calender_icon.png 20 August, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_39581034.webp
మెరీడియన్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి..

19-08-2025

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెరిడియన్ ప్రైవేట్ పాఠశాల(Meridian School) విద్యార్థులను బలవంతంగా మట్టి మొయిస్తూ వెట్టిచాకిరి చేయించిన పాఠశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ నేతలు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పాఠశాల మరమ్మతు పనుల కోసం కూడా అభం శుభం తెలియని విద్యార్థుల చేత పెట్టి చేయిస్తూ రాజకీయ పలుకుబడితో ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. స్కూల్ యాజమాన్యం ఫీజులు వసూలు చేసి విద్యార్థులను బాల కార్మికులుగా మార్చడంపై, స్కూల్ గుర్తింపును రద్దు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

article_60092659.webp
కేఎల్ఐ కాలువ లైనింగ్ పనులు చేపట్టాలి.!

16-08-2025

మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువలకు లైనింగ్ పనులు చేపట్టకపోవడం వల్లే తరచూ గండ్లు పడి సమీప రైతుల పంట పొలాలు, ఇండ్లు ధ్వంసం అవుతున్నాయని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి(MLA Kuchkulla Rajesh Reddy) అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని గుడిపల్లి గ్రామ 29వ ప్యాకేజీ పరిధిలోని కాల్వను ఆయన పరిశీలించారు. కాల్వ నిండుగా నీరు ప్రవహిస్తుండడంతో లైనింగ్ లేని కారణంగా గ్రామంలోని ఇండ్లు ఊరుస్తున్నాయని పంట పొలాలు సైతం కరిగెటగా మారుతున్నాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే అక్కడే ఇరిగేషన్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అవకాశం ఉన్న మేరకు మెత్తబడిన ప్రాంతంలో కాలువల మరమ్మతు పనులు చేపట్టాలని శాశ్వత పరిష్కారం లైనింగ్ పనులు కూడా చేపట్టాలన్నారు.

article_72163396.webp
ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వక్రీకరించడం అవివేకమే..!

14-08-2025

విలువలతో కూడిన జర్నలిజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించి వారి స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని అది ముమ్మాటికీ వారి అవివేకమేనని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి(MLA Kuchukulla Rajesh Reddy) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో అధ్యక్షులు వెంకటస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయు) అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వాలకు ప్రజలకు వారదులుగా అపారమైన అనుభవం గల సీనియర్ పాత్రికేయులు జర్నలిజంపైనే ఆధారపడి ప్రజా శ్రేయస్సుకు పాటుపడుతున్న జర్నలిస్టులను కీర్తిస్తూ తప్పుడు రాతలు రాసే మిగతా జర్నలిస్టుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. కానీ కొంత మంది అవకాశవాదులు దానిని వక్రీకరించి జర్నలిజంపైన తప్పుగా మాట్లాడినట్టు ప్రచారం చేసుకుని పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.

article_17939508.webp
ప్రజలతో మమేకమవుతున్న మంత్రి జూపల్లి.!

14-08-2025

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): సామాన్య ప్రజలతో మమేకం అవుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) కొత్త పంతాను ఎంచుకున్నారు. రాష్ట్ర మంత్రి అంటేనే హంగు ఆర్భాటలు రొండంచెల పోలీసుల బందోబస్తు, భద్రత నడుమ హంగామా సృష్టించే పద్ధతి నుంచి తాను ఒక సామాన్య వ్యక్తుల మాదిరి స్థానిక ప్రజలతో మమేకం అవుతూ తన ప్రవర్తనలో చాలా మార్పులు తెచ్చుకున్నారు. సాంస్కృతిక శాఖ మంత్రిగా తనను గుర్తించాలని పదేపదే వేదికలపై చెప్తూ అదేవిధంగా తన ప్రవర్తన కూడా మార్చుకుంటూ కనిపిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఉయ్యాలవాడ వద్ద బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు తీవ్ర అస్వస్థత, ఆందోళనకు గురవుతున్న క్షణాల్లో వారికి సినిమా పాటలు వినిపిస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపుతూ స్ఫూర్తిని రగిలించే పాటలు వినిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.