ముగిసిన చివరి విడత.. గ్రామ సంగ్రామ సమరం
17-12-2025
అచ్చంపేట: గ్రామ సంగ్రామంలో కీలకమైన చివరి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నాగర్ కర్నూల్ జిల్లాలలో ప్రశాతంగా ముగిశాయి. జిల్లాలోని ఏడు మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల పక్రియను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోశ్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పరిశీలించారు. జిల్లాలో చివరి దశ ఎన్నికలలో భాగంగా బుధవారం అచ్చంపేట, బల్మూర్, లింగాల, చారగొండ, ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర మండలాలలోని 134 గ్రామ పంచాయతీలలో సర్పంచు, 1,064 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకే గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్లారు.