ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ జిల్లాలో బాలికలు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. రెగ్యులర్, ఒకేషనల్ కోర్సులలో బాలికల ఉత్తీర్ణత శాతం బాలురతో పోల్చితే గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ, కేజీబీవీ, గురుకుల కళాశాలల విద్యార్థులోనూ మెరుగైన ఫలితాలు సాధించగా, ప్రైవేటు కళాశాలల్లో మాత్రం ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది.
13-04-2026