13 April, 2026 | 5:41 PM

Districts - Nagarkurnool

article_44535865.webp
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక భాగంగా నిర్వహిస్తోన్న అరైవ్ - అలైవ్ కార్యక్రమాన్ని కల్వకుర్తి మండలం తర్మికల్ గ్రామపంచాయతీలో సోమవారం నిర్వహించారు. ఈ, సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. గ్రామ సర్పంచ్ వరలక్ష్మి స్వంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. గ్రామ భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

13-04-2026