30 April, 2026 | 6:07 PM

Districts - Nagarkurnool

article_12173388.webp
సోమశిలను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

కొల్లాపూర్ రూరల్: నాగర్‌ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిలను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. గురువారం సోమశిలను సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎకో టూరిజం ప్రాజెక్టులు, హేలీ టూరిజం, పర్యాటక సదుపాయాలు, అలాగే 167కే జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఐకానిక్ కేబుల్ వంతెన పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. సోమశిల వంటి ప్రకృతి సోయగాలున్న ప్రాంతాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి టూరిజం హబ్‌లుగా మారే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.

30-04-2026