calender_icon.png 31 January, 2026 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_17560528.webp
మద్దిమడుగులో సెల్ టవర్ సేవలు ప్రారంభం

31-01-2026

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందిన స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి. అచ్చంపేట నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతంలో సెల్ టవర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ చర్వతో సెల్ టవర్ సేవలు అక్కడి ప్రజలు అందుకోవాలని ఉద్దేశంతో ఈరోజు పార్లమెంటు సభ్యులు మల్లు రవి గారితో కలిసి సెల్ టవర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఏజెన్సీ ప్రజలు సెల్ టవర్ సేవలు ప్రారంభించగానే ఎక్కడలేని ఆనందంతో ప్రజలు సంతోషిస్తున్నారు. గ్రామాలలో ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరించే విధంగా ముందుకు పోతానని ఎమ్మెల్యే అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం పదర, అమ్రాబాద్ మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ,ఎంపీ మల్లు రవి,ఆయా గ్రామాల ప్రతినిధులు ప్రజలు.

article_69268332.webp
రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు

30-01-2026

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ తో కలిసి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రమాదకర ప్రాంతాల్లో సూచిక బోర్డులు, డైవర్షన్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని, పాఠశాల బస్సుల ఫిట్‌నెస్ తనిఖీలు కఠినంగా నిర్వహించాలని సూచించారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

article_29383116.webp
అచ్చంపేటలో గ్రూప్ వన్ అధికారుల శిక్షణ

30-01-2026

అచ్చంపేట జనవరి 29: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే కొత్తగా ఎన్నికైన గ్రూప్‌వన్ అధికారులకు ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు అచ్చంపేట పట్టణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో, శిక్షణా తరగతులకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు.ఒక విడతలో 150 మంది గ్రూప్‌వన్ అధికారులు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొననున్న నేపథ్యంలో, వారికి అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు, శిక్షణ తరగతుల నిర్వహణకు అవసరమైన తరగతి గదులు, సమావేశ మందిరాలు తదితర ఏర్పాట్లను అచ్చంపేటలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.

article_13483651.webp
శిక్షణ తరగతుల నిర్వహణకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

30-01-2026

అచ్చంపేట జనవరి 29: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే కొత్తగా ఎన్నికైన గ్రూప్‌వన్ అధికారులకు ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు అచ్చంపేట పట్టణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో, శిక్షణా తరగతులకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. ఒక విడతలో 150 మంది గ్రూప్‌వన్ అధికారులు ఈ శిక్షణా తరగతు ల్లో పాల్గొననున్న నేపథ్యంలో, వారికి అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు, శిక్షణ తరగతుల నిర్వహణకు అవసరమైన తరగతి గదులు, సమావేశ మందిరాలు తదితర ఏర్పాట్లను అచ్చంపేటలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.

article_38414251.webp
కృష్ణానది తీరంలో అలవి వల వేట

30-01-2026

కొల్లాపూర్ రూరల్, జనవరి 29: నదులు, జలవనరులను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే మత్స్య మాఫియాతో చేతులు కలిపి కృష్ణా నది పరివాహ ప్రాంతాల్లో చేప పిల్లల సంపదను కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. కృష్ణా నదిలో రాత్రిపగలు అనే తేడా లేకుండా నిషేధిత అలవి వలలు విసిరి చేప పిల్లలను పూర్తిగా వేటాడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పట్టిన చేప పిల్లలను ఎండబెట్టి కోట్ల రూపాయల వ్యాపా రానికి తరలిస్తూ, మత్స్య మాఫియాకు అధికారులు కేరాఫ్ అడ్రస్గా మారారని విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రతి ఏడాది సుమారు రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసి నదిలో చేప పిల్లలను వదులుతుంటే, అధికారుల కనుసైగల్లో కొందరు దళారులు అలవి వలలతో వేట సాగించి స్థానిక మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

article_87707737.webp
అచ్చంపేటలో గ్రూప్ వన్ అధికారుల శిక్షణ

29-01-2026

అచ్చంపేట జనవరి 29: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే కొత్తగా ఎన్నికైన గ్రూప్–వన్ అధికారులకు ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు అచ్చంపేట పట్టణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో, శిక్షణా తరగతులకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. ఒక విడతలో 150 మంది గ్రూప్–వన్ అధికారులు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొననున్న నేపథ్యంలో, వారికి అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు, శిక్షణ తరగతుల నిర్వహణకు అవసరమైన తరగతి గదులు, సమావేశ మందిరాలు తదితర ఏర్పాట్లను అచ్చంపేటలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.