నేడు నల్లమల్లలో మంత్రుల పర్యటన
నాగర్ కర్నూల్ జిల్లాలోనీ నల్లమలలో గురువారం రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ లు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు.
01-04-2026