calender_icon.png 13 November, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_64184364.webp
మంత్ర శక్తులతో గుప్త నిధులు బయటకు తీస్తామంటూ.. లక్షలు కాజేసిన కిలాడీలు.!

12-11-2025

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): అమాయకులను ఆసరాగా చేసుకొని తమ వద్ద మంత్ర శక్తులు ఉన్నాయని ఆరోగ్య పరిస్థితిని బాగు చేసేందుకు, గుప్త నిధులను బయటకు తీస్తామని నమ్మించి లక్షల కాజేసిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 7.50 లక్షల నగదు, 1160 నకిలీ బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఏర్పాటు చేసిన మీడియా ముందు వివరాలను వెల్లడించారు. తాడూరు మండలం అంతారం గ్రామానికి చెందిన కోట్ల అలివేల నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కాలనీలో నివాసం అంటుంది. గత కొంతకాలంగా తన వద్ద దైవ శక్తి మంత్ర శక్తులు ఉన్నాయని ప్రజలను నమ్మిస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తుండేది.

article_72103250.webp
తమ భూమి తనకు ఇప్పించాలి జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతి

11-11-2025

వెల్దండ: మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామ శివారులో తన భర్త కొనుగోలు చేసిన భూమిని తనకు ఇప్పించాలని రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం విట్టాయిపల్లి గ్రామానికి చెందిన హైమావతి సోమవారం కొట్ర తండా వద్ద గల జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామ రెవెన్యూ శివారులో 237, 238 సర్వే నెంబర్ లో 2006 సంవత్సరంలో తన భర్త వీరేశం 10.06 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. 2020 సంవత్సరం వరకు సాగు చేయడం జరిగిందని బాధితురాలు హైమావతి ఫిర్యాదులు పేర్కొన్నారు. తన భర్త వీరేశం శబరిమలైకి వెళ్లి అక్కడే స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అప్పటినుండి పొలం సాగు చేయకపోవడంతో ఇతరులు కబ్జా చేశారు. అధికారుల, కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. తన భూమిని తనకు ఇప్పించాలని స్థానిక గ్రామస్తులతో కలిసి హైమావతి జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అంద చేశారు.