ఆగిపోయిన ఆర్టీసీ రథచక్రం
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం నాగర్ కర్నూల్ జిల్లాలో(Nagarkurnool District) స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా పరిధిలోని అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ డిపోలలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కండక్టర్, డ్రైవర్ కార్మికులు డిపోల ముందు బైఠాయించి ధర్నాలు నిర్వహిస్తూ తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమం కొనసాగిస్తున్నారు.
22-04-2026