calender_icon.png 25 June, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_71267811.webp
చేగుంటలో అమానవీయ ఘటన..!

22-06-2025

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. చేతబడి చేశాడన్న అనుమానంతో ఒక వ్యక్తిని చెప్పుల దండ మెడలో వేసి గ్రామంలో ఊరేగించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆ వ్యక్తిపై అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చేత జరిపించిన ఈ అమానవీయ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం చేగుంట గ్రామంలో శనివారం చోటు చేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలోని ఒక వ్యక్తిపై మరో వ్యక్తి తరచు అనారోగ్యానికి గురవుతుండడంతో బిజినపల్లి మండల కేంద్రంలో గద్దె చెప్పించుకున్నాడు.