పరిశుభ్రతకు ప్రాధాన్యత
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): గ్రామాల పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలు, పచ్చదనం పెంపుతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఊర్కొండ మండలంలోని ఉరుకొండపేట, ముచ్చర్లపల్లి గ్రామాలను సందర్శించి, కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణాల నాణ్యత, పురోగతిపై సమీక్షిస్తూ, లబ్ధిదారులు పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేసుకోవాలని సూచించారు.
05-05-2026