ప్రశాంతంగా మొదటి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి.!
12-12-2025
నాగర్ కర్నూల్ ,( విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా సాగింది. తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి ఆరు మండలాల్లో కలిపి మొత్తం 1,81,543 ఓటర్లలో 1,56,710 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.