13 May, 2026 | 5:10 AM

Districts - Nagarkurnool

article_37653804.webp
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు

అచ్చంపేట మే 12: తెలంగాణ అటవీ శాఖ(Telangana Forest Department), విదేశాంగ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ బ్రాంచ్ సెక్రటేరియట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిగ్ క్యాట్ సంరక్షణ వర్క్‌షాప్‌లో భాగంగా వివిధ దేశాల నుండి వచ్చిన కాన్సులేట్ జనరల్స్, దౌత్య ప్రతినిధులు మంగళవారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను(Amrabad Tiger Reserve) సందర్శించి జంగిల్ సఫారీలో పాల్గొన్నారు. ప్రతినిధులు మన్ననూర్ జంగిల్ రిసార్ట్‌లో రాత్రి విడిది చేసి ఉదయం 6 గంటలకు సఫారీకి వెళ్లారు. పర్యటనలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని సహజ అటవీ అందాలు, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలను చూసి వారు ఆనందం వ్యక్తం చేశారని అటవీ అధికారులు వెల్లడించారు.

12-05-2026

article_15942466.webp
వెంచర్లో అక్రమాలపై కుల సంఘాల పిర్యాదు

బిజినేపల్లి: కందనూల్ జిల్లాలోని క్విడ్ ప్రొఖో వ్యవహారంలో మండల కేంద్ర శివారులోని 101 సర్వే నెంబరులో వేసిన వెంచరులో చోటు చేసుకున్న అక్రమాలపై అధికారులు విచారణ జరిపి న్యాయం చేస్తూ అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాలమూరు నిర్వాసిత బాధితులు, ఎల్.హెచ్. పీ.ఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు మాన్య నాయక్, మంగి విజయ్ లు సోమవారం మండల తహశీల్దారు కార్యాలయంలో పిర్యాదు చేశారు. రిజర్వాయర్ లో ఇండ్లు,భూముల పరిహారాన్ని క్విడ్ ప్రాకో కింద బిఆర్ఎస్ నేతల మాటలు నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన గిరిజనులను ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న అప్పటి అధికార పార్టీ నాయకుడు తనకున్న రెండు ఎకరాల భూమికి బదులు 6.06 ఎకరాల్లో వెంచర్ వేసి మోసం చేశాడని ఆరోపించారు. విజయక్రాంతి పత్రిక అండగా నిలిచిందన్నారు.

11-05-2026

article_25505888.webp
రెక్కల కష్టం వర్షార్పణం..!

నాగర్ కర్నూల్ మే 10 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన మొక్కజొన్న పంట వరద నీటిలో కొట్టుకుపోయింది. నెలల తరబడి పంటలు పండించి తీర ధాన్యం అమ్ముకునేందుకు మార్కెట్కు వస్తే సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంటను అమ్ముకోవడం కోసం కూడా నెలల తరబడి వేచి చూసే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా ఆదివారం సాయంత్రం కురిసిన భారీ అకాల వర్షానికి మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయింది. రైతుల కళ్ళముందే వరద నీటిలో మొక్కజొన్న కొట్టుకుపోతుండగా వచ్చే కంటనీరు కూడా వర్షపు నీటిలో కలిసిపోయిందని రైతాంగం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

11-05-2026