12 March, 2026 | 8:26 AM

Districts

article_41277625.webp
ప్రైవేట్ వ్యక్తుల గుప్పిట్లో బందీగా రిక్వెస్ట్ బస్ స్టాప్.!

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల కొరకు స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిర్మించిన రిక్వెస్ట్ బస్ స్టాప్ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు వీధి వ్యాపారస్తుల చేతిలో బందీగా మారింది. జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలో నిర్మించిన రిక్వెస్ట్ బస్ స్టాప్ ప్రైవేటు వ్యక్తుల ప్రచార ప్రకటన కోసం పరిమితం కాగా జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన రిక్వెస్ట్ బస్ స్టాప్ చుట్టూరా ప్రైవేట్ వ్యక్తులు తమ చిరు వ్యాపారుల కోసం షెల్టర్స్ ఏర్పాటు చేసుకున్నారు.

11-03-2026

article_53461189.webp
మంచి నీటి కోసం రాస్తారోకో..!

కోడేరు: నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆరోపిస్తూ గ్రామస్తులు మంగళవారం ప్రధాన రహదారిపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. సర్పంచ్ బోలమోని లక్ష్మీ, ఉపసర్పంచ్ ధర్మరాజు నాయకత్వంలో ఎత్తం బస్టాండ్ వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామంలో సుమారు 3,500 మంది జనాభా ఉన్నప్పటికీ గత రెండు నెలలుగా తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు బోర్లు త్రవ్వించినా నీటి సమస్య తీరలేదని, మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నా నీరు రావడం లేదని తెలిపారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, వెంటనే సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

11-03-2026