ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
అచ్చంపేట ఏప్రిల్ 09: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ వ్యవసాయ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు మర్రికంటి భవానీ రెడ్డి, కెవిఎన్ రెడ్డి, రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, రాములు నాయక్, భూమి సునీల్ కుమార్ హాజరయ్యా రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి హక్కుల గుర్తింపు, పత్రాల సమస్యలు, భూ వివాదాలు వంటి అంశాలు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఏసీ గదుల్లో కూర్చుని సమస్యను పరిష్కరించలేమని కమిషన్ భావించిందని అందుకే నేరుగా రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి అందుకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఉద్దేశంతోనే రైతు కమిషన్ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
09-04-2026