10 April, 2026 | 1:30 PM

Breaking News

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •   యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం సాధ్యం   •   హిందూ సమ్మేళన కరపత్రాలను పంపిణీ   •   కన్నతల్లికి ఎంత కష్టం   •   ఆరోగ్యకర జీవనానికి హోమియోపతి వైద్యం మంచి మార్గం   •   లక్ష్యం వైపు అడుగులు ఆగవు!   •   చెత్తలో రూ. 14 లక్షల విలువైన వజ్రపు ఉంగరాలు — జూబ్లీహిల్స్‌లో దొంగ అరెస్ట్   •   ఏడుగురు MBBS విద్యార్థులు సస్పెండ్— కేఎంసీలో ర్యాగింగ్‌ కలకలం!   •   శ్రీ భక్తాంజనేయ స్వామి సహిత శివ పంచాయతన దేవాలయంలో మహా అన్నదాన కార్యక్రమం   •  

Districts - Nagarkurnool

article_11132507.webp
ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

అచ్చంపేట ఏప్రిల్ 09: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ వ్యవసాయ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు మర్రికంటి భవానీ రెడ్డి, కెవిఎన్ రెడ్డి, రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, రాములు నాయక్, భూమి సునీల్ కుమార్ హాజరయ్యా రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి హక్కుల గుర్తింపు, పత్రాల సమస్యలు, భూ వివాదాలు వంటి అంశాలు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఏసీ గదుల్లో కూర్చుని సమస్యను పరిష్కరించలేమని కమిషన్ భావించిందని అందుకే నేరుగా రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి అందుకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఉద్దేశంతోనే రైతు కమిషన్ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

09-04-2026

article_57353281.webp
సీసీ రోడ్డు కమిషన్ల కోసం కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట.!

నాగరుకర్నూల్,(విజయక్రాంతి): బిజినపల్లి మండలం బోయాపూర్ గ్రామంలో ఏడాది క్రితం రు.10 లక్షలతో వేసిన సీసీ రోడ్డు కమిషన్ల(Commissions) పంచాయతీ బుధవారం పోలీస్ స్టేషన్ కు చేరింది. రూ. 10 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి బోయపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు రూ.70వేలు వసూళ్లు చేయగా వాటి పంపకంలో సయోధ్య కుదరకపోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఏకంగా అధికారుల ముందే పంపకలు జరుపుకోవడం అందులో అయోధ్య కుదరకపోవడంతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా చివరికి పెద్ద సారు మందలించినట్లు తెలిసింది. చివరగా ఈ పంచాయతీ పెద్ద సార్ ముందుకు వెళ్లడంతో చర్చనీయంశంగా మారింది.

08-04-2026