారు.