17 April, 2026 | 12:16 AM

Districts - Nagarkurnool

article_59040277.webp
రోడ్డు భద్రతకై వాహనదారులకు కంటి పరీక్షలు తప్పనిసరి

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఐ క్యాంప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” కార్యక్రమం కింద ఈ ఐ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్‌లో లారీ, ఆటో సహా ఇతర వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు.

16-04-2026