వడదెబ్బ రోగులకు తక్షణ వైద్య సేవలు
వేసవి ఎండలు తీవ్రత దృష్ట్యా నాగర్కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వడదెబ్బ (హీట్ స్ట్రోక్) రోగులకు తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.టి.ఉషారాణి తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఆసుపత్రిలో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేసి, తాగునీరు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
20-04-2026