calender_icon.png 22 February, 2026 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_69014234.webp
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు

20-02-2026

కొల్లాపూర్ టౌన్: కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత లోపం లేకుండా పనులు చేపట్టాలని మేస్త్రీలకు సూచించారు. నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిరుపేదల సంక్షేమం వారి అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను జూపల్లి కృష్ణా రావు ఆధ్వర్యంలో మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ రహీం భాషా, మాజీ కౌన్సిలర్ బరిగెల రాముడు యాదవ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

article_34811381.webp
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం

20-02-2026

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కారు బైక్ ఎదురెదురుగా ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న గన్నోజు సురేష్ చారి (40) వృత్తి రీత్యా దారువాజా కొలతలు తీసుకునేందుకు తన బైక్ పై పెద్దకొత్తపల్లి వెళ్లి తిరిగి పట్టణానికి వస్తుండగా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు నాగర్ కర్నూల్ నుండి సోమశిల వైపు కారులో వెళ్తున్న క్రమంలో కారు బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

article_47516378.webp
పౌష్టికాహారం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

20-02-2026

ఊర్కొండ: పౌష్టికాహారం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రమేష్ నాయక్ అన్నారు. గురువారం మండలంలోని గుడ్లగుంటపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో చిన్నారులతో పాటు గర్భిణీలు బాలింతలకు పౌష్టిక ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ప్రజలకు కావలసినటువంటి సకల సౌకర్యాలతో పాటు సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నదని అన్నారు. అందులో భాగంగానే గ్రామాల్లో ఉన్నటువంటి మహిళ తల్లులకు గర్భిణీలు బాలింతలతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుందని ఈ అవకాశాలను అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రజని, ఉపసర్పంచ్ కొండలు తదితరులు ఉన్నారు

article_20866817.webp
మట్టి పరీక్ష పంటల అభివృద్ధికి తొలి అడుగు

19-02-2026

కల్వకుర్తి: వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధించడంతో పాటు రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని,ఈ లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి అన్నారు. గురువారం రైతు కమిషన్ బృందం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండలంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామంలో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి నేతృత్వంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ పాల్గొని గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యత, నేల నాణ్యత ఆధారంగా ఎరువుల వినియోగ విధానం, సేంద్రియ వ్యవసాయం ప్రయోజనాలపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. అనంతరం మినీ కిట్ల పంపిణీ, భూసార పరీక్షలకు సంబంధించిన పరికరాలను రైతులకు పంపిణీ చేశారు.

article_33049115.webp
నిరుపేదల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇండ్లు: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి.

19-02-2026

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇండ్లు నిలుస్తాయని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి ఆయన హాజరయ్యారు. పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు. సొంతింటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో అనేక కుటుంబాలు సురక్షిత నివాసం పొందుతున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.