9 April, 2026 | 12:34 AM

Districts - Nagarkurnool

article_57353281.webp
సీసీ రోడ్డు కమిషన్ల కోసం కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట.!

నాగరుకర్నూల్,(విజయక్రాంతి): బిజినపల్లి మండలం బోయాపూర్ గ్రామంలో ఏడాది క్రితం రు.10 లక్షలతో వేసిన సీసీ రోడ్డు కమిషన్ల(Commissions) పంచాయతీ బుధవారం పోలీస్ స్టేషన్ కు చేరింది. రూ. 10 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి బోయపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు రూ.70వేలు వసూళ్లు చేయగా వాటి పంపకంలో సయోధ్య కుదరకపోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఏకంగా అధికారుల ముందే పంపకలు జరుపుకోవడం అందులో అయోధ్య కుదరకపోవడంతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా చివరికి పెద్ద సారు మందలించినట్లు తెలిసింది. చివరగా ఈ పంచాయతీ పెద్ద సార్ ముందుకు వెళ్లడంతో చర్చనీయంశంగా మారింది.

08-04-2026