calender_icon.png 14 February, 2026 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_59538167.webp
ప్రభుత్వ పాలనకు ప్రజా తీర్పే నిదర్శనం!

13-02-2026

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించారని, ఈ ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.