ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ శనివారం పరిశీలించారు. లబ్ధిదారులు పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణ నాణ్యత, సదుపాయాలు, ప్రభుత్వ సహాయం వినియోగంపై కలెక్టర్ సమగ్రంగా ఆరా తీశారు. ప్రభుత్వం పేదల స్వగృహ కలను నెరవేర్చేందుకు ఈ పథకాన్ని ప్రాధాన్యంతో అమలు చేస్తోందని తెలిపారు.
02-05-2026