ప్రభుత్వ భూములను పరిరక్షించండి
30-06-2025
నాగర్కర్నూల్ జిల్లా(Nagarkurnool District) పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువుల శిఖంల భూములపై జరుగుతున్న ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక ఉద్యమకారుడు రాజశేఖర శర్మ సోమవారం జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జిల్లా కొత్తగా ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వ భూములపై విస్తృతంగా ఆక్రమణలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువులు, కుంటలు వంటి ప్రకృతి వనరులను ధ్వంసం చేసి అక్రమ నిర్మాణాలు వేయడం పట్ల సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. చట్టపరంగా చెరువు బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నా కూడా, వాటిని ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు.