సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం
05-02-2026
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం–2005 ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత గడువులోగా అందించడం ప్రతి అధికారి బాధ్యత అని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయంలో మండల విద్యాధికారులు, కార్యాలయ సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని తెలిపారు.