అచ్చంపేటలో గ్రూప్ వన్ అధికారుల శిక్షణ
30-01-2026
అచ్చంపేట జనవరి 29: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే కొత్తగా ఎన్నికైన గ్రూప్వన్ అధికారులకు ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు అచ్చంపేట పట్టణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో, శిక్షణా తరగతులకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు.ఒక విడతలో 150 మంది గ్రూప్వన్ అధికారులు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొననున్న నేపథ్యంలో, వారికి అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు, శిక్షణ తరగతుల నిర్వహణకు అవసరమైన తరగతి గదులు, సమావేశ మందిరాలు తదితర ఏర్పాట్లను అచ్చంపేటలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.