ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలి
అచ్చంపేట ఏప్రిల్ 07: నాగర్ కర్నూల్ జిల్లాలోని ఇసుక రీచ్ ల నుంచి ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా మాత్రమే మన ఇసుక మన వాహనం ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలని, అందుకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిన కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల, వంగూరు మండలాల్లోని మొల్గర, పెదాపూర్, ఉల్పర గ్రామాల్లో కొనసాగుతున్న ఇసుక రీచ్ లను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
07-04-2026