calender_icon.png 18 July, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_82982377.webp
దుండగుల చేతిలో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహం.!

15-07-2025

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): గుర్తు తెలియని దుండగుల చేతిలో ముసుగులో ఉన్న అంబేద్కర్ విగ్రహం(Ambedkar statue) ధ్వంసమైన ఘటన నాగర్ కర్నూలు జిల్లా(Nagarkurnool district) బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించేందుకు దాతల సాయంతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సోమవారం గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. ముసుగులోనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కుడి చేతి మణికట్టు, వేలు విరిగి కింద పడింది. దీని గమనించిన దళిత సంఘాల నేతలు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపడుతున్నారు.

article_12849179.webp
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అభినందనీయం

13-07-2025

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1986 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్(SP Gaikwad Vaibhav Raghunath) పాల్గొని ఈ సమ్మేళనాన్ని అభినందనీయం అంటూ ప్రశంసిస్తూ వారితో పాటు క్రికెట్ ఆడి సంతోషాన్ని పంచుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఇలాంటి పూర్వ విద్యార్థుల కలయికలు స్నేహబంధాలను మరింతగా బలపరచడమే కాకుండా, బాల్య జ్ఞాపకాలను తిరిగి జలపరిచే వేదికలవుతాయి. విద్యార్థి దశ జీవితంలో కీలకమైనది. ఆ దశను తిరిగి నెమరేసుకునే అవకాశం అందరికీ రాలేదు. అలాంటి మధుర క్షణాలను పునరావృతం చేయడం గొప్ప విషయమన్నారు.