calender_icon.png 19 October, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_55775228.webp
పెద్దకొత్తపల్లిలో పేట్రేగిపోతున్న మట్టి మాఫియా..!

18-10-2025

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల(Peddakothapally Mandal) పరిసరాల్లోని గుట్టలు, ప్రభుత్వ భూములను, రైతులకు చెందిన గైరాన్ భూములను అధికార పార్టీ ముఖ్య నేతలు అడ్డగోలుగా తవ్వుకొని అమాంతం మింగేస్తున్నారు. భారీ వృక్షాలు గట్లతో కూడిన గుట్టను తవ్వి పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్నారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రకృతి సంపదను దోచుకొని సొమ్ము చేసుకుంటున్నారని స్థానిక రైతులనుండి ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. వీటిపై తరచూ ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత రెవిన్యూ, పోలీస్ మండల స్థాయి అధికారులు వారిని పట్టించుకోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

article_12816075.webp
హైకోర్టు తీర్పు బిఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు.!

17-10-2025

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాల భూ నిర్వాసితుల పక్షాన హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రామేశ్వరరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అఖిలపక్ష నేతల మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమాలు దోపిడీలు నిరంకుశత్వంగా దలితులను అడుగడుగునా అవమానపరిచిందని గ్రామాల్లోని వైకుంఠ ధమాలు, చెత్త సేకరణ కేంద్రాలు, రైతు వేదికల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 44 వేల ఎకరాలను అతి కిరాతకంగా బలవంతంగా లాక్కుందన్నారు. నిరుపేద దళితుల ఉసురు ముట్టి ఘోరంగా ఓటమి చెందారని ఆరోపించారు.

article_60350392.webp
శ్రీశైలానికి ప్రధాని మోదీ

16-10-2025

శ్రీశైలం/నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని(PM Modi) దర్శించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10:53 గంటలకు ప్రధానమంత్రి సున్నిపెంట హెలిప్యాడ్‌కు హెలికాప్టర్‌లో చేరుకోగా, ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chief Minister Nara Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. హెలిప్యాడ్ వద్ద ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను ట్రాన్స్పోర్ట్, ఆర్అండ్‌బి స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప ఉదయం 11 గంటలకు భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆలయ దర్శనం కార్యక్రమం కొనసాగుతోందని ఆలయ అధికారులు పేర్కొన్నారు

article_65185862.webp
ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

15-10-2025

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): శారీరక సుఖం కోసం ప్రియుడి మోజులో పడి నూరేళ్లు తోడుంటానని పెళ్లాడిన భార్య కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అతికిరాతకంగా హతమార్చింది. చివరికి నేరం తన మీదికి రాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. చివరికి కోడలిపైన అనుమానంతో మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును సేదించారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామంలో ఈనెల 12న చోటు చేసుకోగా బుధవారం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను డిఎస్పి బుర్రి శ్రీనివాసులు మీడియాకు వివరించారు. నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మైన గాని రాములు(30)కి పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లకు చెందిన మానసతో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.