5 April, 2026 | 10:08 PM

Districts - Nagarkurnool

article_63184278.webp
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

నాగర్ కర్నూల్ రూరల్, ఏప్రిల్ 2: మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి రూ.10 వేల కోట్ల మేర ఆదా చేసుకున్న సందర్భంగా గురువారం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించిందని ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఖర్చును ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఆర్టీసీకి ఆర్థికంగా బలమిచ్చినట్లు పేర్కొన్నారు.

03-04-2026