ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
వెల్దండ మార్చి 20 : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని జిల్లా అదన కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అన్నారు . శుక్రవారం వెల్దండ మండలం, చుక్కనపల్లిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సాగు చేస్తున్న మునగ తోటను పరిశీలించారు. తోట నిర్వహణ, మొక్కల పెరుగుదల, నీటి వినియోగం వంటి అంశాలను తెలుసుకున్నారు. రైతులకు మరింత సాంకేతిక మార్గదర్శకత అందించాలని అధికారులకు సూచించారు.
21-03-2026