calender_icon.png 18 December, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_12940770.webp
ముగిసిన చివరి విడత.. గ్రామ సంగ్రామ సమరం

17-12-2025

అచ్చంపేట: గ్రామ సంగ్రామంలో కీలకమైన చివరి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నాగర్ కర్నూల్ జిల్లాలలో ప్రశాతంగా ముగిశాయి. జిల్లాలోని ఏడు మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల పక్రియను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోశ్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పరిశీలించారు. జిల్లాలో చివరి దశ ఎన్నికలలో భాగంగా బుధవారం అచ్చంపేట, బల్మూర్, లింగాల, చారగొండ, ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర మండలాలలోని 134 గ్రామ పంచాయతీలలో సర్పంచు, 1,064 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకే గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్లారు.

article_71249733.webp
ఇంద్రకల్‌లో అర్ధరాత్రి దొంగల బీభత్సం..!

17-12-2025

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలో వరుసగా తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసారు. ఐదు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి బంగారం, వెండి, నగదు, వాహనాలను దోచుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన కొరుపాల కృష్ణయ్య ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి తాళం ధ్వంసం చేసి ఇంట్లో చొరబడ్డారు. ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారం, కేజీ వెండి, రూ.2 లక్షల నగదును దోచుకెళ్లారు.

article_48436112.webp
ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు

16-12-2025

అచ్చంపేట: మరికొద్దిసేపట్లో కీలక ఘట్టానికి అంకురార్పణ జరగనుంది. గ్రామ పంచాయతిని అధిరోహించే విజేతలెవరో తేలిపోనుంది. నాగర్ కర్నూల్ జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం అచ్చంపేటలోని బర్కతుల్ల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, సామగ్రి పంపిణీ ప్రక్రియ సక్రమంగా సాగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.